Tuesday, April 27, 2010

వీలునామా ఎందుకు రాయాలి?

వీలునామా ఎందుకు రాయాలి?
April 27th, 2010

వీలునామాల ప్రసక్తి పూర్వకాలంలో లేదు. వీలునామాను హిందూ చట్టం గుర్తించలేదు. హిందూ వారసత్వ చట్టంలో వీలునామాల ప్రసక్తి లేదు. బ్రిటీష్ పరిపాలకుల అజమాయిషీలో వున్న నగరాల్లో వాళ్ళ ప్రభావం వల్ల ఈ వీలునామాని గుర్తించడం జరిగింది. కాలక్రమంలో మిగతా నగరాలు ప్రజలు ఈ వీలునామాలని గుర్తించడం మొదలుపెట్టారు. కోర్టులు కూడా వీలునామాలను గుర్తించడం మొదలుపెట్టాయి. చివరికి వీలునామాలకి చట్టబద్ధత కల్పించారు. భారతీయ వారసత్వ చట్టంలో ఈ వీలునామాని గుర్తించినారు. తరువాత ఈ వీలునామాని హిందూ వారసత్వ చట్టం కూడా గుర్తించింది.
చావు అనివార్యమైనప్పటికీ చాలామంది ఈ విషయాన్ని అంగీకరించరు. అంగీకరించినా తగు చర్యలు తీసుకోరు. అందుకనే చాలామంది విద్యావంతులు కూడా వీలునామాలు రాయకుండానే తమ జీవితాలను ముగిస్తున్నారు. తమ స్థిర చరాస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం చేయకుండానే తమ జీవితాలను పూర్తిచేస్తున్నారు. అలా చేయడంవల్ల అతని కుటుంబీకులు కలతలకి, కక్షలకి, అశాంతులకి గురవుతున్నారు.
హిందూ వారసత్వ ‘లా’లో వీలునామాల ప్రసక్తి లేకపోవడానికి ప్రధానకారణం పూర్వం చనిపోయిన వ్యక్తి అభిలాష ప్రకారం పంపకాలు చేసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పూర్వంలా ఇపుడు వాటిని మన్నించడంలేదు. అందుకని మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం వీలునామా రాయడం అవసరమైపోయింది. ఒక వ్యక్తి తన మరణం తరువాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియపరిచే చట్టబద్ధమైన ప్రకటనగల పత్రాన్ని వీలునామా అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.

వీలునామా ఉద్దేశ్యమేమిటీ?
------------------------------
ఒక వ్యక్తి తన మరణం తరువాత తను ఏవి నిర్వర్తించాలని అనుకుంటున్నాడో దాని చట్టబద్ధమైన ప్రకటనే వీలునామా. తన ఆస్తి ఏ విధంగా చెందాలో తెలియచేసే ప్రకటనని వీలునామా అని అనవచ్చు. వీలునామా రాసి ఎవరైనా వ్యక్తి చనిపోతే వీలునామా రాసి చనిపోయిన వ్యక్తి అని ఆ విధంగా కానప్పుడు వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి అని అంటారు. వీలునామా రాసినప్పుడు ఆ వ్యక్తి వీలునామాలో రాసిన విధంగా ఇతరులకి చెందుతుంది. వీలునామా రాయకుండా మరణించితే ఆ వ్యక్తి వ్యక్తిగత చట్టప్రకారం అతని వారసులకి అతని ఆస్తి చెందుతుంది. ఏ ఏ వారసునికి ఎంత ఆస్తి చెందుతుందన్న విషయం వాళ్ళ వ్యక్తిగత చట్టాలని బట్టి వుంటుంది. వాళ్ళు ఆస్తి పొందడానికి అర్హత లేకున్నా వాళ్ళకి ఆ ఆస్తి చెందుతుంది. అంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా చూడరు. వాళ్ళని గాలికి వదిలేస్తారు. అలాంటి వ్యక్తులకి కూడా వారసత్వ చట్ట ప్రకారం ఆస్తి లభిస్తుంది. వీలునామా ఉన్నప్పుడు వీలునామాలో పేర్కొన్న విధంగానే లభిస్తుంది. చనిపోయిన వ్యక్తికి బాగా సేవలు చేసిన వ్యక్తులు వారసులు కానప్పుడు వాళ్ళకి అతని ఆస్తిలో ఎలాంటి వాటా రాదు. నమ్మకంగా వున్న వ్యక్తులకి, సేవలు అందించిన సేవకులకి, స్నేహితులకి ఆస్తి ఇవ్వాలని అనుకున్నప్పుడు వీలునామా రాయడం అవసరం. అదేవిధంగా ఒక వ్యక్తి మరణానంతరం ఎలాంటి తగవులు రాకుండా వుండడానికి కూడా వీలునామా అవసరం.
ఎవరైనా వ్యక్తి తన మరణం తరువాత అతను కోరుకున్న విధంగా ఆస్తి ఇతరులకి చెందాలని అనుకున్నపుడు వీలునామా రాయడం అవసరం.

వీలునామా రాయడంవల్ల
ప్రయోజనాలు ఏమిటీ?
----------------------------
వీలునామా రాయడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని-

1.ఒక వ్యక్తి మరణం తరువాత అతని ఆస్తిని ఏ విధంగా వినియోగించాలో అన్న విషయంలో ఎలాంటి గందరగోళం అతని కుటుంబసభ్యులలో బంధువులో తలెత్తదు. వాళ్లకు తెలియాల్సిన విషయం ఒక్కటే. ఆ చనిపోయిన వ్యక్తి వీలునామా రాసాడన్న విషయం.
2.వీలునామా అన్నది పూర్తిగా వ్యక్తిగత పత్రం. అందులో చాలా వ్యక్తుల గురించి అభిప్రాయాలు, అనుభూతులని వ్యక్తపరిచే అవకాశం వుంటుంది.
3.వారసత్వ చట్టప్రకారం కాకుండా వారసుల స్థాయిని బట్టి వారికి ఆస్తిని ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి- చిన్నపిల్లల, అంగవైకల్యం వున్న పిల్లలకి, వితంతువు అయిన కూతురికి వారి అవసరాలను బట్టి ఆస్తి వారికి చెందేట్టు రాయవచ్చు.
4.వారసులకే కాకుండా నమ్మకంగా పనిచేసిన సేవకులకి, నర్సులకి, స్నేహితులకి వీలునామా ద్వారా ఆస్తిని సంక్రమింపచేయవచ్చు.
5.ఏ ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా రాయడంవల్ల వారసుల మధ్యన వివాదాలు రాకుండా చూడవచ్చు.
6.వీలునామా ద్వారా అవిధేయత వున్న వ్యక్తులకి ఆస్తి చెందకుండా నిరోధించే అవకాశం వుంది.
7.రోజురోజుకీ ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా యుక్తవయస్సులో వున్న వ్యక్తులు కూడా వీలునామా రాయడం అవసరం.
8.ఇన్ని ప్రయోజనాల దృష్ట్యా

No comments:

Post a Comment

Followers