Friday, February 13, 2009

surya daily paper 14-2-09
ఎన్‌కౌంటర్‌ మరణాలు

`అర్ధాలు మారిపోతాయి
కాలక్రమంలో అర్ధాలు మారిపోతాయి!
మనం డిక్షనరీలు మార్చుకోక తప్పదు!!'' అన్నాడు ఓ తెలుగు కవి

.1990 ప్రాంతంలో లాకప్‌ డెత్‌లు, ఎన్‌కౌంటర్లని చూసి ఓ కవితలో ఆ విధంగా అన్నాడు. నేరన్యాయ వ్యవస్థ వైఫల్యం వల్ల, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు చట్టం పరిధి నుంచి సులువుగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పోలీసుల నుంచి కఠినమైన చర్యలను ఆశిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలు కావాలని కోరుతున్నారు. వారు ఆ విధంగా కోరుతున్నారని మీడియా ప్రచారం చేస్తుంది. ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఇలాంటి స్పందన రావడం సహజమే. అయితే అది క్షణికమైనటువంటిది. దాన్ని సహజమైన భావనగా మీడియా కావాలని ప్రసా రం చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు! ఎవరైనా అమ్మాయి మీద దాడి జరిగితే చాలు, అవతలి వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలని అంటున్నారు.ఎన్‌కౌంటర్లు జరగడానికి ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సహం కారణం కాదు. వాటికి కారణాలు అనేకం. ప్రమోషన్లు, మెడల్‌‌స, ఆర్థికపరమైన లాభాలు, రాజకీయ నాయకుల్లో ఉదాసీన వైఖరి. ఎన్‌కౌంటర్లనేవి పోలీసుల పనిలో భాగమని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. దాదాపుగా అవి ప్రజల దృష్టిని ఆకర్షించడం తగ్గిపోయింది. ఇలాంటి దశలో వరంగల్‌ యాసిడ్‌ దాడులలోని నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దాని మీద చర్చజరిగింది. ఆ తరువాత ƒరీంనగర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెలలో మన రాష్ట్ర హైకోర్టులోని ఐదుగురు సభ్యులుగల బెంచి ఎన్‌కౌంటర్ల మీద తమ తీర్పుని వెలువరించింది. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్టా్య, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్టా్య ఇది చాలా ప్రాధాన్యతను సంత…రించుకుంది.ఇది అవసరమైన తీర్పుకూడా! అయితే ఈ తీర్పుతోనే ఈ ఎన్‌కౌంటర్ల ఒరవడి తగ్గిపోతుందని అనుకోలేం. కానీ ఒక బెదురు ఏర్పడే అవకాశం ఉంది.1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కె.జి.కన్నాభిరాన్‌ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ 1995 (2) ఎ.ఎల్‌.టి(క్రిమినల్‌) 490 కేసులో కూడా ఎన్‌కౌంటర్ల మీద ఓ తీర్పుని ప్రకటించింది. ఎన్‌కౌంటర్లో మనిషి మరణించినప్పుడు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని ఆదేశించింది.ఆ తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దీనికి వ్యతిరేకమైన తీర్పును ప్రకటించింది. ఆ తరువాత కూడా ఇలాంటి కేసులు హైకోర్టుకి రావడం వల్ల ఈ కేసులో తలెత్తిన అంశాల ప్రాధాన్యతల దృష్టా్య దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధర్మాసనం ఈ నెలలో తన తీర్పును ప్రకటించింది. ఎన్‌కౌంటర్‌ కేసుల్లో ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని, ఆదేవిధంగా ఆ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల వివరాలను కూడా ప్రకటించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు వల్ల పోలీసులు తప్పుడు ఎన్‌కౌంటర్లకి జంకే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్‌కౌంటర్ల మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నందున ఈ కేసు తీర్పు చాలా మందిని ఆలోచనల్లో పడేస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.జాతీయ మానవ హక్కుల ƒమిషన్‌ లెక్కల ప్రకారం 2002-03 సంవత్సర కాలంలో 83 మంది వ్యక్తులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఆ తరువాత సంవత్సరంలో 100 మంది, ఆ తరువాత సంవత్సరంలో 122 మంది చనిపోయారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కల్లో జమ్మూ-కాశ్మీర్‌ రాషా్టన్న్రి మినహాయించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎన్‌కౌంటర్ల నేపథƒ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు పోలీసులను కొంతమేరకు నియంత్రిస్తుంది. కానీ వారిని పూర్తిగా నియంత్రిస్తుందా? ఇదీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రతి వ్యక్తి తన ఆస్తిని, తన ప్రాణాన్ని అదే విధంగా ఇతరుల ప్రాణాలని, ఇతరుల ఆస్తిని కాపాడే హక్కు కలిగి ఉంటాడు. దీన్నే వ్యక్తిగత రక్షణ హక్కు అంటారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 97,100,103 ప్రకారం ఈ హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అయితే ఈ హక్కుని తాను శాసనం నిర్దేశించిన పరిధిలోనే వినియోగించుకున్నానని ఆ వ్యక్తి కోర్టులో రుజువు చేసుకున్నప్పుడే అతనికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఆ విధంగా నిరూపించుకోలేనప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడవుతాడు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు ఈ చర్యలను తమ విధి నిర్వహణలో చేశామని అంటారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా పోలీసు అధికారులే. సహజంగానే వాళ్ళు కూడా ఇదే భావనకి వస్తారు. ఈ సందర్భంలో ఆ పోలీసు అధికారులను ప్రాసిక్యూట్‌ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నెం. 132,197 ప్రకారం ప్రభుత్వం నుంచి ఈ అనుమతి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అనుమతి సులువుగా రావడం, సత్వరంగా రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో చాలా కేసులు ప్రభుత్వ అనుమతి లేక మూలన పడుతున్నాయి. ఒక వేళ అనుమతి లభించినా కూడా వాటిని పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలే. అప్పటికే ఆ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వ్యక్తులు పదవీ విరమణ చేయవచ్చు. ముసలివాళ్ళు అయిపోవచ్చు. అందుకని ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని తగ్గించడం అంత… సులువైనదిగా అనిపించడం లేదు. ఈ సందర్భంలో పది సంవత్సరాల క్రితం డిల్లీలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుకోవడం అవసరం. వ్యాపారవేత్తలు ప్రదీప్‌ గోయల్‌, జగ్‌జిల్‌ సింగ్‌లు ఓ తప్పుడు ఎన్‌కౌంటర్లో చనిపోయినారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ నగర పోలీసు కమిషన్‌ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించారు. పది సంవత్సరాల తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌కి పాల్పడిన 10 మంది పోలీసులకి శిక్ష పడింది. ఆ బాధితుల కుంటుంబీకులు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు కాబట్టి, వనరులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇది సాధ్యపడింది. మామూలు వ్యక్తులు ఎన్‌కౌంటర్లో మరణిస్తే ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. కొంత మంది పోలీసు అధికారులను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళే పంజాబ్‌కి చెందిన సీనియర్‌ ఎస్పీ అజిత్‌ సింగ్‌ సందూ, గుజరాత్‌కి చెందిన ఐ.పి.ఎస్‌ అధికారులు డి.జి.వంజర, యం.ఎన్‌ దినేష్‌, ఆర్‌.కె.పాండియన్‌, డిల్లీకి చెందిన అసిస్టెంట్‌ కమీషనర్‌ రాజ్‌బీర్‌సింగ్‌. ఎంతో మంది కరుడు గట్టిన తీవ్రవాదులని మట్టుపెట్టిన సందూ, తీవ్ర ఆరోపణలలో ఎన్నో కేసుల్లో విచారణలను ఎదుర్కొన్నాడు. తను అరెస్టు చేసిన ఖైదీలతో బాటే తానూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌ పోలీసు అధికారులు తమ ప్రమోషన్ల కోసం సోహ్రబుద్దీన్‌ని కాల్చి చంపారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ అధికారులని ఎంతగానో అభిమానించిన రాజకీయ నాయకులు వాళ్ళకి దూరమయ్యారు. సుప్రీంకోర్టులో వాళ్ళ రక్షణకి రాలేదు. ఇక రాజ్‌బీర్‌ సింగ్‌ విషయానికి వస్తే, ఇతను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. అతనికి రాష్టప్రతి గెలంటరీ మెడల్‌ కూడా లభించింది. ఇంకా అలాంటివి ఎన్నో లభించాయి. కానీ రియల్‌ ఎేస్టేట్‌ వ్యక్తులతో అతనికి తెరచాటు సంబంధాలు ఉన్నాయి. అతన్ని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కాల్చి చంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్‌ పోలీసు అధికారి కూడా రాలేదు. ఒక్క పుష్పగుచ్ఛాన్ని కూడా పంపించలేదు. జూనియర్‌ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీనియర్లందరూ అంతకు ముందు అతన్ని అభినందించిన వారే. ఇవన్నీ గమనించి చట్టవ్యతిరేక దారుల్లో ప్రయాణం చేస్తున్న అధికారులు తమ ధోరణులను మార్చుకోవాలి. ప్రజల కోసమైనా చట్ట వ్యతిరేకంగా పని చేయడం తమ గౌరవాన్ని కించపరుచుకోవడమే నన్న విషయాన్ని గమనించాలి. రాజకీయాలు కాదు, న్యాయాధిక్యమే ముఖ్యమని భావించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

ఎన్‌కౌంటర్‌ మరణాలు
అర్ధాలు మారిపోతాయి
కాలక్రమంలో అర్ధాలు మారిపోతాయి!
మనం డిక్షనరీలు మార్చుకోక తప్పదు!!'' అన్నాడు ఓ తెలుగు కవి.
1990 ప్రాంతంలో లాకప్‌ డెత్‌లు, ఎన్‌కౌంటర్లని చూసి ఓ కవితలో ఆ విధంగా అన్నాడు. నేరన్యాయ వ్యవస్థ వైఫల్యం వల్ల, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు చట్టం పరిధి నుంచి సులువుగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పోలీసుల నుంచి కఠినమైన చర్యలను ఆశిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలు కావాలని కోరుతున్నారు. వారు ఆ విధంగా కోరుతున్నారని మీడియా ప్రచారం చేస్తుంది. ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఇలాంటి స్పందన రావడం సహజమే. అయితే అది క్షణికమైనటువంటిది. దాన్ని సహజమైన భావనగా మీడియా కావాలని ప్రసా రం చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు! ఎవరైనా అమ్మాయి మీద దాడి జరిగితే చాలు, అవతలి వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలని అంటున్నారు.

ఎన్‌కౌంటర్లు జరగడానికి ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సహం కారణం కాదు. వాటికి కారణాలు అనేకం. ప్రమోషన్లు, మెడల్‌‌స, ఆర్థికపరమైన లాభాలు, రాజకీయ నాయకుల్లో ఉదాసీన వైఖరి. ఎన్‌కౌంటర్లనేవి పోలీసుల పనిలో భాగమని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. దాదాపుగా అవి ప్రజల దృష్టిని ఆకర్షించడం తగ్గిపోయింది. ఇలాంటి దశలో వరంగల్‌ యాసిడ్‌ దాడులలోని నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దాని మీద చర్చజరిగింది. ఆ తరువాత ƒరీంనగర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెలలో మన రాష్ట్ర హైకోర్టులోని ఐదుగురు సభ్యులుగల బెంచి ఎన్‌కౌంటర్ల మీద తమ తీర్పుని వెలువరించింది. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్టా్య, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్టా్య ఇది చాలా ప్రాధాన్యతను సంత…రించుకుంది.

ఇది అవసరమైన తీర్పుకూడా! అయితే ఈ తీర్పుతోనే ఈ ఎన్‌కౌంటర్ల ఒరవడి తగ్గిపోతుందని అనుకోలేం. కానీ ఒక బెదురు ఏర్పడే అవకాశం ఉంది.1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కె.జి.కన్నాభిరాన్‌ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ 1995 (2) ఎ.ఎల్‌.టి(క్రిమినల్‌) 490 కేసులో కూడా ఎన్‌కౌంటర్ల మీద ఓ తీర్పుని ప్రకటించింది. ఎన్‌కౌంటర్లో మనిషి మరణించినప్పుడు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని ఆదేశించింది.ఆ తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దీనికి వ్యతిరేకమైన తీర్పును ప్రకటించింది. ఆ తరువాత కూడా ఇలాంటి కేసులు హైకోర్టుకి రావడం వల్ల ఈ కేసులో తలెత్తిన అంశాల ప్రాధాన్యతల దృష్టా్య దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధర్మాసనం ఈ నెలలో తన తీర్పును ప్రకటించింది.

ఎన్‌కౌంటర్‌ కేసుల్లో ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని, ఆదేవిధంగా ఆ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల వివరాలను కూడా ప్రకటించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు వల్ల పోలీసులు తప్పుడు ఎన్‌కౌంటర్లకి జంకే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్‌కౌంటర్ల మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నందున ఈ కేసు తీర్పు చాలా మందిని ఆలోచనల్లో పడేస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.జాతీయ మానవ హక్కుల ƒమిషన్‌ లెక్కల ప్రకారం 2002-03 సంవత్సర కాలంలో 83 మంది వ్యక్తులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఆ తరువాత సంవత్సరంలో 100 మంది, ఆ తరువాత సంవత్సరంలో 122 మంది చనిపోయారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కల్లో జమ్మూ-కాశ్మీర్‌ రాషా్టన్న్రి మినహాయించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎన్‌కౌంటర్ల నేపథƒ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు పోలీసులను కొంతమేరకు నియంత్రిస్తుంది. కానీ వారిని పూర్తిగా నియంత్రిస్తుందా? ఇదీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రతి వ్యక్తి తన ఆస్తిని, తన ప్రాణాన్ని అదే విధంగా ఇతరుల ప్రాణాలని, ఇతరుల ఆస్తిని కాపాడే హక్కు కలిగి ఉంటాడు.

దీన్నే వ్యక్తిగత రక్షణ హక్కు అంటారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 97,100,103 ప్రకారం ఈ హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అయితే ఈ హక్కుని తాను శాసనం నిర్దేశించిన పరిధిలోనే వినియోగించుకున్నానని ఆ వ్యక్తి కోర్టులో రుజువు చేసుకున్నప్పుడే అతనికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఆ విధంగా నిరూపించుకోలేనప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడవుతాడు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు ఈ చర్యలను తమ విధి నిర్వహణలో చేశామని అంటారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా పోలీసు అధికారులే. సహజంగానే వాళ్ళు కూడా ఇదే భావనకి వస్తారు. ఈ సందర్భంలో ఆ పోలీసు అధికారులను ప్రాసిక్యూట్‌ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నెం. 132,197 ప్రకారం ప్రభుత్వం నుంచి ఈ అనుమతి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అనుమతి సులువుగా రావడం, సత్వరంగా రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో చాలా కేసులు ప్రభుత్వ అనుమతి లేక మూలన పడుతున్నాయి. ఒక వేళ అనుమతి లభించినా కూడా వాటిని పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలే.

అప్పటికే ఆ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వ్యక్తులు పదవీ విరమణ చేయవచ్చు. ముసలివాళ్ళు అయిపోవచ్చు. అందుకని ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని తగ్గించడం అంత… సులువైనదిగా అనిపించడం లేదు. ఈ సందర్భంలో పది సంవత్సరాల క్రితం డిల్లీలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుకోవడం అవసరం. వ్యాపారవేత్తలు ప్రదీప్‌ గోయల్‌, జగ్‌జిల్‌ సింగ్‌లు ఓ తప్పుడు ఎన్‌కౌంటర్లో చనిపోయినారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ నగర పోలీసు కమిషన్‌ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించారు. పది సంవత్సరాల తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌కి పాల్పడిన 10 మంది పోలీసులకి శిక్ష పడింది. ఆ బాధితుల కుంటుంబీకులు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు కాబట్టి, వనరులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇది సాధ్యపడింది. మామూలు వ్యక్తులు ఎన్‌కౌంటర్లో మరణిస్తే ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.

అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. కొంత మంది పోలీసు అధికారులను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళే పంజాబ్‌కి చెందిన సీనియర్‌ ఎస్పీ అజిత్‌ సింగ్‌ సందూ, గుజరాత్‌కి చెందిన ఐ.పి.ఎస్‌ అధికారులు డి.జి.వంజర, యం.ఎన్‌ దినేష్‌, ఆర్‌.కె.పాండియన్‌, డిల్లీకి చెందిన అసిస్టెంట్‌ కమీషనర్‌ రాజ్‌బీర్‌సింగ్‌. ఎంతో మంది కరుడు గట్టిన తీవ్రవాదులని మట్టుపెట్టిన సందూ, తీవ్ర ఆరోపణలలో ఎన్నో కేసుల్లో విచారణలను ఎదుర్కొన్నాడు. తను అరెస్టు చేసిన ఖైదీలతో బాటే తానూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌ పోలీసు అధికారులు తమ ప్రమోషన్ల కోసం సోహ్రబుద్దీన్‌ని కాల్చి చంపారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఆ అధికారులని ఎంతగానో అభిమానించిన రాజకీయ నాయకులు వాళ్ళకి దూరమయ్యారు. సుప్రీంకోర్టులో వాళ్ళ రక్షణకి రాలేదు. ఇక రాజ్‌బీర్‌ సింగ్‌ విషయానికి వస్తే, ఇతను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. అతనికి రాష్టప్రతి గెలంటరీ మెడల్‌ కూడా లభించింది. ఇంకా అలాంటివి ఎన్నో లభించాయి. కానీ రియల్‌ ఎేస్టేట్‌ వ్యక్తులతో అతనికి తెరచాటు సంబంధాలు ఉన్నాయి. అతన్ని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కాల్చి చంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్‌ పోలీసు అధికారి కూడా రాలేదు. ఒక్క పుష్పగుచ్ఛాన్ని కూడా పంపించలేదు. జూనియర్‌ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీనియర్లందరూ అంతకు ముందు అతన్ని అభినందించిన వారే. ఇవన్నీ గమనించి చట్టవ్యతిరేక దారుల్లో ప్రయాణం చేస్తున్న అధికారులు తమ ధోరణులను మార్చుకోవాలి. ప్రజల కోసమైనా చట్ట వ్యతిరేకంగా పని చేయడం తమ గౌరవాన్ని కించపరుచుకోవడమే నన్న విషయాన్ని గమనించాలి. రాజకీయాలు కాదు, న్యాయాధిక్యమే ముఖ్యమని భావించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers