Monday, November 29, 2010

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines
వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines

Monday, November 8, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి అవసరమైన అంశాలు

October 20th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులను కోరే పద్ధతి గతంలో లేదు. దీన్ని 1976లో ప్రవేశపెట్టారు. ఇది ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాఖలు చేస్తారు. మామూలుగా విడాకులు కోరినపుడు ఆ విధంగా కోరిన వ్యక్తి దరఖాస్తుదారుగా అవతలి వ్యక్తిని ప్రతివాదిగా చూపిస్తారు. అయితే ఈ పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ఇద్దరు దంపతులు సంయుక్తంగా కలిసి దాఖలు చేస్తారు.
ఈ దరఖాస్తులో ఏ అంశాలు ఉండాలి
పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ప్రధానంగా మూడు అంశాలు వుండాలి. అవి-
* వారిద్దరి మధ్య వివాదం జరిగి వుండాలి. ఏ చట్ట ప్రకారమైతే వివాహం జరిగిందో, వారు ఆ మతానికి చెందినవారై వుండాలి. ఆ విషయాన్ని అందులో పేర్కొనాలి.
* సంవత్సరం నుంచి కానీ అంతకుమించి గానీ వారిద్దరూ వేరుగా నివశిస్తూ ఉండాలి.
* వాళ్ళిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడి, పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని వుండాలి.
వివాహం జరిగి ఉండాలి అంటే?
హిందూ వివాహ చట్టం అమల్లోకి రాకముందుగానీ ఆ తరువాత గానీ వారిమధ్య వివాహం జరిగి ఉండాలి. దరఖాస్తుతో తమ వివాహం హిందూ మతాచారం ప్రకారం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. దానికి సంబంధించిన పత్రాలని దరఖాస్తుతోబాటు జత చేయాలి. వారి వివాహ పత్రిక, సంయుక్తంగా వున్న ఫొటో, అవి లేనప్పుడు ఇద్దరివి వేరువేరుగా వున్న ఫొటోలని దరఖాస్తుతోబాటూ జత చేయాలి. వీలైతే వాటిని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి దాఖలుచేయాలి.
వేరుగా నివసిస్తూ వుండాలంటే?
పరస్పర ఆమోదంతో సంయుక్తంగా దంపతులిద్దరు కలిసి దాఖలుచేసే దరఖాస్తు తాము సంవత్సరం నుంచి గానీ అంతకుమించిగానీ వేరుగా నివశిస్తున్నామని పేర్కొనాలి. వాస్తవంగా ఇద్దరిమధ్య విభేదాలు పొడసూపి వేరువేరుగా నివశిస్తారు.
అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నప్పటికీ వేరు వేరు జీవితాలని గడుపుతుంటారు. అంటే వారి మధ్యన దాంపత్య జీవనం వుండదు. ఇలాంటి సందర్భాన్ని కూడా వేరువేరుగా నివసించడంగా పరిగణించవచ్చా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీన్ని కూడా వేరుగా నివశిస్తున్నట్టుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. దాంపత్య జీవనం లేకపోవడం అంటే భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాలు లేకపోవడమని అర్ధం. ఒక గూడులో నివశిస్తున్నప్పటికీ వారిమధ్యన సెక్స్ సంబంధాలు లేకపోతే దాన్ని వేరుగా నివసిస్తున్నట్టుగానే భావించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
కలిసి జీవించి వుండలేని పరిస్థితులు అంటే
దంపతులిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడి కలిసి జీవించి వుండలేని పరిస్థితులు వుండాలి. రాజీ ప్రయత్నాలు కూడా విఫలమై వుండాలి. ఈ పరిస్థితుల కారణంగా వారిద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని వుండాలి.
షరతులు పెట్టుకోవచ్చా?
ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని షరతులని కూడా దంపతులు ఏర్పరచుకుంటారు. ఆస్తి విభాగాల గురించి, భరణం గురించి, నెలవారీ చెల్లించే మనోవర్తి గురించి, పిల్లల కస్టడీ గురించి, పిల్లలని చూడటానికి సంబంధించిన సమయాలు, తేదీల గురించి కూడా ఈ దరఖాస్తు పరిష్కారంలో కోరుకోవచ్చు. ఇవి ప్రైవేట్ హక్కులకి, పబ్లిక్ పాలసీకి భంగం కలిగించకుండా వుండాలి.
ఈ దరఖాస్తు దాఖలు తరువాత ఎంతకాలం
వేచి వుండాలి?
పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దాఖలుచేసిన దంపతులు తిరిగి ఆలోచించుకోవడానికి, రాజీచేసుకొని దాంపత్య జీవనం తిరిగి కొనసాగించడానికి చట్టపరంగా 6 నెలల కాలాన్ని కనీస సమయంగా ఏర్పరిచారు. దాన్ని 18 నెలల కాలం వరకు ఈ సమయాన్ని పొడిగించే అవకాశం వుంది. దీని ఉద్దేశ్యం- వివాహం తిరిగి పునరుద్ధరించబడటానికి తొందరపాటు వల్ల విడాకులు తీసుకోకుండా వుండటానికి ఈ కాలపరిమితిని ఏర్పాటుచేశారు.
ఈ కాలపరిమితిలో పార్టీలు తమ దరఖాస్తుని ఉపసంహరించుకొని దాంపత్య జీవనాన్ని కొనసాగించవచ్చు. వివాహం చెదిరిపోకుండా వుండటానికి, దంపతుల మధ్య ఆవేశకావేశాలు, కోపతాపాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షరతుని ఏర్పరచి శాసనకర్తలు కొంత జాగ్రత్తని తీసుకున్నారని అన్పిస్తుంది.
ఆరునెలల తరువాత పార్టీలు ఏం చెయ్యాలి?
ఆరునెలల తరువాత కోర్టు పార్టీలని విచారించాయి. ఈ ఆరునెలల కాలం గడిచిన తరువాత పార్టీలు ఇంకా అదే అభిప్రాయంతో వున్నారా అన్న విషయాన్ని పరిశీలించి, కోర్టు సంతృప్తి చెందిన తరువాత కోర్టు విడాకులను మంజూరు చేస్తుంది. ఇందుకుగానూ పార్టీలు తమ ప్రమాణ పత్రాలని సమర్పించవచ్చు. లేదా కోర్టు వారి స్టేట్‌మెంట్లని నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో పార్టీలు సమ్మతిని మోసం ద్వారా ఒత్తిడి ద్వారా ప్రభావితం చేయడం ద్వారా పొందినవా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించాల్సి వుంటుంది. భార్య తన మనోవర్తి గురించి, పిల్లల అధీనం గురించిన హక్కులను వదులుకున్నారా అన్న విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది.
ఫొటోలు, స్టేట్‌మెంట్లు నమోదు అవసరమా?
గతంలో విడాకుల దరఖాస్తులో ఫొటోలని కావాలని కోర్టులు అడిగేవి కావు. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో మోసాలు జరిగిన సంఘటనలు కోర్టుల దృష్టికి వచ్చాయి. వేరే ఎవరినో తీసుకొనివచ్చి విడాకులు పొందిన సందర్భాలని కోర్టులు గమనించి ఆ పార్టీల ఫొటోలు అవసరమని కోర్టులు అంటున్నాయి.
అదేవిధంగా దరఖాస్తుని దాఖలుచేసిన సందర్భంలో మళ్లీ విడాకులు మంజూరు చేసే సందర్భంలో పార్టీలని స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేయడం అవసరం. అలా చెయ్యడంవల్ల తమ దరఖాస్తులో రాసిన విషయాలు ఈ పార్టీలకి బోధపడతాయి.
ఒకవేళ ప్రమాణ పత్రాలను దాఖలు చేసినపుడు కూడా వాటిలోని కోర్టు వారికి తెలియచెప్పి తిరిగి వారి సంతకాలు తీసుకుంటోంది. కాబట్టి అందులో ఏమి రాసి వుందో ఆ విషయం పార్టీలకు మళ్ళీ ఒకసారి అవగతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
మోసాలు జరగకుండా వుండటానికి కోర్టు వివాహానికి సంబంధించిన ఫొటోను అదేవిధంగా కొత్త పాస్‌పోర్టు ఫొటోను తమ దరఖాస్తుతోబాటు జతచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. పార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మోసాలు జరగకుండా వుండటానికి కోర్టులు ఈ పని చేస్తున్నాయని గ్రహించాలి.


*
*
*

* Releated Articles

భర్త హాజరు కానప్పుడు.

.
November 2nd, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే దరఖాస్తు దాఖలు చేసిన తరువాత కనీసం 6 నెలలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ గడువుని ఏర్పర్చడానికి కారణం పార్టీలు తొందరపాటు వల్ల విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోలేదని, ఒత్తిడి వల్ల, బెదిరింపువల్ల అలాంటి నిర్ణయానికి రాలేదని కోర్టు అభిప్రాయ పడటానికి. అదే విధంగా పార్టీలు పునరాలోచించుకోవడానికీ ఈ గడువు దోహదపడుతుంది.
ఒక్కసారి కోర్టు ద్వారా విడాకుల కోసం పార్టీలు వచ్చినారంటే అది ఒక్క కేసులోనే ఉండదు. క్రిమినల్ కేసులు, ఆస్తి తగాదాలు, పిల్లల కస్టడీలో లాంటి కేసులు కూడా ఉంటాయి. కొంతమంది భర్తలు (్భర్యలు కూడా) పరస్పర ఆమోదంతో విడాకులు కోరడానికి దరఖాస్తుని దాఖలు చేసుకొని ఆ తరువాత సహకరించరు. అప్పటికే వాళ్లు కొన్ని కేసుల్లో లబ్ధి పొందుతారు. లబ్ధి పొంది మిగతా వ్యక్తులని ఇబ్బందులకు గురిచేస్తారు.
మొదటి సారే కాకుండా ఆరు నెలల నుంచి 18 మాసాలలోపు మళ్లీ పార్టీలు కోర్టు ముందుకు వచ్చి మేము విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు కాని కోర్టు మంజూరు చేయవు. ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? కోర్టు ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం రాజస్థాన్ హైకోర్టు శ్రీమతి సుమన్ వర్సెస్ సురేంద్ర కుమార్ ‘ఎఐఆర్ 2003 రాజస్థాన్ 155-ఐ (2003) డిఎమ్‌సి 805 కేసులో సమాధానాలు చెప్పింది.
పరస్పర ఆమోదంతో దాఖలు చేసిన దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం 2-12-1999 రోజున తిరస్కరించింది. దీనిపైన రాజస్థాన్ హైకోర్టులో డివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత కోర్టు దరఖాస్తుని ఆమోదించింది.
కేసు విషయాల్లోకి వస్తే - పార్టీల మధ్య 24, మే 1995 రోజున వివాహం జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరూ వేరువేరుగా నివసించడం మొదలు పెట్టారు. ఆ తరువాత 15-1-1999 రోజున హిందూ వివాహ చట్టంలోని సె.-13బి ప్రకారం విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశారు. వారిద్దరి స్టేట్ మెంట్లని కోర్టు నమోదు చేసి, ఆరు నెలల తరువాత వారి హాజరు గురించి తేదీని నిర్ణయించింది. ఆ తరువాత భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భార్య హాజరైంది. రెండు, మూడు వాయిదాలు ఇచ్చినప్పటికీ భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భర్త నడవడిక చూసి విసుగు చెందిన భార్య, అతను కోర్టు ముందు హాజరు అయ్యే విధంగా, అదే విధంగా అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకోవడానికి సమన్స్ పంపించాలని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. ఆ విధంగా చేయడానికి చట్టంలో అలాంటి ప్రొసీజర్ లేదని కోర్టు పేర్కొంటూ దరఖాస్తుని కొట్టివేసింది. ఐదవసారి పార్టీలు హాజరు కావడం లేదన్న కారణంగా కోర్టు వారి కేసుని కొట్టివేసింది. దీనిపైన అప్పీలుకి రాజస్థాన్ హైకోర్టులో దాఖలు చేసింది భార్య. దానిపైన రివ్యూ దరఖాస్తుని దాఖలు చేశారు. రివ్యూని కోర్టు ఆమోదించింది.
ఇద్దరూ కలిసి దరఖాస్తుని దాఖలు చేసినప్పుడే కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులు మంజూరు చెయ్యాలి తప్ప వారు హాజరు కానప్పుడు మంజూరు చేయడానికి వీల్లేదని భర్త న్యాయవాది కోర్టు ముందు వాదనలు చేశాడు. మొదటి సారి విడాకుల కోసం సమ్మతిని తెలియజేసి ఆ తరువాత కోర్టు ముందు హాజరు కాకపోవడం ద్వారా తనను ఇబ్బంది పెట్టి కేసు డిస్మిస్ అయ్యే విధంగా చేయడం సరైంది కాదని, వరుసగా హాజరు కాకుండా చేయగా అలాంటి తనని ఇబ్బందికి గురి చేయడమేనని కోర్టు ముందు భార్య న్యాయవాది వాదనలు చేశాడు.
తీర్పులోని ముఖ్యాంశం
మొదటిసారి తరువాత ఇంకొకసారి ఇద్దరూ హాజరై విడాకుల కోసం తమ సమస్యలు తెలియజేయాలి. అలాంటి సందర్భాల్లోనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కోర్టు గడువు ఇచ్చిన సమయంలో తమ సమ్మతిని తెలియజేస్తూ భార్యా భర్తలలో ఎవరైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ ఈ కేసులో భర్త ఆ విధంగా చేయలేదు.
అతను కోర్టు ముందుకు రాకుండా వౌనంగా ఉన్నాడు. ఆ వౌనాన్ని, సమ్మతిని ఉపసంహరించుకున్నట్టుగా భావించడానికి వీలు లేదు. అతను ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు వౌనంగా ఉన్నాడు. అతను తన సమ్మతిని ఉపసంహరించుకో దలిస్తే కోర్టు ముందుకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ముందుకి రాకుండా అతను భార్యని వేధించాడు. రెండవసారి ఇద్దరు పార్టీలు హాజరు వుండాలన్న సాంకేతిక అభ్యంతరాన్ని మేం పట్టించుకోదల్చుకోలేదు. రెండవసారి అతను హాజరు కాకపోవడం వల్ల అతను సమ్మతిని ఇచ్చాడన్న భావనకి రావల్సి ఉంటుంది. భర్త పూర్తిగా వౌనంగా ఉండటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రెండవ సందర్భంలో కొన్ని నెగటివ్‌గా తీసుకోవాలా, పాజిటవ్‌గా తీసుకోవాలా? తను తన సమ్మతిని ఉపసంహరించుకోవాలంటే అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు. అతన్ని ఎవరూ నిరోధించలేదు. అందుకని అతను సమ్మతిని ఉపసంహరించాడని కాకుండా ఇచ్చాడన్న అభిప్రాయానికి కోర్టు రావాల్సి ఉంటుంది. అందుకని ఈ కేసులో భర్త సమ్మతిని ఇచ్చాడన్న నిర్ణయానికి వచ్చి వారి వివాహాన్ని రద్దు చేస్తున్నాం’’.
భర్త హాజరు కాకున్నా కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులను మంజూరు చేసింది. దీని ఉద్దేశం ఇద్దరు హాజరు కాకున్నా మంజూరు చేయవచ్చని కాదు. తన సమ్మతిని ఉపసంహరించుకోకుండా నిరాటంకంగా హాజరు కానప్పుడు కోర్టు ఇలాంటి భావనకి రావల్సి ఉంటుందని ఈ తీర్పు ఉద్దేశం.

Wednesday, October 27, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

పరస్పర ఆమోదంతో విడాకులు
October 26th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలనుకునే వ్యక్తులు సె.-13-బి ప్రకారం ఈ విషయాలను సంతృప్తి పరచాల్సి వుంటుంది. అవి -
ఆ దంపతులు ఒక సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గానీ వేరువేరుగా నివసిస్తూ వుండాలి.
వారిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితులు వుండాలి.
తమ వివాహం ఇద్దరూ రద్దు కావాలని పరస్పర ఆమోదంతో కోరుకుని ఉండాలి.
హిందూ వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం విడాకులు దరఖాస్తుని దాఖలు చేయడానికి సంవత్సరం కాలం పాటు కాలపరిమితిని విధించారు. వివాహమైన సంవత్సర కాలం తరువాత వాళ్లు దరఖాస్తుని దాఖలు చేసుకోవాల్సి వుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సె.-14ప్రకారం కోర్టు దీనికి మినహాయింపుని ఇవ్వవచ్చు. దంపతులు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవాలంటే వాళ్లు సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గాని వేరువేరుగా నివశిస్తూ వుండాలి. ఈ విధంగా కానప్పుడు పరస్పర ఆమోదంతో విడాకులని కోరడానికి అవకాశం లేదు. సె.-14 ప్రకారం అనుమతి ఇవ్వవచ్చా? ఇవీ ప్రశ్నలు.
స్వీటీ, ఆమె భర్త సునీల్ కుమార్ పరస్పర ఆమోదంతో సె.-13-బి ప్రకారం విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేశారు. అయితే వారి వివాహమైన సంవత్సరంలోపే దరఖాస్తుని దాఖలు చేసి సె.-14 ప్రకారం కోర్టు అనుమతిని కోరారు. కోర్టు ఆ అనుమతిని ఇవ్వలేదు.
తామిద్దరూ కలిసి ఒక్కరోజు కూడా జీవించలేదని, అందుకని మినహాయింపుని ఇవ్వాలని వారు కోర్టుని కోరారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల వల్ల వాళ్లు కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల వాళ్లు మానసిక, శారీరక క్షోభని భరించలేమని దరఖాస్తులో పేర్కొన్నారు. పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల తమ జీవితాలని తిరిగి నిర్మించుకునే అవకాశం వుందని కూడా వాళ్లు తమ దరఖాస్తులో పేర్కొన్నారు. భర్త ఉద్యోగరీత్యా, విదేశాల్లో వుంటున్నాడు. వివాహం కాగానే అతను బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేసి లండన్‌కి వెళ్లిపోయాడు. అక్కడ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉద్యోగాన్ని వదిలి భారత దేశానికి వచ్చే పరిస్థితుల్లో లేడు. భార్య భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె విదేశాలకు వెళ్లే యోచనలో లేదు. అందుకని తాము కలిసి వుండే పరిస్థితి లేదని వాళ్లు భావించి పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేసుకున్నారు. సంవత్సర కాలంగా తాము వేరుగా నివసించడం లేదు కాబట్టి సె.-14 ప్రకారం మినహాయింపుని ఇవ్వమని కుటుంబ న్యాయస్థానం కోర్టుని కోరారు. కోర్టు వారి దరఖాస్తుని తిరస్కరించింది. దీనిపై కర్నాటక హైకోర్టులో అప్పీలుని దాఖలు చేశారు.
వారిద్దరి మధ్య పరిష్కరించడానికి వీల్లేని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తన భర్త శాశ్వతంగా విదేశాల్లో వుండదల్చుకున్నాడు. అందుకు తాను ఇష్టపడటం లేదని భార్య తన ప్రమాణ పత్రంలో స్పష్టంగా తెలియజేసింది. భార్య వయస్సు 25 సంవత్సరాలు. భర్త వయస్సు 33 సంవత్సరాలు. వారి పెద్దవాళ్లు బాధ్యతలు తెలిసిన వాళ్లు. వాళ్లిద్దరూ తాము కలిసి వుండలేమని చెబుతున్నప్పుడు వారిని వివాహ బంధం నుంచి విముక్తి చేయక పోవడానికి ఎలాంటి కారణం కన్పించడం లేదు.
సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే సంవత్సర కాలంగా లేదా అంతకు మించి వేరుగా నివశిస్తూ వుండాలి. దీనికి కూడా సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపుని ఇచ్చి దరఖాస్తు దాఖలు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వవచ్చు. ఒత్తిడివల్ల, బెదిరింపు వల్ల దరఖాస్తు దాఖలు చేయడం లేదని, అదే విధంగా పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల ఉత్పన్నమయ్యే విషయాలు వాళ్లకి తెలిసి వుండాలి. వీటి విషయంలో కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.
సంవత్సర కాలానికి మినహాయింపు ఇవ్వాలంటే కోర్టు ఈ విషయాల గురించి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అవి:-
దంపతులకి విషయాలను అర్థం చేసుకునే యోగ్యత
ఒత్తిడి, బెదిరింపులు లేకపోవడం
ఇద్దరూ కలిసి వుండే పరిస్థితులు లేకపోవడం
వాహం రద్దు కోరుతున్న పరిధి
తప్పుడు విషయాలు చెప్పడం
పార్టీల వయస్సు, వివాహం పొడిగింపు వల్ల వారి పునర్వివాహ అవకాశాలు దెబ్బతినడం
ఈ విషయాలను గమనించి అనుమతిని ఇవ్వాలి. ఈ కేసులో వీరి వివాహం కొనసాగించడంవల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని సె.-14 ప్రకారం సంవత్సర కాలం పాటు వేరుగా వుండటానికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం వుంది. (శ్రీమతి స్వీటీ, ఎమ్. వర్సెస్ సునీల్ కుమార్ కె.బి. కర్నాటక లా జర్నల్ బి (2007) 244)
తీర్పులోని ముఖ్యాంశం: భార్యా భర్తలు విడాకులు పొందాలంటే వివాహమైన సంవత్సరం తరువాతే దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతలోపు దరఖాస్తు చేసుకోవాలంటే సె.-14 ప్రకారం కోర్టు అనుమతి ఉండాల్సి వుంటుంది. అదే విధంగా సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే కనీసం సంవత్సరకాలం వేరుగా వుండాలి. అయితే సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపు ఇవ్వవచ్చు.

Tuesday, October 12, 2010

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు
October 12th, 2010

హిందూ వివాహ చట్టప్రకారం దంపతుల్లోని ఎవరైనా వ్యక్తి విడాకులు పొందాలంటే

ఎదుటివ్యక్తి చేసిన తప్పిదం వుండాలి. అది చట్టం గుర్తించిన తప్పిదం అయి వుండాలి.

తామే తప్పుచేసి ఆ ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. క్రూరత్వం,

వైవాహికేతర సంబంధాలు, విడిచిపెట్టి వుండటంలాంటివి వివాహ తప్పిదాలుగా చట్టం

గుర్తించింది.
వివాహ తప్పిదం వున్నపుడే విడాకులు తీసుకోవాలి అన్న సిద్ధాంతం కాలక్రమంలో

మారిపోయింది. ఎలాంటి తప్పిదం లేకున్నా విడాకులు పొందవచ్చన్న దిశగా చట్టం

మారింది. దంపతుల మధ్యన సరైన అవగాహన లేనప్పుడు కూడా విడాకులు

తీసుకోవచ్చన్నది కూడా ఒక ఆధారంగా పరిణమించింది.
వివాహ సంబంధాలు విఫలం కావడానికి ప్రతిసారి ఎదుటివారి వివాహ తప్పిదం

వుండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్యన దంపతుల

మధ్యన అవగాహన లేకపోవడంవల్ల కూడా వివాహాలు విఫలం అవుతుంటాయి.

అన్ని ప్రయత్నాలు విఫలం అయినపుడు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంది.
ఎదుటివారి తప్పిదం ఆధారంగానే దంపతుల మధ్యన వివాహాలని రద్దుచేసేవారు.

‘తప్పిదం’ సిద్ధాంతం ప్రకారం ఎదుటివ్యక్తి వివాహ తప్పిదం చేసినపుడే వివాహాన్ని

రద్దుచేసి విడాకులని మంజూరుచేసే పరిస్థితి చట్టప్రకారం వుంది. ఇలాంటి

సందర్భాలలో విడాకులు తీసుకోవడానికి భార్యాభర్తలు తప్పుడు ఆధారాలు,

ఆరోపణలు చేసి ఒకరికొకరు లాలూచీపడి విడాకుల కోసం దరఖాస్తులు చేసే పరిస్థితి

గతంలో వుండేది. వారు ఆ విధంగానే దరఖాస్తులు చేసుకునేవారు. ఒకరకంగా

చెప్పాలంటే లాలూచీపడి విడాకుల డిక్రీని పొందేవారు. దంపతుల్లో ఒక వ్యక్తి వివాహ

తప్పిదం చేసాడని మరో వ్యక్తి ఆరోపించడం, ఆ మరో వ్యక్తి దాన్ని అంగీకరించడం

ద్వారా విడాకుల డిక్రీలని పొందేవారు. ఎదుటివారి తప్పిదం లేకున్నా వివాహాన్ని

రద్దుచేసుకోవడానికి ఇద్దరూ లాలూచీపడేవారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి

చట్టంలో ‘సమ్మతితో విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా కొత్త నిబంధనని

ఏర్పరిచారు. దీని ఉద్దేశం సచ్ఛీలతతో దంపతులు విడాకులు తీసుకోవాలి తప్ప

మోసపూరితంగా, లాలూచీతో విడాకులు పొందకూడదని, అంతిమంగా వాళ్ళు

పొందేది చట్టబద్ధమైనదైనా వారి దారి చట్టవ్యతిరేకంగా ఉండకూడదని చట్టం ఉద్దేశం.
‘సమ్మతితో విడాకుల’ సిద్ధాంతంవల్ల
వివాహ పవిత్రత దెబ్బతిన్నదా?
హిందూ వివాహాలు ఒప్పందంలాంటివి కాదు. అవి పవిత్రమైనవి. ‘సమ్మతితో

విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా ఆ భావన నుంచి కొంత ప్రక్కకి వైదొలగడమే.

వివాహ ఒప్పందంలోకి దంపతులు రావడానికి ఎంత స్వేచ్ఛ వుందో అదేవిధంగా

వైదొలగడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. దీనే్న ‘సమ్మతితో విడాకులు’ అంటారు.

ఉభయుల సమ్మతితో విడాకులు పొందే నిబంధనని చట్టంలో ఏర్పాటుచేయడంవల్ల

సంప్రదాయంగా వస్తున్న హిందూ వివాహాలు పవిత్రమైనవి అన్న భావనకి సమాధి

చేయడమేనని చాలామంది భావన.
ముస్లింలలో ఇలాంటి భావన వుందా?
ముస్లిం వివాహాలు ఒప్పందాలలాంటివి. వాటిని రద్దుచేసుకోవచ్చు. సమ్మతితో

వివాహాలని రద్దుచేసుకోవడం చాలా సులువు. ఉభయుల సమ్మతితో విడాకులు

పొందడానికి ముస్లిం లాలలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ‘ఖుల్లా’,

‘ముబ్బారత్’. ‘ఖుల్లా’ పద్ధతిలో వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం భార్యనుంచి

వస్తుంది. ముబ్బారత్‌లో ఉభయులనుంచి వస్తుంది. ముస్లింలా అనేది కోడ్‌లాగా

మార్చలేదు. అందుకని న్యాయపరమైన డిక్రీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒప్పందం

ద్వారా విడాకులు తీసుకుని దానికి ఖాజా ఆమోదముద్ర వుంటే సరిపోతుంది.
ప్రత్యేక వివాహ చట్టంలో ఇలాంటి భావన వుందా?
ప్రత్యేక వివాహ చట్టాన్ని 1954లో తయారుచేశారు. ఆ చట్టాన్ని తయారుచేసిన

సంవత్సరం తరువాత హిందూ వివాహ చట్టాన్ని తయారుచేశారు. హిందూ వివాహ

చట్టం ఒక్క హిందువులకే పరిమితం. ప్రత్యేక వివాహ చట్టం అన్ని మతాలవారికి

వర్తిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టంలో ఉభయుల సమ్మతితో

విడాకులు పొందడానికి అవసరమైన నిబంధనని ఏర్పరిచారు. హిందూ వివాహ

చట్టం ఆ తరువాత తయారుచేసినప్పటికీ హిందువులు ఈ నిబంధనని

అంగీకరించరు అన్న అభిప్రాయంవల్ల ఈ నిబంధనని హిందూ వివాహ చట్టాన్ని

తయారుచేసినపుడు ఏర్పరచలేదు. కానీ 1978లో ఈ నిబంధన అవసరమని భావించి

13(బి)ని ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రగతిశీలమైనదని చాలామంది భావన. దీనివల్ల

తప్పుడు ఆరోపణలతో విడాకులు తీసుకోకుండా కలిసి జీవించి వుండలేని పరిస్థితుల్లో

ఈ నిబంధన ప్రకారం విడాకులు తీసుకోవటం సాధ్యమవుతుందని చాలామంది

వ్యక్తుల భావన.
క్రైస్తవులలో ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకోవచ్చా?
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే అవకాశం క్రైస్తవులకి గతంలో లేదు.

కానీ 2001 సంవత్సరంలో విడాకుల చట్టం, 1869కి సవరణలు తీసుకొచ్చి సె.10ఎ

నిబంధనని చేర్చినారు. ఈ కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులుకూడా ఉభయుల

సమ్మతితో విడాకులు తీసుకోవచ్చు.
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే పద్ధతి అమల్లోకి రావడానికి చాలాకాలం

పట్టింది. సోవియట్ విప్లవం తరువాత అక్కడ ఈ పద్ధతిని ఏర్పాటుచేశారు. ఆ

తరువాత చైనా, బెల్జియమ్, నార్వే, జపాన్, పోర్చుగల్ దేశాలు ఈ నిబంధనని

చట్టంలో ఏర్పాటు చేసుకున్నాయి.
విడాకులకోసం దరఖాస్తు చేసుకున్న తరువాత
ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుని విడాకుల దరఖాస్తు చేసుకున్న దంపతులు

కూడా తమ దరఖాస్తులు విచారణలో ఉన్నపుడు వాటిని ఉభయుల సమ్మతితో

విడాకుల దరఖాస్తుగా మార్చుకునే అవకాశం వుంది. దీనివల్ల శత్రుభావంతో

విడిపోకుండా వుండే పరిస్థితి ఏర్పడుతుంది.

Thursday, October 7, 2010

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత
August 31st, 2010

భారతదేశంలో ముస్లింల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాన్ని ‘ముస్లిం లా’ అంటున్నాం. ఈ చట్టానికి ప్రధాన ఆధారం ఇస్లామిక్ చట్టంలోని పవిత్ర భాగాలు, దానితో పాటు ఆచార వ్యవహారాలు కోర్టు తీర్పులు ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్ధం కాలేదు. ముస్లింల వ్యక్తిగత చట్టాన్ని వివిధ రకాలైన శాఖలు వివిధ రకాలుగా వ్యాఖ్యానించాయి. భారతదేశంలోని ముస్లింలు ఎక్కువగా ‘హనాఫీ’ శాఖను అనుసరిస్తున్నారు. సున్నీ తరగతికి చెందిన ముస్లింలలో నాలుగు ఉపతరగతులున్నప్పటికీ వీళ్ళందరూ హనాఫీ శాఖలో వున్న వ్యక్తిగతమైన చట్టాన్ని అవలంభిస్తున్నారు. షియా తరగతికి చెందిన ముస్లింలు ‘ఇత్నా అఫారీ’ శాఖలో పేర్కొన్న చట్టాన్ని అవలంభిస్తున్నారు. ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్దీకరించబడలేదు. అందుకని ఈ చట్టంలోని నిబంధనలు అన్నీ పవిత్రమైన మత చట్టాలనుంచి తీసుకోవడం జరిగింది. మస్లింల వ్యక్తిగత చట్టంలో వారి వైవాహిక జీవితానికి సంబంధించి ఒకే ఒక చట్టం క్రమబద్దీకరించడం జరిగింది. అదే ముస్లింల వివాహాల రద్దుపరచే చట్టం (1939).ప్రతి ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైన ప్రత్యేకమైన నిబంధనలేమీ లేవు. అయితే ఆయా ప్రాంతాలలోని హైకోర్టు వ్యాఖ్యానించిన పద్ధతినే ఆయా ప్రాంతాలలో పాటిస్తున్నారు. ఎక్కడైతే సుప్రీంకోర్టు వివరంగా వ్యాఖ్యానించిందో ఆ విషయాలు అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయి.ముస్లిం చట్టం భారతదేశంలోని ప్రతి ముస్లింకీ వర్తిస్తుంది. భగవంతుడొక్కడే ఉన్నాడని, మహమ్మద్ అతను ప్రవక్త అని నమ్మే వ్యక్తులందరూ ముస్లింలే!
ముస్లింల వివాహంలోని ముఖ్యాంశాలు
ముస్లింల వివాహం ఒక సివిల్ కాంట్రాక్టు వంటిది. దాని ప్రధానోద్దేశం పిల్లలకు జన్మనివ్వడమే. ముస్లింల వివాహంలో ఒకవైపునుంచి వివాహం గురించి ప్రతిపాదన రావడం, రెండవ వైపునుంచి ఆ ప్రతిపాదనను ఆమోదించడం వుంటుంది. దీనే్న ‘ఇజాబ్! వా ఖుబూల్’ అంటారు.
ఈ వివాహ ప్రతిపాదన దాని ఆమోదం ఒక్కొక్క సమావేశంలో జరగాలి.
ఈ ప్రతిపాదన, ఆమోదాలకు ఎలాంటి నిర్ణీత పద్దతి లేదు.
ఈ ప్రతిపాదన ఆమోదాలు రాతపూర్వకంగా ఉండాలన్న నియమంలేదు.
సాక్షులు అవసరమా?
‘హనాఫీ’ శాఖ ప్రకారం ఈ వివాహం సాక్షుల సమక్షంలో జరగాలి. ఆ సాక్షులు ఇద్దరు మగవాళ్లుగాని, లేక ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళుగానీ అయి ఉండాలి. సాక్షుల సమక్షంలో వివాహం జరగనప్పుడు ఆ వివాహం సక్రమం కానప్పటికీ వారిద్దరి కలయికతో అది సక్రమం అయిపోతుంది. మిగతా శాఖల్లో జరిగే వివాహాలకి సాక్షుల సమక్షం అక్కరలేదు. ఈ వివాహం ఖ్వాజీల సమక్షంలో జరగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వివాహానికి ఎలాంటి మతపరమైన ఉత్సవాలు అక్కరలేదు. ఈ వివాహాన్ని రిజిష్టరు చేయించవలసిన అవసరం లేదు.
ఇతరులని పెళ్లిచేసుకోవచ్చా?
ముస్లింలు ఇతరుల్ని వివాహం చేసుకోవడం గురించి వివిధ శాఖలకు సంబంధించి వివిధ రకాలుగా అభిప్రాయాలు వున్నాయి. సున్నీ ముస్లిం శాఖకు చెందిన పురుషుడు ముస్లిం చట్టాన్ని ప్రార్థించే (కీలాబియా) క్రిస్టియన్ మతస్థులను పెళ్ళిచేసుకోవచ్చు. హిందువులని సిక్కులని పెళ్లిచేసుకోవడానికి వీల్లేదు. సున్నీ మతానికి చెందిన స్ర్తి వేరే పురుషుణ్ణి వివాహమాడటానికి వీలులేదు. షియా శాఖకు చెందిన ముస్లిం ఇతర మత స్ర్తిలను శాశ్వత పద్ధతిలో పెళ్లిచేసుకోవడానికి వీలులేదు. వాళ్ళని తాత్కాలిక పద్ధతిలో పెళ్ళిచేసుకోవచ్చును. షియా ముస్లిం యువతి ఇతర పురుషులను ఏ పద్ధతిలో కూడా వివాహం చేసుకోవడానికి వీలులేదు. ఇతర శాఖలకు చెందిన ముస్లింలు ఒకరినొకరు పెళ్లిచేసుకోవచ్చు.
ఎంతమందిని వివాహమాడవచ్చు?
ముస్లిం మతానికి చెందిన పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే ఆ నలుగురు భార్యలను సమానంగా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ముస్లిం యువతి ఒకరికన్నా మించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు.అయితే ఈ భాగ్యలలో ఏ ఇద్దరుకూడా చట్ట వ్యతిరేకమైన కలయిక అయి ఉండకూడదు.
చట్టవ్యతిరేకమైన కలయిక అంటే ఏమిటి?
ముస్లింలలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ, ఆ భార్యల మధ్య చట్టవ్యతిరేక కలయిక ఉండకూడదు. చట్టవ్యతిరేకమైన కలయిక నిషేధించబడినది. ఉదాహరణకు భార్యకు విడాకులు ఇవ్వకముందు ఆ భార్య చెల్లెల్ని పెళ్లిచేసుకోవడం నిషేధించబడింది.
వయఃపరిమితి
వనదశ మస్లిం యువతీ యువకులు స్థిరచిత్తం ఉన్నప్పుడు పెళ్లిచేసుకోవచ్చు.యవ్వన దశరాని ముస్లిం యువతీ యువకులు కూడా వారి గార్డియన్ల ద్వారా వివాహం చేసుకోవచ్చు. నెలకొన్న పరిస్థితులవల్ల యవ్వన దశవచ్చిన తరువాత వాళ్లు ఆ వివాహాన్ని నిరాకరించవచ్చు. బాల్య వివాహాల చట్టప్రకారం ఆడవాళ్లు 18 సంవత్సరాలు నిండకముందు, మగవాళ్లు 21 సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకోవడం నేరం. ఈ చట్టం ముస్లింలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆ వివాహం చట్ట వ్యతిరేకంగా పరిగణించబడదు. అయితే ముస్లింలు రెండో వివాహం చేసుకోవడం భారతీయ శిక్షాస్మృతిలోని సె.194 ప్రకారం నేరంగా పరిగణించబడదు.
ఈ వివాహాలు ఎప్పుడు చెల్లకుండా పోతాయి?
ముస్లింల వివాహం చట్టంలో నిషేధించిన సంబంధాల మీద వివాహం చేసుకున్నపుడు అవి చెల్లకుండా పోతాయి.
అయితే అవి మూడు రకాలు-
చట్టబద్ధమైనవి
చెల్లనివి
నియమ విరుద్ధమైనవి.

తలాక్ అంటే ఏమిటి?

తలాక్ అంటే ఏమిటి?
-రాజేందర్
September 14th, 2010

తలాక్ అన్న పదం మనకు చిరపరిచితమైనదే. ముస్లింలలో భర్తలు భార్యలకి విడాకులు ఇవ్వడం అతి సులువైనది. అది ఏకపక్షమైనది.
మన దేశంలో ముస్లింలు విడాకులు ఇవ్వడానికి నాలుగు రకాల పద్ధతులు వున్నాయి. ఈ నాలుగు పద్ధతులలో చాలా ప్రాచుర్యం పొందినది ‘తలాక్’
నాలుగు రకాల పద్ధతులేమిటి?
తలాక్: న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం తెలియజేయకుండా ఏకపక్షంగా భర్త ఇచ్చే విడాకులు. దానే్న సాధారణ పరిభాషలో తలాక్ అంటున్నాం.
నిర్మాణాత్మక విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భర్త ప్రేరణతో నిర్మాణాత్మకంగా ఇచ్చే విడాకులు.
పరస్పర అంగీకార విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భార్యా భర్తలిద్దరు పరస్పర అంగీకారంతో ముస్లింల వివాహాల రద్దు పరిచే చట్టం 1939 ఫ్రకారం తీసుకునే విడాకులు.
చట్టప్రకారం: ముస్లిం వివాహాల రద్దు పరిచే చట్టంలో పేర్కొన్న ఆధారాలు ప్రకారం ముస్లిం స్ర్తిలు తీసుకునే విడాకులు.
మొదట పేర్కొన్నవిడాకులనే తలాక్ అంటున్నాం. రెండవ రకం విడాకులు కొన్ని నీతి నియమాల ప్రకారం భర్త తీసుకునే విడాకులు. మూడవ రకం విడాకులు సనాతనంగా ముస్లింల చట్టంలో వున్నటువంటివి. నాలుగవ రకం పద్ధతి మాత్రమే న్యాయపరంగా వున్న విడాకులు. ఇది ముస్లిం వివాహ చట్టంలో పొందుపరచబడినది. ఈ చట్ట ప్రకారం ముస్లిం స్ర్తిలు విడాకులు తీసుకునే అవకాశం కల్పించబడింది. ఈ పద్ధతి ప్రకారం స్ర్తిలు మాత్రమే విడాకులు తీసుకోవడానికి వీలుంటుంది.
తలాక్ అంటే?
యుక్త వయస్కుడై స్థిరచిత్తం కలిగిన ఓ ముస్లిం పురుషుడైన ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతిని తలాక్ అంటున్నాం. ముస్లిం పురుషులు ఏకపక్షంగా తమ భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతినే తలాక్ అంటున్నాం.
సున్నీ చట్ట ప్రకారం తలాక్ వౌఖికంగా వుండవచ్చు. రాతపూర్వకంగా వుండవచ్చు. షియా చట్ట ప్రకారం సమర్ధులైన ఇద్దరు సాక్ష్యుల సమక్షంలో తలాక్ ప్రకటన వౌఖికంగా వుండాలి. అసాధారణ పరిస్థితుల్లో అంటే భర్త వౌఖికంగా ఈ ప్రకటన చేసే వీలు లేనప్పుడు రాతపూర్వకంగా కూడా చేయవచ్చు.
తలాక్ ప్రకటించడానికి పద్ధతులేమిటి?
తలాక్ ప్రకటనని రెండు విధాలుగా ప్రకటించవచ్చు. మొదటిది ఆమోదించిన పద్ధతి. రెండవది ఆమోదించని పద్ధతి
ఆమోదించిన పద్ధతిలో మళ్లీ రెండు రకాల పద్ధతులున్నాయి.
అవి-
-సాధారణ పద్ధతి (అహసన్)
-అసాధారణ పద్ధతి (హసన్)
అసాధారణ పద్ధతిలో మళ్లీ ఎన్నో రకాలైన పద్ధతులున్నాయి. ఆమోదించిన పద్ధతి ప్రకారం భర్త తన భార్యకి విడాకులు ఇవ్వచ్చుననే మామూలు ప్రకటన సరిపోతుంది. తన ఉద్దేశాన్ని తెలియజేస్తే చాలు. ఆ ఉద్దేశాన్ని ఈ పద్ధతుల్లో తెలియజేయాల్సి వుంటుంది.
* తన భార్యకి విడాకులు ఇచ్చానన్న ప్రకటన భార్య ‘తుహ్రూ’ కాలంలో తెలియజేయాలి. ‘తుహ్రూ’ కాలం అంటే రెండు రుతుస్రావాల మధ్యకాలం. ‘ఇద్దక్’ కాలం అయిపోయే వరకు శారీరకంగా దూరంగా వుండాలి. ఈ ‘ఇద్దక్’ కాలం అయిపోయిన తరువాత విడాకులు ఫలవంతమవుతుంది. దాన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ‘అహసన్’ పద్ధతి అంటారు.
* వరసగా మూడు తుహ్రూ కాలంలో ఈ ప్రకటన చేసి వుండాలి. ఈ మూడు తుహ్రూ కాలాలలో శారీరకంగా దూరంగా వుండాలి. మూడవ ప్రకటనతో ఈ విడాకులు పూర్తవుతుంది. ఆ తరువాత దీన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ’హసన్’ పద్ధతి అంటారు.
* తుహ్రూ కాలంలో నేను విడాకులు ఇస్తున్నానని మూడుసార్లు ఒకేసారి ప్రకటించితే విడాకులు పూర్తి అవుతుంది. ఈ విధంగా కాకుండా ఒక తుహ్రూ కాలంలో మూడుసార్లు వేరువేరుగా ఈ ప్రకటన చేసినప్పుడు తలాక్ పూర్తవుతుంది.
* రద్దుపరిచే వీలు లేకుండా నీకు విడాకులు ఇస్తున్నాను అని ఒకేసారి ప్రకటించినప్పటికీ అది ఫలవంతమైన రద్దు పరచలేని విడాకులుగానే ముస్లింలు చట్టం పరిగణిస్తుంది.
తలాక్ గురించి మరికొన్ని విషయాలు
- భార్య విషయలో కూడా తలాక్ ప్రకటన భర్త చేయవచ్చు. అయితే విడాకులు ఇచ్చే ఉద్దేశ్యం స్పష్టంగా వుండాలి.
- భర్తకు భార్య తలాక్ పద్ధతిలో విడాకులు ఇవ్వడానికి వీల్లేదు.
- తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త ఇతరులకి కూడా సంక్రమింపచేయవచ్చు. అలా ఇచ్చినప్పుడు కూడా అవి సక్రమమైన తలాక్ అవుతుంది. తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త తన భార్యకు సంక్రమింపచేయవచ్చు.
- భవిష్యత్తులో జరగబోయే సంఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా తలాక్ ప్రకటనని భర్తీ చేయవచ్

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత
August 31st, 2010

భారతదేశంలో ముస్లింల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాన్ని ‘ముస్లిం లా’ అంటున్నాం. ఈ చట్టానికి ప్రధాన ఆధారం ఇస్లామిక్ చట్టంలోని పవిత్ర భాగాలు, దానితో పాటు ఆచార వ్యవహారాలు కోర్టు తీర్పులు ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్ధం కాలేదు. ముస్లింల వ్యక్తిగత చట్టాన్ని వివిధ రకాలైన శాఖలు వివిధ రకాలుగా వ్యాఖ్యానించాయి. భారతదేశంలోని ముస్లింలు ఎక్కువగా ‘హనాఫీ’ శాఖను అనుసరిస్తున్నారు. సున్నీ తరగతికి చెందిన ముస్లింలలో నాలుగు ఉపతరగతులున్నప్పటికీ వీళ్ళందరూ హనాఫీ శాఖలో వున్న వ్యక్తిగతమైన చట్టాన్ని అవలంభిస్తున్నారు. షియా తరగతికి చెందిన ముస్లింలు ‘ఇత్నా అఫారీ’ శాఖలో పేర్కొన్న చట్టాన్ని అవలంభిస్తున్నారు. ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్దీకరించబడలేదు. అందుకని ఈ చట్టంలోని నిబంధనలు అన్నీ పవిత్రమైన మత చట్టాలనుంచి తీసుకోవడం జరిగింది. మస్లింల వ్యక్తిగత చట్టంలో వారి వైవాహిక జీవితానికి సంబంధించి ఒకే ఒక చట్టం క్రమబద్దీకరించడం జరిగింది. అదే ముస్లింల వివాహాల రద్దుపరచే చట్టం (1939).ప్రతి ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైన ప్రత్యేకమైన నిబంధనలేమీ లేవు. అయితే ఆయా ప్రాంతాలలోని హైకోర్టు వ్యాఖ్యానించిన పద్ధతినే ఆయా ప్రాంతాలలో పాటిస్తున్నారు. ఎక్కడైతే సుప్రీంకోర్టు వివరంగా వ్యాఖ్యానించిందో ఆ విషయాలు అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయి.ముస్లిం చట్టం భారతదేశంలోని ప్రతి ముస్లింకీ వర్తిస్తుంది. భగవంతుడొక్కడే ఉన్నాడని, మహమ్మద్ అతను ప్రవక్త అని నమ్మే వ్యక్తులందరూ ముస్లింలే!
ముస్లింల వివాహంలోని ముఖ్యాంశాలు
ముస్లింల వివాహం ఒక సివిల్ కాంట్రాక్టు వంటిది. దాని ప్రధానోద్దేశం పిల్లలకు జన్మనివ్వడమే. ముస్లింల వివాహంలో ఒకవైపునుంచి వివాహం గురించి ప్రతిపాదన రావడం, రెండవ వైపునుంచి ఆ ప్రతిపాదనను ఆమోదించడం వుంటుంది. దీనే్న ‘ఇజాబ్! వా ఖుబూల్’ అంటారు.
ఈ వివాహ ప్రతిపాదన దాని ఆమోదం ఒక్కొక్క సమావేశంలో జరగాలి.
ఈ ప్రతిపాదన, ఆమోదాలకు ఎలాంటి నిర్ణీత పద్దతి లేదు.
ఈ ప్రతిపాదన ఆమోదాలు రాతపూర్వకంగా ఉండాలన్న నియమంలేదు.
సాక్షులు అవసరమా?
‘హనాఫీ’ శాఖ ప్రకారం ఈ వివాహం సాక్షుల సమక్షంలో జరగాలి. ఆ సాక్షులు ఇద్దరు మగవాళ్లుగాని, లేక ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళుగానీ అయి ఉండాలి. సాక్షుల సమక్షంలో వివాహం జరగనప్పుడు ఆ వివాహం సక్రమం కానప్పటికీ వారిద్దరి కలయికతో అది సక్రమం అయిపోతుంది. మిగతా శాఖల్లో జరిగే వివాహాలకి సాక్షుల సమక్షం అక్కరలేదు. ఈ వివాహం ఖ్వాజీల సమక్షంలో జరగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వివాహానికి ఎలాంటి మతపరమైన ఉత్సవాలు అక్కరలేదు. ఈ వివాహాన్ని రిజిష్టరు చేయించవలసిన అవసరం లేదు.
ఇతరులని పెళ్లిచేసుకోవచ్చా?
ముస్లింలు ఇతరుల్ని వివాహం చేసుకోవడం గురించి వివిధ శాఖలకు సంబంధించి వివిధ రకాలుగా అభిప్రాయాలు వున్నాయి. సున్నీ ముస్లిం శాఖకు చెందిన పురుషుడు ముస్లిం చట్టాన్ని ప్రార్థించే (కీలాబియా) క్రిస్టియన్ మతస్థులను పెళ్ళిచేసుకోవచ్చు. హిందువులని సిక్కులని పెళ్లిచేసుకోవడానికి వీల్లేదు. సున్నీ మతానికి చెందిన స్ర్తి వేరే పురుషుణ్ణి వివాహమాడటానికి వీలులేదు. షియా శాఖకు చెందిన ముస్లిం ఇతర మత స్ర్తిలను శాశ్వత పద్ధతిలో పెళ్లిచేసుకోవడానికి వీలులేదు. వాళ్ళని తాత్కాలిక పద్ధతిలో పెళ్ళిచేసుకోవచ్చును. షియా ముస్లిం యువతి ఇతర పురుషులను ఏ పద్ధతిలో కూడా వివాహం చేసుకోవడానికి వీలులేదు. ఇతర శాఖలకు చెందిన ముస్లింలు ఒకరినొకరు పెళ్లిచేసుకోవచ్చు.
ఎంతమందిని వివాహమాడవచ్చు?
ముస్లిం మతానికి చెందిన పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే ఆ నలుగురు భార్యలను సమానంగా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ముస్లిం యువతి ఒకరికన్నా మించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు.అయితే ఈ భాగ్యలలో ఏ ఇద్దరుకూడా చట్ట వ్యతిరేకమైన కలయిక అయి ఉండకూడదు.
చట్టవ్యతిరేకమైన కలయిక అంటే ఏమిటి?
ముస్లింలలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ, ఆ భార్యల మధ్య చట్టవ్యతిరేక కలయిక ఉండకూడదు. చట్టవ్యతిరేకమైన కలయిక నిషేధించబడినది. ఉదాహరణకు భార్యకు విడాకులు ఇవ్వకముందు ఆ భార్య చెల్లెల్ని పెళ్లిచేసుకోవడం నిషేధించబడింది.
వయఃపరిమితి
వనదశ మస్లిం యువతీ యువకులు స్థిరచిత్తం ఉన్నప్పుడు పెళ్లిచేసుకోవచ్చు.యవ్వన దశరాని ముస్లిం యువతీ యువకులు కూడా వారి గార్డియన్ల ద్వారా వివాహం చేసుకోవచ్చు. నెలకొన్న పరిస్థితులవల్ల యవ్వన దశవచ్చిన తరువాత వాళ్లు ఆ వివాహాన్ని నిరాకరించవచ్చు. బాల్య వివాహాల చట్టప్రకారం ఆడవాళ్లు 18 సంవత్సరాలు నిండకముందు, మగవాళ్లు 21 సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకోవడం నేరం. ఈ చట్టం ముస్లింలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆ వివాహం చట్ట వ్యతిరేకంగా పరిగణించబడదు. అయితే ముస్లింలు రెండో వివాహం చేసుకోవడం భారతీయ శిక్షాస్మృతిలోని సె.194 ప్రకారం నేరంగా పరిగణించబడదు.
ఈ వివాహాలు ఎప్పుడు చెల్లకుండా పోతాయి?
ముస్లింల వివాహం చట్టంలో నిషేధించిన సంబంధాల మీద వివాహం చేసుకున్నపుడు అవి చెల్లకుండా పోతాయి.
అయితే అవి మూడు రకాలు-
చట్టబద్ధమైనవి
చెల్లనివి
నియమ విరుద

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు
August 24th, 2010

దంపతుల్లో ఎవరైనా తమకు సంబంధించిన ముఖ్య విషయాలు చెప్పకుండా ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ విధంగా మోసపోయిన వ్యక్తి ఆ వివాహం రద్దు చేయమని కోరే అవకాశం వుంది. హిందూ వివాహ చట్టంలోని సె.12(సి) ప్రకారం దరఖాస్తుని దాఖలు చేయవచ్చు.
ఆ నిబంధన ఈ విధంగా చెబుతుంది- ప్రతివాదికి సంబంధించిన ముఖ్య విషయాలను కప్పిపుచ్చి వాది సమ్మతిని పొందినప్పుడు, అదేవిధంగా- బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి రాకపూర్వం జరిగిన వివాహాల్లో వాది మైనరైనప్పుడు సంరక్షకుని సమ్మతిని బలప్రయోగం ద్వారా, మోసం ద్వారా పొందినప్పుడు వాది ఆ వివాహం రద్దు చేయమని కోర్టులో దరఖాస్తు దాఖలు చేయవచ్చు.
***
సంవత్సరంలోగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టులు పరిశీలిస్తాయి. ఆ తరువాత దాఖలు చేసిన పిటిషన్లని బలప్రయోగం తొలగిపోయిన తర్వాత, మోసం తెలిసిన తరువాత వాది ప్రతివాదితో పూర్తి సమ్మతితో కాపురం చేసినప్పుడే కోర్టులు ఆ వివాహాన్ని రద్దు పరచవు.
ఈ నేపధ్యంలో- గుల్లపల్లి సౌర్యరాజ్ వర్సెస్ బండారు పావనిని అలియాస్ గుల్లపల్లి పావని, ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085 కేసుని చూద్దాం.
తన సాంఘిక హోదా అంటే మతం ఏమిటో తెలియజేయకుండా ఎవరైనా హిందువులని హిం దూ పద్ధతుల ప్రకా రం చేసుకున్నప్పటికీ ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? ప్రతివాదికి తనకు సంబంధించిన ము ఖ్యవిషయం మరుగుపరిచి వివాహం చేసుకున్నట్టుగా వాది భావించి వివాహాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుందా?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే గుల్లపల్లి సౌవురియారాజ్ వర్సెస్ బండారు పావని ఎలియాస్ గుల్లపల్లి పావని (ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085)లోని విషయాలను పరిశీలించాలి.
సౌవర్యారాజ్ రోమన్ కాథలిక్. అతను పావనని 24-10-1996 రోజున హిందువుల ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహంలో అతను ఆమెకు తాళి కట్టాడు. ఇరుపక్షాల బంధువులు తల్లిదండ్రులు ఎవరూ ఆ వివాహానికి హాజరు కాలేదు.ఆ తర్వాత 2-11-1996రోజున ఆ వివాహాన్ని హిందూ వివాహాల చట్టం, 1955లోని సె.8 ప్రకారం రిజిస్టర్ కూడా చేయించారు.
తేదీ 13-3-1997 రోజున ప్రతివాది (్భర్య) విశాఖ పట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసి వివాహాన్ని రద్దు చేయమనికోరింది. వాదికి (సౌర్యరాజ్)కి సంబంధించిన ముఖ్య విషయాలు మరుగుపరిచినాడని అందుకని తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టంలోని సె.12(1)(సి) ప్రకారం రద్దు చేయాలని ఆమె కోరింది. ఆమె దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం కొట్టివేసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
అప్పీలుని విచారించిన హైకోర్టు, ఆమె దాఖలు చేసిన అప్పీలుని ఆమోదించింది. హిందువుకి, క్రిస్టియన్‌కి జరిగిన వివాహం ప్రాధమికంగానే హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని పేర్కొంటూ వారి వివాహాన్ని 12-9-2002 రోజున రద్దు చేసింది.
ఆ తరువాత పావని డాక్టర్ ప్రవీణ్‌ని 23-1-2003రోజున వివాహం చేసుకుంది. హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సౌర్యరాజ్ 23-4-2003 రోజున స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసాడు. సుప్రీంకోర్టు దాన్ని సివిల్ అప్పీలు నెం.2446/2005గా స్వీకరించి విచారించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశం
సౌర్యరాజ్ రోమన్ కాథొలిక్. పావని హిందువు. వారి వివాహం హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగింది. ఆ తరువాత వారి వివాహం సె.8 ప్రకారం రిజిస్టర్ అయింది. అయినా కూడా అది చెల్లదు. అందుకని వారి వివాహాన్ని హైకోర్టు రద్దు చేయడం సమంజసమే. అందులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. వీరి వివాహం చెల్లనప్పుడు పావని తిరిగి వివాహం చేసుకున్నప్పటికీ దానికి విలువలేదు. అందుకని ఆమె రెండవ వివాహం గురించి ఏమీ చెప్పలేం. దాఖలు చేసిన అప

రెండవ వివాహం - దాని పరిణామాలు

రెండవ వివాహం - దాని పరిణామాలు
లా ఇలా
August 17th, 2010

సె.494 ఐ.పి.సి ప్రకారం భార్యగానీ, భర్తగానీ బ్రతికి ఉండగా రెండో వివాహం చేసుకుంటే అది చట్టరీత్యా చెల్లనపుడు శిక్షార్హులౌతారు. వాళ్ళకు ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఇదివరకే వివాహం అయిందన్న విషయాన్ని మరుగుపరచి రెండో వివాహం చేసుకున్న వ్యక్తులను సె.495 ఐ.పి.సి ప్రకారం పది సంవత్సరాలు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
ఈ నేరం ఋజువుకావాలంటే ఏ అంశాలని నిరూపించాల్సి ఉంటుంది?
ఈ నేరం ఋజువుకావాలంటే ప్రాసిక్యూషన్ ఈ నాలుగు షరతులను నిరూపించాల్సి ఉంటుంది. అవి-
1.మొదటి వివాహం సక్రమమైనదై వుండి, హిందూ వివాహ చట్టప్రకారం జరిగిందై వుండాలి.
2.ఆ వివాహం పార్టీల ఆచార వ్యవహారాల ప్రకారం ఉత్సవాల ప్రకారం జరిగి ఉండాలి.
3.ఆ వివాహంలోని దంపతులిద్దరూ హిందువులై వుండాలి.
4.రెండో వివాహం జరిగిన రోజున దంపతుల్లో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ ఉండి వుండాలి.
రెండో వివాహం ఎపుడు చెల్లదు?
రెండో వివాహం ఈ క్రింది రెండు అంశాలున్నప్పుడు చెల్లదు. ఆ అంశాలు-
* ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అంటే మే 1955 తరువాత రెండో వివాహం జరిగి వుండాలి.
* ఆ వివాహ సమయంలో వివాహం చేసుకున్న పార్టీలలో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ వుండి వుండాలి.
శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలంటే...
ఈ నిబంధన వర్తించాలంటే పార్టీల మధ్య శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలి. శాస్త్రోక్తంగా వివాహం జరగడమనేది పార్టీల ఆచార వ్యవహారాలను బట్టి వుంటుంది.
హోమము, సప్తపది లేకుండా తాళికట్టినంత మాత్రాన అది శాస్త్రోక్తంగా వివాహం జరిగినట్టు కాదని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని కులాల, ఆచారాల ప్రకారం హోమము, సప్తపది అవసరం లేదు. కానీ తాళికట్టడం, కంకణం కట్టుకోవడం వివాహంలో తప్పనిసరి.
వివాహానికి అవసరమైన ఉత్సవాలు, కార్యకలాపాలు రెండో వివాహానికి జరిగినట్లు రుజువైతేతప్ప ముద్దాయిలను శిక్షించడానికి వీల్లేదు. భార్య ఉండగా రెండో వివాహాన్ని భర్త చేసుకున్నప్పుడు, ఆ వివాహం చెల్లదు. గనుక రెండవ భార్య మళ్లీ ఇతరుల్ని వివాహం చేసుకున్నపుడు ఆమెను శిక్షించడానికి వీల్లేదు.
సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ప్రత్యేక ఉపశమనం చట్టం క్రింద రెండో వివాహాన్ని ఆపడానికి ఇంజెక్షన్ తీసుకోవడానికి ఈ చట్టం ఏ విధమైన ఆటంకం కల్పించడం లేదని అలా తీసుకోవడంవల్ల భవిష్యత్తులో పరిమాణాలని నిలుపుదల చేయవచ్చని పార్టీలు ఆ నిబంధన ప్రకారం, రెండో వివాహం చెల్లదని ప్రకటించేసేసి కోర్టులో దావావేయాల్సిన అవసరం వుండదని అందుకని కోర్టులో రెండో వివాహాలను నిలుపుదల చేయడానికి ఇంజెక్షన్ ఇవ్వడం సరైందని వివిధ హైకోర్టులు అభిప్రాయపడుతున్నాయి.
వివాహ షరతులు ఉల్లంఘిస్తే నేరమా? (సె.18)
కొన్ని వివాహ షరతులు ఉల్లంఘిస్తే వివిధ చట్టాల ప్రకారం నేరాలవుతాయి. భార్యగానీ, భర్తగానీ బ్రతికి వుండగా రెండో వివాహం చేసుకుంటే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరమవుతుంది. అలాగే బాల్య వివాహాలు, బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం నేరమవుతాయి. వివాహ సమయంలో వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినపుడు ఆచార వ్యవహారాలు అనుమతించనపుడు, నిషేధింపబడిన బంధుత్వాల మధ్య వివాహం చేసుకున్నా సపిండుల మధ్య వివాహం చేసుకున్నా హిందూ వివాహ చట్టప్రకారం నేరాలుగా పరిగణింపబడతాయి.
వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేసుకున్న వ్యక్తులకి పదిహేను రోజుల వరకు సాధారణ జైలుశిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగానీ లేక ఈ రెండింటినిగానీ కోర్టులు విధిస్తాయి. వధూవరులిద్దరికి మాత్రమే ఈ శిక్షలు విధిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చట్టప్రకారం శిక్షార్హులు కాదు. వధూవరులిద్దరిలో ఎవరి ప్రోద్బలంతోనైతే వివాహం జరిగిందో వాళ్ళే శిక్షార్హులవుతారు. వధూవరులిద్దరు పైన చెప్పిన వయస్సుకన్నా తక్కువగా ఉన్నపుడు వివాహం జరిగినపుడు ఇద్దరికి శిక్ష విధించడం సాధ్యంకాదు. ఎందుకంటె అంతకన్నా వయస్సు తక్కువ ఉన్నపుడు వారి ప్రోద్బలం వున్నట్టుగా చట్టం భావించదు. ఇది ఆ చట్టంలో ఉన్న లోపం. అయితే ఇలాంటి వివాహాలు చేసుకున్న వరుడు బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం శిక్షార్హుడవుతాడు. అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే, అతనికి పదిహేను రోజుల వరకు జైలుశిక్షగానీ జరిమానా గానీ లేక రెండూ గానీ విధించవచ్చు. ఒకవేళ వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే అతనికి మూడు నెలలవరకు సాధారణ జైలుశిక్షగానీ జరిమానా గానీ కోర్టులు విధిస్తాయి. వరుడే కాకుండా ఈ వివాహాలని ప్రోత్సహించిన వ్యక్తులు కూడా శిక్షార్హులవుతారు.
ఆచార వ్యవహారాలు ఆమోదించినపుడు నిషేధించబడిన బంధుత్వాల మధ్య సపిండుల మధ్య వివాహాలు చేసుకున్న వ్యక్తులకి హిందూ వివాహాల చట్టప్రకారం నెల రోజులవరకు జైలు శిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగాని రెండూగానీ విధించవచ్చు. *

*
*
*

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి
- రాజేందర్
September 21st, 2010

రోజురోజుకీ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగి పోతున్నాయి. పెళ్ళైన సంవత్సరంలోపే విడాకుల కోసం కోర్టులకి వస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. స్ర్తిలకి ఆర్థిక స్వాతంత్య్రం రావడమే దీనికి ప్రధాన కారణమన్న అపవాదు కూడా వుంది. కుటుంబంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కుటుంబ న్యాయస్థానాలని ఏర్పాటుచేసింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం ఈ న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశం. మన సమాజంలో కుటుంబానికి అత్యంత విలువ వుంది. అందుకని కుటుంబ జీవితాన్ని పరిరక్షించడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం, నమ్మకం పెంచి కుటుంబ జీవితాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో ఏదైనా వివాదం తలెత్తి కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం సన్నగిల్లితే చట్టాన్ని ఉపయోగించుకోవాల్సి వుంటుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సమాజంలో వున్న విలువలని కాపాడుతూ ఈ న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.

కుటుంబ వివాదాలు పరిష్కారంవల్ల ఆ వివాదానికి పార్టీల వ్యక్తుల జీవితమే కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల జీవితాలని అది ప్రభావితం చేస్తుంది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చే తీర్పువల్ల సుదూర జీవితంలో కూడా ప్రభావితం వుంటుంది. ఉదాహరణకి- ఏదైనా నడవడిక క్రూరత్వం కాదని కోర్టు ప్రకటిస్తే, అలాంటి నడవడికని ఆ దంపతుల్లోని వ్యక్తి ఇంకా ఎక్కువ చేసే అవకాశం వుంది. వాళ్ళని ప్రోత్సహించినట్టుగా కూడా వుంటుంది- ఏదైనా నడవడిక అనేది క్రూరత్వం అవుతుందని కోర్టు ప్రకటిస్తే కుటుంబంలో ఒత్తిడి, సంఘర్షణ పెరుగుతుంది.

ఈ విషయాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ వివాదాలని పరిష్కరించడానికి ఓ యంత్రాంగం అవసరమని శాసనకర్తలు భావించి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
కుటుంబ వివాదాల పరిష్కారానికి కూడా ఈ చట్టంలో కొత్త పద్ధతులని ఏర్పాటుచేశారు. సాధారణ కోర్టులో వుండే పద్ధతికి భిన్నంగా ఈ కోర్టులు పనిచేసే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. పార్టీలకి న్యాయాన్ని అందించడానికి వీలుగా ఈ కోర్టులు తమ పద్ధతులని ఏర్పాటుచేసుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది.

ఏ నిబంధన కొత్త పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాయి?

కుటుంబ న్యాయస్థానాలు మామూలు కోర్టులకి భిన్నంగా పనిచేయాలి. పార్టీలకు సత్వర న్యాయాన్ని అందించాలి. అందుకని తమకు తోచిన పద్ధతిని ఏర్పాటుచేసుకోవడానికి ఈ చట్టంలో వున్న కొన్ని నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. ఆ నిబంధనలు సె.10(3), సె.14, సె.15.
* సె.10 (3)- తమ ముందు విచారణలో వున్న ఏదైనా దావాని, ప్రొసీడింగ్స్‌ని లేదా ఏవైనా విషయాలని ఒక పార్టీ ఆరోపించి మరో పార్టీ ఖండించినప్పుడు వాటిని పరిష్కరించడానికి అవసరమైన స్వంత పద్ధతిని అవలంబించడానికి కుటుంబ న్యాయస్థానానికి ఎలాంటి ఆటంకం లేదు.
* సె.14- భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 ప్రకారం ఆమోదయోగ్యం కాని లేదా సంబంధితం కాని డాక్యుమెంట్లని, నివేదికలను, స్టేట్‌మెంట్లను కూడా సాక్ష్యంగా కుటుంబ న్యాయస్థానం స్వీకరించవచ్చు. అయితే అవి వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఉపయోగపడాలి.
* సె.15- కుటుంబ న్యాయస్థానాల్లో విచారణలో వున్న దావాలని లేదా ప్రొసీజింగ్స్‌ని పరిష్కరించే క్రమంలో సాక్ష్యాలని సుదీర్ఘంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. సాక్షుల సాక్ష్యంలోని సారాంశాన్ని నమోదు చేసి సాక్షుల సంతకం తీసుకొని న్యాయమూర్తి సంతకం చేస్తే సరిపోతుంది.

వివాదాలు పరిష్కారానికి అవసరమైన పద్ధతులని ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అయితే న్యాయవాదులు కోర్టుల ముందు హాజరుకావడానికి ఈ చట్టం నిరోధిస్తుంది. న్యాయవాదులు కుటుంబ న్యాయస్థానాలముందు హాజరుకావాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. అనుమతి తీసుకున్నప్పటికీ వాళ్ళు కోర్టు సహాయకులుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప మామూలు కేసుల్లో మాదిరిగా తమ పార్టీల పక్షం వహించకూడదు.

మన దేశం బ్రిటీష్ వాళ్ళ అడ్వర్సరల్ సిస్టమ్‌ని పాటిస్తుంది. ఈ సిస్టమ్‌లో న్యాయమూర్తులు అంపైర్‌ల మాదిరిగా వుండాలి. క్రియాత్మకంగా వ్యవహరించకూడదు. తమ దగ్గరికి వచ్చిన సాక్ష్యాలని ఆధారం చేసుకొని తీర్పులని వెలువరించాల్సి వుంటుంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు వున్నాయి. చట్టం వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ పరిమితుల్లో పనిచేయాల్సిన పరిస్

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే
September 29th, 2010

దత్తత గురించి వివాదం తలెత్తినపుడు ఆ పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిపై ఉంటుందా లేక దత్తత తల్లిదండ్రులపై ఉంటుం దా? ఈ ప్రశ్నకి సమాధానాన్ని సుప్రీంకోర్టు రాజీవ్ భాటియా వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం మరి ఇతరులు (ఎ.ఐ.ఆర్.1999 సుప్రీంకోర్టు (3284) కేసులో చెప్పింది.
కేసు విషయాలు
తన కుమారుడు తన భర్త అన్న దగ్గర అక్రమ సంరక్షణలో ఉన్నాడని ఆ పిల్లవాడి స్వంత తల్లి రాజస్థాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ని దాఖలు చేసింది. రాజీవ్ భాటియా ఆ రిట్ పిటిషన్‌కి జవాబును దాఖలు చేశాడు. ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల చేత తనకు దత్తత ఇవ్వబడినాడని జవాబులో పేర్కొన్నాడు. ఇరుపక్షాలవాదన విన్న తరువాత ఆ పిల్లవాడిని న్యాయమూర్తుల ఛాంబర్స్‌లో ప్రవేశపెట్టారు. ఆ పిల్లవాడిని న్యాయ మూర్తులు ప్రశ్నించారు. తాను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నానన్న అభిప్రాయాన్ని ఆ పిల్లవాడు జడ్జిలకు కలుగజేశాడు. ఆ పిల్లవాడు దత్తత తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలని ఆదేశించారు. దత్తత పత్రము సరియైనదే కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేదాకా ఆ పిల్లవాడు స్వంత తల్లి దగ్గరే ఉండాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా రాజీవ్ భాటియా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ పిల్లవాడిని పరీక్షించి మాట్లాడి తన తీర్పుని ప్రకటించింది. దత్తత పత్రము చెల్లుబాటు సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్లిదగ్గరే ఉండటం సమంజసమని సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశము
రాజస్థాన్ హైకోర్టు ఈ కేసులో జారీచేసిన ఉత్తర్వులు సరైనవేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వచ్చేముందు మేము ఇరుపక్షాల వాదనలని విన్నాము. వారి ఆరోపణలని ప్రత్యారోపణలని కూడా పరిగణనలోకి తీసుకొని వాటిలోని నిజానిజాలను తెలుసుకోవడానికి ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో హాజరుపరచమని ఆ పిల్లవాడి స్వంత తల్లిని ఆదేశించాము. మా ఆదేశాలకు అనుగుణంగా ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో ఆ తల్లి ప్రవేశపెట్టింది. ఆ పిల్లవాడు చాలా చిన్నపిల్లవాడు. అతను ఎలాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చలేకపోయాడు కాని మా ప్రశ్నలకు అతని సమాధానాలని పరిశీలించిన అనంతరం అతడు స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడని అర్థవౌతుంది. అంతేకాదు దత్తత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లటానికి ఇష్టపడటంలేదన్న విషయం కూడా అర్థం అవుతుంది. దత్తత తల్లిదండ్రులు మా ఛాంబర్‌లో అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినపుడు ఈ విషయం స్పష్టమైంది. అతను వాళ్ళతో మాట్లాడకపోవడమే కాకుండా వాళ్ళు కనిపించగానే ఏడ్వడం మొదలుపెట్టాడు. రాజీవ్ భాటియా న్యాయవాది గోబర్థన్ ఈ విషయాన్ని తప్పని ఆ తల్లి చేసిన ట్యూటరింగ్ వల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా చేశాడని అతను గట్టిగా వాదించాడు. కాని మేము అతని వాదనతో ఏకీభవించడంలేదు. స్వంత తల్లి దత్తత తల్లిదండ్రులు న్యాయవాదులు లేనపుడు ఆ పిల్లవాడిని మేము మా ఛాంబర్లో ప్రశ్నించి కొన్ని సమాధానాలని రాబట్టుకున్నాము. ఆ సమాధానాల ఆధారంగా ఆ పిల్లవాడి ఆకాంక్షను మేము గమనించాము. అతను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ కారణాలవల్ల అతను స్వంత తల్లి సంరక్షణలో ఉండటం సమంజసం. అందుకని రాజస్థాన్ జారీ చేసిన ఉత్తర్వు సరియైనదేనని మేము భావిస్తున్నాము. ఆ దత్తత పత్రము చెల్లుబాటయ్యే దత్తత పత్రమా కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు
October 6th, 2010

భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తినపుడు విడాకులు తీసుకుంటారు. కొంతమంది పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటారు. ఈ విధంగా విడాకులు తీసుకున్న భార్యలకి భర్త ఆస్తుల మీద ఎలాంటి హక్కులు వుండవు. ఆమె శాశ్వత మనోవర్తి కోసం ఎలాంటి భరణం ఇవ్వనపుడు ఆమె భరణం కోరే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆస్తుల విషయంలో హక్కులు వుండవు. కొన్ని సందర్భాలలో భర్త అద్దెకు తీసుకున్న ఇంటిలో భార్య అద్దె వుంటే పరిస్థితి వుంటుంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని దరఖాస్తు చేసినపుడు ఆ ఇంటిలో ఆ భార్యకి కిరాయిదారుకు వుండే హక్కులువుంటాయా? ఆ కేసులో ఆమె అవసరమైన పార్టీ అవుతుందా? విడాకులు పొందిన స్ర్తి తన భర్త కిరాయి హక్కులను పొందే అవకాశం వుందా?

ఈ ప్రశ్నకి సమాధానం సుప్రీంకోర్టు రూమా చక్రవర్తి వర్సెస్ సుధారాణి బెనర్జీ ఇతరులు (2005 (8) సుప్రీంకోర్టు కేసెస్ 140) కేసులో సమాధానాలు చెప్పింది. మాజీ భర్త కిరాయి హక్కులలో మాజీ భార్యకు ఎలాంటి హక్కు వుండదని సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది.

కేసు విషయాలు
‘ఏ’ భార్య ఆమె వివాహం ‘బి’ భర్తతో జరిగింది. వారిద్దరిమధ్య విభేదాలు తలెత్తి చివరికి హిందూ వివాహ చట్టంలోని సె.13 బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక కిరాయి ఇంటిలో వుండేవాళ్ళు. విడాకులు మంజూరైన తరువాత భర్త వేరే ఇంటిలో కాపురం వుండటం మొదలుపెట్టాడు. భార్య తన పిల్లలతో భర్త కిరాయికు తీసుకున్న ఇంటిలో వుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ‘బి’ భర్తపైన ఇల్లు ఖాళీ చెయ్యమని దరఖాస్తు దాఖలు చేసింది. ‘బి’ తన ఇంటిని కిరాయికు తీసుకొని ఒక అపరిచితురాలికి కిరాయికు ఇచ్చిన కారణంగా ఇల్లు ఖాళీ చెయ్యాలని ఆమె తన దావాలో పేర్కొంది.
‘బి’ తన జవాబుని దాఖలు చేశాడు. తన పిల్లలు ఆ ఇంటిలో నివశిస్తున్నారని, ‘ఏ’ తన పిల్లల తల్లిగా వాళ్ళ సంరక్షకురాలిగా వుంటుందని, అంతేకానీ ఆమె కిరాయిదారు కానీ ఉప కిరాయిదారు కాదని తన జవాబులో ‘బి’ పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ఇల్లు తన స్వాధీనంలోనే వుందని తన పిల్లలు ఆ ఇంటిలో వుండే అధికారం కలిగి వున్నారని కూడా తన జవాబులో పేర్కొన్నాడు.
అతని భార్య ‘ఏ’ కూడా ఆ దావాలో ఒక దరఖాస్తుని దాఖలు చేసింది. తాను ఆ కేసులో అవసరమైన పార్టీ అని తనకు కూడా కిరాయిదారుకు వుండే హక్కులు వున్నాయని అందుకని ఆ కేసులో తనని కూడా పార్టీ చెయ్యాలని దరఖాస్తు చేసుకుంది. సివిల్ కోర్టు ఆమె దరఖాస్తుని త్రోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో దరఖాస్తుని దాఖలు చేసింది. కలకత్తా హైకోర్టు సివిల్ కోర్టు ఉత్తర్వునే సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకంగా ‘ఏ’ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
మాజీ భార్యకి మాజీ భర్త ద్వారా కిరాయి హక్కులు సంక్రమిస్తాయా? ‘ఏ’ అనే వ్యక్తి అవసరమైన పార్టీ అవుతుందా? ఇది సుప్రీంకోర్టు ముందు తలెత్తిన ప్రశ్న.
సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం.. కిరాయికి తీసుకున్న ఇల్లు తన స్వాధీనంలో ఉందని తన మాజీ భార్య తన పిల్లలకి సంరక్షకురాలిగా మాత్రమే ఆ ఇంట్లో వుంటుందని కానీ కిరాయిదారుగా ఉప కిరాయిదారుగా కాదని ‘బి’ కోర్టు ముందు వాదించాడు. మాజీ భర్త కేసుని ఎదుర్కొంటున్నాడు కాబట్టి అతని మాజీ భార్య ఈ కేసులో అవసరమైన పార్టీ కాదని ఆ ఇంటి యజమాని సుప్రీంకోర్టు ముందు వాదించింది.
సుప్రీంకోర్టు ‘ఏ’ దాఖలుచేసిన అప్పీలుని డిస్మిస్ చేస్తూ ఈ విధంగా తీర్పుని ప్రకటించింది.
*ఈ కేసులో మూల కిరాయిదారు కేసును ఎదుర్కొంటున్నాడు. మైనర్ పిల్లల ప్రయోజనాలని అతను పట్టించుకుంటున్నాడు. అందుకని అతని మాజీ భార్యకి ఈ కేసులో స్థానం లేదు. అందుకని ఆమె ఈ కేసులో అవసరమైన పార్టీ కాదు.
భర్తను వదిలిపెట్టిన భార్య స్థానం విడాకులు పొందిన భార్య స్థానం వేరువేరుగా వుంటాయి. భర్తను వదిలిపెట్టిన భార్య ఇంటిలో వుండే అవకాశం వుంటుంది. విడాకులు తీసుకున్న భార్య ఇంటిలో వుండే అవకాశం లేదు. ఎందుకంటే విడాకులు అనేవి వైవాహిక జీవితానికి ముగింపు వంటివి. నివాసంలో వుండే అధికారం విడాకుల డిక్రీ ప్రకారం వుంటుంది. ఈ కేసులో ‘ఏ’ తన మనోవర్తి హక్కుని వదులుకుంది. పిల్లల్ని పెంచే హక్కుని తీసుకుంది. ఈ కారణంగా ఆమెకు తన మాజీ భర్త ఇంటిలో వుండే అవకాశం లేదు. అందుకని దావాలో ఆమె అవసరమైన పార్టీ కాద

Tuesday, August 10, 2010

చెల్లుబాటు కాని వివాహాలు

చెల్లుబాటు కాని వివాహాలు
లా ఇలా
August 10th, 2010

చెల్లగూడని వివాహాల గురించి హిందూ వివాహ చట్టంలోని సె.12 చెబుతుంది. హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గానీ అంతకుముందుగానీ జరిగిన వివాహాల్లో ఈ క్రింది కారణాలు వున్నపుడు వాటిని రద్దుచేసుకోవచ్చు. అవి-
* నపుంసకత్వంవల్ల వివాహ లక్ష్యం నెరవేరకపోవడం
* మతిస్థిమితం లేకపోవడంవల్ల ఆమోదం తెలుపలేని పరిస్థితి లేదా తెలిసినా సంతానం కల్గించలేనటువంటి మానసిక అనారోగ్యం, తరుచూ మూర్చలు.
* మోసం ద్వారా సమ్మతిని పొందినపుడు
* వివాహ సమయంలో భార్య గర్భవతి అయినపుడు
దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం వుందని తేలినపుడు ఏమవుతుంది?
దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం వుండి దానివల్ల వివాహ లక్ష్యం నెరవేరనపుడు ఆ వివాహం చెల్లగూడని వివాహంగా ప్రకటించమని కోరవచ్చు.
శారీరక సంభోగం చెయ్యలేని అశక్తత దంపతుల్లో ఎవరికైనా వుండి, అది నివారించలేని పరిస్థితి వున్నపుడు ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు. వివాహం అయిన రోజునుంచి పిటీషన్ దాఖలుచేసేవరకు ప్రతివాదికి నపుంసకత్వం వుందని వాది రుజువు చేసినపుడే కోర్టులు ఆ వివాహాన్ని రదుచేస్తాయి.
సరైన మానసిక యోగ్యత లేకపోవడం..
వివాహ స్వభావం లేదా వివాహ విధులు బాధ్యతలని అర్ధం చేసుకోలేని పరిస్థితులలో దంపతులలోని వ్యక్తులు వుంటే వారి వివాహాన్ని కోర్టులు రద్దుచేస్తాయి.
వివాహ ఒప్పందం అర్ధం చేసుకునే యోగ్యత పార్టీకి లేనపుడు వున్నా ప్రతివాదితో ఇష్టంగా నివసించినప్పుడు ఈ ఆధారం వారికి లభించదు. ఇది మానసిక అనారోగ్యం వున్న వ్యక్తులకి వర్తిస్తుంది.
సమ్మతి ఇచ్చే వయస్సుకి తక్కువ వయస్సు ఉన్నప్పుడు..
వివాహ వయస్సుకన్నా తక్కువ వయస్సులో వున్నప్పుడు వివాహం అయితే ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు. మగపిల్లలకి 21 సంవత్సరాలు, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు వివాహ సమయానికి నిండి వుండాలి.
అయితే తక్కువ వయస్సు వున్న వ్యక్తులు, సమ్మతి ఇచ్చే వయస్సు వచ్చిన తరువాత కూడా ప్రతివాదితో సంసారిక జీవితం గడిపితే వివాహాన్ని రద్దుచేయమని కోరే అవకాశం వుండదు.
ఉదాహరణకి- ఒక అమ్మాయికి 17 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగి ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని గుర్తించింది. అయితే ఆమె 19 సంవత్సరాల వయస్సు తరువాత కూడా సంసారిక జీవనాన్ని కొనసాగించినపుడు విడాకుల రద్దును కోరడానికి అవకాశం వుండదు. వేరే కారణాలమీద కోరే అవకాశం ఉంటుంది.
మోసం, బలప్రయోగం..
మోసం ద్వారా బలప్రయోగం ద్వారా వివాహ సమ్మతిని పొందినపుడు ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరే అవకాశం వుంటుంది. నిజం చెప్పకపోవడమే మోసం కాదు. అయితే నిజం చెప్పకపోవడమనేది కూడా కొన్ని సందర్భాలలో మోసం అయ్యే అవకాశం కేసులోని వాస్తవాలను బట్టి వుంటుంది.
బలప్రయోగం అంటే శారీరక హింస కావచ్చు లేదా ఆ బెదిరింపు కూడా కావొచ్చు. అయితే అది వివాహం జరగడానికి జరిగి వుండాలి.
అయితే బలప్రయోగం, మోసం తెలిసిన సంవత్సరం తరువాత వాది ప్రతివాదితో పూర్తి సమ్మతితో కాపురం చేస్తే కోర్టులు ఆ వివాహాన్ని రద్దుచేయవు.
వివాహ సమయంలో గర్భవతి అయినపుడు..
వివాహ సమయంలో భార్య గర్భవతిగా వుండి ఆ గర్భం భర్తతో (వాది) కాకుండా ఇతరులతో అయినపుడు భర్త ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు.
ఈ విధంగా వివాహాన్ని రదుచేయమని కోరినపుడు ఈ క్రింది విషయాలను రుజువుచేయాల్సి వుంటుంది.
అవి-
* వివాహ సమయానికే ఆమె గర్భవతని,
* ఇతరులవల్ల ఆమె గర్భం దాల్చిందని
* వివాహ సమయంలో ఆమె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని
* వివాహం జరిగిన సంవత్సరంలోగా తాను దరఖాస్తు చేశానని,
* ఇతరులతో గర్భం దాల్చిందన్న విషయం తెలిసిన తరువాత తన భార్యతో తాను సంభోగం చేయలేదని
ఇతరులవల్ల తన భార్య గర్భవతి అయ్యిందన్న సంగతి వివాహ సమయంలో తనకు తెలియదని, వివాహం జరిగిన సంవత్సరంలోపు దరఖాస్తు చేసినపుడు మాత్రమే కోర్టులు వాటిని పరిష్కరిస్తాయి. ఆ తరువాత దాఖలు చేసినపుడు వాటిని పరిశీలించవు.
ఇతరులవల్ల గర్భవతి అయ్యిందన్న సంగతి తెలిసిన తరువాత వాది తన పూర్తి సమ్మతితో తన భార్యతో సంభోగం జరుపలేదని కోర్టుకి సంతృప్తి కలిగినప్పుడే ఈ దరఖాస్తులను ఆమోదిస్తాయి.

Monday, August 9, 2010

చెల్లని వివాహాలు

చెల్లని వివాహాలు
- మంగారి రాజేందర్
August 3rd, 2010

వివాహం వుండటంవల్ల ఒక సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది. వివాహం ద్వారా జన్మించిన సంతానానికి ఆస్తిలో హక్కులు లభిస్తాయి. సమాజంలో ఓ హోదా కూడా లభిస్తుంది. హిందూ వివాహాలు ఒప్పందం లాంటివి కాదు. అవి పవిత్రమైనవి. అయినా కూడా ఈ రోజుల్లో చెదిరిపోతున్న వివాహాల సంఖ్య పెరిగిపోతుంది. విడాకులు కోరుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. వివాహాలు నిష్ఫలం అవడం అనేది మూడు రకాలుగా వుంటుంది.
విడాకులు
- ఉభయుల సమ్మతితో విడాకులు
- ఎదుటివారి వివాహ తప్పుతో విడాకులు
* చెల్లని వివాహాలు
* చెల్లగూడని వివాహాలు
ఈ వివాహాల రద్దుకోసం పార్టీలలో విడాకులనేది ఎదుటివారి వివాహ తప్పిదంవల్ల ఇవ్వడం జరుగుతుంది. వివాహం రద్దుకావడం అనేది రకరకాల కారణాలవల్ల జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు వున్నపుడు వివాహం రద్దుకావడం అనేది జరుగుతుంది.
వివాహం రద్దుకావడం అంటే ఏమిటి?
చెల్లగూడని వివాహాలను రద్దుచేయడాన్ని వివాహ రద్దుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రారంభం నుండే వివాహం చెల్లనపుడు అది దానంతదానిగా రద్దు అవుతుంది. అయితే దానికి కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాల్సి వుంటుంది. కొన్ని శాసనపరమైన ఆవశ్యకతలను అవలంభించనపుడు మాత్రమే వివాహాన్ని రద్దుచేస్తారు. దంపతుల్లోని మరో వ్యక్తి జీవించి వున్నపుడే రెండో వివాహం చేసుకున్నపుడు, వివాహానికి అవసరమైన కనీస వయస్సు లేనప్పుడు వివాహాన్ని సులువుగా రద్దుచేస్తారు. మిగతా సందర్భాలలో కూడా రద్దుచేస్తారు కానీ అది అంత సులువు కాదు. వివాహానికి అవసరమైన షరతులని పాటించకపోతే దాన్ని రద్దుచేస్తారు. అది చట్టం దృష్టిలో వివాహమే కాదు. జరిగిన వివాహాన్ని రద్దుచేయడాన్ని విడాకులని అంటాం. రద్దుచేయడం అంటే వివాహాన్ని గుర్తించకపోవడమే. అంటే గతంలో కూడా వారి మధ్య వివాహం వుందని గుర్తించకపోవడమే వివాహ రద్దు.
వివాహం రద్దు ఎప్పుడు చేస్తారు?
ఈ క్రింది కారణాలు వున్నపుడు వివాహాన్ని రద్దుచేస్తారు. అవి-
* దంపతుల్లోని ఒకరు ప్రశ్నార్థకంలో వున్న వివాహానికి ముందే వివాహం చేసుకోవడం
* వివాహం చేసుకోవడానికి అవసరమైన వయస్సు రానపుడు
* వివాహ సమయంలో మానసిక వైకల్యంతో దంపతుల్లోని ఒక వ్యక్తి వున్నపుడు
* సమ్మతిని మోసం వల్ల బలవంతంవల్ల పొందినప్పుడు
* వివాహ సమయంలో శారీరక అనారోగ్యంవల్ల దాంపత్య జీవనానికి అనర్హులుగా వున్న వ్యక్తి వివాహం చేసుకున్నపుడు
* దంపతుల మధ్య నిషేధించబడిన బంధుత్వం వున్నపుడు దానికి ఆచార వ్యవహారాలు అనుమతి లేనపుడు
* జీవిత ఖైదు శిక్ష పడిన వ్యక్తులు వివాహం చేసుకున్నపుడు
* మత్తు పదార్థాలకి బానిసైన విషయం, నేర చరిత్ర లాంటి విషయాలని మరుగుపరిచి వివాహం చేసుకున్నపుడు;
వివాహానికి అవసరమైన షరతులేమిటీ?
హిందూ వివాహాలు జరిపించడానికి కొన్ని షరతులు వున్నాయి. ఆ షరతులు వున్నప్పుడే ఇద్దరు హిందువుల మధ్య వివాహం జరిపించాలి. అవి-
* వివాహం చేసుకునే వధూవరులకి వివాహ సమయానికి అంతకు పూర్వం వివాహం అయివుంటే ఆ భర్త కానీ భార్య గానీ జీవించి వుండకూడదు.
* వివాహ సమయంలో వధూవరులిద్దరిలో ఎవరైనా మతి స్థిమితం కోల్పోయిన కారణంగా వివాహానికి ఆమోదం తెలుపలేని పరిస్థితిలో వుండరాదు.
* ఒకవేళ వివాహానికి తమ ఆమోదం తెలిపే పరిస్థితి వున్నప్పటికీ సంతానాన్ని కల్గించలేనటువంటి మానసిక అనారోగ్యం వుండకూడదు.
* వారిద్దరిలో ఎవరికైనా తరచూ ఉన్మాదంగానీ మూర్చలుగానీ వచ్చి బాధపడుతూ వుండరాదు.
* వివాహ సమయంలో వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి వుండాలి.
* ఆచార వ్యవహారాలు అనుమతించినపుడు తప్ప వధూవరుల మధ్య నిషేధించబడిన బంధుత్వం వుండరాదు.
* ఆచార వ్యవహారాలు అనుమతించినపుడు తప్ప వధూవరులిద్దరూ సఫిండులు కారాదు.
చెల్లని వివాహాలు
శాసనం నిషేధించినపుడు జరిగిన వివాహాలు వాటంతట అవే చెల్లకుండా పోతాయి. వీటినే చెల్లని వివాహాలని అంటాం. హిందూ వివాహ చట్టంలోని సె.11 వీటి గురించి చెబుతుంది.
హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత చట్టంలోని సె.5(1)(జ్ప)(్ప)లో ఏర్పరిచిన షరతులకి విరుద్ధంగా వివాహాలు జరిపించినపుడు ఆ వివాహాలు చెల్లవు. ఈ షరతులకి విరుద్ధంగా వివాహం జరిగినపుడు దంపతుల్లో ఎవరైనా పిటీషన్ దాఖలు చేసి తమ వివాహాలని రద్దుపరచుకోవచ్చు. అంటే వివాహ సమయంలో వధూవరులలో ఏ ఒక్కరైనా వివాహం అయి వుండి వారి భర్తగానీ, భార్యగానీ బతికి వున్నపుడు, వారిమధ్య ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా నిషేధించబడిన బంధుత్వం వున్నపుడు, ఆచార వ్యవహారాలు అనుమతించని సఫిండ బంధుత్వం వున

Tuesday, July 20, 2010

భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ భార్య విడాకులు కోరవచ్చు!

భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ
భార్య విడాకులు కోరవచ్చు!
July 20th, 2010

హిందూ వివాహ చట్టప్రకారం అమెరికాలోగానీ ఇతర విదేశాల్లోగాని జరిగిన వివాహాన్ని రద్దుచేయమని భారతదేశంలోని కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చా?
ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో నిసించడం అక్కడే వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. మనవాళ్లు విదేశాల్లో వివాహాలు చేసుకుంటున్నప్పటికీ మన పద్ధతుల ప్రకారమే వివాహాలు చేసుకుంటున్నారు. అలాంటి వివాహం జరిగిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు హిందూ వివాహ చట్టంలోని సె.13 ప్రకారం విడాకుల దరఖాస్తుని భారతదేశంలో దాఖలు చేసుకోవచ్చు. భార్యా భర్తలో ఒకరు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఈ దరఖాస్తుని భారతదేశంలో వేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్యే ఒకటి మద్రాసు హైకోర్టు ముందుకు ఇటీవల వచ్చింది.
ఆర్.సుకన్య సినీనటి. ఆమె భర్త ఆర్.శ్రీ్ధరన్. అతను అమెరికా దేశ పౌరుడు. వారిద్దరి వివాహం ఏప్రియల్ 2002 రోజున హిందూ ఉత్సవాల ప్రకారం అమెరికా దేశంలోని న్యూజెర్సీలోని బాలాజీ దేవాలయంలో జరిగింది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది. సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 2004 సంవత్సరంలో విడాకులకోసం మద్రాసులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. కోర్టునుంచి నోటీసు అందుకుని కోర్టుముందు హాజరు కాకపోవడంవల్ల కుటుంబ న్యాయస్థానం ఏకపక్షంగా సుకన్య పక్షాన విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
కొంతకాలం తరువాత శ్రీ్ధరన్ కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసి ఏకపక్షంగా మంజూరు చేసిన విడాకులను రద్దుచేయించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఈ కేసు విచారణ చేపట్టడానికి కుటుంబ న్యాయస్థానానికి అధికార పరిధి లేదని మద్రాసు హైకోర్టులో మరో దరఖాస్తుని దాఖలు చేశాడు. తమ వివాహం అమెరికాలో జరిగిందని అందుకని భారతదేశంలోని కోర్టుకి అధికార పరిధి లేదని అతని వాదన.
మద్రాసు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. అతని దరఖాస్తును కొట్టివేసింది. కుటుంబ న్యాయస్థానం సుకన్య దాఖలుచేసిన దరఖాస్తుని రెండు మాసాల్లో పరిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఈ కారణాలతో అతని దరఖాస్తుని కొట్టివేసింది.
గతంలో హిందూ వివాహ చట్ట ప్రకారం దాఖలు చేసుకోవాల్సిన దరఖాస్తుని వారి వివాహం ఏ కోర్టు అధికార పరిధిలో జరిందో అక్కడ లేదా దరఖాస్తు దాఖలు చేసే సమయానికి ప్రతివాది ఎక్కడ నివశిస్తున్నాడో ఆ కోర్టు పరిధిలో లేదా పార్టీలిద్దరు కలిసి చివరిసారి ఎక్కడ నివశించారో ఆ కోర్టు పరిధిలో మాత్రమే విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నిబంధనవల్ల చాలా ఇబ్బందులు వున్నాయని గమనించి శాసనకర్తలు హిందూ వివాహ చట్టంలోని సె.19కి సవరణలు తీసుకునివచ్చారు. వివాహాల (సవరణల) చట్టం, 2003 ద్వారా ఈ నిబంధనకి సవరణలు తీసుకునివచ్చాయి. కొత్త నిబంధనని సె.19 (జజజఎ)ని చట్టంలో పొందుపరిచారు.
ఈ నిబంధన ప్రకారం- భార్య ప్రతివాది అయినపుడు, ఆమె ఈ చట్టప్రకారం దరఖాస్తు చేసే సమయానికి ఏ కోర్టు అధికార పరిధిలో నివశిస్తుందో ఆ కోర్టులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన 23.12.2003 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకని సుకన్య మద్రాసులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసుకోవడం సమంజసమేనని, చట్టబద్ధమేనని కోర్టు పేర్కొంది.
సుకన్య, శ్రీ్ధరన్‌ల వివాహం హిందూ వివాహ చట్టప్రకారం జరిగింది. ఆమె విడాకుల దరఖాస్తుని హిందూ వివాహ చట్టప్రకారం దాఖలు చేసింది. ఈ సందర్భంలో తమ వివాహం అమెరికాలో జరిగిందని, తాను అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నానని అతను వాదించడంలో ఎలాంటి పస లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ కారణాలతో ఈ కోర్టు పరిధినుంచి అతను మినహాయింపు కోరలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
సవరణలు తీసుకరావడానికన్నా ముందు వున్న నిబంధనవల్ల మహిళలు చాలా ఇబ్బందులకి, అసౌకర్యానికి లోనయ్యేవారు. ఆ క్లిష్టమైన నిబంధనవల్ల వారి వివాహం ఎక్కడ జరిగిందో ఆ కోర్టులో లేక చివరిసారి వారిద్దరూ కలిసి ఎక్కడ నివశించినారో అక్కడ తమ దరఖాస్తులని దాఖలు చేసుకునేవాళ్లు. ఆ నిబంధన అనుచితంగా వుందని భావించి సె.19కి సవరణలు తీసుకొనివచ్చారు.
వివాహం విదేశాల్లో జరిగినా భారతదేశంలోని కోర్టుల్లో విడాకులకోసం స్ర్తిలు దరఖాస్తులని దాఖలు చేసుకోవచ్చు. అయితే వారి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగి ఉండాలి. ఇదే మద్రాసు కోర్టు తీర్పులోని సారాంశం.
*

Tuesday, July 6, 2010

రేప్ నేర నిరూపణ

రేప్ నేర నిరూపణ

July 6th, 2010

రేప్ అనేది తీవ్రమైన నేరం. ఈ నేరం నిరూపించాలంటే ముద్దాయి బాధితురాలి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా శారీరక సంభోగం జరిపాడని, ఎలాంటి అనుమానానికి తావు లేకుండా రుజువు చేయాల్సి వుంటుంది.
రేప్ జరిగిందని అనడానికి ఏ మాత్రం అంగ ప్రవేశం వున్నా అది రేప్ కిందే లెక్క. ఎంతవరకు జరిగిందనే విషయంతో సంబంధం లేదు. రేప్ కేసులో కనె్నపొర చిరిగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే వీర్యస్కలనం జరిగి వుండాల్సిన అవసరం లేదు. అంగప్రవేశం ఏ మాత్రం లేనప్పుడు అది రేప్‌గా పరిగణింపబడదు. అప్పుడు అది రేప్ చేయడానికి చేసిన ప్రయత్నంగా భావించొచ్చు.
వయస్సు గురించి భావన ఏమిటి?
భారతీయ శిక్షాస్మృతిలోని నెం.10లో స్ర్తి పురుషుడు అర్థాలని నిర్వచించారు. స్ర్తి అన్నప్పుడు ఏ వయస్సులో వున్న స్ర్తి అయినా అని అర్ధం. అంటే పసిపాపను కూడా ‘స్ర్తి’ అనే పిలుస్తారు. 90 ఏళ్ళ ముసలావిడను కూడా ‘స్ర్తి’ అనే పిలుస్తారు.
అలాగే ‘పురుషుడు’ అన్నప్పుడూ ఏ వయస్సులో వున్న పురుషుడైనా అని అర్ధం. మగవాడు, స్ర్తి అన్నప్పుడు వయస్సుతో నిమిత్తం లేదు.
ఇంగ్లీషు ‘లా’కి
మన ‘లా’కి భేదమేమిటి?
14 సంవత్సరాలలోపు వున్న వ్యక్తులు రేప్ చేయలేరన్న చట్టబద్ధమైన భావన ఇంగ్లీషు ‘లా’లో ఉంది. కానీ మన చట్టాల్లో అలాంటి భావన లేదు.
భారతీయ శిక్షాస్మృతిలోని సె.82 ఏడు సంవత్సరాలలోపు పిల్లలకి పూర్తి రక్షణని ఇస్తుంది. ఏడు సంవత్సరాలలోపు పిల్లలు ఏది చేసినా అది నేరంగా పరిగణించడానికి వీల్లేదు. సె.83లో మాత్రం ఒక్క షరతు వుంది. ఇది 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలలోపు వున్న పిల్లలకు వర్తిస్తుంది. తాను చేసిన చర్య స్వభావం, దాని ఫలితాలను అర్ధం చేసుకునే అతని మానసిక స్థితిని బట్టి వుంటుంది. అతను వాటిని సరిగ్గా అర్ధం చేసుకునే స్థితిలో లేనప్పుడు అది నేరం కాదు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఎలాంటి రక్షణ లేదు. కేసు యోగ్యతను బట్టి కేసు నిర్ణయించాల్సి వుంటుంది.
నేర నిరూపణ జరగాలంటే ప్రాసిక్యూషన్ ఏమి రుజువు చేయాల్సి వుంటుంది?
ముద్దాయికి శిక్ష పడాలంటే ప్రాసిక్యూషన్ ఈ విషయాలని రుజువు చేయాల్సి వుంటుంది.
* లైంగిక సంభోగం స్ర్తి పురుషునికి మధ్య జరిగి వుండాలి.
* ఆ సంభోగం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లేక ఆమె సమ్మతి లేకుండా జరిగిందని రుజువు చేయాలి.
* ఒకవేళ సమ్మతి ఇచ్చినట్లయితే ఆ సమ్మతి సె.375లో పేర్కొన్న సమ్మతై వుండాలి.
చట్టప్రకారం రేప్ అంటే ఏమిటి?
భారతీయ శిక్షాస్మృతిలోని సె.375 రేప్‌ని నిర్వచించింది. ఈ నిర్వచనం ప్రకారం ఎవరైనా స్ర్తిపై పురుషుడు జరిపే శారీరక సంభోగం. ఈ కింది ఆరు కారణాల్లో ఏదైనా వున్నప్పుడు దాన్ని రేప్ అంటారు. అవి-
1. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా.
2. ఆమె సమ్మతి లేకుండా.
3. ఆమెను గానీ, ఆమె ఆత్మీయులుగానీ గాయపరుస్తారనో చంపుతాననో బెదిరించి ఆమె సమ్మతి పొందినపుడు.
4. మతిస్థిమితం లేనప్పుడు, నిషాలో వున్నప్పుడు, తన అంగీకారం వల్ల జరగబోయే పరిణామాలు, ప్రభావాలు అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఆమె సమ్మతి పొందినపుడు.
6. పదహారేళ్ళలోపు వయసు వున్నప్పుడు, ఆమె సమ్మతి వున్నప్పటికీ, లేనప్పటికీ.
ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అంటే...
రేప్‌వల్ల జరిగే పరిణామాలు ప్రభావాలు తెలిసి అర్ధం చేసికొని వ్యతిరేకత చూపించినప్పటికీ రేప్ ఆమెపై జరిగినప్పుడు, ఆ చర్య ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా భావిస్తారు. రేప్ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు, ఆ చర్యకి ఆమె సమ్మతి లేదనే అర్ధం. కానీ రేప్ ఆమె సమ్మతి లేకుండా జరిగినప్పుడు అది తప్పనిసరిగా ఆమె ఇష్టానికి జరిగిందని అనడానికి వీల్లేదు.
ఇష్టానికి వ్యతిరేకంగా, సమ్మతి లేకుండా అనేవి రెండూ కూడా మెదడుకు సంబంధించిన చర్యలు. ఇష్టమనేది చాలా కఠినమైన పదం. ఏదైనా చర్య చేయాలన్నా వద్దన్నా గట్టి నిశ్చయం వుంటుంది. కానీ సమ్మతి అనేది ఉదాసీన వైఖరి. దీనికి క్రియాశీలకమైన వ్యతిరేకత వుండదు.
ఈ రెండు నిబంధనలు ఒకదానిమీద ఒకటి ఓవర్ లాప్ కావు. స్పృహలో వుండి తన మనసుమీద శరీరం మీద పూర్తి స్వేచ్ఛ వుండి ఇచ్చే చర్య ఇష్టం. కానీ సమ్మతి అనేది దీనికి పూర్తిగా వి

Wednesday, June 30, 2010

మానభంగ యత్నం అంటే..!?
June 29th, 2010

హత్యాప్రయత్నం గురించి, ఆత్మహత్యా ప్రయత్నం గురించి, దోపిడీ యత్నం గురించి భారతీయ శిక్షాస్మృతిలో ప్రత్యేకమైన నిబంధనలు వున్నాయి. వాటికి శిక్షలు కూడా వున్నాయి. కానీ మానభంగ యత్నం గురించి ప్రత్యేకమైన నిబంధన ఏదీ లేదు. ఎవరైనా వ్యక్తి మానభంగయత్నం గురించి -ఉద్దేశపూర్వకంగా తయారై నేరం చేయడానికి ప్రయత్నం చేసినపుడు దాన్ని మానభంగ యత్నం అంటారు.
ప్రయత్నం అనేది కేసునిబట్టి, ఆ కేసులోని పరిస్థితిని బట్టి మారుతూ వుంటుంది. ప్రయత్నం (ఎట్టంప్ట్)కి, తయారుకి (ప్రెపరేషన్) బేధం వుంది. ఎప్పుడైతే తయారై అనేది అంతం అవుతుందో అక్కడ ప్రయత్నం మొదలవుతుంది.
నేరం చేయడంలో నాలుగు దశలు వుంటాయి. అవి
* ఉద్దేశం
* తయారు
* ప్రయత్నం
* సఫలం
నేరం చెయ్యాలన్న తలంపు రావడమే ఉద్దేశ్యం. ఆ నేరం చేయడానికి తయారు కావడమనేది రెండవ దశ. ఆ నేరం చేయడానికి ఉద్రిక్తమై ప్రయత్నం చేయడం మూడో దశ. ఆ ప్రయత్నం సఫలమైతే నేరం పూర్తవుతుంది.
రేప్ నేరంలో, మానభంగ యత్నం నేరంలో మహిళల గౌరవ మర్యాదలపై దాడి వుంటుంది. ఎవరైనా స్ర్తిని దౌర్జన్యంగా చేయిపట్టుకుని కౌగిలించుకోవడానికి లాగినప్పుడు, బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకా ఏవైనా అగౌరవ చర్యలకి పాల్పడినప్పుడు అది గౌరవ మర్యాదలకి భంగం కలిగించినట్టవుతుంది. స్ర్తి గౌరవం సెక్స్‌తో ముడిపడి వుంటుంది. ఇలాంటి చర్యలు భారతీయ శిక్షాస్మృతిలోని సె.354 ప్రకారం నేరకృతము.
ఒకవేళ మహిళ గుడ్డలు ఊడదీసి నేలమీద పడేసి ఆ వ్యక్తిపై పడుకుని శారీరక సంభోగానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు అతను మానభంగ యత్నం నేరం చేసినవాడవుతాడు. అతను భారతీయ శిక్షాస్మృతిలోని సె.376 రెడ్‌విత్ 511 ప్రకారం శిక్షార్హుడవుతాడు. రేప్ నేరానికి వున్న శిక్షే, మానభంగ యత్నానికి ఉంటుంది.
మదన్‌లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్తాన్ (1986 ఆర్.ఎల్.డబ్ల్యు 377) కేసులో ముద్దాయి -అమ్మాయి సల్వార్ కమీజు తీసివేసి తన పైజామా కూడా తీసివేసి కిందపడేసాడు. ఆ తరువాత ఆమె అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. శారీరక సంభోగం కోసం ఆమెపై పడుకున్నాడు. అటువైపు వచ్చిన కొంతమంది అతన్ని లాగివేసారు. వాళ్లు రానట్టయితే అతను ఆమెను మానభంగానికి గురిచేసేవాడే. ఇది మానభంగ యత్ననేరం.
కౌగలించుకోవాలని మహిళలని చేయిపట్టుకుని లాగితే అది సె.354 ప్రకారం నేరం. ఇంకా కాస్త ముందుకు వెళ్లి బట్టలు విప్పదీసి మానభంగం చేయడానికి ప్రయత్నించి విఫలమైతే అది సె.376 ఆర్/డబ్ల్యు 511 ప్రకారం నేరం. మానభంగం చేయడంలో సఫలం అయతే, అది మానభంగం. ఆ వ్యక్తి సె.376 ప్రకారం శిక్షార్హుడవుతాడు.
శారీరక సంభోగం జరపాలన్న దృఢ నిశ్చయం వుండి విఫలమైనప్పుడు అది మానభంగ యత్నం అవుతుంది. ఖచ్చితమైన దృఢ నిశ్చయం లేనప్పుడు గౌరవ మర్యాదలపై దాడి అవుతుంది.
చేయి పట్టుకోకుండా రోడ్డుమీదున్న మహిళను ఉద్దేశించి కారుకూతలు కూసినా, సైగలు చేసినా, పాటలు పాడినా అది స్ర్తిని అవమానించడమే అవుతుంది. అలాంటి వ్యక్తులు సె.509 ప్రకారం శిక్షార్హులవుతారు. ప్రేమ లేఖలు రాయడం కూడా సె.509 ఐపిసి ప్రకారం నేరమవుతుంది

Tuesday, June 22, 2010

కామోద్రేకం కారణంగా చూపి శిక్ష తగ్గించవచ్చా?

కామోద్రేకం కారణంగా చూపి
శిక్ష తగ్గించవచ్చా?
June 22nd, 2010

బాధితురాలు హోస్కోట్‌లోని ఓ క్లినిక్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. బెంగళూరు నుంచి హాసన్ వెళ్తున్నప్పుడు ఇద్దరు ప్రయాణీకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణంలో పరిచయం స్నేహంగా మారింది. ఆమె వెళ్లాల్సిన ఊరుకి సరైన సమయంలో వెళ్లడానికి సహకరిస్తామని వాళ్లు ఆమెకు చెప్పారు. వాళ్లు ఆమెను భోజనానికని రెస్టారెంట్‌కి, తరువాత బి.జి.కె లాడ్జికి తీసుకొని వెళ్ళారు. వాళ్లు ముగ్గురూ లాడ్జిలో ఉన్నారు. లాడ్జీ ప్రక్కన రూంలో డ్యూటీకి వచ్చిన గోశాల అనే కానిస్టేబుల్ ఉన్నాడు. బాధితురాలు మంచం మీద పడుకుంది. ఇద్దరు (ముద్దాయిలు) క్రింద పడుకున్నారు. కొంతసమయం గడిచాక రూంలోని లైట్లు ఆరిపోయాయి. క్రిష్ణ (ముద్దాయి నెం.2) వచ్చి ఆమె ప్రక్కన పడుకున్నాడు. క్రింద దోమలు కుడుతున్నాయని చెప్పాడు. ఆమె అభ్యంతరాన్ని తెలియచేసింది. కొద్దిగా అరిచింది. రాజు (ముద్దాయి 1) లేచి కర్చీప్‌తో ఆమె నోటిని మూసివేశాడు. అరవొద్దని బెదిరించాడు. తరువాత క్రిష్ణని బయటకు పంపించి రూం గొళ్ళెం పెట్టాడు. ఆమె వ్యతిరేకతని లెక్కచేయకుండా శారీరక సంభోగం కావాలని కోరాడు. వివాహం చేసుకుంటే తప్ప అలాంటి అవకాశం లేదని ఆమె చెప్పింది. అప్పుడే తలుపుని రెండవ ముద్దాయి తట్టాడు. తలుపు తీసిన తరువాత అతను లోనికి వచ్చాడు. మొదటి ముద్దాయి బయటకు వెళ్లిపోయాడు. రెండవ ముద్దాయి కత్తితో ఆమెను బెదిరించి ఆమె నోరు మూసి ఆమెను మానభంగం చేశాడు. కాసేపటికి ఆమె నోరు పెగిలించుకొని అరిచింది. రూం బాయ్, ఇంకా కొంతమంది అరుపులు విని తలుపుని తట్టారు. బట్టలు వేసుకొని మొదటి ముద్దాయి తలుపు తీశాడు. జరిగిన విషయం లోనికి వచ్చిన వ్యక్తులకి, కానిస్టేబుల్ గోపాల్‌కి ఆమె చెప్పింది. హాసన్ పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షలకి పంపించారు. ఆమెపై శారీరక సంభోగం జరిగిందని, కనె్నపొర ఇటీవలనే చెదిరిందని ఆమె రహస్య అవయవాల మీద గాయాలు వున్నాయని వైద్య పరీక్షల్లో తేలింది.
కేసుని విచారించిన సెషన్స్ జడ్జి రేప్ నేరం మొదటి ముద్దాయి చేశాడని నిర్దారించాడు. రెండవ ముద్దాయి నేరం చేశాడని ఎలాంటి అనుమానానికి తావు లేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, రెండవ ముద్దాయిపై కేసుని కొట్టివేశాడు. ముద్దాయి యుక్తవయస్సుని దృష్టిలో పెట్టుకొని, బాధితురాలు ఆ రూంలో స్వచ్ఛందంగా వచ్చి వుందని, రేప్ కూడా క్షణికమైన కామోద్రేకంలో జరిగిందన్న కారణాలవల్ల మొదటి ముద్దాయికి కూడా సెషన్స్ జడ్జి అతి తక్కువ శిక్ష అంటే కోర్టు అయిపోయేంతవరకు శిక్ష మరియు రూ.500ల జరిమానాని విధించారు.
ఈ తీర్పుకి వ్యతిరేకంగా ‘స్టేట్’ అప్పీలుని వేసింది. అప్పీలుని విచారించిన హైకోర్టు రేప్ నేరం ఇద్దరు ముద్దాయిలు చేశారని రుజువైందని, మొదటి ముద్దాయికి శిక్షను హెచ్చించింది. రెండవ ముద్దాయికి శిక్షను విధించింది. ఇద్దరికీ ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షని హైకోర్టు విధించింది.
ముద్దాయి సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు. సుప్రీంకోర్టు రేప్ నేరాన్ని ముద్దాయిలు ఇద్దరూ చేశారని నిర్ధారించింది. కానీ శిక్ష విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించింది. బాధితురాలు ఆమె ఊరు చేరడానికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యమే ముద్దాయిలిద్దరికీ మొదట వుందని, తరువాత ఒకే రూంలో వుండంవల్ల వాళ్ళు కామోద్రేకానికి గురై నేరం చేశారని సుప్రీంకోర్ట వ్యాఖ్యానించింది. ఈ కారణాలవల్ల సుప్రీంకోర్టు శిక్షను ముద్దాయిలకు తగ్గిస్తున్నామని చెప్పింది.
* ముద్దాయిలు చాలా చిన్న వయస్సులో వున్నారని
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడలేక, డీసెన్సీనీ, నైతిక విలువల్ని కోల్పోయి, రేప్ నేరం చేశారని
* రేప్ నేరం చాలా రోజుల క్రితం జరిగిందని ఈ కాలంలో ముద్దాయిలు తీవ్రమైన మానసిక వేధనకి గురైనారని, వాళ్ళ ప్రతిష్టకు కూడా భంగం కలిగిందని
ఈ కారణాలవల్ల తక్కువ శిక్ష విధించడం వల్ల న్యాయం చేకూరుతుందని భావిస్తూ సుప్రీంకోర్టు ముద్దాయిలకి మూడు సంవత్సరాల శిక్షని విధించింది. (రాజు, క్రిష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏ.ఐ.ఆర్. 1994 సుప్రీంకోర్టు 222=1994 క్రిమినల్ లా జనరల్ 248)
ఈ శిక్షని తగ్గించడం విషయంలో మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరాలని లేవనెత్తి ఆందోళనలు చేశాయి. వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు -
* నేరం జరిగేటప్పుడు ముద్దాయిల వయస్సు 24 మరియు 21 సంవత్సరాలు. అంటే వాళ్లు చేస్తున్న చర్య ఫలితాలు వాళ్లకి తెలుసు. అందుకని వాళ్లకి జువెనైల్ జస్టిస్ చట్టం వర్తించదు. అదే విధంగా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం కూడా వర్తించదు.
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడ లేకపోయ్యారనడానికి గల కారణాలు వివరించలేదు.
* రేప్ నేరం చాలా సంవత్సరాల క్రితం జరిగిందని, ఈ కాలంలో ముద్దాయి తీవ్రమైన మానసిక వేదనకి గురైనారని వాళ్ల ప్రతిష్టకి భంగం కలిగిందని సుప్రీంకోర్టు శిక్షను తగ్గించింది కానీ ఈ జాప్యానికి కారణం బాధితురాలు కాదు. అదేవిధంగా ఈ పదిహేను సంవత్సరాల్లో బాధితురాలు ఎంతటి మనోవేదనకి మానసిక సంఘర్షణకి గురైందో సుప్రీంకోర్టు శిక్ష తగ్గించేప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు.
శిక్షను తగ్గించడానికి సరైన ప్రత్యేకమైన కారణాలు వుండాలి. వాటిని చట్టం నిర్వచించలేదు. *

Wednesday, June 9, 2010

సె.498ఎ’లో రాజీపడవచ్చా?

సె.498ఎ’లో రాజీపడవచ్చా?
- మంగారి రాజేందర్
June 8th, 2010

భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత భార్యలు పెట్టే కేసు 498ఎ. భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం ఈ కేసులని దాఖలు చేస్తుంటారు. భార్యని భర్తగాని అతని బంధువులు గానీ శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ నిబంధన ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది.కొన్ని సందర్భాలలో స్ర్తిలు అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తారు. ఆ స్ర్తిలు వివాహితులై ఏడు సంవత్సరాలలో మరణించి, మరణానికి ముందు వరకట్నం కోసం వేధింపులు వుంటే అది సె.304 బి ప్రకారం నేరమవుతుంది. అదేవిధంగా వివాహిత ఆత్మహత్య చేసుకునే విధంగా భర్తగానీ అతని బంధువులు ప్రవర్తిస్తే వాళ్ళపై భారతీయ శిక్షాస్మతిలోని సె.306 ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది. అదేవిధంగా కొట్టినప్పుడు కూడా భారతీయ శిక్షాస్మృతిలోని సె.324 ప్రకారం కేసులు పెట్టే అవకాశం వుంది. కొన్ని సందర్భాలలో కేసు విచారణలో వుండగా భార్యాభర్తలు రాజీపడాలని అనుకుంటారు. ఇలాంటి సందర్భాలలో భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం దాఖలు చేసిన కేసుని రాజీపడటానికి అవకాశం వుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ వుంటే ఏ దశలో రాజీ చేసుకోవచ్చు. రాజీపడటం అంటే ఏమిటి? రాజీపడదగ్గ నేరాలు అంటే ఏమిటి?
కేసులో మూడు రకాలు-
* కాగ్నిజబుల్ - నాన్ కాగ్నిజబుల్
* బెయిలబుల్ -నాన్ బెయిలబుల్
* రాజీపడే నేరాలు - రాజీపడటానికి అవకాశం వున్న నేరాలు
రాజీ పడే నేరాలు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.320లో ఓ పట్టికను ఇచ్చి అందులో కోర్టు అనుమతితో, కోర్టు అనుమతి లేకుండా రాజీపడే నేరాలని వర్గీకరించారు. ఈ పట్టికలో సూచించిన నేరాలు మాత్రమే రాజీపడటానికి వీలున్న నేరాలు. భారతీయ శిక్షాస్మృతిలోని నేరాలుని మాత్రమే ఈ పట్టికల్లో పొందుపరిచారు. భారతీయ శిక్షాస్మృతి అనేది ప్రభావ శాసనంగా తయారుచేశారు కాబట్టి అందులోని నేరాలు మాత్రమే ఇందులో వుండేవి. అయితే ఆ తరువాత చాలా చట్టాలు వచ్చాయి. వాటిని ఈ పట్టికలో పొందుపరచటం సాధ్యంకాదు. అందుకని వాటి గురించి వేరుగా ఆయా చట్టాల్లోనే అవి రాజీపడటానికి వీలున్న నేరాలా? కాదా అన్న విషయాలని పేర్కొంటారు. భారతీయ శిక్షాస్మృతిలో చేర్చిన నిబంధన సె.498ఎ. ఈ నిబంధన రాజీపడటానికి వీల్లేని నేరం. అయితే ఈ విధంగా వుంచడంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కలిసి జీవించాలని అనుకునే భార్యాభర్తలకి ఆటంకాలు ఏర్పడుతున్నాయని శాసనకర్తలు భావించి మన రాష్ట్రంలో దీన్ని రాజీపడటానికి వీలున్న నేరంగా సె.320కి మార్పులు చేసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ చట్టం 11/2003 ద్వారా ఈ మార్పులు తీసుకొని వచ్చారు. 1.8.2003 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే ఒక షరతుని విధించారు. రాజీ దరఖాస్తు చేసుకున్న తేదీనే ఈ నేరాన్ని రాజీపడటానికి అవకాశం వుండదు. రాజీపడటానికి దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి మూడు నెలలు దాటిన తరువాతనే ఈ నేరాన్ని రాజీ చేసుకోవచ్చు. అయితే ఈమధ్యకాలంలో రాజీచేసుకునే పార్టీలలో ఎవరూ కూడా దరఖాస్తుని ఉపసంహరించుకోకుండా వుండాలి.
రాజీ ఏ విధంగా చేసుకుంటారు?
* రాజీ కోసం ప్రయత్నాలు కోర్టు వెలుపల జరుగవచ్చు, కోర్టులో జరుగవచ్చు.
* కోర్టు అనుమతితో రాజీ చేసుకునే నేరాలని వెంటనే రాజీచేసుకోవడానికి అవకాశం వుండదు. కోర్టు అనుమతి తీసుకున్న తరువాతనే రాజీ చేసుకోవచ్చు. మిగతావి వెంటనే రాజీ చేసుకోవచ్చు.
* రాజీ చేసుకున్నారా? అన్న విషయాన్ని కోర్టు పరిశీలించి కేసుని రాజీ చేస్తుంది. కోర్టు అనుమతి ఇవ్వాల్సిన నేరాలకి సంబంధించి కోర్టు తన విచక్షణాధికారాలని ఉపయోగిస్తుంది. ఆ తరువాతనే అనుమతి ఇస్తుంది.
* పార్టీలు రాజీచేసుకున్న ముద్దాయి కేసు నుంచి విడుదల అవుతాడు.
* చిన్న పిల్లల (మైనర్) విషయంలో పెద్దవాళ్ళు రాజీపడటానికి అవకాశం వుంది.
* అప్పీలు దశలో కూడా కేసులని రాజీ చేసుకునే అవకాశం వుంది.
* బాధితులు మాత్రమే రాజీ చేసుకునే అవకాశం వుంది.
సె.498.ఎ నేరం కోర్టు అనుమతితో రాజీ చేసుకునే వీలున్న నేరం. అనుమతి ఇచ్చిన తరువాత మూడు మాసాల తరువాత రాజీపడాల్సి వుంటుంది. పార్టీలు. పార్టీలు ఈ మూడు మాసాల కాలంలో పునరాలోచించుకోవటానికి అవకాశం వుంటుంది.

Wednesday, June 2, 2010

శేష వీలునామా హక్కుదారంటే..?

శేష వీలునామా హక్కుదారంటే..?

June 1st, 2010

వీలునామాకర్త తన శేష ఆస్తిని ఎవరికైతే చెందాలని రాస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు. అంటే వీలునామాకర్త నిర్దేశించిన ప్రకారం వీలునామా హక్కుదారులు తమ ఆస్తులను తీసుకోగా మిగిలిన ఆస్తిని శేషాస్తి అంటారు. ఆ మిగులు ఆస్తి ఎవరికైతే చెందాలని వీలునామాకర్త నిర్దేశిస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు.
వీలునామా ఆస్తి
వీలునామా కర్తకన్నా ముందు వీలునామా హక్కుదారు చనిపోయినప్పుడు, ఆ వీలునామా ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది (105 (1) భారతీయ వారసత్వ చట్టం). అలాగే వీలునామా కర్త తరువాత వీలునామా హక్కుదారు చనిపోతే ఆ వీలునామా ఆస్తి వీలునామా హక్కుదారు చట్టబద్ధ వారసులకి చెందుతుంది (105 (2) భారతీయ వారసత్వ చట్టం).
ఇద్దరూ ఒకేసారి చనిపోయినప్పుడు
వీలునామా కర్త దాని హక్కుదారు ఇద్దరూ ఒకేసారి విమాన ప్రమాదంలోగానీ ఇతర ఏ ప్రమాదంలోనైనా చనిపోయినప్పుడు ఎవరు ముందు చనిపోయారోనన్న సాక్ష్యం లేనప్పుడు ఆ ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది. అయితే హిందువులకు సంబంధించినపుడు ఆ ఇద్దరిలో ఎవరు చిన్నవారో అతని వారసులకి ఆ ఆస్తి చెందుతుంది.
ఇద్దరికీ ఇచ్చినప్పుడు
వీలునామా ఆస్తిని ఇద్దరు వ్యక్తులకు సమష్టిగా చెందాలని రాసినపుడు ఆ ఇద్దరిలో ఎవరైనా వ్యక్తి వీలునామా కర్త కన్నా ముందే చనిపోతే, ఆ ఆస్తి మిగతా వ్యక్తికి చెందుతుంది.
పిల్లలకు ఇచ్చినప్పుడు
రామయ్య తన కొడుకు గంగాధర్‌కి తన డబ్బు మొత్తం అతని ఉపయోగార్థం చెందాలని వీలునామా రాసాడు. అయితే గంగాధర్ తన కొడుకు రవీందర్ పుట్టిన తరువాత రామయ్యకన్నా ముందే చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వీలునామా ఆస్తి గంగాధర్ కొడుకు రవీందర్‌కే చెందుతుంది. ఒకవేళ గంగాధర్ కూడా వీలునామా రాసి తన ఆస్తి మొత్తం తన భార్య విమలకి చెందాలని రాసినపుడు ఆస్తి కొడుకు రవీందర్‌కి కాకుండా గంగాధర్ భార్య విమలకి చెందుతుంది.
పిల్లలంటే
ఒక వ్యక్తి సంతతిని పిల్లలుగా భావిస్తారు. అంటే అతని మనుమలు, మనుమరాళ్లు అతని పిల్లలుగా భావించరు. అక్రమ సంతతిని కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అతని సంతతిగా పరిగణిస్తారు. గర్భంలో వున్న పిల్లల్ని కూడా అతని సంతతిగా పరిగణిస్తారు. (సె.99 (జి), 99 (ఎ) భారతీయ వారసత్వ చట్టం.
వీలునామా డిపాజిట్ చేయవచ్చా
వీలునామాలని రిజిస్ట్రేషన్ చట్టప్రకారం డిపాజిట్ కూడా చేయవచ్చు. వీలునామాకర్త తాను స్వయంగా కానీ, తన ఏజెంట్ ద్వారా కానీ వీలునామాని కవర్‌లోపెట్టి దాన్ని సీల్ చేసి రిజిస్ట్రార్ (సబ్ రిజిస్ట్రార్) దగ్గర డిపాజిట్ చేయొచ్చు. కవరుమీద వీలునామా కర్త పేరు, అది దేని గురించో, ఆ స్టేట్‌మెంట్ దాని కర్త సంతకంతో వుండాలి. అది వీలునామా కర్తదేనన్న విషయం సంతృప్తి చెందిన తరువాత, దాని కవర్‌పైనున్న విషయాలు తన రిజిష్టర్‌లో నోట్ చేసి ఆ కవరును డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన వీలునామాలను రిజిస్ట్రేషన్ అధికారులు తెరువరు. దాన్ని అలాగే భద్రపరుస్తారు. వీలునామా డిపాజిట్ చేయడానికి, దాన్ని రిజిష్టర్ చేయడానికి భేదముంది. రిజిష్టర్ చేసిన వీలునామాలోని విషయాలను తమ రిజిష్టర్‌లో నోట్ చేసుకొని వీలునామాపై సీల్ వేసి తిరిగి వీలునామా కర్తకు ఇచ్చేస్తారు.
డిపాజిట్ చేసిన వీలునామా కర్త
మరణించినప్పుడు
వీలునామా డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినప్పుడు, అతని మరణ ధృవీకరణ పత్రాన్ని రిజిస్ట్రార్‌కి అందచేసినప్పుడు అతని సమక్షంలో ఆ వీలునామాలోని విషయాలను తాను రిజిష్టర్‌లో రాసి దాన్ని తమ వద్ద భద్రపరుస్తారు. ఆ వీలునామాని ధృవీకరించడానికి కోర్టులో దాఖలు చేయమని కోర్టు ఆదేశించినప్పుడు కోర్టులో దాఖలు చేస్తారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరా..?
వీలునామా తప్పనిసరిగా రిజిష్టర్ చేయించాల్సిన అవసరం లేదు. కాని రిజిష్టర్ చేయించడం మంచిది. అనవసరపు చిక్కులు వుండవు. *

Wednesday, May 19, 2010

దాన ధర్మాలకూ పరిమితులు

May 18th, 2010

హిందువులు ముస్లింలు కాకుండా మిగతా మతాలకు చెందిన వ్యక్తులు తమ ఆస్తులను ధార్మిక సంస్థలకి దానధర్మం చేయడానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితులకు లోబడి వీలునామా రాసినప్పుడే అవి చెల్లుతాయి.
కొడుకులు, కూతుళ్ళు ఇంకా సమీప బంధువులు వున్న వ్యక్తులు తమ వీలునామాని తమ మరణానికి కనీసం 12 నెలల ముందు ఈ వీలునామా రాయాల్సి వుంటుంది.
అంతేకాకుండా అది రాసిన ఆరు నెలల తరువాత దాన్ని డిపాజిట్ చేయవలసి వుంటుంది. ఇది స్థిర చరాస్తులకు దేనికి సంబంధించినదైనా వర్తిస్తుంది.
ఈ పరిమితిని వుంచడానికి గల కారణం వీలునామా కర్త సెంటిమెంట్‌కి లోనై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దానధర్మాలకు రాయకుండా వుండాలని అతని బంధువులకి అన్యాయం జరగకుండా వుండాలని. ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకి వర్తించదు. కానీ ఈ నిబంధన ప్రస్తుత కాల మాన పరిస్థితుల ప్రకారం మార్చాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఆ ధార్మిక సంస్థ ఉనికి లేనప్పుడు...
వీలునామాకర్త ధార్మిక సంస్థకి తన ఆస్తి చెందాలని వీలునామా రాసినప్పుడు, అతని జీవితకాలంలో అట్టి ధార్మిక సంస్థ ఉనికే లేనప్పుడు, ఆ ఆస్తిని అలాంటి ధార్మిక సంస్థలు దేనికైనా ధారాదత్తం చేయవచ్చు.
ఎలాంటి వీలునామా లేనప్పుడు...
ఎవరైనా వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు అతని ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అలాగే మొత్తం ఆస్తి గురించి వీలునామా లేనప్పుడు, ఆ మిగిలిన ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అవశిష్ట వారసుల్ని పేర్కొన్నప్పుడు ఆ మిగిలిన ఆస్తి అతనికి చెందుతుంది.
హిందువులు
వీలునామా రాయకుండా ఎవరైనా హిందువు చనిపోయినపుడు అతని ఆస్తి అతని భార్య, పిల్లలకు, తల్లికి సమానంగా చెందుతుంది. ఎవరికి ఎక్కువగానీ తక్కువ గానీ లేదు.
ముస్లింలు
ముస్లింల చట్టప్రకారం ఏ వ్యకె్తైనా తన ఆస్తిలో 1/3 వరకే వీలునామా చేయగలుగుతాడు. మిగిలిన 2/3 అతని వారసులకి చట్టప్రకారం చెందుతుంది. ఈ భాగాల పంపకం వాళ్ళల్లోవున్న తెగలని బట్టి వుంటుంది. ఆ భాగాల పంపకం ఎలా వున్నప్పటికి పురుషులకి ఎక్కువగా అంటే స్ర్తిలకన్నా రెట్టింపుగా చెందుతుంది.
క్రైస్తవులు
వీలునామా రాయకుండా క్రైస్తవ వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆస్తిలో 1/3 వంతు అతని భార్యకి మిగిలిన 2/3 వంతులు పిల్లలకి చెందుతాయి ఒకవేళ ఆ వ్యక్తికి పిల్లలు లేనప్పుడు అతని ఆస్తిలో సగం అతని భార్యకి మిగిలిన సగభాగం అతని తల్లిదండ్రులకి ....... చెందుతాయి.
పార్శీలు
పార్శీలలో వీలునామా లేకుండా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి భార్యాపిల్లలు వున్నప్పటికి అతని తల్లిదండ్రులకి భాగం వుంటుంది. మగపిల్లలకి, భార్యకి, ...... రెట్టింపు భాగం వుంటుంది. తండ్రికి ఒకటిన్నర భాగం, తల్లికి అర్ధ్భాగం వుంది.
నామినీ వున్నప్పుడు...
ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్, పాలసీలలో నామినీగా పేర్కొన్నప్పటికీ వీలునామా రాయాల్సి వుంటుంది. ఈ ‘నామినీ’లు ఆ డబ్బుని పాలసీ హోల్డర్ చట్టబద్ధ వారసుల తరపున ట్రస్టీగా తీసుకుంటున్నట్టు మాత్రమే. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నామినీ కూడా ఈ డబ్బులు నామినీకే చెందాలని దాని కర్తకి వున్నప్పుడు వీలునామాలో స్పష్టంగా అతనికి చెందాలని పేర్కొన్నప్పుడు మాత్రమే చిక్కులుండవు.
వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించవచ్చా?
* భారతీయ వారసత్వ చట్టంలోని సె.60 ప్రకారం ఏ వయస్సులో వున్న తండ్రైనా వీలునామా ద్వారా తన పిల్లలకి సంరక్షకులను నియమించవచ్చు.
అయితే తల్లి అలా నియమించడానికి ఈ చట్టంలో వీలు కల్పించలేదు. ఆ వీలు కలిగేట్టు చట్టాన్ని మార్చాల్సిన అవసరం వుంది.
* వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించినంత మాత్రాన దాన్ని ప్రాబేట్ చేయించాల్సిన అవసరం లేదు.
* ఈ నియమ నిబంధన హిందువులకి వర్తించదు. ఎందుకంటే హిందువులు సంరక్షకులని హిందూ మైనారిటీ గార్డియన్‌ల చట్టప్రకారం నియమించాల్సి వుంటుంది.
*

Wednesday, May 5, 2010

వీలునామా ఎవరు రాయవచ్చు..?

వీలునామా ఎవరు రాయవచ్చు..?
May 4th, 2010

ఒక వ్యక్తి తన మరణం తర్వాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియబరిచే చట్టబద్ధమైన ప్రకటనగల డాక్యుమెంటును వీలునామా అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.

వీలునామా ఎవరు రాయవచ్చు?

-మైనరు కాకుండా స్థిరచిత్తంగల ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని ఇతరులకు వీలునామా ద్వారా హస్తగతం చేయవచ్చు.
-మత్తులో వున్నప్పడుగానీ తీవ్ర అనారోగ్యంతో వున్నప్పుడుగానీ వేరే ఇతరమైన కారణాలలోనైనా వుండి తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వున్న వ్యక్తులు వీలునామా రాయడానికి వీల్లేదు (సె.59 భారతీయ వారసత్వ చట్టం)
-తన జీవితకాలంలో తన ఆస్తిని ఇతరులకు హస్తగతం చేసే అధికారం గల ఏ స్ర్తి అయినా, పెళ్ళైనప్పటికీ, వీలునామా ద్వారా ఇతరులకు తన ఆస్తిని సంక్రమింపచేయవచ్చు.
-చెవిటి, మూగ, అంధత్వంగల వ్యక్తులు కూడా వీలునామా ద్వారా తమ ఆస్తిని ఇతరులకు హస్తగతం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తులకి తాము ఏం చేస్తున్నామోనన్న విషయం తెలిసి వుండాలి.
-పిచ్చివున్న వ్యక్తి అయినా పిచ్చి విరామం వుండే కాలంలో వీలునామా వ్రాయవచ్చు.

వీలునామా ఎలా రాస్తారు?

-రాతపూర్వకంగా వుండాలి.
-వీలునామా రాసిన వ్యక్తి సంతకం వుండాలి.
-ఇద్దరు సాక్షుల సంతకం కలిగి వుండాలి.
వీలునామా రాతపూర్వకంగా వుండాలి. అంటే అది టైపులోగానీ ప్రింటులోగానీ వేరే ఇతర రూపంలోనైనా రాయబడి వుండాలి. వీలునామా తప్పనిసరిగా కాగితంపైనే రాసి వుండాలని ఏమీ లేదు. దేనిమీదనైనా రాసి వుండవచ్చు. పశ్చిమ దేశాల్లో వీడియోల ద్వారా టేప్‌ల ద్వారా వున్న వీలునామాలను కూడా ఆమోదిస్తున్నారు. కాని మన దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు.

వ్యక్తి సంతకం

వీలునామా పత్రంపై అది రాయించిన వ్యక్తి సంతకంగానీ, వేలిముద్రగానీ వుండాలి. ఒకవేళ అతను వేలిముద్రగానీ సంతకం గానీ పెట్టలేని పరిస్థితిలో వున్నప్పుడు అతను తన సమక్షంలో వేరే వ్యక్తులని సంతకం పెట్టమని ఆదేశించవచ్చు. సాధారణంగా సంతకాలు చివర్లో వుంటాయి. చివర్లోనే వుండాలన్న నియమం ఏమీ లేదు.

సాక్షుల సంతకాలు

ప్రతి వీలునామా తప్పనిసరిగా ఇద్దరు సాక్షులతో సంతకం చేసి వుండాలి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకేసారి సంతకాలు చేయాలన్న నియమం ఏమీ లేదు. కాని వీలునామా రాసిన వ్యక్తి వాళ్ళ సమక్షంలో వీలునామా పత్రంపై సంతకమన్నా చేసి వుండాలి. లేదా ఆ విషయాన్ని వాళ్ళ సమక్షంలో ఒప్పుకొనైనా వుండాలి. సాక్షులిద్దరూ వీలునామా కర్త సమక్షంలోనే సంతకాలు చేయాలి.
మైనరు కాని ఏ వ్యక్తులైనా సాక్షులుగా వుండవచ్చు. ఈ సాక్షులకి వీలునామా పత్రంలోని విషయాలు మొత్తం తెలిసి వుండాల్సిన అవసరం లేదు. కాని వీలునామా కర్త వాళ్ళ సమక్షంలో సంతకమన్నా చెయ్యాలి. లేదా చేసినట్టు ఒప్పుకోనైనా వుండాలి (సె.63, భారతీయ వారసత్వ చట్టం).
సాక్షి లబ్దిదారుడైనప్పుడు
వీలునామాలోని సాక్షికి కూడా ఏమైనా ఆస్తి చెందేట్టు వుండి, లబ్దిదారుడైనప్పటికీ, వీలునామా అమలు అది ఆటంకం కాదు. అయితే లబ్దిదారులకు మాత్రం ఆ వీలునామా చెల్లదు. ఈ నిబంధన హిందువులకి వర్తించదు. (సె.67 భారతీయ వారసత్వ చట్టం)

వీలునామా భాష

వీలునామాలోని భాష సరళంగా స్పష్టంగా ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా వుండాలి. సాంకేతిక చట్టపరమైన పరిభాష ఉండాలని ఏమీ లేదు. కానీ వీలునామా చదవగానే వీలునామా కర్త ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమయ్యేట్లు వుండాలి.

వీలునామాలో కింది విషయాలు స్పష్టంగా వుండాలి

-వీలునామా ద్వారా ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా పేర్కొనాలి.
-అలాగే ఆస్తిలో ఎలాంటి హక్కులు అతనికి ధారాదత్తం చేయబడ్డాయో పేర్కొనాలి.
-ఆస్తి వ్యక్తికి ఎప్పటినుంచి చెందాలో (అంటే మైనారిటీ తీరిన తరువాత గానీ లేక వివాహమైన తరువాత) స్పష్టంగా పేర్కొనాలి.
ఎవరైనా వ్యక్తి జైల్లో వున్నప్పుడు వీలునామా రాయవచ్చు. జైల్లో వీలునామా రాసినంత మాత్రాన ఎవరి ఒత్తిడి వల్లనో రాసినట్టు అనుకోవడానికి వీల్లేదు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).

వీలునామా ఎప్పుడు చెల్లదు?Bold

ఎవరైనా వ్యక్తి మోసం చేసిగానీ, ఒత్తిడి చేసిగానీ వీలునామా రాయిస్తే అది చెల్లదు.
ఉదాహరణకు వీలునామా కర్తని చంపుతామని బెదిరించి వీలునామా రాయించినపుడు, అతని పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగిస్తామని ఒత్తిడి తెచ్చినపుడు, అతని కొడుకు తప్పు పని చేసాడని తెలియకుండా వుండాలంటే వీలునామా వ్రాయాలని రాయించినపుడు అవి చెల్లవు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).
పెళ్ళి అయిన తరువాత...
వీలునామా కర్త పెళ్లయిన తర్వాత వీలునామా దానంతట అదే రద్దవుతుంది. కానీ ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకు వర్తించదు. *

Followers

Blog Archive