Tuesday, September 15, 2009

మళ్ళీ యాసిడ్‌ దాడులు

malli acid dadulu
మళ్ళీ యాసిడ్దాడులు


``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''. యాసిడ్‌ బాధితురాలి కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్‌ బెంచి తన తీర్పులో ఈ మాటలను పేర్కొంది. సంయమనం కోల్పోకుండా తీర్పులు చెప్పాల్సిన న్యాయమూర్తులకే అంత ఆగ్రహం, బాధ, ఆవేశం కలిగించిన కేసు అది. ఇక మామూలు వ్యక్తుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ యాసిడ్‌ దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. మీడియా కథనం ప్రకారం బుధవారం సాయంత్రం స్కూటీమీద ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రణీత, స్వప్నికలపై యాసిడ్‌ దాడి జరిగింది.వాళ్ళు రామారం ఎవిఎస్‌ కాలేజీ వద్దకు రాగానే వెనక నుంచి పల్సర్‌ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై యాసిడ్‌ పోసి పారిపోయారు. హెల్మెట్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తున్న ప్రణీతకు స్వల్పంగా గాయాలు కాగా వెనుక కూర్చున్న స్వప్నికకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో రాష్ట్రంలోని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. అందరూ ఆగ్రహావేశాలను వెళ్ళగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో యాసిడ్‌ దాడుల గురించి మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ మానవహక్కుల రోజున ఈ దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా అత్యంత బాధాకరమైన విషయం. మహిళలపై దాడి చేయడానికి మగవాళ్ళు అందుకున్న కొత్త ఆయుధం యాసిడ్‌. ఈ ఆయుధాన్ని కర్ణాటకలో మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి యాసిడ్‌ దాడుల బారిన పడిన వాళ్ళ సంఖ్య 65 మంది. అందరూ మహిళలే.ఆ తరువాతి స్థానాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ముంబాయి. ఇప్పుడు కొత్తగా మరో రాష్ట్రం చేరబోతుంది. అదే అంధ్రప్రదేశ్‌. 97 శాతం మంది మహిళల పైనే ఈ దాడులు జరిగాయి. ఇందుకు కారణం ఏమిటి? మహిళలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండటానికి వాళ్ళను నియంత్రించడానికి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కొంతమంది భావన. తమను ప్రేమించనందుకు జరుగుతున్నాయని మరి కొంత మంది భావన. ఇవి రెండూ కూడా కారణాలు కావచ్చు. మహిళలు స్వతంత్రంగా ఉద్యోగాలు చేస్తూ కార్లు, బైకులు నడిపిస్తూ, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తూ తమకు ఇష్టమైన రీతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా మందికి రుచించకపోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించడం, ప్రేమించకపోవడంలో స్వతంత్రంగా వ్యవహరించి ఎంపిక చేసుకునే హక్కును మహిళలు వినియోగించకుండా ఉండటానికి కూడా ఈ దాడులు జరుగుతూ ఉండవచ్చు. కర్ణాటక కేసు విషయానికి వస్తే హసీనా వయస్సు 19 సంవత్సరాలు. ఆమెపై దాడి చేసిన జోసెఫ్‌ రొడ్రిక్‌‌స వయస్సు 39 సంవత్సరాలు. అతనికి ఒక కంప్యూటర్‌ వ్యాపారం ఉంది. హసీనా అందులో ఉద్యోగం చేసేది. అది నష్టాల్లో ఉండటం వల్ల ఆ వ్యాపారాన్ని జోసెఫ్‌ ఆపేశాడు. కానీ హసీనాని తన ఇంటిదగ్గర పని చెయ్యమని డిమాండ్‌ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. వేరే చోట చేరింది. ఫలితంగా ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు జోసెఫ్‌. ఈ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు గడిచాయి. ఈ ఏడుసంవత్సరాలలో ఆమెకు 15 ఆపరేషన్లు జరిగాయి. కళ్ళు కోల్పోయింది. ఆమె పెదవులు, వెంట్రుకలు కాలిపోయాయి. వాటిని గ్రాప్టింగ్‌ ద్వారా ఏర్పాటు చేశారు. అయినా హసీనా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. ఫలితంగా జోసెఫ్‌కు జీవిత ఖైదు శిక్షపడింది. సెషన్‌‌స కోర్టు తక్కువ శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ హసీనాకు సహకరించింది. కర్ణాటక హైకోర్టులోని డివిజన్‌ బెంచి తీర్పులో ఇంకా ఈ విధంగా అభిప్రాయ పడింది: `ఆమెకు అయిన గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడుతాయి. చావుకన్నా ఆమె బతుకును ముద్దాయి దుర్భరం చేశాడు. అందుకని అతనికి విధించాల్సిన కనీస శిక్ష సె.307కి ఉన్న గరిష్ఠ శిక్ష. ముద్దాయి ప్రార్థన విన్నాం. అన్నీ పరిశీలించి అతనికి ఆ నేరానికి ఉన్న అత్యధిక శిక్ష జీవితఖైదును విధించాలని ఆదేశిస్తున్నాం. కింది కోర్టు విధించిన జరిమానాను మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నాం. బాధితురాలు ఆ డబ్బు తీసుకోవచ్చు' ఇదీ తీర్పులోని సారాంశం.యాసిడ్‌ దాడులను మహిళా కమిషన్‌, సుప్రీంకోర్టు కూడా పట్టించుకున్నాయి. ఈ దాడుల గురించి ఒక నివేదిక సమర్పించవలసినదిగా లా కమిషన్‌ను ఆదేశించింది. లా కమిషన్‌ ఆగస్టులో నివేదిక సమర్పించింది. భారతీయ శిక్షాస్మృతిలో సె.326.ఎ అన్న కొత్త నిబంధనను ఏర్పరచాలని, నేరం చేసిన వ్యక్తికి కనీస శిక్ష 10 సంవత్సరాలుగా జీవిత ఖైదు విధించేలా ఏర్పరచాలని సూచించింది. యాసిడ్‌ దాడులను నిరోధించడానికి చట్టం తీసుకు రావలసి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ అభిప్రాయపడి ముసాయిదా బిల్లు తయారు చేసింది. లైంగికంగా వేధించడం, మానభంగానికి గురి చేయడం వంటి నేరాల కన్నా ఈ నేరం హీనమైనదని కమిషన్‌ భావించింది. బాధితులకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని బిల్లులో పేర్కొంది. బాధితులకు తక్షణ వైద్య సదుపాయం అందించని హాస్పిటళ్ళపై చర్య తీసుకునే నిబంధనను ఈ బిల్లులో ఏర్పరిచారు. యాసిడ్‌ అమ్మకాలను క్రమబద్ధీకరించే నిబంధనలనుకూడా కమిషన్‌ సూచించింది. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చట్టాన్ని తీసుకరాలేదు. అవసరమైన సవరణలను భారతీయ శిక్షాస్మృతిలో చేయలేదు. కఠినమైన నిబంధనలు ఉంటే మాత్రమే సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హసీనా కేసు పరిష్కారానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా కాకుండా సత్వరం పరిష్కారం అయ్యేవిధంగా నిబంధనలను చట్టంలో ఏర్పాటు చెయ్యాలి. వాటి అమలు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇలాంటి నేరాలకు పోలీసులు కోర్టులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే, ఈ దాడుల వల్ల మహిళలకు మానసిక మరణం సంభవిస్తుంది. అనుక్షణం ఇది వాళ్ళను వెంటాడుతుంది. అందరికీ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ కొత్త చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రప్రభుత్వమే స్పందించి లాకమిషన్‌, మహిళా కమిషన్‌ సూచించిన విధంగా చట్టం తీసుకురావలసిన అవసరం, దానిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

1 comment:

  1. చూడండి మీ స్పందన తెలుపండి
    http://okkaavakasam.blogspot.com/2009/09/blog-post_15.html

    ReplyDelete

Followers