Thursday, September 24, 2009

పెరుగుతున్న లాకప్‌ మరణాలు

పెరుగుతున్న లాకప్మరణాలు

పోలీసు కస్టడీలో జ్యోతిరచన మరణించింది. ఆమె మరణానికి పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణమని పేర్కొంటూ పోలీసు అధి కారులను ఉన్నతాధికారులు సస్సెండ్‌ చేశారు. పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎలాంటి తాత్సార్యం చేయలేదు. అయితే జ్యోతి రచన ఆత్మహత్య చేసుకుందని వారి అభిప్రాయం.

పోలీసుల కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఎలాంటి అభిప్రా యానికి రావల్సి ఉంటుంది? ఏమైనా నిజమనే భావనని తీసుకొనడానికి అవకాశం ఉందా? పోలీసు కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఏవై నా ఇతర సాక్ష్యాలు లభించే అవకాశం ఉంటుందా? తన తోటి పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఇతర పోలీసు అధికారులు సాక్ష్యం చెప్పే అవ కాశం ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. వీటికి సమాధానాలను సుప్రీంకోర్టు తీర్పుల్లోనే వెతకాల్సి ఉంటుంది.

అరెస్టు తరువాత నిర్బంధం ఉంటుంది. ఏవైనా నేరారోపణలు ఉన్న ప్పుడు పోలీసు అధికారులు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కొన్ని సంద ర్భాలలో ప్రైవేటు వ్యక్తులు కూడా అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. పోలీసు అధికారులు అరెస్టు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి అన్న విషయం గురించి రాజ్యాంగం దగ్గర నుంచి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వరకు ఎన్నో అధికరణలు, నిబంధనలు ఉన్నాయి. ఇవి అన్నీ అరెస్టు చట్టబద్ధమైనప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ చాలా మంది వ్యక్తులని చట్టబద్ధంగా కాకుండా అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఆ అరెస్టు మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. అజమా యిషీ ఉండదు. మన సమాజంలో ఎలాంటి అరెస్టులు లేకుండా కొనసాగే నిర్బంధాలే ఎక్కువ.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మన మందరం గర్వపడే విధంగా ఉన్నాయి. ఆర్టికల్‌ 21 ప్రకారం-అమల్లో ఉన్న శాసన ప్రకారం తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్‌ 21 అక్రమ అరెస్టుల, నుంచి అక్రమ నిర్బంధాల నుండి అభ యం కల్పిస్తుంది.
ఈ ఆర్టికల్‌ ప్రకారం అరెస్టు అయిన వ్యక్తికి అరెస్టు చేయడానికి గల కారణాలను వెంటనే తెలియచేయాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించడానికి అవకాశం కల్పించాలి. ప్రయాణపు సమయం కాకు ండా 24 గంటల్లోగా అతన్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచాలి.

ఇవే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా మానవ హక్కులను, వ్యక్తి గత స్వేచ్ఛను, గౌరవాన్ని రక్షించుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. సె.57 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని అవసరమైన సందర్భంలో మాత్రమే అరెస్టు చేసి తరువాత తమ కస్టడీలో ఉంచుకునే అధికారం పోలీసులకు ఉంది. ఆ కేసు దర్యాప్తుకు అవసరమైన కాలం వరకు మాత్రమే అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలో ఉంచుకోవచ్చు. అంటే, అవసరం లేనప్పుడు 24 గంటలు కూడా ఆ వ్యక్తిని తమ కస్టడీలో ఉంచుకునే అవ కాశం, అధికారం పోలీసులకు లేదు. వ్యక్తి స్వేచ్ఛను, జీవితాన్ని కాపా డటానికి ఇన్ని రాజ్యాంగపరమైన, శాసనపరమైన రక్షణలు ఉన్నప్పటికీ చిత్రహింసలు, కస్టడీ మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.

ఈ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు జోగిందర్‌ కేసులో, డి.కె.బసు కేసులో మరెన్నో రణలు కల్పించింది. జోగిందర్‌ సింగ్‌ కేసులో కోర్టు ఈ విధంగా అభిప్రాయ పడింది:-‘చట్ట బద్ధమన్న కారణంగా పోలీసు అధి కారి అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తు, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయ బద్ధత ఉందని చూపిం చడం మరొక ఎత్తు. అధికారం ఉందని అరెస్టు చేయడం కాదు, దాన్ని సమర్థించుకునేందుకు న్యాయబద్ధత కూడా ఉండాలి.

కొంత దర్యాప్తు జరిపిన తరువాత ఫిర్యాదులోని అంశాలలో నిజా యితీ ఉందని, ఆ వ్యక్తికి నేరంలో సంబంధం ఉందని సహేతుకంగా అన్పించినప్పుడు, అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులను అరెస్టు చేయాలి. వ్యక్తి స్వేచ్ఛను నిరాకరిం చడమనేది చాలా తీవ్రమైన విషయం.
ఈ తీర్పుని, ఇంకా ఇతర తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు డి.కె.బసు తీర్పును వెలువరించి కస్టడీ మరణాలను నివారించడానికి పద కొండు ఆవశ్యకతలను ఏర్పరచింది. ప్రభుత్వం ఆ అవశ్యకతలకు శాసన రూపం ఇచ్చే వరకు వాటిని శాసనంగా పరిగణించి పాటించాలని పోలీసు అధికారులను, దర్యాప్తు అధికారులను ఆదేశించింది. ఇవి కాకుండా జాతీ య మానవ హక్కులు కమిషన్‌ కూడా కస్టడీ మరణాలను నివారిం చడానికి కొన్ని మర్గాదర్శకాలను నిర్దేశించింది. ఇన్ని ఉన్నప్పటికీ కస్టడీ మరణాలు తగ్గు ముఖం పట్టడం లేదు. ఇందుకు కారణం అక్రమ అరెస్టు లపై పై, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, మరో రకంగా ఉదాసీనంగా ఉండడం, ప్రోత్సహించడం కారణాలు కావచ్చు.

కస్టడీలో మరణాలు జరిగినప్పుడు అవి ఆత్మహత్యలుగా పోలీసులు ప్రకటిస్తారు. స్నేహ భావంతో, సౌభ్రాతృత్వంతో అలా ప్రకటిస్తారని చాలా మంది అంటూ ఉంటారు. పోలీసుల కస్టడీల్లో మరణాలు సంభవిం చినప్పుడు, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల మీద అభియోగాలు దాఖలు కావడం అరుదు. ఒకవేళ అవి దాఖలైనా నేరం రుజువు కావడం కష్ట సాధ్యం. ఇలాంటి సందర్భమే ఒకటి చాలా రోజుల క్రితం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అదే స్టేట్‌ ఆఫ్‌ యు.పి వర్సెస్‌ రామ్‌సాగర్‌ యాదవ్‌ కేసు (ఏ.ఐ.ఆర్‌ 1985 సుప్రీంకోర్టు 416).

సుప్రీంకోర్టు ఆ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది:-‘రైన సాక్ష్యాలు లేని కారణంగా తప్పి దాలు చేసిన పోలీసు అధికారులు తప్పించుకోకుండా చట్టాలను మార్చా ల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి మేం తెలియచేస్తున్నాం. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించినప్పుడు, గాయాల పాలైనప్పుడు అవి ఎలా జరిగాయో చెప్పడానికి అవకాశం ఉన్న వ్యక్తులు పోలీసులే. ఇంక ఎవరూ ఉండరు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా పోలీసు అధికారులు పెదవి విప్పరు. ఎందుకంటే తోటి పోలీసులపై ఉన్న సౌభ్రాతృత్వం వల్ల. అందు కని ఇలాంటి కేసుల్లో నిరూపణ భారం నేరస్థులపై ఉండే విధంగా చట్టా లను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందికస్టోడియల్నేరాలకు ఎలాంటి శిక్ష లేకుండా పోయినప్పుడు నేరస్థు లకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజం నష్టపోతుంది. నేర బాధితులకు, వారి బందువులకు నిరుత్సాహం వస్తుంది. శాసనం పట్ల వ్యతిరేకత పెరు గుతుంది. కారణాల వల్ల లా కమిషన్తన 113 నివేదికలో భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో సె.114బి-ని చేర్చాలని సిఫారసు చేసింది.

ఈ సూచించిన నిబంధన ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి గాయాలైనప్పుడు, లేదా ఎవరైనా వ్యక్తికి మరణం సంభవించినప్పుడు ఆ గాయాలు, ఆ మరణం ఏ పోలీసు అధికారి ఆధీనంలో ఉన్నప్పుడు జరిగాయో ఆ పోలీసు అధికారే ఆ గాయాలు చేశాడన్న నిజమైన భావనకి కోర్టులు రావాల్సి ఉంటుంది.
లా కమిషన్‌ ఈ సూచన చేసి, సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెలు బుచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి. కానీ శాసన కర్తల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ సిఫారసును ఇప్పటి వరకు భారతీయ సాక్ష్యా ధారాల చట్టంలో చేర్చలేదు.రోజు రోజుకీ పెరుగుతున్న కస్టడీ హింస, లాకప్‌ మరణాలు ఆ నిబం దన చేర్చడం గురించిన ఆవశ్యకతను తెలియ చేస్తున్నాయి. ఈ నిబంధ నను చేరిస్తే ఈ లాకప్‌ మరణాలు ఉండవని అనలేం కానీ, తగ్గుముఖం మాత్రం తప్పక పడతాయి.

Wednesday, September 16, 2009

ఆస్తి’ ప్రాథమిక హక్కా ?

ఆస్తిప్రాథమిక హక్కా ?

ఆస్తి హక్కు అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు. ఇది మామూలు హక్కు. 1978 సంవత్సరం వరకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుగా తొలగించారు. ప్రాథమిక హక్కులను పొందుపరిచిన ఆర్టికల్స్‌లోని 19(1) (ఎఫ్‌) లో ఇది ప్రాథమిక హక్కుగా ఉండేది. భారత దేశంలోని ప్రతి పౌరునికి ఇది వర్తించేది. రాజ్యాంగ 44వ సవరణల చట్టం ద్వారా ఈ హక్కును తొలగించారు. అదే విధంగా ఆర్టికల్‌ 31 ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించారు. తప్పని సరి గా భూమిని ప్రభుత్వాలు తీసుకోవలిసిన పరిస్థితి ఏర్పడి నప్పుడు నష్ట పరిహారం చెల్లించే విధంగా ఆర్టికల్‌ 31లో అవకాశం ఉండేది.

44వ సవరణల ద్వారా దీన్ని కూడ తొల గించారు. అందువల్ల రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం పొందే అవకాశాన్ని పౌరులు కోల్పోయారు. రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 30 (1ఎ) ప్రకారం, అదే విధంగా ఆర్టికల్‌ 31 ఎ (1) లోని రెండవ ప్రొవిసో ప్రకారం కొన్ని సందర్భా లలో నష్టపరిహారాన్ని రాజ్యాంగ రీత్యా పొందవచ్చు.భూసేకరణ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా జరు గుతోంది. ప్రాజెక్టులకు, ప్రజల అవసరాలకు భూసేకరణ చేసే అవకాశం భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంది. ప్రైవేటు భూముల పైన కూడా ప్రభుత్వానికి ఆధి పత్యం ఉంటుంది.

రైలు మార్గాల కోసం, ప్రజా పనుల కోసం, ప్రాజెక్టుల కోసం ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకు న్నప్పుడు సముచితమైన నష్టపరిహారాన్ని ఆ వ్యక్తులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రజల అవ సరాలకు’ అన్న నిర్వచనం పరిధి చాలా విస్తృతమై పోయింది. గత దశాబ్ద కాలంలో ఈ నిర్వచనం పరిధి విస్తృ తమైపోయి ప్రైవేటు పరిశ్రమలకు, ప్రైవేటు గృహాలకు, కోఆపరేటివ్‌ సంస్థల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్‌ ఆట స్థలాల కోసం ఈ సేకరణలను ప్రభు త్వాలు చేయడం మొదలు పెట్టాయి.

ఈ ప్రాజెక్టులు ప్రజల అవసరాలకంటే ప్రైవేటు వ్యక్తుల అవసరాలనే ఎక్కువగా తీరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు జీవించే హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తోడు సెజ్‌లు వచ్చే శాయి. ఒక్క మన రాష్ట్రంలోనే వందకు పైగా సెజ్‌లు వచ్చా యి. ఈ సంస్థానాలు ఏ ప్రజల అవసరార్థంమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విదేశీ కంపెనీల అవసరాల కోసం కూడా ప్రభుత్వాలు భూసేకరణ చట్టాన్ని ఉపయోగి స్తున్నాయి. అందువల్ల దేశ ఐక్యత దెబ్బతినే పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని గమనించిన తరువాత ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు ఇవ్వకూ డదన్న వాదన కూడా వస్తుంది.

భూసేకరణ గురించి కోర్టుల్లో చాలా ప్రజాహిత కేసులు దాఖలవుతున్నాయి. కలకత్తాకు చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత కేసుని దాఖలు చేసింది. ప్రైవేటు ఆస్తుల మీద ఉన్న ప్రభుత్వ అధిపత్యం వల్ల, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కును కాలరాస్తోందని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ దరఖాస్తును స్వీకరిస్తూ సుప్రీంకోర్టు, ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు మార్చకూడదన్న ప్రశ్నని ప్రభుత్వానికి వేసింది. ఫలితంగా ఆస్తిహక్కు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తొలగించడం వల్ల పౌరులు ప్రభుత్వ చర్యను రాజ్యాంగం ప్రకారం ప్రశ్నిం చే హక్కును కోల్పోయారు. ప్రభుత్వ చర్యలను మామూలు చట్ట ప్రకారం మాత్రమే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.

రాజ్యాంగంలోని అధికరణ 300ఎ ప్రకారం ఇప్పుడు ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు కాదు. అంటే ఒక వ్యక్తికి గల హక్కును శాసన బద్ధంగా తొలగించవచ్చు. అంటే భూసే కరణ చట్టం ద్వారా తొలగించవచ్చు. ఈ కారణంగా విదేశీ సంస్థలకి ఇప్పుడు దేశ పౌరుల మాదిరిగా సమాన హక్కు లు ఉన్నాయి.కలకత్తాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత కేసులో 44వ సవరణలను ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, సెలక్ట్‌ కమిటీకి నివేదిం చకుండా ఆర్టికల్‌ 19 (1) ఎఫ్‌ని తొలగించడం సమంజసం కాదని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు.

ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే చాలా సమస్య లు తలెత్తుతాయన్న వాదనలు కూడా ఉన్నాయి. దేశ అభి వృద్ధి కుంటుపడుతుందని కొంతమంది వాదనలు చేస్తున్నా రు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తిరిగి చేర్చాలన్న వాదనలు ఎన్ని ఉన్నాయో దాన్ని చేర్చకూడదన్న వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అలా పక్క న పెట్టి, ఒక్క విషయం గురించి మాత్రం ఆలోచించ వచ్చు. భూసేకరణ చట్టంలో నిర్వచించిన ‘ప్రజల అవసరార్థం’ అన్న పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. దాని పరిధిని కుదించాల్సిన అవసరం ఉంది.

ప్రాజెక్టుల కోసం, రైలు మార్గాల కోసం, రహదారుల కోసం ప్రభుత్వాలు ప్రజల భూములను సేకరించడం సమంజసమే కానీ, ప్రైవేటు ఇండస్ట్రీల కోసం, ప్రైవేటు గృ హల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్ఆటల కోసం ప్రభుత్వాలు భూములను సేకరించి వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇది దేశ ప్రజలను వేధి స్తున్న ప్రశ్న. భూసేకరణ ప్రజాహితం కోసం జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తుల హితం కోసం జరుగకూడదు. విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. విధంగా ఆలోచించకపోతే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా చెయ్యాలన్న వాదనలు మరింత బలపడతాయి.

Tuesday, September 15, 2009

మళ్ళీ యాసిడ్‌ దాడులు

malli acid dadulu
మళ్ళీ యాసిడ్దాడులు


``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''. యాసిడ్‌ బాధితురాలి కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్‌ బెంచి తన తీర్పులో ఈ మాటలను పేర్కొంది. సంయమనం కోల్పోకుండా తీర్పులు చెప్పాల్సిన న్యాయమూర్తులకే అంత ఆగ్రహం, బాధ, ఆవేశం కలిగించిన కేసు అది. ఇక మామూలు వ్యక్తుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ యాసిడ్‌ దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. మీడియా కథనం ప్రకారం బుధవారం సాయంత్రం స్కూటీమీద ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రణీత, స్వప్నికలపై యాసిడ్‌ దాడి జరిగింది.వాళ్ళు రామారం ఎవిఎస్‌ కాలేజీ వద్దకు రాగానే వెనక నుంచి పల్సర్‌ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై యాసిడ్‌ పోసి పారిపోయారు. హెల్మెట్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తున్న ప్రణీతకు స్వల్పంగా గాయాలు కాగా వెనుక కూర్చున్న స్వప్నికకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో రాష్ట్రంలోని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. అందరూ ఆగ్రహావేశాలను వెళ్ళగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో యాసిడ్‌ దాడుల గురించి మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ మానవహక్కుల రోజున ఈ దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా అత్యంత బాధాకరమైన విషయం. మహిళలపై దాడి చేయడానికి మగవాళ్ళు అందుకున్న కొత్త ఆయుధం యాసిడ్‌. ఈ ఆయుధాన్ని కర్ణాటకలో మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి యాసిడ్‌ దాడుల బారిన పడిన వాళ్ళ సంఖ్య 65 మంది. అందరూ మహిళలే.ఆ తరువాతి స్థానాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ముంబాయి. ఇప్పుడు కొత్తగా మరో రాష్ట్రం చేరబోతుంది. అదే అంధ్రప్రదేశ్‌. 97 శాతం మంది మహిళల పైనే ఈ దాడులు జరిగాయి. ఇందుకు కారణం ఏమిటి? మహిళలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండటానికి వాళ్ళను నియంత్రించడానికి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కొంతమంది భావన. తమను ప్రేమించనందుకు జరుగుతున్నాయని మరి కొంత మంది భావన. ఇవి రెండూ కూడా కారణాలు కావచ్చు. మహిళలు స్వతంత్రంగా ఉద్యోగాలు చేస్తూ కార్లు, బైకులు నడిపిస్తూ, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తూ తమకు ఇష్టమైన రీతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా మందికి రుచించకపోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించడం, ప్రేమించకపోవడంలో స్వతంత్రంగా వ్యవహరించి ఎంపిక చేసుకునే హక్కును మహిళలు వినియోగించకుండా ఉండటానికి కూడా ఈ దాడులు జరుగుతూ ఉండవచ్చు. కర్ణాటక కేసు విషయానికి వస్తే హసీనా వయస్సు 19 సంవత్సరాలు. ఆమెపై దాడి చేసిన జోసెఫ్‌ రొడ్రిక్‌‌స వయస్సు 39 సంవత్సరాలు. అతనికి ఒక కంప్యూటర్‌ వ్యాపారం ఉంది. హసీనా అందులో ఉద్యోగం చేసేది. అది నష్టాల్లో ఉండటం వల్ల ఆ వ్యాపారాన్ని జోసెఫ్‌ ఆపేశాడు. కానీ హసీనాని తన ఇంటిదగ్గర పని చెయ్యమని డిమాండ్‌ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. వేరే చోట చేరింది. ఫలితంగా ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు జోసెఫ్‌. ఈ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు గడిచాయి. ఈ ఏడుసంవత్సరాలలో ఆమెకు 15 ఆపరేషన్లు జరిగాయి. కళ్ళు కోల్పోయింది. ఆమె పెదవులు, వెంట్రుకలు కాలిపోయాయి. వాటిని గ్రాప్టింగ్‌ ద్వారా ఏర్పాటు చేశారు. అయినా హసీనా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. ఫలితంగా జోసెఫ్‌కు జీవిత ఖైదు శిక్షపడింది. సెషన్‌‌స కోర్టు తక్కువ శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ హసీనాకు సహకరించింది. కర్ణాటక హైకోర్టులోని డివిజన్‌ బెంచి తీర్పులో ఇంకా ఈ విధంగా అభిప్రాయ పడింది: `ఆమెకు అయిన గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడుతాయి. చావుకన్నా ఆమె బతుకును ముద్దాయి దుర్భరం చేశాడు. అందుకని అతనికి విధించాల్సిన కనీస శిక్ష సె.307కి ఉన్న గరిష్ఠ శిక్ష. ముద్దాయి ప్రార్థన విన్నాం. అన్నీ పరిశీలించి అతనికి ఆ నేరానికి ఉన్న అత్యధిక శిక్ష జీవితఖైదును విధించాలని ఆదేశిస్తున్నాం. కింది కోర్టు విధించిన జరిమానాను మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నాం. బాధితురాలు ఆ డబ్బు తీసుకోవచ్చు' ఇదీ తీర్పులోని సారాంశం.యాసిడ్‌ దాడులను మహిళా కమిషన్‌, సుప్రీంకోర్టు కూడా పట్టించుకున్నాయి. ఈ దాడుల గురించి ఒక నివేదిక సమర్పించవలసినదిగా లా కమిషన్‌ను ఆదేశించింది. లా కమిషన్‌ ఆగస్టులో నివేదిక సమర్పించింది. భారతీయ శిక్షాస్మృతిలో సె.326.ఎ అన్న కొత్త నిబంధనను ఏర్పరచాలని, నేరం చేసిన వ్యక్తికి కనీస శిక్ష 10 సంవత్సరాలుగా జీవిత ఖైదు విధించేలా ఏర్పరచాలని సూచించింది. యాసిడ్‌ దాడులను నిరోధించడానికి చట్టం తీసుకు రావలసి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ అభిప్రాయపడి ముసాయిదా బిల్లు తయారు చేసింది. లైంగికంగా వేధించడం, మానభంగానికి గురి చేయడం వంటి నేరాల కన్నా ఈ నేరం హీనమైనదని కమిషన్‌ భావించింది. బాధితులకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని బిల్లులో పేర్కొంది. బాధితులకు తక్షణ వైద్య సదుపాయం అందించని హాస్పిటళ్ళపై చర్య తీసుకునే నిబంధనను ఈ బిల్లులో ఏర్పరిచారు. యాసిడ్‌ అమ్మకాలను క్రమబద్ధీకరించే నిబంధనలనుకూడా కమిషన్‌ సూచించింది. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చట్టాన్ని తీసుకరాలేదు. అవసరమైన సవరణలను భారతీయ శిక్షాస్మృతిలో చేయలేదు. కఠినమైన నిబంధనలు ఉంటే మాత్రమే సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హసీనా కేసు పరిష్కారానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా కాకుండా సత్వరం పరిష్కారం అయ్యేవిధంగా నిబంధనలను చట్టంలో ఏర్పాటు చెయ్యాలి. వాటి అమలు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇలాంటి నేరాలకు పోలీసులు కోర్టులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే, ఈ దాడుల వల్ల మహిళలకు మానసిక మరణం సంభవిస్తుంది. అనుక్షణం ఇది వాళ్ళను వెంటాడుతుంది. అందరికీ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ కొత్త చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రప్రభుత్వమే స్పందించి లాకమిషన్‌, మహిళా కమిషన్‌ సూచించిన విధంగా చట్టం తీసుకురావలసిన అవసరం, దానిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Monday, September 14, 2009

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

ఒకే కోర్టులో చాలామంది క్లెయిందారులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీలకు వివాదాలు భారంగా మారతాయి.


మారుతున్న సమాజానికి అనుకూలంగా చట్టాలను మార్పు చేయడం అవసరమే. చట్టాలకు సవరణలు తీసుకొని రావడం వల్ల కొన్ని సార్లు మేలు, అదే విధంగా హాని జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులకు నష్ట పరిహారం అందించాలన్నది శాసనకర్తల ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మోటారు వాహన చట్టాన్ని తయారు చేశారు. అవసరమైనప్పుడల్లా ఆ చట్టానికి సవరణలు చేశారు. 1988 చట్టంలోని సె.166 (2) ప్రకారం ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ పరిధిలో క్లెయిం దరఖాస్తుని చట్టం నిర్దే శించిన పద్ధతిలో వివరాలను తెలియజేస్తూ దాఖలు చేయాలి.

అందువల్ల బాధితులకు ఇబ్బందులు ఎదు రవుతున్నాయని చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
ఈ నిబంధనకు కొత్త చట్టంలో మార్పు చేశారు. మోటారు వాహన చట్టంలో సెక్షన్‌ 166 (2) ప్రకారం క్లెయిం దరఖాస్తును ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ ట్రిబ్యునల్‌లో గాని లేక క్లెయిందారు ఎక్కడ నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ పరిధి ఉన్న ట్రిబ్యునల్‌లో గానీ లేక ప్రతివాది ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లో గాని చట్టం నిర్దేశించిన ఫారంలో వివరాలతో దాఖలు చేసుకోవచ్చు.

మోటారు వాహనాల చట్టానికి సవరణలు రాక పూర్వం ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లోనే క్లెయిం దరఖాస్తు దాఖలు చేయాలి. ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం బాధితులకు మూడు అవకాశాలు వచ్చాయి.

1. ప్రమాదం జరిగిన స్థలం ట్రిబ్యునల్‌ పరిధిలో, 2. క్లెయిందారు ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ ట్రిబ్యునల్‌ పరిధిలో, 3. ప్రతివాది (ఈ్ఛజ్ఛఛ్చ్టీ) ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో ఆ ట్రిబ్యు నల్‌ పరిధిలో ఎక్కడైనా క్లెయిందారు దరఖాస్తు దాఖలు చేసుకో వచ్చు. ఇది ఒక రకమైన సౌకర్యాన్ని క్లెయిందారుకు ఇచ్చిన ప్పటికీ అందువల్ల చాలా అసౌకర్యాలు కూడా ఉన్నాయి. వివా దాలు బహుళం (ఠజ్టూజీఞజూజీఛిజ్టీడ) అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పార్టీలకి అసౌకర్యం కలుగుతుంది. ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉదాహరణకు, ఢిల్లీలోని ఓ టూరిస్ట్‌ బస్సులో 25 రాష్ట్రా లకు చెందిన వ్యక్తులు తాజ్‌మహల్‌ చూడడానికి బయల్దేరా రనుకుందాం. ఆ వాహనానికి ప్రమాదం జరిగినట్లైతే, బాధితు లు తమ రాష్ట్రాలలో అంటే 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తు లను డ్రైవర్‌ పైన, ఆ వాహన యజమానిపైన, ఇన్స్యూ రెన్స్‌ వారి పైన వేయడానికి అవకాశం ఉంది. ఒకే ప్రమాదం గురిం చి అనేక వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల ఒకే అంశంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

తన క్లెయింను పొందడానికి క్లెయిందారుడు మోటారు వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం గానీ లేక దుడుకైన డ్రైవింగ్‌ గాని ఉందని రుజువు చేయాలి. ఈ అంశాలని రుజువు పరచడానికి క్లెయిందారులు ఒకే రకమైన సాక్ష్యాలను అనేక ట్రిబ్యునళ్ళ ముందు ప్రవేశపెట్టాలి. ఇది ట్రిబ్యునళ్ళ సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని క్లెయిం దరఖాస్తులను ఒకే చోట విచారించవలసినదిగా క్లెయిందారులు కోరాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణలో చెప్పి నట్టుగా 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తులు విచారణలో ఉన్న ప్పుడు ఒకే దగ్గర సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్టీజీౌ) చేసి విచారణ జరపడానికి పార్టీలు సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేయా ల్సి ఉంటుంది.

ఇలా చేయడం పార్టీలకు భారమైనదిగా పరిణ మిస్తుంది. క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. అంటే సాక్ష్యం తీసు కోవడానికి, సాక్ష్యులను కోర్టులకు పిలవడానికి, కేసుకి అవసర మైన డాక్యుమెంట్లను, వివరాలను తెప్పించుకోవడానికి సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ వాటికీ ఉంటాయి. మోటారు వాహనాల ప్రమాదాల నష్టపరిహారం కేసులపై ట్రిబ్యునళ్ళకు పూర్తి అధికార పరిధి ఉంటుంది. ఈ ప్రొసీడింగ్‌ను ఆపే అధి కారం, నిలిపివేసే అధికారం సివిల్‌ కోర్టులకు ఉండదు. ఈ ప్రొసీడింగ్స్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి సివిల్‌ కోర్టులకు అధికారం లేదు. ట్రిబ్యు నళ్ళకు ఉన్న అధికారాల గురించి సెక్షన్‌ 169లో పేర్కొనడం జరిగింది.

1. ఈ చట్టం ప్రకారం తయారు చేసిన నిబంధనలకు అను గుణంగా ఈ క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళు సమ్మరీ పద్ధతిన విచారిస్తాయి. 2. ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టు లకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. ప్రమాణ పూర్వకంగా సాక్ష్యాలను స్వీకరించేందుకు, అధికారం, సాక్ష్యులను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశించేందుకు, అధికారాలు, డాక్యుమెంట్లను ఇతర అవసరమైన వివరాలను కోర్టులో ప్రవేశపెట్టమని ఆదేశించేందుకు అధికారాలు ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని అధ్యాయం 26 ప్రకారం సివిల్‌ కోర్టులకు సెక్షన్‌ 195 ప్రకారం ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యు నళ్ళకు ఉంటాయి.

3. మోటారు వాహనాల రూల్సుకు అను గుణంగా క్లెయింలను పరిష్కరించడానికి అవసరమని భావిం చినప్పుడు ఏదైనా విషయంపై పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల సహా యాన్ని ట్రిబ్యునల్‌ తీసుకోవచ్చు. సెక్షన్‌ 169 ప్రకారం సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. అంటే ఒక ప్రమాదానికి సంబంధించిన వివిధ వివాదాలను సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 151 ప్రకారం సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్ట్ఛీ) చేసే అధికారం ఉంది. అందువల్ల అందరు పార్టీ లకు ప్రయోజనం చేకూరుతుందని కోర్టులు భావించినప్పుడే అలా చేస్తాయి. ఈ విధంగా సంఘటితం చేయనందువల్ల ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంతకు ముందు ప్రస్తావించిన ఉదాహరణలోని కేసులో ప్రమాదం జరిగింది ఢిల్లీ దగ్గర. బాధితులు 25 రాష్ట్రాలకు చెందిన వారు. క్లెయిం పిటిషన్లు ఇరవై అయిదు రాష్ట్రాల్లో దాఖలవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో సాక్ష్యం అంతా దాదాపుగా ఒకేలా ఉంటుంది. చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను పరిశీలించిన అధి కారులను, డాక్లర్లను కూడా సాక్షులుగా విచారించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. 25 కేసులలోనూ వాళ్ళను విచారించాల్సిన ఆవశ్య కత ఉంటుంది.

ఒకే విషయం గురించి వేరు రాష్ట్రాలలో దాఖలైన వివా దాల ను సంఘటితం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి: ‘గుడ విజ యలక్ష్మి వర్సెస్‌ గుడ రామచంద్ర, ఎ.ఐ.ఆర్‌ 1981 సుప్రీం కోర్టు 1143’ కేసులో దాంపత్య జీవన హక్కుల (్ఛట్టజ్టీఠ్టజీౌ ౌజ ఛిౌ్జఠ్చజూ జీజ్టిట) విషయంలో న్యాయ పరమైన వేర్పాటు (ఒఠఛీజీఛిజ్చీజూ ట్ఛఞ్చట్చ్టజీౌ) గురించి, భర్త ఒక రాష్ర్టంలో, భార్య వేరొ క రాష్ట్రంలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇలాంటి కేసుల్లో ఆ రెండు కేసులను సంఘటితం చేసి ఒకే కోర్టు విచారించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వెంకటేష్‌ ప్రభు, వర్సెస్‌ కె.తేజప్ప శెట్టి, ఎ.ఐ.ఆర్‌.1982- కర్ణాటక 319’ కేసులో కర్ణాటక రెంట్‌ కంట్రోలు రూల్స్‌ ప్రకా రం కేసులను ఏకీకృతం చేయడానికి వీలులేప్పటికీ కోర్టులు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏకీకృతం చేయాల్సి ఉంటుంది. ఏ శాసనం ప్రకారమైతే కోర్టులకి గానీ ట్రిబ్యునళ్ళకు గానీ అధి కారం వస్తుందో, ఆ శాసనం సక్రమంగా అమలు జరపడం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఆ శాసనమే ఇస్తుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.

ఒకే సంఘటన గురించి, ఒకే విషయం గురించి తలెత్తిన వివాదాలు వివిధ కోర్టుల్లో దాఖలై విభిన్నమైన తీర్పులు రాకూడదన్న ఉద్దేశం ఈ రెండు తీర్పుల్లో అంతః సూత్రంగా ఉంది. ఒకే కోర్టులో చాలామంది క్లెయిందా రులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు ఈ సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీ లకు వివాదాలు భారంగా మారతాయి.

సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని వీటిని సంఘటిత పరుద్దామని ఎవరైనా పార్టీ భావించినప్పటికీ కొన్నిసార్లు కొత్త సమస్యలు తలెత్తుతాయి. మార్పు చేసిన చట్టం ప్రకారం క్లెయిం దరఖాస్తులు దాఖలు చేయడానికి కాలపరిమితి లేదు. అందుకని పార్టీలంద రూ ఒకే కాలంలో ఈ క్లెయిం దరఖాస్తు వే యాల్సిన అవసరం లేదు. ఎవరిదైనా క్లెయిం దరఖాస్తులో తీర్పు వచ్చిన తరువాత, ఆ తీర్పులోని బాగోగులు చూసిన తరువాత కేసు దాఖలు చేద్దామని ఎవరైనా వేచి చూసి ఆ తరువాత క్లెయిం కోరడానికి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో కూడా సంఘటితం చేయడానికి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రకమైన ఫీజును పార్టీలు చెల్లించవలసి రావచ్చు.

అలాంట ప్పుడు కేసులను సంఘటితం చేసినప్పుడు కొంతమంది పార్టీలు మరికొంత కోర్టు ఫీజు చెల్లించవలసి రావచ్చు. కొంత మంది ఎక్కువ ఫీజును ఇదివరకే చెల్లించి ఉండవచ్చు. ఒకే వివాదం గురించి ఎవరైనా పార్టీలు రెండు క్లెయిం దర ఖాస్తులు వేరు వేరు రాష్ట్రాల్లో దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితుడు రెండు క్లెయింలను కోరడానికి అవకాశం ఉంది. ఒక వాహనం డ్రైవర్‌, యాజమాని, ఇన్స్యూ రెన్స్‌ కంపెనీలపై ఒక క్లెయింను ప్రమాదం జరిగిన ప్రాంతం లోని ట్రిబ్యునల్‌లో, మరో వాహనంపై మరో క్లెయింను అతను నివసిస్తున్న ప్రాంతంలో కోరడానికి అవకాశం ఉంది. ఈ మోసాలను ట్రిబ్యునళ్ళు కనుక్కోవడం కష్టమైనపని. ఈ సమ్యలను దృష్టిలో ఉంచుకొని చట్టానికి మళ్ళీ సవరణలు తీసుకొనిరావలసి ఉంది.

సూర్య డైలీ

Wednesday, September 2, 2009

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు
కాలానుగుణంగా చట్టాలు మారాలి. అదే విధంగా చట్టాల గురించి వ్యాఖ్యానాలు మారాలి. మారాయి కూడా. సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడా కులు మంజూరు చేయడం సమంజసమేనని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. హిందూ వివాహ చట్టంలో అది విడాకులు పొందడానికి ఒక ఆధారం కాదు. అయినా కేసులోని వాస్తవ పరిస్థితు లను బట్టి కోర్టులు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడాకులు మంజూరు చేసిన సంద ర్భాలు ఉన్నాయి. సరిదిద్దలేని విధంగా ఇద్దరు వ్యక్తుల వివాహం మారినప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసే విధంగా లేదా ఆ పరిస్థితుల్లో ఉన్న దంపతులు విడాకులు కోరే విధంగా హిందూ వివాహ చట్టం లో మార్పులు తీసుకొని రావాలని లా కమిషన్‌ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చిన నివేదికలో పేర్కొంది. సరిదిద్దడానికి వీల్లేని విధంగా దంపతుల జీవితాలు మారినప్పుడు ఆ ఆధారంగా విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీం కోర్టు గతంలో కొన్ని తీర్పులని ప్రకటించింది. అయితే ఆ తీర్పులకి భిన్నంగా మరో తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. అదే విష్ణుదత్త శర్మ వర్సెస్‌ మంజుశర్మ కేసు.

హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ తప్పులు దంపతుల్లో ఎవరైనా చేస్తే మరొకరు దాని ఆధారంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ఇదే ‘తప్పిదం ఆధారంగా’ విడాకులు పొందే పద్ధతి. చట్టంలో ఇలాంటి ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలోనే విడాకులు మంజూరు చెయ్యాలా? లేక సరిదిద్దడానికి వీల్లేని విధంగా కోరే అవకాశం ఉందా? ఈ విషయం గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహాలు పవిత్రమైనవి. ఈ చట్టప్రకారం భార్య భర్తలను తిరిగి కలపడానికే ప్రయత్నం చెయ్యాలి తప్ప వారిని విడదీయడానికి, వాళ్ళకి విడాకులు మంజూరు చేయ డానికి ప్రయత్నం చేయకూడదు. అందుకనే కోర్టు దంపతులిద్దరిని కలిపే ప్రయత్నం చేసి విఫల మైనప్పుడే కేసుని విచారిస్తుంది. ఆ తరువాతనే విడాకులని మంజూరు చేస్తాయి. అయితే సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు మారినప్పుడు, సుప్రీంకోర్టు దాని ఆధారంగా కూడా విడాకులని మంజూరు చేసింది. భార్య భర్తల మధ్య వివాహం అన్న భావన చనిపోయినప్పుడు తప్పు ఎవరిది ఉన్నప్పటికీ విడా కులు మంజూరు చేస్తుంది.

భార్య పట్ల భర్త క్రూరంగా వ్యవహరించి ఆమెను హింసించి దాని ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. కానీ అలాంటి సందర్భంలో భార్య విడాకులు కోరవచ్చు. వివాహ తప్పు చేసిన వ్యక్తులకి వ్యతిరేకంగా దంపతుల్లోని మరొకరు విడాకులు కోరే అవకాశం ఉంది. భర్తలు వైవాహికేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు సాధారణంగా భార్యలు భర్తలకి దూరంగా ఉంటారు. కానీ విడాకులని కాంక్షించరు. ఇలా సంవత్సరాలు గడిచినప్పుడు వారిద్దరి మధ్య సరిదిద్దడానికి వీల్లేని విధంగా వారి వివా హం మారి పోతుంది. ఇలాంటి సందర్భాలను గమనించి సుప్రీంకోర్టు విష్ణుశర్మ కేసులో ఈ విషయాన్ని పునఃపరిశీలన చేసింది. దీని ఆధారంగా విడాకులు మంజూరు చేయడం వల్ల ఎక్కువగా స్ర్తీలే నష్టపోయే అవకాశం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు భావించింది.

విష్ణుశర్మకి మంజుకి 26 పిబ్రవరి 1993లో వివాహం జరిగింది. డిసెంబర్‌ 1993లో ఓ కూతురుకి జన్మనిచ్చింది. ఆ తరువాత కొంత కాలానికి విష్ణుదత్త శర్మ విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశాడు. వివాహమైన కొద్ది రోజులకే ఆమె తన ఇంటి నుంచి తల్లి గారింటికి వెళ్లిపోయిందని, ఆమె తండ్రి సబ్‌ ఇన స్పెక్టర్‌ కాబట్టి తనను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. మంజు తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. సెప్టెంబర్‌ 14, 1994 రోజున తనని భర్త, అత ని కుటుంబ సభ్యులు విపరీతంగా కొట్టినారని తన జవాబులో పేర్కొంది. తనని కొట్టి సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కూడా పేర్కొంది. ఈ దరఖాస్తును విచారించిన కోర్టు భర్త, అతని బంధు వులు మంజు పట్ల క్రూరంగా వ్యవహరించినారని తన తీర్పులో పేర్కొంది. అతని విడాకుల దరఖాస్తుని కొట్టి వేసింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలుని ధాఖలు చేశాడు.

హైకోర్టు కూడా అతని అప్పీలుని కొట్టి వేసింది. భర్త వివాహ తప్పిదాలు చేసి తమ మధ్య వివాహం సరిదిద్దలేని విధంగా మారి పోయిందని విడాకులు కోరినా ఆ విధంగా ఇవ్వడం సరైంది కాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. తమ మధ్య సరిదిద్దలేని విధంగా వివా హం అయ్యిందని అందుకని విడాకులు మంజూరు చేయాలని వాదనలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ వాద నలతో ఏకీభవించలేదు. హిందూ వివాహచట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి ఎన్నో ఆధా రాలు ఉన్నాయి. కానీ సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహం మారిందన్న కార ణంగా విడాకులు కోరే ఆధారం లేదని, అలాంటి ఆధారాన్ని కోర్టు చట్టంలో చేర్చజాలదని, అలా చేయడం అంటే చట్టాన్ని సవరిం చడమేనని అది శాసనకర్తలు చేయాల్సిన పని అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం వివాహ తప్పిదం చేసిన వ్యక్తి విడాకులు పొందడానికి అవకాశం లేదు. సరిదిద్దడానికి వీల్లేని విధంగా తమ వివాహం మారిందన్న కారణంగా కూడా విడాకులు పొందే అవకాశం లేదు. ఆ ఆధారం చట్టంలో లేదు. కానీ గతంలో ఈ ఆధారంగా కోర్టు విడాకులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. ఇది భిన్నమైన తీర్పు. తీర్పులు ఒక విషయంలో నిలకడగా లేనప్పుడు గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. దీనిపై శాసనకర్తలే ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Followers