Thursday, October 29, 2009

పూచీకత్తుతో బెయిల్‌ పొందవచ్చా ?

మన దేశంలోని కోర్టులలో మూడు కోట్ల కేసులు విచారణలో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో 2.5 కోట్లు కేసులు దిగువ కోర్టుల్లో, 40 లక్షల కేసులు వివిధ హైకోర్టుల్లో, 52,000 కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.

కింది కోర్టుల్లో ఇన్ని కేసులు విచారణలో ఉన్న ప్పుడు క్రిమినల్‌ కేసుల విచారణ సత్వరంగా జర గడం కష్టమైన పని. విచారణ సత్వరం జరగ పోవడం వల్ల, బెయిలు పెట్టుకోలేని స్థితిలో ఉండ టం వల్ల చాలా మంది వ్యక్తులు జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తుంది. నేరాలు రెండు రకాలుగా ఉంటాయి. బెయిలబుల్‌ నేరాలు, నాన్‌ బెయిలబుల్‌ నేరాలు. బెయిల్‌బుల్‌ నేరాల్లో బెయిలు పొందడం అనేది హక్కుగా ఉంటుంది. నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో బెయిల్‌ ఇవ్వడం అనేది కోర్టు విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న నేరాలను బెయిల బుల్‌ నేరాలుగా గుర్తించడం జరిగింది.

ఈ చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులు కూడా బెయిల్‌ పెట్టు కోలేక పోవడం వల్ల జైళ్ళల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సె.436లో ప్రొవిసోని అన్న కొత్త నిబంధన ఏర్పాటు చేశారు. ఈ నిబంధన ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలు వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదలయ్యే అవకాశం లభించింది.
కేసు దర్యాప్తు సమయంలో గానీ, కేసు విచారణ దశలో గానీ ఎంకై్వరీ దశలో గానీ ఎవరైనా విచా రణలో ఉన్న ఖైదీ జామీను పెట్టుకోలేని పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదలయ్యే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుంది.

అయితే ఆ వ్యక్తి బెయిల్‌బుల్‌ నేరంలో ముద్దాయి అయి ఉండాలి. అతనికి బెయిలు మంజూరై, జామీ ను పెట్టుకోలేని పరిస్థితులలో ఉండాలి. అరెస్టు అయి 7 రోజుల నుంచి కస్టడీలో ఉండి ఉండాలి. ఈ మూ డు పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిగత పూచీ కత్తు మీద విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్‌ చేసిన తేదీ నుంచి లేదా పోలీసులు అరెస్టు చేసిన తేదీ నుంచి ఏడు రోజులను లెక్కకట్టవలసి ఉం టుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొంత మంది 7 రోజులు దాటిన తరువాత కూడా కాలం తరబడి బెయిల్‌బుల్‌ నేరాల్లో జైళ్ళల్లో ఉండి పోతున్నారు. ఈ నిబంధనలోని ప్రొవి సో ప్రకారం మేజిస్ట్రేట్‌ విధిగా వాళ్ళని వ్యక్తిగత పూచీ కత్తు మీద విడుదల చేయాల్సి ఉంటుంది.

సె-436: క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.436లో ప్రొవిసోతో పాటు, సె.436ఎ అన్న కొత్త నిబంధనని కూడా ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రకా రం నాన్‌ బెయిల్‌బుల్‌ నేరాల్లో కూడా కొన్ని సంద ర్భాలలో బెయిల్‌ మీద విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉన్న నేరారోపణలను ఎదుర్కొంటున్న ముద్దాయికి ఈ నిబంధన వర్తించదు. మరణ శిక్ష విధించడానికి అవకాశం లేని నేరాల్లో విచారణలో ఉన్న ఖైదీ నేర స్వభావాలతో సంబంధం లేకుండా బెయిలు పొందే అవకాశం ఉంటుంది. ఆ నేరానికి విధించే గరిష్ట శిక్షలో సగభాగం శిక్ష ఆ ఖైదీ అనుభవించి ఉండాలి.

ఇలాంటి సందర్భాలలో కొర్టు ప్రాసిక్యూటర్‌ వాద నలు విని ఆ ఖైదీ విడుదల కోసం ఆదేశాలను జారీ చే యవచ్చు. అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద గానీ, జామీను పైన గానీ విడుదల చేయమని ఆదేశించవ చ్చు. బెయిల్‌పై విడుదల చేసే ముందు ఆ విధంగా విడుదల చేయడానికి గల కారణాలను కోర్టు తన ఆదేశాల్లో చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ విడు దల చేయడానికి నిరాకరించినప్పుడు కూడా కోర్టు కారణాలను తన తీర్పులో చెప్పాల్సి ఉంటుంది.

ఈ రెండు నిబంధనలను చట్టంలో కొత్తగా ఏర్పరి చారు. ఇవి కాకుండా కూడా ఇంకో నిబంధన చట్టం లో ఉంది. అదే సె.167 (2). క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఈ నిబంధన ప్రకారం కూడా కేసు దర్యాప్తు దశలో విచారణలో ఉన్న ఖైదీలను విడుదల చేయ వచ్చు. 10 సంవత్సరాలు గానీ, అంతకు మించి గా నీ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసుల దర్యాప్తు ముద్దాయిని అరెస్టు చేసిన తేదీ నుంచి 90 రోజుల్లోగా పూర్తి కావాలి. ఒక వేళ ఆ విధంగా దర్యా ప్తు పూర్తి కానప్పుడు ముద్దాయిని కేసులోని యోగ్య తలతో నిమిత్తం లేకుండా బెయిలుపై విడుదల చే యాల్సి ఉంటుంది. కోర్టులు జామీను కోరవచ్చు. అదే విధంగా మిగతా కేసుల్లో దర్యాప్తు 60 రోజు ల్లోగా పూర్తి కావాలి. ఒక వేళ దర్యాప్తు 60 రోజు ల్లోగా పూర్తి కాకపోతే ముద్దాయిని బెయిలుపై విడు దల చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కోర్టులు జామీను కోరవచ్చు.

ఎలాంటి జామీను లేకుండా విడుదల కావడానికి అవకాశం ఉన్న ఒకే ఒక నిబంధన క్రిమినల్‌ ప్రొసీ జర్‌ కోడ్‌లోని సె.436లోని ప్రొవిసో. ఇక్కడ జామీ ను కావాలని కోరే అవకాశం కోర్టుకి లేదు. జైళ్లని సందర్శించినప్పుడు చాలా మంది మామూలు ఖైదీలే, అంటే చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులే ఎక్కువ మం ది కన్పిస్తారు. అలా అన్నీ బెయిల్‌బుల్‌ నేరాలే. అలాంటి నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు వ్యక్తి గత పూచీకత్తుపై విడుదల కావొచ్చు. అయితే ఇది మొదటి దశలో కాదు. అరెస్టు అయిన 7 రోజుల తరువాత మాత్రమే ఇలాంటి అవకాశం సంక్రమి స్తుంది. 7 రోజుల తరువాత జామీను కావాలని కోర్టు కోరే అవకాశం లేదు. విధిగా వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనను కోర్టులు, విచారణలో ఉన్న ఖైదీ లు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉపయోగించుకున్నప్పుడు కేసుల సంఖ్య తగ్గక పోయినా జైళ్లల్లో ముద్దాయిల సంఖ్య తగ్గుతుంది.

Wednesday, October 21, 2009

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనాల డ్రైవర్లు ఆ వాహనాల్ని అక్కడే వదిలేసి పారిపోతుంటారు. వీలైతే మరికొన్ని సార్లు వాహనం కూడా తీసుకునే పారిపోతుంటారు. ప్రమాదానికి గురైన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోకుండా, అతనికి కనీస వైద్య సదుపాయాల్ని కల్పించాలన్న కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తి స్తుంటారు.సరైన సమయానికి వైద్యసదుపాయాలు అందినట్లైతే కొన్ని సందర్భాలలో ప్రమాదానికి గురైన వ్యక్తులు బతికే అవకాశాలు ఉండవచ్చు. బతికే అవకాశం ఉన్నప్పటికీ ప్రమాదానికి కారకులైన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల బాధితులు ప్రాణాలు కోల్పోవచ్చు.

మోటారు ప్రమాదానికి గురైన వ్యక్తికి తక్షణ సదుపాయాలు కల్పించడం అందుకు కారకుడైన డ్రైవర్‌ కనీస భాద్యత. అవస రమైతే అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. అయితే అ లా తరలించడం ఆ బాధితుని ఇష్టానికి వ్యతిరేకంగా జరుగ కూడదు. ఒక్కోసారి ప్రమాదానికి గురైన వ్యక్తి పొరపాటు వల్లనే ప్రమాదం జరగవచ్చు. ఆ వ్యక్తిని ప్రమాద స్థలం నుంచి తొల గించడం వల్ల ఆ సాక్ష్యం రూపు మారిపోవుచ్చు. అందుకని పోలీ సుల సహాయాన్ని తీసుకొని నేర స్థల స్కెచ్‌ తయారు చేసిన తరు వాతే తరలించాలి. రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగి నపుడు ఏ వాహనం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందో తెలుసు కోవడానికి వాటి స్థానాలను, అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తి స్థానాన్ని గుర్తించడం అవసరమవుతుంది.

పోలీసులు దరిదా పుల్లో లేనప్పుడు తప్పనిసరిగా అతన్ని ఆసుపత్రికి తరలించాలి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీస్‌ అధికారులు ఎవరూ లేనట్లైతే ఆ ప్రమాద సమాచారాన్ని దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో సాధ్యమైనంత త్వరగా తెలియపరచాలి. ప్రమాదం జరిగి, ఆ ప్రమాదంలో బాధితుడైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిద్దాం అను కునేంతలో అక్కడ గుమికూడిన జనం ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కి హాని తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు అతను నేర స్థలం నుంచి పారిపోవడంలో తప్పులేదు. పారిపోయినా వెంటనే అత ను ప్రమాద విషయాన్ని పోలీసులకు తెలియచేయాలి. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోవలసి వచ్చిందని కూడా తెలియచేయాలి.

ఏదైనా ప్రమాదం జరిగి వాహనాల రాకపోకల కు అంతరాయం ఏర్పడినప్పుడు డ్రైవర్‌ తనంతట తానుగా వాహనం స్థానాన్ని తొలగించకూడదు. పోలీసు అధికారులు వచ్చి నేరస్థుల పంచనామా చేసిన తరువాతనే వాహనాలను ఆ యా స్థానాల నుంచి తొలగించాలి. వాహనానికి సంబంధించిన వివరాలు, దాని రిజిస్ట్రేషన్‌, ఇన్స్యూరెన్స్‌, వాహన యజమాని వివరాలను పోలీసులు కోరినప్పుడు తెలియచేయాల్సిన భాద్యత ఆ డ్రైవర్‌ మీద ఉంటుంది. ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల్లోగా అంద చేయాల్సి ఉంటుంది.

బాధితుడు అతని సంబంధికులు తీసుకోవలసిన జాగ్రత్తలు
ప్రమాదం కలగజేసిన చేసిన వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబరు గుర్తు పెట్టుకోవాలి. వీలుంటే ప్రమాదానికి గురిచేసిన డ్రైవరు పేరు, వయస్సు, అడ్రసు మెదలగు వివరాలు తెలుసుకోవాలి. పోలీసులు వచ్చి పంచనామా చేసే వరకూ వాహనాన్ని అక్కడ నుంచి కదలించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రమాదం గురిం చిన ప్రాథమిక సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా సమీప పరిధిలో గల పోలీస్‌ స్టేషన్‌లో తెలియపరచాలి. త్వరగా తెలియ చేయడం వల్ల పోలీసులు త్వరగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత మంది సాక్ష్యులను పోలీసులు విచా రించేలా ప్రయత్నించాలి. ప్రత్యక్షసాక్షులు ప్రమాద స్థలంలో ఉండేట్టు చేసుకోవాలి. బాధితుడు ప్రాణాలతో ఉన్నట్లైతే అతణ్ణి సమీప ఆసుపత్రికి తరలించి సరైన వైద్యసదుపాయాలు పొందే వీలు కల్పించాలి.

నేరం జరిగిన స్థలంలో గుర్తులు చెదరక ముందే వివిధ కోణాల్లో ఫోటోలు తీయించే ఏర్పాటు చేయాలి. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆ డాక్టర్‌ నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందాలి (ఆ సర్టిఫికేట్‌ వల్ల అతనికి తగిలిన గాయాల తీవ్రతను తెలుసుకునే అవకాశం ఉంటుంది). దుడుకు తనం లేదా నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చేసిన వ్యక్తిపై పోలీసులు తప్పని సరిగా క్రిమినల్‌ కేసులు పెడతారు. ఒక వేళ పెట్టనట్లైతే అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలి. వాటి ఫలితాలు తెలుసుకోవాలి. క్రిమినల్‌ కేసు ఫలితం ట్రిబ్యునల్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. కానీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఆ కేసులో రుజువైనట్లెతే అది కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రమాదంలో బాధితుడు చనిపోయినట్లైతే అతని శవాన్ని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష చేయించాలి. ఆ పరీక్ష నివేదిక వల్ల అతని మరణానికి దారి తీసిన కారణాలను రుజువు పరచడానికి వీలుంటుంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను చికిత్సకోసం డాక్టర్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, వారు ఆ వ్యక్తులకు అవసరమైన చికిత్సను సత్వరం అందచేయాలి. అంతే కానీ పోలీసులు వచ్చే వరకు తాము ఏ చికిత్స చేయబోమని తెలపడం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని సూచించడం కూడదు. సత్వ ర చికిత్స అందచేయడం వైద్యుల పైన ఉన్న కనీస బాధ్యత.

Thursday, October 15, 2009

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

ఉద్యోగం చేయని మహిళల పనికి మన సమాజంలో గుర్తింపు లేదు. ఇంటినీ, సంసారాన్ని చక్కదిద్దే పనికి విలువ లేదు. దాన్ని వెలకట్టలేం కానీ వెలకట్టే ముందు కోర్టులు మగవాడి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మహిళ మృతి చెందితే ఆమె ఆదాయాన్ని తెలుసుకోవడం అవసరం. ఆమె ఆదాయాన్ని, ఆమె జీవన ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఆమె వారసులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నిర్ధారిస్తాయి. ఆమెకు ఏమైనా బలమైన గాయాలు ఆయితే ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహా రానికి కూడా ఆమె ఆదాయ వివరాలు అవసరం. ఆమె ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె జీతాన్ని, ఆదాయాన్ని అంచనా వేయలేం.

కోర్టులు నష్టపరిహారాలను చెల్లించే ముందు వివిధ అంశా లను పరిగణనలోకి తీసుకుంటాయి. భావ సారూప్యం కలిగిన అన్ని కేసుల్లోని నష్టపరిహార మొత్తాలన్నీ ఒకేలా ఉండాలని లేదు. అందుకని ఒక్కో కేసులోని పరిస్థితులను బట్టి ఒక్కో రకమైన అవార్డుని కోర్టులు నిర్ధారిస్తాయి. ఒకే విధంగా అనిపిస్తున్న ప్రతి కేసులో ఒకే రకమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయించాలని శాసనంలో ఎక్కడా పేర్కొనలేదు. ఒక్కో కేసు లోని వివిధ అంశాలను బట్టి నష్టపరిహార మొత్తాలను తమకు న్యాయబద్ధంగా తోచిన విధంగా కోర్టులు నిర్ణయిస్తాయి.

వ్యక్తిగత గాయాలకు నష్టపరిహారం నిర్ణయించడంలో కోర్టు లు ప్రధానంగా, ఆ వ్యక్తికి ఆ గాయాలు కానట్లైతే అతను ఎంతైతే సంపాదించేవాడో ఆ మొత్తాన్ని అతనికి చెందేటట్టుగా నిర్ణయిస్తాయి. అంతే కాకుండా ఆ గాయాల వల్ల బాధితునికి కలిగిన బాధను, వేదనను దృష్టిలో ఉంచుకొని నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయిస్తాయి. బాధితునికి కలిగిన బాధనీ, వేదనని డబ్బుతో కొలవలేం. ఆ నష్టాన్ని కోర్టులు ఏ విధంగా పూరించ లేవు. కాబట్టి డబ్బు ద్వారా ఆ నష్టాన్ని పూరించడానికి ప్రయత్నిస్తాయి.
ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణించినప్పుడు, ఆ వ్యక్తి ఎంతకాలం వరకు జీవించేవాడో పరగణనలోకి తీసుకొని ఆ కాలపరిమితిలో అతని చట్టబద్ధ ప్రతినిధులకు ఎంత ఆదా యం లభించేదో ఆ మొత్తాన్ని నష్టపరిహార రూపకంగా ట్రిబ్యు నళ్ళు నిర్ధారిస్తాయి. అయితే గృహిణులకు ఎలాంటి ఆదాయం ఉండదు.మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు?ఈ పరిస్థితులను గమనించి మోటారు వాహన చట్టంలో రెండవ షెడ్యూలును ఏర్పాటు చేశారు. ఆ రెండవ షెడ్యూలు ప్రకారం దంపతుల్లో ఎవరికైనా ఎలాంటి సంపాదన లేనప్పుడు, అందులో రెండవ వారికి సంపాదన ఉన్నప్పుడు ఆ సంపాదిస్తున్న వ్యక్తి ఆదాయంలో మూడవ వంతుగా వారి ఆదాయాన్ని నిర్ణయించాలి.

అంటే గృహిణుల ఆదాయాన్ని ఉద్యోగం చేస్తున్న భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టులు నిర్ణయించి నష్టపరిహారాన్ని మంజూరు చెయ్యాలి. ఆ విధంగా గృహిణుల ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకోవడం సరైందేనా? ఇలాంటి ప్రశ్నే మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో వేసుకుంది. నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ వర్సెస్‌ దీపికా కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రభాశ్రీ దేవన్‌ ఇలాంటి ప్రశ్నే వేసి విషయం గురించి తిరిగి పునఃపరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.

గృిహణులు ఇంట్లో చేస్తున్న చాకిరినీ, సేవలను మగవాడి జీతంతో కొలవడం సరైందేనా? ఒక వేళ కొలిచినా అతని ఆదా యంలో మూడవ వంతుగా స్వీకరించడం సమంజసమేనా? ఇవీ కోర్టు ఈ తీర్పులో లెవనెత్తిన ప్రశ్నలు 1995లో స్ర్తీల మీద అన్ని రకాల హింసల నుండి విముక్తి (ఇ్ఛఛ్చీఠీ) పత్రం మీద భారత దేశం కూడా సంతకం చేసింది. అంటే మహిళల అభివృద్ధి గురించి మన దేశం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.ఎలాంటి ప్రతి ఫలం లేకుండా మహిళలు చేసే ఇంటి చాిరీకీ ఈ ఒప్పంద పత్రం ప్రకారం కూడా సరైన విలువ కట్ట వలసిన బాధ్యత భారత దేశంపై ఉందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. మహిళలు ఇంటి బాగు కోసం, అభివృద్ధి కోసం చేసే సేవల వల్ల ఆ ఇల్లు బాగుపడుతుంది. ఫలితంగా దేశం అభివృద్ధి చెందుతుంది. కోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది.

హోమ్‌మేడమ్‌ను ఎవరూ విస్మరించరాదు. మర్చిపో కూడదు ఇంటి కార్యభారం తన తల మీద వేసుకొని మగవాడిని విముక్తి చేస్తుంది. అందువల్ల అతను తన పూర్తి సమయాన్ని, దృష్టిని తన సంపాదన మీద, తన ఉద్యోగం మీద పెట్టే అవకా శం కలుగుతుంది. మగవాడు ఆస్తి సంపాదించడానికి ఆమె ఉపకరిస్తుంది’.ఈ నేపథ్యంలో మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలును శాసన కర్తలు తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కాదు, వైవాహిక ఆస్తిలో వాటా ఇచ్చే విషయంలో కూడా ఈ విషయాన్ని చూడాల్సి ఉంటుంది.

గృహిణుల ఇంటి చాకిరీ గురించి కొత్త కోణంలో ఆలో చించన తీర్పు ఇది. రోటీన్‌గా వచ్చే తీర్పులకి భిన్నమైనది. మగ వాడు ఆస్తిని సంపాదించడంలో గృహిణుల ప్రత్యక్ష సహాయం లేకపోవచ్చు. కానీ పరోక్ష సహాయం ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఆస్తి కొనుగొలుతో సహాయం అందించకపోవచ్చు. కానీ వారి సేవల ఫలితమే మగవాడి నిర్వాకం.

ఈ తీర్పు ద్వారా మనకు రెండు విషయాలు స్పష్ట మవు తున్నాయి. మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలు ప్రకారం ఇంటి సేవను, గృహిణుల ఆదాయాన్ని అంచనా వేయ డం సమంజసం కాదు. అదే విధంగా మగవాడు స్వయంగా వివాహం తరువాత సంపాదించిన ఆస్తుల్లో నిగూఢ వాటా ఆడ వాళ్ళది ఉంటుంది. భవిష్యత్తులో ఈ విధంగా చట్టాలు పరి ణామం చెందే అవకాశం ఉందని అనిపిస్తుంది.

Followers