Wednesday, September 16, 2009

ఆస్తి’ ప్రాథమిక హక్కా ?

ఆస్తిప్రాథమిక హక్కా ?

ఆస్తి హక్కు అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు. ఇది మామూలు హక్కు. 1978 సంవత్సరం వరకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుగా తొలగించారు. ప్రాథమిక హక్కులను పొందుపరిచిన ఆర్టికల్స్‌లోని 19(1) (ఎఫ్‌) లో ఇది ప్రాథమిక హక్కుగా ఉండేది. భారత దేశంలోని ప్రతి పౌరునికి ఇది వర్తించేది. రాజ్యాంగ 44వ సవరణల చట్టం ద్వారా ఈ హక్కును తొలగించారు. అదే విధంగా ఆర్టికల్‌ 31 ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించారు. తప్పని సరి గా భూమిని ప్రభుత్వాలు తీసుకోవలిసిన పరిస్థితి ఏర్పడి నప్పుడు నష్ట పరిహారం చెల్లించే విధంగా ఆర్టికల్‌ 31లో అవకాశం ఉండేది.

44వ సవరణల ద్వారా దీన్ని కూడ తొల గించారు. అందువల్ల రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం పొందే అవకాశాన్ని పౌరులు కోల్పోయారు. రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 30 (1ఎ) ప్రకారం, అదే విధంగా ఆర్టికల్‌ 31 ఎ (1) లోని రెండవ ప్రొవిసో ప్రకారం కొన్ని సందర్భా లలో నష్టపరిహారాన్ని రాజ్యాంగ రీత్యా పొందవచ్చు.భూసేకరణ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా జరు గుతోంది. ప్రాజెక్టులకు, ప్రజల అవసరాలకు భూసేకరణ చేసే అవకాశం భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంది. ప్రైవేటు భూముల పైన కూడా ప్రభుత్వానికి ఆధి పత్యం ఉంటుంది.

రైలు మార్గాల కోసం, ప్రజా పనుల కోసం, ప్రాజెక్టుల కోసం ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకు న్నప్పుడు సముచితమైన నష్టపరిహారాన్ని ఆ వ్యక్తులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రజల అవ సరాలకు’ అన్న నిర్వచనం పరిధి చాలా విస్తృతమై పోయింది. గత దశాబ్ద కాలంలో ఈ నిర్వచనం పరిధి విస్తృ తమైపోయి ప్రైవేటు పరిశ్రమలకు, ప్రైవేటు గృహాలకు, కోఆపరేటివ్‌ సంస్థల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్‌ ఆట స్థలాల కోసం ఈ సేకరణలను ప్రభు త్వాలు చేయడం మొదలు పెట్టాయి.

ఈ ప్రాజెక్టులు ప్రజల అవసరాలకంటే ప్రైవేటు వ్యక్తుల అవసరాలనే ఎక్కువగా తీరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు జీవించే హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తోడు సెజ్‌లు వచ్చే శాయి. ఒక్క మన రాష్ట్రంలోనే వందకు పైగా సెజ్‌లు వచ్చా యి. ఈ సంస్థానాలు ఏ ప్రజల అవసరార్థంమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విదేశీ కంపెనీల అవసరాల కోసం కూడా ప్రభుత్వాలు భూసేకరణ చట్టాన్ని ఉపయోగి స్తున్నాయి. అందువల్ల దేశ ఐక్యత దెబ్బతినే పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని గమనించిన తరువాత ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు ఇవ్వకూ డదన్న వాదన కూడా వస్తుంది.

భూసేకరణ గురించి కోర్టుల్లో చాలా ప్రజాహిత కేసులు దాఖలవుతున్నాయి. కలకత్తాకు చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత కేసుని దాఖలు చేసింది. ప్రైవేటు ఆస్తుల మీద ఉన్న ప్రభుత్వ అధిపత్యం వల్ల, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కును కాలరాస్తోందని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ దరఖాస్తును స్వీకరిస్తూ సుప్రీంకోర్టు, ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు మార్చకూడదన్న ప్రశ్నని ప్రభుత్వానికి వేసింది. ఫలితంగా ఆస్తిహక్కు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తొలగించడం వల్ల పౌరులు ప్రభుత్వ చర్యను రాజ్యాంగం ప్రకారం ప్రశ్నిం చే హక్కును కోల్పోయారు. ప్రభుత్వ చర్యలను మామూలు చట్ట ప్రకారం మాత్రమే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.

రాజ్యాంగంలోని అధికరణ 300ఎ ప్రకారం ఇప్పుడు ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు కాదు. అంటే ఒక వ్యక్తికి గల హక్కును శాసన బద్ధంగా తొలగించవచ్చు. అంటే భూసే కరణ చట్టం ద్వారా తొలగించవచ్చు. ఈ కారణంగా విదేశీ సంస్థలకి ఇప్పుడు దేశ పౌరుల మాదిరిగా సమాన హక్కు లు ఉన్నాయి.కలకత్తాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత కేసులో 44వ సవరణలను ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, సెలక్ట్‌ కమిటీకి నివేదిం చకుండా ఆర్టికల్‌ 19 (1) ఎఫ్‌ని తొలగించడం సమంజసం కాదని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు.

ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే చాలా సమస్య లు తలెత్తుతాయన్న వాదనలు కూడా ఉన్నాయి. దేశ అభి వృద్ధి కుంటుపడుతుందని కొంతమంది వాదనలు చేస్తున్నా రు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తిరిగి చేర్చాలన్న వాదనలు ఎన్ని ఉన్నాయో దాన్ని చేర్చకూడదన్న వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అలా పక్క న పెట్టి, ఒక్క విషయం గురించి మాత్రం ఆలోచించ వచ్చు. భూసేకరణ చట్టంలో నిర్వచించిన ‘ప్రజల అవసరార్థం’ అన్న పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. దాని పరిధిని కుదించాల్సిన అవసరం ఉంది.

ప్రాజెక్టుల కోసం, రైలు మార్గాల కోసం, రహదారుల కోసం ప్రభుత్వాలు ప్రజల భూములను సేకరించడం సమంజసమే కానీ, ప్రైవేటు ఇండస్ట్రీల కోసం, ప్రైవేటు గృ హల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్ఆటల కోసం ప్రభుత్వాలు భూములను సేకరించి వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇది దేశ ప్రజలను వేధి స్తున్న ప్రశ్న. భూసేకరణ ప్రజాహితం కోసం జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తుల హితం కోసం జరుగకూడదు. విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. విధంగా ఆలోచించకపోతే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా చెయ్యాలన్న వాదనలు మరింత బలపడతాయి.

No comments:

Post a Comment

Followers