Saturday, April 4, 2009

హీనాతి హీనమైన నేరానికి శిక్ష

`నిజం చెప్పాలంటే, ఈ విషయం గురించి విన్నా, చదివినా, మాట్లాడినా వెన్నులోంచి వణుకు మొదలవుతుంది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే అత్యంత హీనమైన నేరం మృగప్రాయమైన నేరం. ఈ విధంగా అనడం మృగాన్ని కించపరచడమే' - సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరిజిత్‌ పసాయత్‌ ఓ మానభంగం కేసులో వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. హంతకుడు ఆ బాధితురాలిని భౌతికంగా చంపివేస్తాడు. కానీ ఓ మానభంగం చేసిన వ్యక్తి ఆమెను భౌతికంగానే కాదు, ఆమె ఆత్మపైన కూడా దాడి చేస్తారు. ఈ మాట కూడా అదే తీర్పులో న్యాయమూర్తి ప్రకటించారు.

ఇది మామూలు వ్యక్తి చేసిన నేరం. అదే నేరం ఆ అమ్మాయిని ఎత్తుకొని పెంచి పోషించిన తండ్రి చేస్తే ఎలా ఉంటుంది? జీవితం మీదే విరక్తి ƒలుగుతుంది. అదే తండ్రి తన కూతురి మీద కొన్ని సంవత్సరాలు తరబడి ఆ పని చేస్తూ, ఇంకో వ్యక్తి కూడా మానభంగం చెయ్యడానికి సహకరించడం, ఆమె తల్లి కూడా సహకరించడం అన్న వార్త వింటే కళ్ళ వెంట నీళ్ళు రావడమే కాదు, చేతులు కూడా బిగుసుకుంటాయి.
ముంబాయి సంఘటన మరిచిపోకముందే అమృత్‌సర్‌లో ఇలాంటిదే మరో సంఘటన. మొన్న నిజామాబాద్‌లో కూడా ఓ తండ్రి వేధిస్తున్నాడన్న విషయం బయట పడింది. పోలీసులు సత్వర చర్య తీసుకునేట్లుగా న్యాయ సేవాధికార సంస్థ పనిచెయ్యడం వల్ల ఈ ఘోరమైన సంఘటనని నివారించ కలిగారు. 21 సంవత్సరాల కూతురిని 9 సంవత్సరాల పాటు లైంగికంగా అనుభవించిన తండ్రి వార్త విన్నప్పుడు దేశంలోని ప్రతి మానవుని రక్తం శీతలమై పోతుంది. తల్లులు నిశ్చేష్ఠులవుతారు. తండ్రులు దిక్కు తో చక తలలు పట్టుకుం టున్నారు. ఇది వాస్తవమేనా అని మరికొం త మంది ఆందోళన చెందుతున్నారు. దోషి తండ్రి, సహకరించిన వ్యక్తి తల్లి. వీళ్ళిద్దరితోపాటు మరో తాంత్రికుడూ దోషే. తల్లి భావోద్వేగంతో కూతురుని బ్లాక్‌మెయిల్‌ చేసింది. తండ్రి ఈ హీనమైన నేరం చెయ్యడానికి తోడ్పడింది.

తాంత్రికుడు కూడా ఆమెను అనుభవించడానికి ఆ తల్లి తోడ్పడింది. ఆ సంఘటన ఇలా ఉండగా, అమృత్‌సర్‌లో రాజకీయ నాయకుడైన తన తండ్రి తనను ఆరు సంవత్సరాలుగా మానభంగానికి గురి చేస్తున్నాడని 21 సంవత్సరాల కూతురు ఆరోపించింది. వావి వరసలని కాలదన్ని స్వంత కూతురిని మానభంగం చెయ్యడం వెనక మూఢనమ్మకాలు కూడా ఉండవచ్చు. దిగువ తరగతి, మధ్యతరగతిలో స్త్రీలపై జరుగుతున్న నేరాలు ఎక్కువ కుటుం బ సభ్యుల వల్లే జరుగుతున్నాయి. బయటకు వస్తున్న సంఘటనల కన్నా బయటకు రాని సంఘటనలు ఎన్నో. వావివరుసలు లేకుండా ఇంట్లో జరుగుతున్న ఇటువంటి నేరాలను నిరోధించడం ఎలా? ఇందుకోసం మరో ప్రత్యేక చ…ట్టం అవసరం ఉందా? ఉన్న చట్టాలతోనే వీటిని నిరోధించే అవకాశం ఉందా?హత్య కన్నా మానభంగమనేది తీవ్రమైన నేరం. హత్యా నేరానికి జీవిత ఖైదు ఉంది. అరుదైన కేసుల్లో అరుదైన వాటికి మరణ శిక్ష కూడా ఉంది. కాని మానభంగం నేరానికి 7 సంవత్సరాలకు తక్కు వ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉంది. జీవిత ఖైదును లేక పది సంవత్సరాల వరకు జైటు శిక్షను విధించే అవకాశం కూడా ఉంది.

సె. 376(2)లో పేర్కొన్న వ్యక్తులు నేరం చేసినప్పుడు కనీస శిక్ష 10 సంవత్సరాల వరకూ పడుతుంది. నేరం నిరూపణ జరిగిన తరువాత కోర్టులు విధించే శిక్ష ఎక్కువలో ఎక్కువ 7 సంవత్సరాల నుం చి 10 సంవత్సరాల వరకు పడుతుంది. అరుదైన కేసులో మాత్రమే జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. మానభంగం చేసిన వ్యక్తులకు మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాలన్న ప్రతి పాదన గతంలో వచ్చింది. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించారు. ఈ సమస్యకు మరణ శిక్ష పరిస్కారం కాదని వాళ్ళ వాద న. నిజానికి మరణ శిక్ష దేనికీ పరిష్కారం కాదు. అట్లా అని అరుదైన కేసుల్లో, అరుదైన హత్య కేసుల్లో కూడా మ రణ శిక్షను తొలగించా లా? తొలగించాలని వాద నచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు.భారతీయ శిక్షాస్మృతి లోని సె. 53 ప్రకారం ఐదు రకాలైన శిక్షలను కోర్టులు విధించే అవకాశం ఉంది. అవి మరణ శిక్ష, జీవిత ఖైదు, కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష, అస్తి జప్తు, జరిమానా.

జీవిత ఖైదు శిక్ష గురించి శిక్షాస్మృతిలో చెప్పారు కానీ జీవిత ఖైదు అంటే ఏమిటో చెప్పలేదు. ఏ చట్టంలో కూడా దీన్ని నిర్వచించలేదు. నిజానికి జీవిత ఖైదు అంటే జీవితాంతం వరకు. కారాగార శిక్ష విధించడం సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. అయితే జీవిత ఖైదును శాసన ప్రకారం నిర్దేశించేఅధికారం ప్రభుత్వానికి ఉంటుందని కూడా చెప్పింది. మంచి నడవడిక కారణంగా గానీ, ఇతర కారణాల వల్లగానీ ఈ శిక్షా కాలాన్ని తగ్గించే అవకాశం ఆయా ప్రభుత్వాలకి ఉంది. ప్రభుత్వానికి ఉన్న ఈ అధికారం వల్ల నేరస్తులు బయట పడుతున్నారు. మానభంగానికి గురైన మహిళ మీద పడిన మచ్చ తొలగి పోదు. అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీవిత ఖైదు పడిన వ్యక్తి మంచి నడవడిక కారణంగా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రేప్‌ కేసులో జీవిత ఖైదును సాధారణంగా కోర్టులు విధించవు. ఎక్కువ ఎక్కువ 10 సంవత్సరాల వరకు శిక్షను విధిస్తాయి. మంచి నడవడిక ఉంటే అతను నాలుగైదు సంవత్సరాల్లో బయటకు వస్తాడు. ఇదీ ఇప్పుడున్న పరిస్థితి.

ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుటుంది? మరణ శిక్ష లేకపోయినా పర్వాలేదు కానీ ఈ నేరం చేసిన వ్యక్తులు శిక్షా కాలం మొత్తం జైల్లో ఉండే విధంగా చట్టం ఉంటే కొంతలో కొంత మేలు. ఇంట్లో జరిగే నేరాలను రిపోర్టు చేయడానికి ెహల్‌‌పలైను అత్యంత అవసరం. వాటిని నిరోధించే యంత్రాంగం మరింత అవసరం. హీనతిహీనమైన నేరాల్లో శిక్షలను ఏ కారణంగానైనా తగ్గించే అవకాశం ప్రభుత్వానికి ఉండకూడదు. ఈ దిశగా ఆలోచించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers