Tuesday, July 3, 2012

Justice HR Khanna ఎమర్జెన్సీ’కి బెదరని ధీరుడు

నివారక నిర్బంధం’, విచారణ లేకుండా నిర్బంధించడం అనే విషయాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తిని కలచివేస్తాయి. జీవితంలో అత్యం త విలువైనది స్వేచ్ఛ. ఇలాంటి చట్టాలు, చర్యలు మౌలికమైన స్వేచ్ఛను భగ్నం చేస్తాయి. అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్-శివకాంత్ శుక్లా, 1976 సుప్రీంకోర్టు (రిపోర్టర్ 172) కేసులో హన్స్‌రాజ్ ఖన్నా భిన్నాభివూపాయం న్యాయ చరిత్రలో చారిత్రాత్మకమైనది. ఎవరీ హన్స్‌రాజ్ ఖన్నా? అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన న్యాయమూర్తి. ఆ పదవిని త్యజించిన మహోన్నతుడు. ఎమ్జన్సీ రోజుల్లో ప్రాథమిక హక్కుల కేసుల్లో భిన్నాభివూపాయాన్ని వ్యక్తపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని పోగొట్టుకున్న వ్యక్తి. పౌరహక్కుల గురించి, ప్రాథమిక హక్కుల అమలు గురించి, న్యాయ వ్యవస్థ స్వతంవూతత గురించి ఒంటరిగా పోరాడిన న్యాయమూర్తి. ‘హెబియస్ కార్పస్’ కేసు లో తనతోటి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విభేదించి ధైర్యంగా ఎమ్జన్సీ రోజుల్లో పౌరహక్కుల గురించి చెప్పిన వారు. వ్యక్తులను సుదీర్ఘకాలం నిర్బంధించే అధికారం రాజ్యానికి లేదని,తోటి న్యాయమూర్తులతో విభేదించి తీర్పు రాశా రు. ఎ.డి.ఎమ్. జబల్‌పూర్ కేసు ఎమ్జన్సీ రోజుల్లో ఓ సంచలనం. ఇప్పటికీ అది మర్చిపోలేని తీర్పు. ఈ తీర్పు తర్వాత న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో ‘భారత దేశంలో ప్రజాస్వామ్యం నెలకొన్న తర్వాత ఎవరో ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్‌రాజ్ ఖన్నా కీర్తి స్తంభం నిర్మిస్తారు’ అని రాసింది. ఆయన కీర్తిస్తంభం ఎవరూ నిర్మించలేదు. కానీ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టులో న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 1912జూలై 3న జస్టిస్ ఖన్నా జన్మించారు. 2008 ఫిబ్రవరి25న చనిపోయా రు. ఈ ఏడాది ఆయన శత జయంతి సంవత్సరం . మే నెలలో సాదత్ హస న్ మంటో శత జయంతి జరిగింది. ఈ నెలలో హెచ్.ఆర్. ఖన్నా శత జయంతి. ఈ ఇద్దరికీ సాన్నిహిత్యం లేదు. కానీ ఒకరు ‘నయా కానూన్’ అన్న కథని... (నయా కానూన్ అంటే కొత్త రాజ్యాంగం) రాశారు. మరొకరు రాజ్యాంగాన్ని వివిధ తీర్పుల్లో వ్యాఖ్యానించిన వ్యక్తి. ఎ.డి.ఎమ్ జబల్‌పూర్ కేసులోనే కాదు కేశవానంద భారతి (1973) కేసులో కూడా విలక్షణమైన అభివూపాయాన్ని వెలిబుచ్చిన వ్యక్తి హెచ్.ఆర్.ఖన్నా. న్యాయమూర్తులు ఎస్.ఎమ్. సిక్రీ పధాన న్యాయమూర్తి) జే.ఎం. శెలత్, కె.ఎస్. హెగ్డే, పి. జగన్‌మోహన్‌డ్డి, ఎ.ఎన్. గ్రోవర్, ఎస్. ముఖర్జీయాల ప్రకారం పార్లమెంట్ అధికారం పరిమితమైనది. రాజ్యాంగంలో సహజ సిద్ధమైన పరిమితులున్నాయి. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు ఎ.ఎం.రే, జి.జి. పలేకర్, కె.కె. మూథ్యూ, ఎస్.ఎన్. ద్వివేదీ, ఎం.హెచ్. బేగ్, వైవీ చంద్రచూడ్‌ల ప్రకారం- పార్లమెంట్‌కు అలాంటి పరిమితులు లేవు. న్యాయమూర్తి ఖన్నా ఎటువైపు తీసుకోలేదు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్న ది. కానీ దాన్ని మౌలికమైన నిర్మాణాన్ని మార్చే హక్కు లేదు. ఇదీ ఖన్నా అభివూపాయం. రెండేళ్ల తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక తీర్పు తర్వాత దీని మీద చాలా చర్చ జరిగింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఉంటాయని, ఆస్తి హక్కు ఉండదని ఖన్నా వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యానికి గొప్ప భరోసాను ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి కేసు.మొత్తం 13 మందిలో ఆరుగురు న్యాయమూర్తులు ఒకవైపు, మరో ఆరుగురు న్యాయమూర్తులు మరో వైపు ఉన్న కేసులో నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించిన వ్యక్తి హెచ్.ఆర్. ఖన్నా. హెచ్.ఆర్.ఖన్నా తీర్పుల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు విషిష్టమైనది. ఎందుకంటే అది ఎమ్జన్సీ రోజుల్లో వెలువరించినది. జయవూపకాశ్ నారాయణ్ ఉద్యమం నేపథ్యంలో వేలాదిమందిని అరెస్టు చేశారు. ‘మీసా’ చట్టాన్ని ప్రయోగించి ఎంతోమందిని నిర్బంధించారు. రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కును లేకుండా చేసిన రోజులు. అధికరణ 21ని సస్పెండ్ చేసే అధికారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు ఎ.డి.ఎం. జబల్‌పూర్ కేసు. అప్పుడున్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు- ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ ‘రే’, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా, జస్టిస్ బేగ్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్. పి.ఎన్. భగవతి. ఇద్దరు న్యాయమూర్తుల సీనియారిటీని కాదని జస్టిస్ ‘రే’ను ప్రధా న న్యాయమూర్తిగా నియమించారు. బెంచ్‌ను ఏర్పాటు చేయడం ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. కానీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఇలా కోరడం అసాధారణ విషయం. ఇది ప్రధాన న్యాయమూర్తికి నచ్చనప్పటికీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్‌ని ఏర్పాటు చేశారు. మానవహక్కుల గురించి ఎక్కువగా మాట్లాడే న్యాయమూర్తులు వైవీ చంద్రచూడ్, పి.ఎన్. భగవతి. ప్రధాన న్యాయమూర్తి, ఎం.హెచ్. బేగ్ ఎమ్జన్సీని సమర్థించినప్పటికీ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల వల్ల ప్రాథమిక హక్కులకు అనుకూలంగా తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో రాష్ట్రపతి 27.6.1975న రాజ్యాంగంలోని అధికరణ 359(1) ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకా రం వ్యక్తిగత స్వేచ్ఛను అమలు పరుచమని ఆర్టికల్ 226 ద్వారా కానీ, ఇతర రిట్ ల ద్వారా కానీ కోరడానికి వీల్లేదు. ‘మీసా’ చట్టం ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ నిర్బంధాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు. ఐదుగురు న్యాయమూర్తుల బృందంలో నలుగురు దాన్ని సమర్థించారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకించి తన భిన్నాభివూపాయాన్ని తీర్పు ద్వారా వ్యక్తపరిచిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా. ఆయన మాటల్లో ‘ ఆర్టికల్ 226 ప్రకారం రిట్‌లు జారీచేసే అధికారాన్ని రాజ్యాంగం హైకోర్టులకు సంక్రమింప చేసింది. ఈ అధికారాన్ని సస్పెండ్ చేసే అధికారం రాజ్యాంగం ఏ అధికార యంత్రాంగానికి ఇవ్వలేదు’. ఎమ్జన్సీ కాలంలో ఒక ఒంటరి గొంతుక ఈ తీర్పు చెప్పడం మామూలు విషయం కాదు. ఆ తీర్పు చెప్పినందుకు తగిన మూ ల్యాన్ని ఖన్నా చెల్లించారు. దేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయం తెలిసి తీర్పును వెలువరించిన ధీశాలి. దేశ పౌరుల ప్రాథమిక హక్కులను జెండాలాగా ఎగరవేసిన వారు జస్టిస్ ఖన్నా. రాజ్యాంగం నిబంధనలు, అధికరణలు తెలియడం కాదు. వాటి అమ లు కోసం మనస్సాక్షిగా పనిచేశారు హెచ్.ఆర్.ఖన్నా. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజాహితం కోసం పనిచేయాలనుకునే వ్యక్తులకు, న్యాయమూర్తులకు ఆదర్శవూపాయుడు జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. ఎ.డి. ఎం. జబల్‌పూర్ కేసులోని మరో ఇద్దరు న్యాయమూర్తులు ఖన్నా లాగా ఆలోచిస్తే అత్యవసర పరిస్థితి త్వరగా అంతమయ్యేది. తనకన్నా జూనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో జస్టిస్ ఖన్నా 29-1-1977న తన పదవికి రాజీనామా చేశారు. ఆ తీర్పు చెప్పినందుకు ఖన్నా గర్వపడ్డారు. దేశం గర్వపడింది. ఖన్నా తీర్పు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయబడింది. అధికర ణ 20,21లు ఎమ్జన్సీలో సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఈ సవరణ చెబుతుంది.మంటో ‘నయా ఖానూన్’ కథలో రాజ్యాంగం వస్తుంది. జీవితంలో మార్పు ఉండదు.రాజ్యంగ ప్రకారం ప్రాథమిక హక్కులున్నాయి. కానీ వాటి ఉల్లంఘనలను ఆపలేకపోతున్నాం. జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా లాంటి న్యాయమూర్తులు మన దేశానికి అవసరం.

Followers