Saturday, January 10, 2009

జనాభాను బట్టి కోర్టులు

మహిళల మీద అత్యాచారా లు పెరిగిపోయాయి. మొ న్న విజయవాడ, నిన్న వరంగల్‌ నే డు కొత్తగూడెం! ఆయేషా వివాదం కొనసాగుతూనే ఉంది. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ముగ్గురు యు వకులు ఎన్‌కౌంటర్లో మరణించారు. స్వప్నిక, ప్రణీతలకి సమా జం (మొత్తం కాదు) దృష్టిలో న్యాయం జరిగిపోయింది. పోలీసుల పనితనానికి యువత విజయధ్వానాలు చేసింది. ఆ ఎన్‌కౌంటర్‌కి ప్రజామోదం లభించిందని మీడియా ప్రచారం చేసిం ది, మరోవిధంగా ప్రభావితం చేసింది. కొంతమంది ప్రజల ఉద్వేగాలను, ఆవేశాలను మీడియా పనిగట్టుకొని ప్రచారం చేసింది. పరిణామం తెలిసినదే. కొంతమంది ప్రజల ఇష్టాలనే గౌరవించడం సరైనదేనా? కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం- ఇదేనా సమాజం కోరుకుంటున్నది? ఈ విధంగా జరిగితే సరిపోతుందా? ఇవీ ప్రశ్నలు. సామూహిక మానభంగానికి పాల్పడిన నిందితులను గురువారం కొత్తగూడెం పోలీసులు వినూ త్నపద్ధతిలో వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు శాపనార్థాలు పెడుతూ చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. నిందితులందరినీ కోర్టు రిమాండ్‌ చేసింది. ఈ కేసులో తీర్పు ఎంత కాలానికి వస్తుందో! ఇది అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ కారణంగా కూడా కొంత మంది వ్యక్తులు వరంగల్‌ లాంటి సత్వరన్యా యంకావాలని కోరుతున్నారు. కొత్తగూడెం సంఘటన కొన్ని రోజుల క్రితం జరిగింది. కాబట్టి మీడియా సత్వరన్యాయం కోరుకోలేదనిపిస్తుంది. ఆ దిశగా ప్రజల ఇంటర్యూ్వలను, అభిప్రాయాలను ప్రసారం చెయ్యలేదు. మహిళలపై జరిగే నేరాల విచారణ సత్వరంగా జరగాలి. ఆ విషయానికి వస్తే, క్రిమినల్‌ కేసుల విచారణ సత్వరం జరగాలి. మరీ ముఖ్యంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల పరిష్కారం, సెన్సేషన్‌ కేసుల పరిష్కారం సత్వరంజరగాలి. అలా జరుగనప్పుడు ఇలాంటి అభిప్రాయాలే వెలువడుతాయి. ఇలాంటి సంఘటనలు చాలా రాషా్టల్ల్రో జరుగుతున్నాయి. ఆయా రాషా్టల్రు ఏవిధంగా స్పందిస్తున్నాయి? ఇది మన రాజ్యాధినేతలు గమనించ డంలేదు.అలాంటిఒక సంఘటనను గుర్తుచేసుకోవలసి ఉంది.ఒక జర్మన్‌ టూరిస్టును జోద్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు మానభంగానికి గురిచేశారు. వార్తా పత్రికల్లో చూసి రాజస్థాన్‌ హైకోర్టు తానుగా స్పందించింది. ఆమె విదేశీ వనిత కాబట్టి దర్యాప్తును, విచారణను సత్వరం పూర్తి చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జర్మన్‌ మహిళ కేసు విచారణ జరిగింది. నేరం జరిగిన 15 రోజుల్లో కోర్టు తీర్పు ప్రకటించింది. ముద్దాయిలిద్దరికీ జీవిత ఖైదును ట్రయల్‌ కోర్టు విధించింది. ఈ కేసు విషయంలో అన్ని వ్యవస్థలూ సున్నితంగా వ్యవహరించాయి. ఫోరెన్సిక్‌సైన్‌‌స లాబరేటరీ ఒక్క రోజులో తన నివేదికను అందచే సిం ది. రెండురోజుల్లో పోలీసులు అభియోగాన్ని కోర్టులో దాఖలుచేశారు. చివరి సాక్షిని విచారించిన మరుసటిరోజే కోర్టు తీర్పుప్రకటిం చింది. నేరంచేసినట్లు తేలడంవల్ల ముద్దాయిలకు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. భారతదేశ న్యాయచరిత్రలోనే విచిత్రంగా కోర్టు 15 రోజుల్లోగా ఈ కేసు ను పరిష్కరించింది. రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు కొన్ని సూచనలు చేసింది- రాష్ట్ర పరిధిలోని రేప్‌ కేసు ల దర్యాప్తులను పర్యవేక్షించడానికి ప్రత్యేకవిభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. రేప్‌కేసుల్లో వారంరోజుల్లోగా అభియోగం దాఖలయ్యేటట్టు చూడాలి. లైంగిక నేరానికి సంబంధించిన కేసు వివరాలను, పురోగతిని తెలియజేస్తూ జిల్లా ఎస్పీలు మూడు నెలలకొకసారి ఈ ప్రత్యేక విభాగానికి నివేదికను పంపించాలి. అన్ని జిల్లాల నివేదికలను సంఘటితంచేసి ఆ విభాగానికి నియమిం చిన ప్రత్యేక పోలీసు అధికారి తననివేదికను హైకోర్టురిజిస్ట్రార్‌కు పంపించాలి. హైకోర్టు ఆ నివేదికను పరిశీలించి సంబం ధిత కోర్టులకు ఆ కేసులను సత్వరం పరిష్కరించేలా ఉత్తర్వులు జారీచేస్తుంది. అంతేకాదు, ఆ కేసుల విచారణ 4మాసాల్లోగా పూర్తికావాలి. రేప్‌ బాధితులకు ఆర్థికంగా, వైద్యపరంగా ప్రభుత్వం సహా యం అందించాలి. వాళ్ళకి కౌన్సిలింగ్‌ సహాయం కూడా ప్రభుత్వం అందచెయ్యాలి. ఈ నేరాల్లో బాధితులు విదేశీ టూరిస్టులైతే వాళ్ళు మనదేశంనుంచి వెళ్ళిపోకముందే విచారించడం, వాళ్ళ స్టేట్‌మెంట్ల ను నమోదు చెయ్యడం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. విదేశీటూరిస్టులకు అవసరమైన రక్షణను ప్రభుత్వం కల్పిం చాలి. అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రణాళికలను రెండునెలల్లోగా కోర్టుకి తెలియజేయాలి. ఇలాంటి నేరా ల విషయంలో సున్నితంగా స్పందించడానికి అవసరమైన శిక్షణను, వర్‌‌కషాప్‌లను హైకోర్టూ, ప్రభుత్వమూ చేపట్టాలి. కోర్టుల్లో జాప్యం ఉంటుందనేది జగమెరిగినసత్యం. అందుకు కారణాలు ఉండవచ్చు. కేసులకు, జనాభాకి తగినన్ని కోర్టు లు లేకపోవచ్చు. ఏమైనప్పటికీ జాప్యంవల్ల ప్రజలకు కోర్టుల మీద విశ్వాసం తగ్గే అవకాశం ఉంది. క్రిమినల్‌ కేసుల విచారణల్లో జాప్యంఉంటే న్యాయాధిక్యం ఉనికే దెబ్బతింటుంది. అదే పోలీసులు, అవే కోర్టులు, అవే వ్యవస్థలు- కానీ పై కేసులో బాధితులకు సత్వరన్యాయం లభించింది. ఇది విదేశీ బాధితులకే పరిమితం చెయ్యకుండా, అందరికీ ఇలాంటి న్యాయం దొరికేలా చూడాలి.ఈ కేసులో హైకోర్టు స్పందనను మనరాష్ట్రం గుర్తిస్తే మంచి జరిగే అవకాశంఉంది. కేసులను బట్టి కాక జనాభానుబట్టి కోర్టులు ఏర్పాటు చెయ్యాలి. లా కమిషన్‌ చెప్పింది కూడా అదే. అలాంటిపనిచేస్తే చట్టానికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉండదు. చట్టానికి అతీతంగా పోలీసులు పనిచెయ్యాలని పాలకులు అనుకుంటే, ప్రజలు కోరుకుంటున్నారని భావిస్తే- చట్టాలను ఆ విధంగా మార్చడం జరగాలి.

No comments:

Post a Comment

Followers