Monday, November 29, 2010

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines
వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines

Monday, November 8, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి అవసరమైన అంశాలు

October 20th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులను కోరే పద్ధతి గతంలో లేదు. దీన్ని 1976లో ప్రవేశపెట్టారు. ఇది ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాఖలు చేస్తారు. మామూలుగా విడాకులు కోరినపుడు ఆ విధంగా కోరిన వ్యక్తి దరఖాస్తుదారుగా అవతలి వ్యక్తిని ప్రతివాదిగా చూపిస్తారు. అయితే ఈ పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ఇద్దరు దంపతులు సంయుక్తంగా కలిసి దాఖలు చేస్తారు.
ఈ దరఖాస్తులో ఏ అంశాలు ఉండాలి
పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ప్రధానంగా మూడు అంశాలు వుండాలి. అవి-
* వారిద్దరి మధ్య వివాదం జరిగి వుండాలి. ఏ చట్ట ప్రకారమైతే వివాహం జరిగిందో, వారు ఆ మతానికి చెందినవారై వుండాలి. ఆ విషయాన్ని అందులో పేర్కొనాలి.
* సంవత్సరం నుంచి కానీ అంతకుమించి గానీ వారిద్దరూ వేరుగా నివశిస్తూ ఉండాలి.
* వాళ్ళిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడి, పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని వుండాలి.
వివాహం జరిగి ఉండాలి అంటే?
హిందూ వివాహ చట్టం అమల్లోకి రాకముందుగానీ ఆ తరువాత గానీ వారిమధ్య వివాహం జరిగి ఉండాలి. దరఖాస్తుతో తమ వివాహం హిందూ మతాచారం ప్రకారం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. దానికి సంబంధించిన పత్రాలని దరఖాస్తుతోబాటు జత చేయాలి. వారి వివాహ పత్రిక, సంయుక్తంగా వున్న ఫొటో, అవి లేనప్పుడు ఇద్దరివి వేరువేరుగా వున్న ఫొటోలని దరఖాస్తుతోబాటూ జత చేయాలి. వీలైతే వాటిని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి దాఖలుచేయాలి.
వేరుగా నివసిస్తూ వుండాలంటే?
పరస్పర ఆమోదంతో సంయుక్తంగా దంపతులిద్దరు కలిసి దాఖలుచేసే దరఖాస్తు తాము సంవత్సరం నుంచి గానీ అంతకుమించిగానీ వేరుగా నివశిస్తున్నామని పేర్కొనాలి. వాస్తవంగా ఇద్దరిమధ్య విభేదాలు పొడసూపి వేరువేరుగా నివశిస్తారు.
అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నప్పటికీ వేరు వేరు జీవితాలని గడుపుతుంటారు. అంటే వారి మధ్యన దాంపత్య జీవనం వుండదు. ఇలాంటి సందర్భాన్ని కూడా వేరువేరుగా నివసించడంగా పరిగణించవచ్చా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీన్ని కూడా వేరుగా నివశిస్తున్నట్టుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. దాంపత్య జీవనం లేకపోవడం అంటే భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాలు లేకపోవడమని అర్ధం. ఒక గూడులో నివశిస్తున్నప్పటికీ వారిమధ్యన సెక్స్ సంబంధాలు లేకపోతే దాన్ని వేరుగా నివసిస్తున్నట్టుగానే భావించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
కలిసి జీవించి వుండలేని పరిస్థితులు అంటే
దంపతులిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడి కలిసి జీవించి వుండలేని పరిస్థితులు వుండాలి. రాజీ ప్రయత్నాలు కూడా విఫలమై వుండాలి. ఈ పరిస్థితుల కారణంగా వారిద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని వుండాలి.
షరతులు పెట్టుకోవచ్చా?
ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని షరతులని కూడా దంపతులు ఏర్పరచుకుంటారు. ఆస్తి విభాగాల గురించి, భరణం గురించి, నెలవారీ చెల్లించే మనోవర్తి గురించి, పిల్లల కస్టడీ గురించి, పిల్లలని చూడటానికి సంబంధించిన సమయాలు, తేదీల గురించి కూడా ఈ దరఖాస్తు పరిష్కారంలో కోరుకోవచ్చు. ఇవి ప్రైవేట్ హక్కులకి, పబ్లిక్ పాలసీకి భంగం కలిగించకుండా వుండాలి.
ఈ దరఖాస్తు దాఖలు తరువాత ఎంతకాలం
వేచి వుండాలి?
పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దాఖలుచేసిన దంపతులు తిరిగి ఆలోచించుకోవడానికి, రాజీచేసుకొని దాంపత్య జీవనం తిరిగి కొనసాగించడానికి చట్టపరంగా 6 నెలల కాలాన్ని కనీస సమయంగా ఏర్పరిచారు. దాన్ని 18 నెలల కాలం వరకు ఈ సమయాన్ని పొడిగించే అవకాశం వుంది. దీని ఉద్దేశ్యం- వివాహం తిరిగి పునరుద్ధరించబడటానికి తొందరపాటు వల్ల విడాకులు తీసుకోకుండా వుండటానికి ఈ కాలపరిమితిని ఏర్పాటుచేశారు.
ఈ కాలపరిమితిలో పార్టీలు తమ దరఖాస్తుని ఉపసంహరించుకొని దాంపత్య జీవనాన్ని కొనసాగించవచ్చు. వివాహం చెదిరిపోకుండా వుండటానికి, దంపతుల మధ్య ఆవేశకావేశాలు, కోపతాపాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షరతుని ఏర్పరచి శాసనకర్తలు కొంత జాగ్రత్తని తీసుకున్నారని అన్పిస్తుంది.
ఆరునెలల తరువాత పార్టీలు ఏం చెయ్యాలి?
ఆరునెలల తరువాత కోర్టు పార్టీలని విచారించాయి. ఈ ఆరునెలల కాలం గడిచిన తరువాత పార్టీలు ఇంకా అదే అభిప్రాయంతో వున్నారా అన్న విషయాన్ని పరిశీలించి, కోర్టు సంతృప్తి చెందిన తరువాత కోర్టు విడాకులను మంజూరు చేస్తుంది. ఇందుకుగానూ పార్టీలు తమ ప్రమాణ పత్రాలని సమర్పించవచ్చు. లేదా కోర్టు వారి స్టేట్‌మెంట్లని నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో పార్టీలు సమ్మతిని మోసం ద్వారా ఒత్తిడి ద్వారా ప్రభావితం చేయడం ద్వారా పొందినవా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించాల్సి వుంటుంది. భార్య తన మనోవర్తి గురించి, పిల్లల అధీనం గురించిన హక్కులను వదులుకున్నారా అన్న విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది.
ఫొటోలు, స్టేట్‌మెంట్లు నమోదు అవసరమా?
గతంలో విడాకుల దరఖాస్తులో ఫొటోలని కావాలని కోర్టులు అడిగేవి కావు. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో మోసాలు జరిగిన సంఘటనలు కోర్టుల దృష్టికి వచ్చాయి. వేరే ఎవరినో తీసుకొనివచ్చి విడాకులు పొందిన సందర్భాలని కోర్టులు గమనించి ఆ పార్టీల ఫొటోలు అవసరమని కోర్టులు అంటున్నాయి.
అదేవిధంగా దరఖాస్తుని దాఖలుచేసిన సందర్భంలో మళ్లీ విడాకులు మంజూరు చేసే సందర్భంలో పార్టీలని స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేయడం అవసరం. అలా చెయ్యడంవల్ల తమ దరఖాస్తులో రాసిన విషయాలు ఈ పార్టీలకి బోధపడతాయి.
ఒకవేళ ప్రమాణ పత్రాలను దాఖలు చేసినపుడు కూడా వాటిలోని కోర్టు వారికి తెలియచెప్పి తిరిగి వారి సంతకాలు తీసుకుంటోంది. కాబట్టి అందులో ఏమి రాసి వుందో ఆ విషయం పార్టీలకు మళ్ళీ ఒకసారి అవగతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
మోసాలు జరగకుండా వుండటానికి కోర్టు వివాహానికి సంబంధించిన ఫొటోను అదేవిధంగా కొత్త పాస్‌పోర్టు ఫొటోను తమ దరఖాస్తుతోబాటు జతచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. పార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మోసాలు జరగకుండా వుండటానికి కోర్టులు ఈ పని చేస్తున్నాయని గ్రహించాలి.


*
*
*

* Releated Articles

భర్త హాజరు కానప్పుడు.

.
November 2nd, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే దరఖాస్తు దాఖలు చేసిన తరువాత కనీసం 6 నెలలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ గడువుని ఏర్పర్చడానికి కారణం పార్టీలు తొందరపాటు వల్ల విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోలేదని, ఒత్తిడి వల్ల, బెదిరింపువల్ల అలాంటి నిర్ణయానికి రాలేదని కోర్టు అభిప్రాయ పడటానికి. అదే విధంగా పార్టీలు పునరాలోచించుకోవడానికీ ఈ గడువు దోహదపడుతుంది.
ఒక్కసారి కోర్టు ద్వారా విడాకుల కోసం పార్టీలు వచ్చినారంటే అది ఒక్క కేసులోనే ఉండదు. క్రిమినల్ కేసులు, ఆస్తి తగాదాలు, పిల్లల కస్టడీలో లాంటి కేసులు కూడా ఉంటాయి. కొంతమంది భర్తలు (్భర్యలు కూడా) పరస్పర ఆమోదంతో విడాకులు కోరడానికి దరఖాస్తుని దాఖలు చేసుకొని ఆ తరువాత సహకరించరు. అప్పటికే వాళ్లు కొన్ని కేసుల్లో లబ్ధి పొందుతారు. లబ్ధి పొంది మిగతా వ్యక్తులని ఇబ్బందులకు గురిచేస్తారు.
మొదటి సారే కాకుండా ఆరు నెలల నుంచి 18 మాసాలలోపు మళ్లీ పార్టీలు కోర్టు ముందుకు వచ్చి మేము విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు కాని కోర్టు మంజూరు చేయవు. ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? కోర్టు ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం రాజస్థాన్ హైకోర్టు శ్రీమతి సుమన్ వర్సెస్ సురేంద్ర కుమార్ ‘ఎఐఆర్ 2003 రాజస్థాన్ 155-ఐ (2003) డిఎమ్‌సి 805 కేసులో సమాధానాలు చెప్పింది.
పరస్పర ఆమోదంతో దాఖలు చేసిన దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం 2-12-1999 రోజున తిరస్కరించింది. దీనిపైన రాజస్థాన్ హైకోర్టులో డివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత కోర్టు దరఖాస్తుని ఆమోదించింది.
కేసు విషయాల్లోకి వస్తే - పార్టీల మధ్య 24, మే 1995 రోజున వివాహం జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరూ వేరువేరుగా నివసించడం మొదలు పెట్టారు. ఆ తరువాత 15-1-1999 రోజున హిందూ వివాహ చట్టంలోని సె.-13బి ప్రకారం విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశారు. వారిద్దరి స్టేట్ మెంట్లని కోర్టు నమోదు చేసి, ఆరు నెలల తరువాత వారి హాజరు గురించి తేదీని నిర్ణయించింది. ఆ తరువాత భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భార్య హాజరైంది. రెండు, మూడు వాయిదాలు ఇచ్చినప్పటికీ భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భర్త నడవడిక చూసి విసుగు చెందిన భార్య, అతను కోర్టు ముందు హాజరు అయ్యే విధంగా, అదే విధంగా అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకోవడానికి సమన్స్ పంపించాలని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. ఆ విధంగా చేయడానికి చట్టంలో అలాంటి ప్రొసీజర్ లేదని కోర్టు పేర్కొంటూ దరఖాస్తుని కొట్టివేసింది. ఐదవసారి పార్టీలు హాజరు కావడం లేదన్న కారణంగా కోర్టు వారి కేసుని కొట్టివేసింది. దీనిపైన అప్పీలుకి రాజస్థాన్ హైకోర్టులో దాఖలు చేసింది భార్య. దానిపైన రివ్యూ దరఖాస్తుని దాఖలు చేశారు. రివ్యూని కోర్టు ఆమోదించింది.
ఇద్దరూ కలిసి దరఖాస్తుని దాఖలు చేసినప్పుడే కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులు మంజూరు చెయ్యాలి తప్ప వారు హాజరు కానప్పుడు మంజూరు చేయడానికి వీల్లేదని భర్త న్యాయవాది కోర్టు ముందు వాదనలు చేశాడు. మొదటి సారి విడాకుల కోసం సమ్మతిని తెలియజేసి ఆ తరువాత కోర్టు ముందు హాజరు కాకపోవడం ద్వారా తనను ఇబ్బంది పెట్టి కేసు డిస్మిస్ అయ్యే విధంగా చేయడం సరైంది కాదని, వరుసగా హాజరు కాకుండా చేయగా అలాంటి తనని ఇబ్బందికి గురి చేయడమేనని కోర్టు ముందు భార్య న్యాయవాది వాదనలు చేశాడు.
తీర్పులోని ముఖ్యాంశం
మొదటిసారి తరువాత ఇంకొకసారి ఇద్దరూ హాజరై విడాకుల కోసం తమ సమస్యలు తెలియజేయాలి. అలాంటి సందర్భాల్లోనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కోర్టు గడువు ఇచ్చిన సమయంలో తమ సమ్మతిని తెలియజేస్తూ భార్యా భర్తలలో ఎవరైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ ఈ కేసులో భర్త ఆ విధంగా చేయలేదు.
అతను కోర్టు ముందుకు రాకుండా వౌనంగా ఉన్నాడు. ఆ వౌనాన్ని, సమ్మతిని ఉపసంహరించుకున్నట్టుగా భావించడానికి వీలు లేదు. అతను ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు వౌనంగా ఉన్నాడు. అతను తన సమ్మతిని ఉపసంహరించుకో దలిస్తే కోర్టు ముందుకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ముందుకి రాకుండా అతను భార్యని వేధించాడు. రెండవసారి ఇద్దరు పార్టీలు హాజరు వుండాలన్న సాంకేతిక అభ్యంతరాన్ని మేం పట్టించుకోదల్చుకోలేదు. రెండవసారి అతను హాజరు కాకపోవడం వల్ల అతను సమ్మతిని ఇచ్చాడన్న భావనకి రావల్సి ఉంటుంది. భర్త పూర్తిగా వౌనంగా ఉండటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రెండవ సందర్భంలో కొన్ని నెగటివ్‌గా తీసుకోవాలా, పాజిటవ్‌గా తీసుకోవాలా? తను తన సమ్మతిని ఉపసంహరించుకోవాలంటే అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు. అతన్ని ఎవరూ నిరోధించలేదు. అందుకని అతను సమ్మతిని ఉపసంహరించాడని కాకుండా ఇచ్చాడన్న అభిప్రాయానికి కోర్టు రావాల్సి ఉంటుంది. అందుకని ఈ కేసులో భర్త సమ్మతిని ఇచ్చాడన్న నిర్ణయానికి వచ్చి వారి వివాహాన్ని రద్దు చేస్తున్నాం’’.
భర్త హాజరు కాకున్నా కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులను మంజూరు చేసింది. దీని ఉద్దేశం ఇద్దరు హాజరు కాకున్నా మంజూరు చేయవచ్చని కాదు. తన సమ్మతిని ఉపసంహరించుకోకుండా నిరాటంకంగా హాజరు కానప్పుడు కోర్టు ఇలాంటి భావనకి రావల్సి ఉంటుందని ఈ తీర్పు ఉద్దేశం.

Followers