Thursday, September 24, 2009

పెరుగుతున్న లాకప్‌ మరణాలు

పెరుగుతున్న లాకప్మరణాలు

పోలీసు కస్టడీలో జ్యోతిరచన మరణించింది. ఆమె మరణానికి పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణమని పేర్కొంటూ పోలీసు అధి కారులను ఉన్నతాధికారులు సస్సెండ్‌ చేశారు. పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎలాంటి తాత్సార్యం చేయలేదు. అయితే జ్యోతి రచన ఆత్మహత్య చేసుకుందని వారి అభిప్రాయం.

పోలీసుల కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఎలాంటి అభిప్రా యానికి రావల్సి ఉంటుంది? ఏమైనా నిజమనే భావనని తీసుకొనడానికి అవకాశం ఉందా? పోలీసు కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఏవై నా ఇతర సాక్ష్యాలు లభించే అవకాశం ఉంటుందా? తన తోటి పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఇతర పోలీసు అధికారులు సాక్ష్యం చెప్పే అవ కాశం ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. వీటికి సమాధానాలను సుప్రీంకోర్టు తీర్పుల్లోనే వెతకాల్సి ఉంటుంది.

అరెస్టు తరువాత నిర్బంధం ఉంటుంది. ఏవైనా నేరారోపణలు ఉన్న ప్పుడు పోలీసు అధికారులు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కొన్ని సంద ర్భాలలో ప్రైవేటు వ్యక్తులు కూడా అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. పోలీసు అధికారులు అరెస్టు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి అన్న విషయం గురించి రాజ్యాంగం దగ్గర నుంచి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వరకు ఎన్నో అధికరణలు, నిబంధనలు ఉన్నాయి. ఇవి అన్నీ అరెస్టు చట్టబద్ధమైనప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ చాలా మంది వ్యక్తులని చట్టబద్ధంగా కాకుండా అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఆ అరెస్టు మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. అజమా యిషీ ఉండదు. మన సమాజంలో ఎలాంటి అరెస్టులు లేకుండా కొనసాగే నిర్బంధాలే ఎక్కువ.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మన మందరం గర్వపడే విధంగా ఉన్నాయి. ఆర్టికల్‌ 21 ప్రకారం-అమల్లో ఉన్న శాసన ప్రకారం తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్‌ 21 అక్రమ అరెస్టుల, నుంచి అక్రమ నిర్బంధాల నుండి అభ యం కల్పిస్తుంది.
ఈ ఆర్టికల్‌ ప్రకారం అరెస్టు అయిన వ్యక్తికి అరెస్టు చేయడానికి గల కారణాలను వెంటనే తెలియచేయాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించడానికి అవకాశం కల్పించాలి. ప్రయాణపు సమయం కాకు ండా 24 గంటల్లోగా అతన్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచాలి.

ఇవే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా మానవ హక్కులను, వ్యక్తి గత స్వేచ్ఛను, గౌరవాన్ని రక్షించుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. సె.57 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని అవసరమైన సందర్భంలో మాత్రమే అరెస్టు చేసి తరువాత తమ కస్టడీలో ఉంచుకునే అధికారం పోలీసులకు ఉంది. ఆ కేసు దర్యాప్తుకు అవసరమైన కాలం వరకు మాత్రమే అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలో ఉంచుకోవచ్చు. అంటే, అవసరం లేనప్పుడు 24 గంటలు కూడా ఆ వ్యక్తిని తమ కస్టడీలో ఉంచుకునే అవ కాశం, అధికారం పోలీసులకు లేదు. వ్యక్తి స్వేచ్ఛను, జీవితాన్ని కాపా డటానికి ఇన్ని రాజ్యాంగపరమైన, శాసనపరమైన రక్షణలు ఉన్నప్పటికీ చిత్రహింసలు, కస్టడీ మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.

ఈ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు జోగిందర్‌ కేసులో, డి.కె.బసు కేసులో మరెన్నో రణలు కల్పించింది. జోగిందర్‌ సింగ్‌ కేసులో కోర్టు ఈ విధంగా అభిప్రాయ పడింది:-‘చట్ట బద్ధమన్న కారణంగా పోలీసు అధి కారి అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తు, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయ బద్ధత ఉందని చూపిం చడం మరొక ఎత్తు. అధికారం ఉందని అరెస్టు చేయడం కాదు, దాన్ని సమర్థించుకునేందుకు న్యాయబద్ధత కూడా ఉండాలి.

కొంత దర్యాప్తు జరిపిన తరువాత ఫిర్యాదులోని అంశాలలో నిజా యితీ ఉందని, ఆ వ్యక్తికి నేరంలో సంబంధం ఉందని సహేతుకంగా అన్పించినప్పుడు, అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులను అరెస్టు చేయాలి. వ్యక్తి స్వేచ్ఛను నిరాకరిం చడమనేది చాలా తీవ్రమైన విషయం.
ఈ తీర్పుని, ఇంకా ఇతర తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు డి.కె.బసు తీర్పును వెలువరించి కస్టడీ మరణాలను నివారించడానికి పద కొండు ఆవశ్యకతలను ఏర్పరచింది. ప్రభుత్వం ఆ అవశ్యకతలకు శాసన రూపం ఇచ్చే వరకు వాటిని శాసనంగా పరిగణించి పాటించాలని పోలీసు అధికారులను, దర్యాప్తు అధికారులను ఆదేశించింది. ఇవి కాకుండా జాతీ య మానవ హక్కులు కమిషన్‌ కూడా కస్టడీ మరణాలను నివారిం చడానికి కొన్ని మర్గాదర్శకాలను నిర్దేశించింది. ఇన్ని ఉన్నప్పటికీ కస్టడీ మరణాలు తగ్గు ముఖం పట్టడం లేదు. ఇందుకు కారణం అక్రమ అరెస్టు లపై పై, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, మరో రకంగా ఉదాసీనంగా ఉండడం, ప్రోత్సహించడం కారణాలు కావచ్చు.

కస్టడీలో మరణాలు జరిగినప్పుడు అవి ఆత్మహత్యలుగా పోలీసులు ప్రకటిస్తారు. స్నేహ భావంతో, సౌభ్రాతృత్వంతో అలా ప్రకటిస్తారని చాలా మంది అంటూ ఉంటారు. పోలీసుల కస్టడీల్లో మరణాలు సంభవిం చినప్పుడు, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల మీద అభియోగాలు దాఖలు కావడం అరుదు. ఒకవేళ అవి దాఖలైనా నేరం రుజువు కావడం కష్ట సాధ్యం. ఇలాంటి సందర్భమే ఒకటి చాలా రోజుల క్రితం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అదే స్టేట్‌ ఆఫ్‌ యు.పి వర్సెస్‌ రామ్‌సాగర్‌ యాదవ్‌ కేసు (ఏ.ఐ.ఆర్‌ 1985 సుప్రీంకోర్టు 416).

సుప్రీంకోర్టు ఆ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది:-‘రైన సాక్ష్యాలు లేని కారణంగా తప్పి దాలు చేసిన పోలీసు అధికారులు తప్పించుకోకుండా చట్టాలను మార్చా ల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి మేం తెలియచేస్తున్నాం. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించినప్పుడు, గాయాల పాలైనప్పుడు అవి ఎలా జరిగాయో చెప్పడానికి అవకాశం ఉన్న వ్యక్తులు పోలీసులే. ఇంక ఎవరూ ఉండరు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా పోలీసు అధికారులు పెదవి విప్పరు. ఎందుకంటే తోటి పోలీసులపై ఉన్న సౌభ్రాతృత్వం వల్ల. అందు కని ఇలాంటి కేసుల్లో నిరూపణ భారం నేరస్థులపై ఉండే విధంగా చట్టా లను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందికస్టోడియల్నేరాలకు ఎలాంటి శిక్ష లేకుండా పోయినప్పుడు నేరస్థు లకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజం నష్టపోతుంది. నేర బాధితులకు, వారి బందువులకు నిరుత్సాహం వస్తుంది. శాసనం పట్ల వ్యతిరేకత పెరు గుతుంది. కారణాల వల్ల లా కమిషన్తన 113 నివేదికలో భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో సె.114బి-ని చేర్చాలని సిఫారసు చేసింది.

ఈ సూచించిన నిబంధన ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి గాయాలైనప్పుడు, లేదా ఎవరైనా వ్యక్తికి మరణం సంభవించినప్పుడు ఆ గాయాలు, ఆ మరణం ఏ పోలీసు అధికారి ఆధీనంలో ఉన్నప్పుడు జరిగాయో ఆ పోలీసు అధికారే ఆ గాయాలు చేశాడన్న నిజమైన భావనకి కోర్టులు రావాల్సి ఉంటుంది.
లా కమిషన్‌ ఈ సూచన చేసి, సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెలు బుచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి. కానీ శాసన కర్తల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ సిఫారసును ఇప్పటి వరకు భారతీయ సాక్ష్యా ధారాల చట్టంలో చేర్చలేదు.రోజు రోజుకీ పెరుగుతున్న కస్టడీ హింస, లాకప్‌ మరణాలు ఆ నిబం దన చేర్చడం గురించిన ఆవశ్యకతను తెలియ చేస్తున్నాయి. ఈ నిబంధ నను చేరిస్తే ఈ లాకప్‌ మరణాలు ఉండవని అనలేం కానీ, తగ్గుముఖం మాత్రం తప్పక పడతాయి.

No comments:

Post a Comment

Followers