Monday, September 14, 2009

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

ఒకే కోర్టులో చాలామంది క్లెయిందారులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీలకు వివాదాలు భారంగా మారతాయి.


మారుతున్న సమాజానికి అనుకూలంగా చట్టాలను మార్పు చేయడం అవసరమే. చట్టాలకు సవరణలు తీసుకొని రావడం వల్ల కొన్ని సార్లు మేలు, అదే విధంగా హాని జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులకు నష్ట పరిహారం అందించాలన్నది శాసనకర్తల ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మోటారు వాహన చట్టాన్ని తయారు చేశారు. అవసరమైనప్పుడల్లా ఆ చట్టానికి సవరణలు చేశారు. 1988 చట్టంలోని సె.166 (2) ప్రకారం ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ పరిధిలో క్లెయిం దరఖాస్తుని చట్టం నిర్దే శించిన పద్ధతిలో వివరాలను తెలియజేస్తూ దాఖలు చేయాలి.

అందువల్ల బాధితులకు ఇబ్బందులు ఎదు రవుతున్నాయని చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
ఈ నిబంధనకు కొత్త చట్టంలో మార్పు చేశారు. మోటారు వాహన చట్టంలో సెక్షన్‌ 166 (2) ప్రకారం క్లెయిం దరఖాస్తును ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ ట్రిబ్యునల్‌లో గాని లేక క్లెయిందారు ఎక్కడ నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ పరిధి ఉన్న ట్రిబ్యునల్‌లో గానీ లేక ప్రతివాది ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లో గాని చట్టం నిర్దేశించిన ఫారంలో వివరాలతో దాఖలు చేసుకోవచ్చు.

మోటారు వాహనాల చట్టానికి సవరణలు రాక పూర్వం ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లోనే క్లెయిం దరఖాస్తు దాఖలు చేయాలి. ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం బాధితులకు మూడు అవకాశాలు వచ్చాయి.

1. ప్రమాదం జరిగిన స్థలం ట్రిబ్యునల్‌ పరిధిలో, 2. క్లెయిందారు ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ ట్రిబ్యునల్‌ పరిధిలో, 3. ప్రతివాది (ఈ్ఛజ్ఛఛ్చ్టీ) ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో ఆ ట్రిబ్యు నల్‌ పరిధిలో ఎక్కడైనా క్లెయిందారు దరఖాస్తు దాఖలు చేసుకో వచ్చు. ఇది ఒక రకమైన సౌకర్యాన్ని క్లెయిందారుకు ఇచ్చిన ప్పటికీ అందువల్ల చాలా అసౌకర్యాలు కూడా ఉన్నాయి. వివా దాలు బహుళం (ఠజ్టూజీఞజూజీఛిజ్టీడ) అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పార్టీలకి అసౌకర్యం కలుగుతుంది. ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉదాహరణకు, ఢిల్లీలోని ఓ టూరిస్ట్‌ బస్సులో 25 రాష్ట్రా లకు చెందిన వ్యక్తులు తాజ్‌మహల్‌ చూడడానికి బయల్దేరా రనుకుందాం. ఆ వాహనానికి ప్రమాదం జరిగినట్లైతే, బాధితు లు తమ రాష్ట్రాలలో అంటే 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తు లను డ్రైవర్‌ పైన, ఆ వాహన యజమానిపైన, ఇన్స్యూ రెన్స్‌ వారి పైన వేయడానికి అవకాశం ఉంది. ఒకే ప్రమాదం గురిం చి అనేక వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల ఒకే అంశంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

తన క్లెయింను పొందడానికి క్లెయిందారుడు మోటారు వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం గానీ లేక దుడుకైన డ్రైవింగ్‌ గాని ఉందని రుజువు చేయాలి. ఈ అంశాలని రుజువు పరచడానికి క్లెయిందారులు ఒకే రకమైన సాక్ష్యాలను అనేక ట్రిబ్యునళ్ళ ముందు ప్రవేశపెట్టాలి. ఇది ట్రిబ్యునళ్ళ సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని క్లెయిం దరఖాస్తులను ఒకే చోట విచారించవలసినదిగా క్లెయిందారులు కోరాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణలో చెప్పి నట్టుగా 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తులు విచారణలో ఉన్న ప్పుడు ఒకే దగ్గర సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్టీజీౌ) చేసి విచారణ జరపడానికి పార్టీలు సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేయా ల్సి ఉంటుంది.

ఇలా చేయడం పార్టీలకు భారమైనదిగా పరిణ మిస్తుంది. క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. అంటే సాక్ష్యం తీసు కోవడానికి, సాక్ష్యులను కోర్టులకు పిలవడానికి, కేసుకి అవసర మైన డాక్యుమెంట్లను, వివరాలను తెప్పించుకోవడానికి సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ వాటికీ ఉంటాయి. మోటారు వాహనాల ప్రమాదాల నష్టపరిహారం కేసులపై ట్రిబ్యునళ్ళకు పూర్తి అధికార పరిధి ఉంటుంది. ఈ ప్రొసీడింగ్‌ను ఆపే అధి కారం, నిలిపివేసే అధికారం సివిల్‌ కోర్టులకు ఉండదు. ఈ ప్రొసీడింగ్స్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి సివిల్‌ కోర్టులకు అధికారం లేదు. ట్రిబ్యు నళ్ళకు ఉన్న అధికారాల గురించి సెక్షన్‌ 169లో పేర్కొనడం జరిగింది.

1. ఈ చట్టం ప్రకారం తయారు చేసిన నిబంధనలకు అను గుణంగా ఈ క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళు సమ్మరీ పద్ధతిన విచారిస్తాయి. 2. ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టు లకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. ప్రమాణ పూర్వకంగా సాక్ష్యాలను స్వీకరించేందుకు, అధికారం, సాక్ష్యులను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశించేందుకు, అధికారాలు, డాక్యుమెంట్లను ఇతర అవసరమైన వివరాలను కోర్టులో ప్రవేశపెట్టమని ఆదేశించేందుకు అధికారాలు ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని అధ్యాయం 26 ప్రకారం సివిల్‌ కోర్టులకు సెక్షన్‌ 195 ప్రకారం ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యు నళ్ళకు ఉంటాయి.

3. మోటారు వాహనాల రూల్సుకు అను గుణంగా క్లెయింలను పరిష్కరించడానికి అవసరమని భావిం చినప్పుడు ఏదైనా విషయంపై పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల సహా యాన్ని ట్రిబ్యునల్‌ తీసుకోవచ్చు. సెక్షన్‌ 169 ప్రకారం సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. అంటే ఒక ప్రమాదానికి సంబంధించిన వివిధ వివాదాలను సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 151 ప్రకారం సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్ట్ఛీ) చేసే అధికారం ఉంది. అందువల్ల అందరు పార్టీ లకు ప్రయోజనం చేకూరుతుందని కోర్టులు భావించినప్పుడే అలా చేస్తాయి. ఈ విధంగా సంఘటితం చేయనందువల్ల ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంతకు ముందు ప్రస్తావించిన ఉదాహరణలోని కేసులో ప్రమాదం జరిగింది ఢిల్లీ దగ్గర. బాధితులు 25 రాష్ట్రాలకు చెందిన వారు. క్లెయిం పిటిషన్లు ఇరవై అయిదు రాష్ట్రాల్లో దాఖలవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో సాక్ష్యం అంతా దాదాపుగా ఒకేలా ఉంటుంది. చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను పరిశీలించిన అధి కారులను, డాక్లర్లను కూడా సాక్షులుగా విచారించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. 25 కేసులలోనూ వాళ్ళను విచారించాల్సిన ఆవశ్య కత ఉంటుంది.

ఒకే విషయం గురించి వేరు రాష్ట్రాలలో దాఖలైన వివా దాల ను సంఘటితం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి: ‘గుడ విజ యలక్ష్మి వర్సెస్‌ గుడ రామచంద్ర, ఎ.ఐ.ఆర్‌ 1981 సుప్రీం కోర్టు 1143’ కేసులో దాంపత్య జీవన హక్కుల (్ఛట్టజ్టీఠ్టజీౌ ౌజ ఛిౌ్జఠ్చజూ జీజ్టిట) విషయంలో న్యాయ పరమైన వేర్పాటు (ఒఠఛీజీఛిజ్చీజూ ట్ఛఞ్చట్చ్టజీౌ) గురించి, భర్త ఒక రాష్ర్టంలో, భార్య వేరొ క రాష్ట్రంలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇలాంటి కేసుల్లో ఆ రెండు కేసులను సంఘటితం చేసి ఒకే కోర్టు విచారించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వెంకటేష్‌ ప్రభు, వర్సెస్‌ కె.తేజప్ప శెట్టి, ఎ.ఐ.ఆర్‌.1982- కర్ణాటక 319’ కేసులో కర్ణాటక రెంట్‌ కంట్రోలు రూల్స్‌ ప్రకా రం కేసులను ఏకీకృతం చేయడానికి వీలులేప్పటికీ కోర్టులు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏకీకృతం చేయాల్సి ఉంటుంది. ఏ శాసనం ప్రకారమైతే కోర్టులకి గానీ ట్రిబ్యునళ్ళకు గానీ అధి కారం వస్తుందో, ఆ శాసనం సక్రమంగా అమలు జరపడం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఆ శాసనమే ఇస్తుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.

ఒకే సంఘటన గురించి, ఒకే విషయం గురించి తలెత్తిన వివాదాలు వివిధ కోర్టుల్లో దాఖలై విభిన్నమైన తీర్పులు రాకూడదన్న ఉద్దేశం ఈ రెండు తీర్పుల్లో అంతః సూత్రంగా ఉంది. ఒకే కోర్టులో చాలామంది క్లెయిందా రులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు ఈ సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీ లకు వివాదాలు భారంగా మారతాయి.

సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని వీటిని సంఘటిత పరుద్దామని ఎవరైనా పార్టీ భావించినప్పటికీ కొన్నిసార్లు కొత్త సమస్యలు తలెత్తుతాయి. మార్పు చేసిన చట్టం ప్రకారం క్లెయిం దరఖాస్తులు దాఖలు చేయడానికి కాలపరిమితి లేదు. అందుకని పార్టీలంద రూ ఒకే కాలంలో ఈ క్లెయిం దరఖాస్తు వే యాల్సిన అవసరం లేదు. ఎవరిదైనా క్లెయిం దరఖాస్తులో తీర్పు వచ్చిన తరువాత, ఆ తీర్పులోని బాగోగులు చూసిన తరువాత కేసు దాఖలు చేద్దామని ఎవరైనా వేచి చూసి ఆ తరువాత క్లెయిం కోరడానికి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో కూడా సంఘటితం చేయడానికి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రకమైన ఫీజును పార్టీలు చెల్లించవలసి రావచ్చు.

అలాంట ప్పుడు కేసులను సంఘటితం చేసినప్పుడు కొంతమంది పార్టీలు మరికొంత కోర్టు ఫీజు చెల్లించవలసి రావచ్చు. కొంత మంది ఎక్కువ ఫీజును ఇదివరకే చెల్లించి ఉండవచ్చు. ఒకే వివాదం గురించి ఎవరైనా పార్టీలు రెండు క్లెయిం దర ఖాస్తులు వేరు వేరు రాష్ట్రాల్లో దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితుడు రెండు క్లెయింలను కోరడానికి అవకాశం ఉంది. ఒక వాహనం డ్రైవర్‌, యాజమాని, ఇన్స్యూ రెన్స్‌ కంపెనీలపై ఒక క్లెయింను ప్రమాదం జరిగిన ప్రాంతం లోని ట్రిబ్యునల్‌లో, మరో వాహనంపై మరో క్లెయింను అతను నివసిస్తున్న ప్రాంతంలో కోరడానికి అవకాశం ఉంది. ఈ మోసాలను ట్రిబ్యునళ్ళు కనుక్కోవడం కష్టమైనపని. ఈ సమ్యలను దృష్టిలో ఉంచుకొని చట్టానికి మళ్ళీ సవరణలు తీసుకొనిరావలసి ఉంది.

సూర్య డైలీ

2 comments:

  1. రాజేంద్ర గారు మీరు అందిస్తున్న సమాచారం విలువైనది.ఇంతటి ఛక్కని సమాఛారాన్ని బ్లాగు ద్వారా అందిస్తున్న మీకు మనస్పూర్థిగా అభినందనలు.

    ReplyDelete

Followers