Tuesday, August 25, 2009

మరోసారి మరణ వాంగ్మూలం

మరోసారి మరణ వాంగ్మూలం

మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. వరక ట్నం చావు కేసులు పెరుగుతున్నాయి. వర కట్నం మరణాలు ఎక్కువగా అత్తవారింట్లో జరు గుతాయి. అత్తమామలు, భర్త, అతని బంధువులు తప్ప వేరే ఇతరుల సాక్ష్యాలు దొరకడం కష్టమ వుతుంది. కాలి న గాయలతో’ ఉన్న మహిళని హాస్పి టల్లో చేరు స్తారు. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు, మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తారు. ఆ దశలో ఆమె అత్త గారి ప్రభా వం ఉంటుంది. బతుకుతానన్న ఆశని కూడా వాళ్ళు కలిగిస్తారు. జరిగిన సంఘటన గురించి చెప్పకుండా ఏ ప్రమాదం వల్లో ఆ సంఘ టన జరిగిందని ఆమె సాక్ష్యం చెబుతుంది.

ఆ స్టేట్‌ మెంట్‌ ఆధారంగా ముద్దాయిలు నేరం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. క్రిమినల్‌ కేసుల్లో ఎక్కువగా మౌఖిక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన తరు వాతనే ఆ సాక్ష్యాన్ని కోర్టులు స్వీకరిస్తాయి. అయితే వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, ఆ మరణించిన వ్యక్తి తన మరణానికి గల కారణాల్ని గానీ లేక ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులని గానీ వివరిం చినప్పుడు కోర్టులు వాటిని సాక్ష్యంగా స్వీకరిస్తాయి. వీటినే మరణ వాంగ్మూలం అంటారు.

మరణ వాంగ్మూలం అతి ముఖ్యమైన సాక్ష్యం. చాలా మంది మహిళలు తమని తాము కాల్చు కోవడమో, ఇతరులే కాల్చినప్పటికీ ఆ విషయం చెప్పకుండా ఉండటమో జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో వివాహితలు ఎక్కువ. ఈ సంఘటన జరి గిన వెంటనే ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు ఆమె భర్త, అతని బంధువుల ప్రభావం వల్లనో, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించో జరిగిన విషయం చెప్పరు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతూ ఉంటారు. ఆ మహిళ సబంధీకులు- అంటే ఆమె తల్లి దండ్రులు, అన్నదమ్ములు వచ్చిన తరువాత ధైర్యం కూడ తీసుకుంటారు. అప్పుడు వాస్తవం చెప్పాలనుకుంటారు. అయితే అప్పటికే ఆమె మరణ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తే, ఇలాంటి సందర్భాలలో మరోసారి ఆమె మ రణ వాంగ్మూలాన్ని నమోదుచేసే అవకాశం ఉందా?

రెండోసారి అదే మహిళ చెప్పిన మరణ వాంగ్మూ లం రాయడానికి చాలా మంది మేజిస్ట్రేట్లు సంశ యిస్తూ ఉంటారు. సెషన్స్‌ జడ్జీల అనుమతి కోరు తూ ఉంటారు. అనుమతి ఇవ్వడానికి సెషన్స్‌ జడ్జీలు కూడా సంశయిస్తూ ఉంటారు. మరి కొంత మంది సెషన్స్‌ జడ్జీలు రెండవ మరణ వాంగ్మూ లాన్ని, అదే మేజిస్ట్రేట్‌ నమోదు చేయడాన్ని తప్పు పడుతూ ఉంటారు. ఇది సరైందేనా? ఇలాంటి సం దర్భాలలో చట్టం ఏమి జవాబు చెబుతోంది.?

రెండోసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం ఏదీ చట్టంలో లేదు. మొ దటిసారి మరణ వాంగ్మూలం నమోదు చేసిన మేజి స్ట్రేట్‌ మళ్ళీ రెండవ మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం కూడా చట్టంలో లేదు. రెండవసారి నమోదు చేసిన మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. దేశంలోని అత్యున్నత కోర్టు రెండవసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడాన్ని అనుమతి ఇస్తున్నది. అలాంటి కేసే- సమిరా భాను . సుల్తానా బేగమ్వర్సెస్స్టేట్ఆఫ్మహారాష్ట్ర, అప్పీలు నెం.141/2006, తీర్పు తేదీ: 8/2/07 న్యాయమూర్తులు: సి.కె టక్కర్‌, లోకేశ్వర్‌ సింగ్‌ పాట్నా, సుప్రీంకోర్టు. ఈ కేసులో రెండు మరణ వాంగ్మూలాలను మృతురాలు ఇచ్చింది. రెండింటిని ఒకే మేజిస్ట్రేట్‌ నమోదు చేశాడు.

మొదటి వాంగ్మూలంలో కిరోసిన్‌ దీపంపై పడి అంటుకొని గాయాలు అయినాయని ఆమె చెప్పింది. రెండవ మరణ వాంగ్మూలంలో, తన అత్త కిరోసిన్‌ పోసి కాల్చిందని చెప్పింది. కేసుని విచారించిన సెషన్స్‌ కోర్టు రెండవ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని శిక్ష విధించింది. హై కోర్టు కూడా శిక్షను సమర్థించింది. సుప్రీం కోర్టు కూడా శిక్షని సమర్ధిస్తూ ‘విషయాలను, సాక్ష్యాలను ఆధారం చేసుకొని క్రిమినల్కేసును పరిష్కరిస్తారు. అంతే కానీ గతంలో చెప్పిన తీర్పుల ఆధారంగా కాదు. ముందు ముద్దాయి బాధితురాలిని కొట్టినట్టు, వేధించినట్టు సాక్ష్యం ఉంది. అందుకని రెండవ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించడం సమంజసమే’-అని వాఖ్యానించింది.
ఈ తీర్పునిబట్టి, మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించే అవకాశం ఉంది

Wednesday, August 19, 2009

ఉత్తరాలు -విలువ

రోజు రోజుకీ వరకట్నం చావులు పెరిగి పోతున్నాయి. రక రకాల కారణాలతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. సరైన దర్యాప్తు లేకపోవడం, సాక్షులు కోర్టుల్లో ప్రతి కూల సాక్ష్యం ఇవ్వడం లాంటి కారణాలు ఎన్నో, ఈ పరిస్థితిని అధిగమించడానికి మరణ వాంగ్మూలంలాంటివి ఎంతో అవసర మవుతాయి. మరణ వాంగ్మూలం అంటే మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కావొచ్చు.

మరణానికి దారి తీసిన పరిస్థితులు గురించి చెప్పినవి కావొచ్చు. అవి మౌఖి కాంశంగా ఉండవచ్చు. ఉత్తరాల రూపం లో డైరీల రూపంలో ఉండవచ్చు. వాటికి అత్యం త విలువ ఉంది. మరణ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి తన మర ణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన ఎదైనా పరిస్థితిని వివరిం చినప్పుడు, ఆ వ్యక్తి మరణం ప్రశ్నార్థ కమైనప్పు డు వాంగ్మూలం మరణ వాంగ్మూల మవుతుంది.

‘మరణానికి గల కారణం’, ‘మరణానికి దారి తీసి న పరిస్థితులు’ అన్న ్కజిట్చట్ఛట రెండూ ఒకే అర్థంలో వాడినవి కాదు. ఈ రెండింటి మధ్య భేదం ఉంది. రెండింటి ఉద్ధేశ్యం వేరు. మరణానికి గల కారణం అన్న దానికి పరిమితులున్నాయి. రెండో ్కజిట్చట్ఛకి పరిమితులు లేవు. దాని పరిధి విస్తృతమైనది.
మరణానికి సంబంధించి ఏదైనా పరిస్థితిని వివరించినప్పుడు అది వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని సాక్ష్యంగా తీసుకోవాల్సిన ఉంటుంది.

మర ణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే సామీప్యం ఉన్న పరిస్థితు లేనా? దూరమైన పరిస్థితులు ఉంటే అవి సె.32(1) ప్రకారం సంబం ధితాలు కావా? ఈ విషయం గురించి వివాదాలు ఉండేవి కానీ ఈ విషయాన్ని మొదట శరద్‌బిర్థీ చంద్‌ శారద వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ర్ట (ఏ.ఐ.ఆర్‌ 1984 సుప్రీం కోర్టు 1622-1984 క్రిమినల్‌ లా జర్నల్‌ 1738) కేసులో, ఆ తరువాత చాలా కేసుల్లో పరిష్కరించి వివాదానికి తెరదించింది. మరణానికి దారి తీసిన ఏదైనా పరిస్థితితో దగ్గరి సంబంధం ఉందా? దూరం సంబంధం ఉందా అన్న విషయాలతో పని లేదు.

కన్సేరాజ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ ( 2000 ఏ.ఐ.ఆర్‌. 2324 సుప్రీం కోర్టు =2000 క్రిమినల్‌ లా జర్నల్‌ 2993) కేసులో సుప్రీం కోర్టు ఈ విషయం గురించి ప్రస్తావిస్తు- ‘మరణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే పరిస్థితులకి మరణానికి ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి కాదు. సంభవించిన మరణంతో ఆ పరిస్థితులకి దూరమైన సంబంధం ఉన్నా సరిపోతుంది. లీగల్‌ పొజిషన్‌ ఇలా ఉన్నప్పుడు -సునీత తల్లి దండ్రులకి సోదరులకి తెలిసిన వాళ్ళకి మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్లు సెక్షన్‌ 32 ప్రకారం ఆమోదయోగ్యాలు.

ఎవరైనా వ్యక్తి మరణం ప్రశ్నార్థకమైనప్పుడు ఆ మరణించే వ్యక్తి తన మరణానికి గల కారణాన్ని లేక ఆ మరణానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించిన ప్రకటన భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.32(1) ప్రకారం సంబంధితమైనది కాబట్టి అది ఆమోదయోగ్యమైనది. ఈ స్టేట్‌మెంట్లనే మరణ వాంగ్మూలాలని అంటాం. ఈ స్టేట్‌మెంట్లని ‘అవసరార్థం’ అనే సూత్రం ప్రకారం కోర్టులు ఆమోదిస్తున్నాయి. హత్యకు సంబంధించిన విషయాలైతే-మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని రుజువు చేస్తే అవి ఆమోద యోగ్యాలవుతాయి. సె.32 ఆర్షింపబడాలంటే -మృతుని మరణ వాంగ్మూలాన్ని ఆమోదించాలంటే ఈ విషయాలు రుజువు పరచాల్సి ఉంటుంది.

(ఎ) ఎవరి స్టేట్‌మెంట్‌ నైతే రుజువు చేయదల్చుకున్నారో ఆ వ్యక్తి మరణించిన వ్యక్తిగాని, జాడ తెలియని వ్యక్తిగానీ, మతిస్థి మితం కోల్పోయి. సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి గానీ, తీవ్ర మైన ఖర్చుతో కష్టంగా కోర్టుకి పిలవడానికి అవకాశం ఉన్న వ్యక్తిగానీ అయి ఉండాలి. (బి) ఆ స్టేట్‌మెంట్లు సె.32లోని సబ్‌సెక్షన్‌ 1 నుంచి 8 సందర్భాలలో ఏదైనా ఒక సందర్భంలో పేర్కొన్నదై ఉండాలి. సె.32(1)లో పేర్కొన్న మరణానికి దారి తీసిన పరిస్థితులు వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి. ఇంకోరకంగా చెప్పా లంటే-మృతుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న మరణం కావడం లేక మరణానికి దారితీసిన పరిస్థితులు జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి.

మరణించే మనిషి తన నోట్లో అబద్ధాన్ని పెట్టుకొని చావడు (ూ్ఛఝౌ ఝౌటజ్టీఠటఠట ఞట్చ్ఛటఠఝజ్టీఠట ఝ్ఛ్టజీట్ఛ) అన్న సూత్రం ప్రకారం కోర్టు లు మరణ వాంగ్మూలాన్ని నమ్ముతున్నాయి. ఈ స్టేట్‌మెంట్‌ స్థిరమైన సాక్ష్యంగా ఉండాలంటే ఆ స్టేట్‌మెంట్‌పై ఆధారపడిన వ్యక్తులు గానీ ఏజెన్సీగా ఆ స్టేట్‌మెంట్‌ని షార్ప్‌గా రుజువు పరచాలి. మరణ వాంగ్మూ లం ఇచ్చిన వ్యక్తి ఊహించిన దానికన్నా చాలా రోజులకి చనిపో యారన్న కారణంగా ఆ మరణ వాంగ్మూలం తన విలువని కోల్పోదు. ఆ స్టేట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కావాలంటే అది తన మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని వివరిస్తే సరిపో తుంది. మరణానికి గల కారణం ప్రత్యక్షంగా ఉండవచ్చు లేక పరో క్షంగా ఉండవచ్చు.

(సుధాకర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, 2000 ఏ. ఐ.ఆర్‌. 2002 సుప్రీంకోర్టు =2000 క్రిమినల్‌ లా. జర్నల్‌ 3490).మరణానికి ముందు రాసిన ఉత్తరాలకి నేర సంఘటనతోని దగ్గరి సామీప్యత ఉంటే ఆ ఉత్తరాలు సె.32 ప్రకారం సంబంధితాలవు తాయి. హింసని, వేదనని ఈ ఉత్తరాలు ప్రతిబింబించవచ్చు. కొన్ని కేసుల్లో చాలా రోజుల క్రితం రాసిన ఉత్తరాలని కోర్టులు తిరస్క రించాయి.

మరికొన్ని కేసుల్లో ఆమోదించాయి. మృతురాలు రాసిన ఉత్తరాలే ప్రధాన సాక్ష్యంలో భాగమైనప్పుడు ఆమె మరణానికి ఆ ఉత్తరాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు, మరణానికి సంబం ధించిన కథని వివరిస్తున్నప్పుడు ఆ ఉత్తరాలు తప్పక సె.32 పరిధిలోకి వస్తాయి. అవి ఆమోదయోగ్యం కూడా అవుతాయి. సుదూరమైన కాలం కారణంగా ఆ ఉత్తరాలు సంబంధితాలు కావని అనడానికి వీల్లేదు అని శరద్‌బిర్దీ చంద్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరణానికి నెల రోజుల ముందు తన అత్తమామల చేతుల్లో పడుతున్న బాధల గురించి రాసిన మూడు ఉత్తరాలు సెక్షన్‌ 32(1) పరిధిలోకి వస్తాయి. (బిక్షపతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, 1989 క్రిమినల్‌ లా జర్నల్‌ 1186 ఎ.పి)మరణానికి రెండు రోజుల ముందు మృతురాలు తన తండ్రికి ఉత్తరం రాసింది. తన అత్తమామ, భర్త, ఇతర బంధువుల చేతుల్లో తన మరణం ఉందని తనని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళమని ఆ ఉత్తరాల సారాంశం.

ఆ ఉత్తరం రెండు రోజుల ముందు రాసింది కాదు అంతకు ముందు రాసిందని డిఫెన్స్‌ వాదన. ఎప్పుడు రాసిందీ అన్న విషయంలో ఏమీ భేదం లేదు. ఆ ఉత్తరాలు ఆమే రాసినట్లు రుజువైందని సుప్రీంకోర్టు అభిప్రా య ప డింది. ఆమె రాసిన మిగతా ఉత్తరాలని ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు కోర్టు లో ప్రవేశపెట్టని కారణంగా, ఆ ఉత్తరాలు మరుగు పరిచి ఆమె చేతి రాతని పరిక్షించే వీలు కల్పించలేదనే భావనకి రావడానికి వీల్లేదు. (స్టే ట్‌ ఆఫ్‌ యూ.పి వర్సెస్‌ హరిహరన్‌ 2001 ఎస్‌.సి.సి (క్రిమినల్‌) 49).స్వర్ణలతని వాళ్ళ అత్తా మామ హింసించి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఆమె తమ తల్లితండ్రుల వద్ద కొద్దికాలం నివసించింది. ఆ కాలంలో తనని తీసుకెళ్ళమని తప్పు తనదేనని అత్తమామలకి ఎన్నో ఉత్తరాలు రాసింది. కానీ ఫలితం లేకపోయింది.

చివరికి తన మేనమామలను తీసుకొని వెళ్ళింది. కానీ వాళ్ళ ఆమెను తిట్టి పంపించి వేశారు. తన మేనమామలతో కలిసి తిరిగి వస్తున్నప్పుడు, మేన మామలు ఎడ్లబండి తీసుకురా వడానికి వెళ్ళినప్పుడు ఆమె రైల్వేట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అత్తమామల పైన ఆత్మహత్య ప్రేరకులుగా కేసు పెట్టారు. స్వర్ణలత రాసిన ఉత్తరాలను కోర్టులో ఆమె మరణా నికి కారణాలుగా (ఇజీటఛిఠఝ ట్ఞ్చఛ్ఛిట) ప్రవేశపెట్టారు. నేర సంఘటనతో ఆ ఉత్తరాలకి సామీప్యత (ఞట్ఠౌఝజ్టీడ) లేదని కోర్టు ఆ ఉత్తరాలను మరణ వాంగ్మూలంగా ఆమోదించ లేదు. (గోకుల చంద్ర వర్సెస్‌ స్టేట్‌, ఏ.ఐ.ఆర్‌.1950 కలకత్తా 306) సంఘటన కన్నా ముందు అంటే ఐదు సంవత్సరాలకి ముందు రాసిన ఉత్తరాలు కూడా మరణ వాంగ్మూలాలుగా ఆమోదించబడతాయి.

Tuesday, August 11, 2009

పోలీసులు - బెయిలు

ముద్దాయిలను అరెస్టు చేసిన తరువాత వాళ్ళని మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తుంటారు. చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులను పోలీసులే బెయిలుపై విడుదల చేస్తూ ఉంటారు. మరి కొంత మందిని మేజి స్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి. కానీ చట్టప్రకారం ఆ విధంగా చేయడానికి వీల్లేదు. నేరాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి బెయిల బుల్‌ నేరాలు, నాన్‌ బెయిలబుల్‌ నేరాలు. బెయిలబుల్‌ నేరాల్లో నిందితుడు బెయిలు పొందే హక్కు కలిగి ఉంటా డు. బెయిలు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కోర్టులపై ఉంటుంది. బెయిలు నిరాకరించితే ముద్దాయి నష్టపరిహారం కూడా కోరవచ్చు. బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు పొందే హక్కు కలిగి ఉంటారన్న విషయం ముద్దాయిలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కస్టడీలో ఉండి సరైన జామీను ఇచ్చినప్పుడు బెయిలబుల్‌ నేరాల్లో అతణ్ణి విడుదల చేయాల్సి ఉంటుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.436 నిబంధనను సవరణతో తీసుకొని వచ్చారు. బెయిలబుల్‌ నేరంలోని నిందితుడు పోలీసులు కోరిన జామీనును ఇవ్వలే పోయినపుడు అతన్ని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు. అదే విధంగా బెయిలు ఇవ్వనపుడు కూడా కోర్టు ముందు హాజరు పరుస్తారు. బెయిబుల్‌ నేరాల్లో కోర్టు ముద్దాయికి తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలి. నిజానికి ఆ బెయిలును పోలీసులే మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా జరగడం లేదు. బెయిలబుల్‌ నేరాల్లో కోర్టు బెయిలు మంజూరు చేసేటప్పుడు జామీను కోరే అవకాశం ఉంది. జామీను ఇవ్వలేనప్పుడు మాత్రమే అతన్ని జైలుకు పంపిస్తారు. అయితే అరెస్టు అయిన తేదీ నుంచి పది రోజుల్లోగా జామీను పెట్టకోలేకపోతే అతణ్ణి నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద కోర్టులు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే నాన్‌బెయిలబుల్‌ నేరాల్లో కూడా పోలీసులు బెయిలు మంజూరు చేయవచ్చా? నాన్‌ బెయి లబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయడం ఒక్క కోర్టు విచక్షణాధికారం పైనే ఉంటుందా? వీటి గురించి తెలుసుకునే మందు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.41 ఏమి చెప్తుందో తెలుసుకోవాలి. కోర్టు నుండి ఎలాంటి వారంటు లేకుండా ఏ వ్యక్తినైనా కొన్ని సందర్భాల్లో అరెస్టు చేసే అధికారాన్ని ఈ నిబంధన పోలీసు అధికారులకు ఇస్తుంది.

సె.41(1) () ప్రకారం- (1) కోర్టు నుంచి ఎలాంటి వారంటు లేకుండా, మెజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా-(ఎ) కాగ్నిజబుల్‌ నేరంతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినైనా లేక అతనికి వ్యతిరేకంగా సహేతుకమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, విశ్వసనీయ సమా చారం అందినపుడు లేక సహేతుకమైన అను మానం ఉన్నప్పుడు, వాటితో ఆ వ్యక్తికి సంబంధం ఉన్నప్పుడు పోలీసు అధికారి అరెస్టు చేయవచ్చు. ఈ విధంగా అరెస్టు చేసిన వ్యక్తిని ఎక్కువ కాలం తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు. ఎక్కువకాలం తమ నిర్బంధంలో ఉంచుకోవడాన్ని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె.57 నిషేధిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22 కూడా నిషేధిస్తుంది. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసినపుడు అత న్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటలకు మించి పోలీసులు తమ కస్టడీలో ఉంచు కోవడానికి వీల్లేదు. అయితే మెజి స్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్ళే సమయాన్ని మినహయించ వచ్చు.

నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో, బెయిల్‌ అనేది హక్కుగా కాకుండా విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ విచక్షణాధికారాన్ని కోర్టులే ఉపయోగించాల్సి ఉంటుం దా? పోలీస్‌ అధికారులు కూడా ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.169, సె.437(2)ల గురించి తెలుసుకోవాలి. దర్యాప్తు చేసిన తరువాత సరైన సాక్ష్యం లేదని పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి భావించినపుడు గానీ లేక ముద్దాయి నేరం చేశాడని అనుమానించి మేజిస్ట్రేట్‌ వద్దకు పంపించడానికి సహేతుకమైన ఆధారాలు లేన ప్పుడు, ఆ వ్యక్తి తమ కస్టడీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర బాండుని జామీను దారులతో గాని లేకుండా గానీ తీసు కొని విడుదల చేయాల్సి ఉంటుంది. పోలీసు రిపోర్టుపై నేరాన్ని గుర్తించే మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుకమ్మని ఆదేశించ డానికి అవకాశం ఉంది.

నాన్‌ బెయిలబుల్‌ నేరాల గురించి దర్యాప్తు చేస్తున్న ప్పుడు ముద్దాయిపై వచ్చిన సమాచారం సరైందనిగానీ, తగిన ఆధారాలు ఉన్నాయని గానీ దర్యాప్తు చేసే అధికారి భావించినపుడు అతడికి ఆ వ్యక్తిని విడుదల చేసే అధి కారం లేదు. ఆ విధంగా విడుదల చేయడం సరైంది కాదు కానీ అవినితి నిరోధక కేసుల్లో (ట్రాపు కేసుల్లో) తప్పు చేసిన పబ్లిక్‌ సర్వెంట్లను విడుదల చేయడం జరుగుతుంది. దర్యాప్తు చేసిన తరువాత సరైన సాక్ష్యం లేదని పోలీస్‌ అధికారి భావించినపుడు ముద్దాయి నేరం చేశాడని అనుమానించడానికి సహేతుకమైన ఆధారాలు లేనప్పుడు కస్టడీలో ఉన్న ముద్దాయిని పోలీసు అధికారి విడుదల చేయాల్సి ఉంటుంది. అదే విధంగా, అరెస్టు చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన సమాచారం గానీ, ఫిర్యాదు గానీ ఆధార రిహ తంగా ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని విడుదల చేసే అధి కారం పోలీసు అధికారికి సె.437(2) ప్రకారం లభిస్తుంది.

ఏదైనా కేసు దర్యాప్తులో గానీ, విచారణ(ట్రయలు)లో గానీ, ఉన్నప్పుడు అరెస్టు చేసిన అధికారికి గానీ, కోర్టుకు గానీ ఆ వ్యక్తి నాన్‌ బెయిలబుల్‌ నేరం చేశాడని సహే తుకంగా అనిపించనప్పుడు అతన్ని బెయిలుపై విడుదల చేయాల్సిన బాధ్యత ఆ అధికారిపైగానీ, ఆ కోర్టుపై గానీ ఉంటుంది. కానీ అతడు నేరం చేశాడా లేదా అన్న విషయం గురించి ఇంకా విచారణ అవసరం ఉన్నప్పుడు, అతను హాజరుకావడానికి గాను బాండును తీసుకోవాల్సి ఉంటుంది.ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకు న్నప్పుడు సాధారణ నియమం ప్రకారం నాన్‌ బెయి లబుల్‌ నేరాల్లో పోలీసు అధికారులు బెయిలు ఇవ్వడానికి వీల్లేదు. కానీ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.169, సె.437లలో పేర్కొన్న పరిస్థితుల్లో మాత్రమే పోలీస్‌ అధికారులు నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయడానికి అవకాశం ఉంది.

Tuesday, August 4, 2009

గౌరవ హత్యలు


నేరాలు పాతవే. కానీ పేర్లు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని పదబంధాలు వచ్చాయి. అవే -ద్వేషించే నేరాలు, ద్వేషించే ఉపన్యాసం, గౌరవనేరాలు, గౌరవహత్యలు. ఇలాంటి నేరాలకు సంబంధించి కొత్త చట్టం కావాలని కఠిన శిక్షలు ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు. కొత్త చట్టాలు అవసరం లేదు. ఈ నేరాలని త్వరితగతిన దర్యాప్తు చేయడానికి దర్యాప్తు సంస్థలు, పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఉంటే చాలని మరి కొంత వాదిస్తున్నారు. ‘గౌరవ నేరాలు’ ‘గౌరవ హత్యలు’ దేశమంతటా జరుగుతూనే ఉన్నాయి. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చిదంబరం రాజ్య సభలో ప్రస్తావించారు. ఈ గౌరవ నేరాలని, గౌరవ హత్యలని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉందని మంత్రి చెప్పారు. ఈ పదబందాలని వింటున్నప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. నేరాల్లో గౌరవ నేరాలు, హత్యల్లో గౌరవ హత్యలు కూడా ఉంటాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ‘గౌరవనేరాలు’ ‘గౌరవహత్యలు’ అంటే ఏమిటో, వీటిని అరికట్టడం ఎవరి బాధ్యత, వీటిని అరికట్టడానికి ప్రత్యేక చట్టం అవసరమా? అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులని తీసుకొస్తే సరిపోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలని వెతుకుందాం.

ఇటీవలి కాలంలో జరిగిన రెండు మూడు సంఘటనలని హోంమంత్రి ఉదహరించారు. వాటిని చూద్దాం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ ముస్లిం యువతిని దళిత యువకుడు, పెద్దవాళ్ళకి చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ యువకుడు హత్యకు గురైనాడు. ఇలాంటి మరో సంఘటన హర్యానాలో జరిగింది. ఓ జంట పెద్దలకు తెలియకుండా కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆ అమ్మాయి బంధువులు ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని పోయినారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కోర్టులో దరఖాస్తు చేసి, కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు జవానుని తీసుకొని భార్యని వెదకడానికి బయల్దేరాడు. చివరికి ఆ ఇద్దరూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల చేతుల్లో హతమయ్యారు. ఇవి రెండూ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘనలు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వివాహాలు చేసుకున్న వ్యక్తులని సాంఘిక బహిష్కరణకు కూడా గురి చేస్తుంటారు. రకరకాలైన ఆంక్షలని కూడా విధిస్తూంటారు. కుల సంఘాలు, మత పెద్దలు తీర్పులని, ఫత్వాలని కూడా వీరికి వ్యతిరేకంగా జారీ చేస్తుంటారు. ఇటువంటి నేరాలనే గౌరవ నేరాలని, ఇలా జరిగే హత్యలనే గౌరవ హత్యలని అంటున్నారు. కుటుంబ గౌరవాలని మంట కలిపారని వారి బంధువులు చేసే నేరాలు ఇవి. కాల దోషం పట్టిన ఆచారాల్లో వీటి వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయి. ఈ నేరాలు ఎక్కువగా ఇలాంటి వివాహాలు చేసుకున్న యువతీ కుటుంబ సభ్యుల పైన ఎక్కువగా జరుగుతుంటాయి మన భారత దేశ చట్టాల్లో వీటిని ప్రత్యేకంగా వర్గీకరించరాదు. ఇలాంటి సంఘటనల్లో ఎవరైనా హత్యకు గురైతే, ముద్దాయిలపై భారతీయ శిక్షాస్మృతిలోని సె.302 ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి.

ఒక వ్యక్తిని ప్రేమించడం, పెళ్ళి చేసుకొని జీవించడం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే వాళ్ళిద్దరూ మేజర్లై ఉండాలి. చట్ట ప్రకారం వివాహాం చేసుకునే యోగ్యత కలిగి ఉండాలి. కుటుంబ గౌరవం పేరుతో జరిగే ప్రతి మరణం పురాతన భావాలకు నిదర్శనం. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ మరణాలు దిగ్భ్రాంతిని కలుగచేస్తాయి. కఠినమైన కుల సమాజంలో కుటుంబ గౌరవం పేరుతో జరుగుతున్న హత్యలే ఈ గౌరవ హత్యలు. గ్రామాల్లో కుల సంఘాలు తీర్పులని అమలు చేస్తూ కొంత మంది వ్యక్తులు ఈ నేరాలకి పాల్పడుతున్నారు. ఈ నేరాలు స్త్రీల పైనా, పురుషులపైనా, జరుగుతున్నాయి. ప్రేమి అప్యాయతలకి ఈ నేరాలు వ్యతిరేకం, కుల సంఘాలు జారీ చేసే తీర్పులకి, ఫత్వాలకి చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేనప్పటికీ ఆ తీర్పులు కొన్ని రాష్ట్రాలో కోర్టు తీర్పులు డిక్రీల కన్నా సమర్ధవంతంగా అమలవుతున్నాయి. ఇది చాలా అందోళన కలిగిస్తున్న అంశం.

కులసంఘాలు తీర్పులు చెప్పకుండా ఫత్వాలు జారీ చేయకుండా అదుపు చేయడానికి తగిన నిబంధనలు ఇప్పుడు అమల్లో ఉంటున్న చట్టాల్లో లేవు. అదే విధంగా సంఘ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తే వారిపై సరైన చర్యలు తీసుకునే విధంగా భారతీయ శిక్షాస్మృతిలో ఎలాంటి నిబంధనలు లేవు. అందుకని తగు నిబంధనలు తేవడం అవసరమే. సాధారణంగా నేరాలని రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్‌ పై ఉంటుంది. వరకట్నం చావు విషయంలో కూడా అలాంటి నిబంధనలే ఉన్నప్పటికీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో ఆ నేరం గురించి నిజమనే భావనని తీసుకోవడానికి సె113బి అన్న నిబంధనని ఏర్పరిచారు.

ఈ హత్యల విషయంలో కూడా అలాంటి నిబంధన అవసరమని అన్పిస్తుంది. కలాంతర, మతాంతర వివాహాలని ఎవరైనా జంట వివాహం చేసుకొని దాన్ని వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు ఒకటి రెండు సంవత్సరాల్లో వారి మరణం అసాధారణ పరిస్థితుల్లో జరిగితే దానికి ఆ కుటుంబ సభ్యుల బాధ్యత వహించే విధంగా భారతీయ సాక్ష్యాధారాలు చట్టం మార్పులు అవసరమే. ప్రత్యేక చట్టం చేయన్పటికీ భారతీయ శిక్షాస్మృతిలో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో అవసరమైన సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్పిస్తుంది. పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలుగా రాజ్యాంగం రాష్ట్రాలకు అప్పగించిన్పటికీ, ఈ విషయంలో అవసరమైన సవరణలని, అవసరమనిపిస్తే కొత్త చట్టాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. చట్టంలో మార్పులే కాదు పరిష్కారానికి అవసరమైన న్యాయ, పోలీసు యాంత్రాంగాన్ని కూడా ప్రత్యేకం ఏర్పాటు చేయాలి. అలా చేయనప్పుడు తగు ఫలితాలు వచ్చే అవకాశం లేదు.

Followers