Wednesday, October 21, 2009

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనాల డ్రైవర్లు ఆ వాహనాల్ని అక్కడే వదిలేసి పారిపోతుంటారు. వీలైతే మరికొన్ని సార్లు వాహనం కూడా తీసుకునే పారిపోతుంటారు. ప్రమాదానికి గురైన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోకుండా, అతనికి కనీస వైద్య సదుపాయాల్ని కల్పించాలన్న కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తి స్తుంటారు.సరైన సమయానికి వైద్యసదుపాయాలు అందినట్లైతే కొన్ని సందర్భాలలో ప్రమాదానికి గురైన వ్యక్తులు బతికే అవకాశాలు ఉండవచ్చు. బతికే అవకాశం ఉన్నప్పటికీ ప్రమాదానికి కారకులైన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల బాధితులు ప్రాణాలు కోల్పోవచ్చు.

మోటారు ప్రమాదానికి గురైన వ్యక్తికి తక్షణ సదుపాయాలు కల్పించడం అందుకు కారకుడైన డ్రైవర్‌ కనీస భాద్యత. అవస రమైతే అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. అయితే అ లా తరలించడం ఆ బాధితుని ఇష్టానికి వ్యతిరేకంగా జరుగ కూడదు. ఒక్కోసారి ప్రమాదానికి గురైన వ్యక్తి పొరపాటు వల్లనే ప్రమాదం జరగవచ్చు. ఆ వ్యక్తిని ప్రమాద స్థలం నుంచి తొల గించడం వల్ల ఆ సాక్ష్యం రూపు మారిపోవుచ్చు. అందుకని పోలీ సుల సహాయాన్ని తీసుకొని నేర స్థల స్కెచ్‌ తయారు చేసిన తరు వాతే తరలించాలి. రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగి నపుడు ఏ వాహనం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందో తెలుసు కోవడానికి వాటి స్థానాలను, అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తి స్థానాన్ని గుర్తించడం అవసరమవుతుంది.

పోలీసులు దరిదా పుల్లో లేనప్పుడు తప్పనిసరిగా అతన్ని ఆసుపత్రికి తరలించాలి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీస్‌ అధికారులు ఎవరూ లేనట్లైతే ఆ ప్రమాద సమాచారాన్ని దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో సాధ్యమైనంత త్వరగా తెలియపరచాలి. ప్రమాదం జరిగి, ఆ ప్రమాదంలో బాధితుడైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిద్దాం అను కునేంతలో అక్కడ గుమికూడిన జనం ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కి హాని తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు అతను నేర స్థలం నుంచి పారిపోవడంలో తప్పులేదు. పారిపోయినా వెంటనే అత ను ప్రమాద విషయాన్ని పోలీసులకు తెలియచేయాలి. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోవలసి వచ్చిందని కూడా తెలియచేయాలి.

ఏదైనా ప్రమాదం జరిగి వాహనాల రాకపోకల కు అంతరాయం ఏర్పడినప్పుడు డ్రైవర్‌ తనంతట తానుగా వాహనం స్థానాన్ని తొలగించకూడదు. పోలీసు అధికారులు వచ్చి నేరస్థుల పంచనామా చేసిన తరువాతనే వాహనాలను ఆ యా స్థానాల నుంచి తొలగించాలి. వాహనానికి సంబంధించిన వివరాలు, దాని రిజిస్ట్రేషన్‌, ఇన్స్యూరెన్స్‌, వాహన యజమాని వివరాలను పోలీసులు కోరినప్పుడు తెలియచేయాల్సిన భాద్యత ఆ డ్రైవర్‌ మీద ఉంటుంది. ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల్లోగా అంద చేయాల్సి ఉంటుంది.

బాధితుడు అతని సంబంధికులు తీసుకోవలసిన జాగ్రత్తలు
ప్రమాదం కలగజేసిన చేసిన వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబరు గుర్తు పెట్టుకోవాలి. వీలుంటే ప్రమాదానికి గురిచేసిన డ్రైవరు పేరు, వయస్సు, అడ్రసు మెదలగు వివరాలు తెలుసుకోవాలి. పోలీసులు వచ్చి పంచనామా చేసే వరకూ వాహనాన్ని అక్కడ నుంచి కదలించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రమాదం గురిం చిన ప్రాథమిక సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా సమీప పరిధిలో గల పోలీస్‌ స్టేషన్‌లో తెలియపరచాలి. త్వరగా తెలియ చేయడం వల్ల పోలీసులు త్వరగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత మంది సాక్ష్యులను పోలీసులు విచా రించేలా ప్రయత్నించాలి. ప్రత్యక్షసాక్షులు ప్రమాద స్థలంలో ఉండేట్టు చేసుకోవాలి. బాధితుడు ప్రాణాలతో ఉన్నట్లైతే అతణ్ణి సమీప ఆసుపత్రికి తరలించి సరైన వైద్యసదుపాయాలు పొందే వీలు కల్పించాలి.

నేరం జరిగిన స్థలంలో గుర్తులు చెదరక ముందే వివిధ కోణాల్లో ఫోటోలు తీయించే ఏర్పాటు చేయాలి. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆ డాక్టర్‌ నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందాలి (ఆ సర్టిఫికేట్‌ వల్ల అతనికి తగిలిన గాయాల తీవ్రతను తెలుసుకునే అవకాశం ఉంటుంది). దుడుకు తనం లేదా నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చేసిన వ్యక్తిపై పోలీసులు తప్పని సరిగా క్రిమినల్‌ కేసులు పెడతారు. ఒక వేళ పెట్టనట్లైతే అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలి. వాటి ఫలితాలు తెలుసుకోవాలి. క్రిమినల్‌ కేసు ఫలితం ట్రిబ్యునల్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. కానీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఆ కేసులో రుజువైనట్లెతే అది కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రమాదంలో బాధితుడు చనిపోయినట్లైతే అతని శవాన్ని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష చేయించాలి. ఆ పరీక్ష నివేదిక వల్ల అతని మరణానికి దారి తీసిన కారణాలను రుజువు పరచడానికి వీలుంటుంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను చికిత్సకోసం డాక్టర్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, వారు ఆ వ్యక్తులకు అవసరమైన చికిత్సను సత్వరం అందచేయాలి. అంతే కానీ పోలీసులు వచ్చే వరకు తాము ఏ చికిత్స చేయబోమని తెలపడం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని సూచించడం కూడదు. సత్వ ర చికిత్స అందచేయడం వైద్యుల పైన ఉన్న కనీస బాధ్యత.

No comments:

Post a Comment

Followers