Wednesday, May 19, 2010

దాన ధర్మాలకూ పరిమితులు

May 18th, 2010

హిందువులు ముస్లింలు కాకుండా మిగతా మతాలకు చెందిన వ్యక్తులు తమ ఆస్తులను ధార్మిక సంస్థలకి దానధర్మం చేయడానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితులకు లోబడి వీలునామా రాసినప్పుడే అవి చెల్లుతాయి.
కొడుకులు, కూతుళ్ళు ఇంకా సమీప బంధువులు వున్న వ్యక్తులు తమ వీలునామాని తమ మరణానికి కనీసం 12 నెలల ముందు ఈ వీలునామా రాయాల్సి వుంటుంది.
అంతేకాకుండా అది రాసిన ఆరు నెలల తరువాత దాన్ని డిపాజిట్ చేయవలసి వుంటుంది. ఇది స్థిర చరాస్తులకు దేనికి సంబంధించినదైనా వర్తిస్తుంది.
ఈ పరిమితిని వుంచడానికి గల కారణం వీలునామా కర్త సెంటిమెంట్‌కి లోనై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దానధర్మాలకు రాయకుండా వుండాలని అతని బంధువులకి అన్యాయం జరగకుండా వుండాలని. ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకి వర్తించదు. కానీ ఈ నిబంధన ప్రస్తుత కాల మాన పరిస్థితుల ప్రకారం మార్చాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఆ ధార్మిక సంస్థ ఉనికి లేనప్పుడు...
వీలునామాకర్త ధార్మిక సంస్థకి తన ఆస్తి చెందాలని వీలునామా రాసినప్పుడు, అతని జీవితకాలంలో అట్టి ధార్మిక సంస్థ ఉనికే లేనప్పుడు, ఆ ఆస్తిని అలాంటి ధార్మిక సంస్థలు దేనికైనా ధారాదత్తం చేయవచ్చు.
ఎలాంటి వీలునామా లేనప్పుడు...
ఎవరైనా వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు అతని ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అలాగే మొత్తం ఆస్తి గురించి వీలునామా లేనప్పుడు, ఆ మిగిలిన ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అవశిష్ట వారసుల్ని పేర్కొన్నప్పుడు ఆ మిగిలిన ఆస్తి అతనికి చెందుతుంది.
హిందువులు
వీలునామా రాయకుండా ఎవరైనా హిందువు చనిపోయినపుడు అతని ఆస్తి అతని భార్య, పిల్లలకు, తల్లికి సమానంగా చెందుతుంది. ఎవరికి ఎక్కువగానీ తక్కువ గానీ లేదు.
ముస్లింలు
ముస్లింల చట్టప్రకారం ఏ వ్యకె్తైనా తన ఆస్తిలో 1/3 వరకే వీలునామా చేయగలుగుతాడు. మిగిలిన 2/3 అతని వారసులకి చట్టప్రకారం చెందుతుంది. ఈ భాగాల పంపకం వాళ్ళల్లోవున్న తెగలని బట్టి వుంటుంది. ఆ భాగాల పంపకం ఎలా వున్నప్పటికి పురుషులకి ఎక్కువగా అంటే స్ర్తిలకన్నా రెట్టింపుగా చెందుతుంది.
క్రైస్తవులు
వీలునామా రాయకుండా క్రైస్తవ వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆస్తిలో 1/3 వంతు అతని భార్యకి మిగిలిన 2/3 వంతులు పిల్లలకి చెందుతాయి ఒకవేళ ఆ వ్యక్తికి పిల్లలు లేనప్పుడు అతని ఆస్తిలో సగం అతని భార్యకి మిగిలిన సగభాగం అతని తల్లిదండ్రులకి ....... చెందుతాయి.
పార్శీలు
పార్శీలలో వీలునామా లేకుండా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి భార్యాపిల్లలు వున్నప్పటికి అతని తల్లిదండ్రులకి భాగం వుంటుంది. మగపిల్లలకి, భార్యకి, ...... రెట్టింపు భాగం వుంటుంది. తండ్రికి ఒకటిన్నర భాగం, తల్లికి అర్ధ్భాగం వుంది.
నామినీ వున్నప్పుడు...
ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్, పాలసీలలో నామినీగా పేర్కొన్నప్పటికీ వీలునామా రాయాల్సి వుంటుంది. ఈ ‘నామినీ’లు ఆ డబ్బుని పాలసీ హోల్డర్ చట్టబద్ధ వారసుల తరపున ట్రస్టీగా తీసుకుంటున్నట్టు మాత్రమే. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నామినీ కూడా ఈ డబ్బులు నామినీకే చెందాలని దాని కర్తకి వున్నప్పుడు వీలునామాలో స్పష్టంగా అతనికి చెందాలని పేర్కొన్నప్పుడు మాత్రమే చిక్కులుండవు.
వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించవచ్చా?
* భారతీయ వారసత్వ చట్టంలోని సె.60 ప్రకారం ఏ వయస్సులో వున్న తండ్రైనా వీలునామా ద్వారా తన పిల్లలకి సంరక్షకులను నియమించవచ్చు.
అయితే తల్లి అలా నియమించడానికి ఈ చట్టంలో వీలు కల్పించలేదు. ఆ వీలు కలిగేట్టు చట్టాన్ని మార్చాల్సిన అవసరం వుంది.
* వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించినంత మాత్రాన దాన్ని ప్రాబేట్ చేయించాల్సిన అవసరం లేదు.
* ఈ నియమ నిబంధన హిందువులకి వర్తించదు. ఎందుకంటే హిందువులు సంరక్షకులని హిందూ మైనారిటీ గార్డియన్‌ల చట్టప్రకారం నియమించాల్సి వుంటుంది.
*

Wednesday, May 5, 2010

వీలునామా ఎవరు రాయవచ్చు..?

వీలునామా ఎవరు రాయవచ్చు..?
May 4th, 2010

ఒక వ్యక్తి తన మరణం తర్వాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియబరిచే చట్టబద్ధమైన ప్రకటనగల డాక్యుమెంటును వీలునామా అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.

వీలునామా ఎవరు రాయవచ్చు?

-మైనరు కాకుండా స్థిరచిత్తంగల ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని ఇతరులకు వీలునామా ద్వారా హస్తగతం చేయవచ్చు.
-మత్తులో వున్నప్పడుగానీ తీవ్ర అనారోగ్యంతో వున్నప్పుడుగానీ వేరే ఇతరమైన కారణాలలోనైనా వుండి తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వున్న వ్యక్తులు వీలునామా రాయడానికి వీల్లేదు (సె.59 భారతీయ వారసత్వ చట్టం)
-తన జీవితకాలంలో తన ఆస్తిని ఇతరులకు హస్తగతం చేసే అధికారం గల ఏ స్ర్తి అయినా, పెళ్ళైనప్పటికీ, వీలునామా ద్వారా ఇతరులకు తన ఆస్తిని సంక్రమింపచేయవచ్చు.
-చెవిటి, మూగ, అంధత్వంగల వ్యక్తులు కూడా వీలునామా ద్వారా తమ ఆస్తిని ఇతరులకు హస్తగతం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తులకి తాము ఏం చేస్తున్నామోనన్న విషయం తెలిసి వుండాలి.
-పిచ్చివున్న వ్యక్తి అయినా పిచ్చి విరామం వుండే కాలంలో వీలునామా వ్రాయవచ్చు.

వీలునామా ఎలా రాస్తారు?

-రాతపూర్వకంగా వుండాలి.
-వీలునామా రాసిన వ్యక్తి సంతకం వుండాలి.
-ఇద్దరు సాక్షుల సంతకం కలిగి వుండాలి.
వీలునామా రాతపూర్వకంగా వుండాలి. అంటే అది టైపులోగానీ ప్రింటులోగానీ వేరే ఇతర రూపంలోనైనా రాయబడి వుండాలి. వీలునామా తప్పనిసరిగా కాగితంపైనే రాసి వుండాలని ఏమీ లేదు. దేనిమీదనైనా రాసి వుండవచ్చు. పశ్చిమ దేశాల్లో వీడియోల ద్వారా టేప్‌ల ద్వారా వున్న వీలునామాలను కూడా ఆమోదిస్తున్నారు. కాని మన దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు.

వ్యక్తి సంతకం

వీలునామా పత్రంపై అది రాయించిన వ్యక్తి సంతకంగానీ, వేలిముద్రగానీ వుండాలి. ఒకవేళ అతను వేలిముద్రగానీ సంతకం గానీ పెట్టలేని పరిస్థితిలో వున్నప్పుడు అతను తన సమక్షంలో వేరే వ్యక్తులని సంతకం పెట్టమని ఆదేశించవచ్చు. సాధారణంగా సంతకాలు చివర్లో వుంటాయి. చివర్లోనే వుండాలన్న నియమం ఏమీ లేదు.

సాక్షుల సంతకాలు

ప్రతి వీలునామా తప్పనిసరిగా ఇద్దరు సాక్షులతో సంతకం చేసి వుండాలి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకేసారి సంతకాలు చేయాలన్న నియమం ఏమీ లేదు. కాని వీలునామా రాసిన వ్యక్తి వాళ్ళ సమక్షంలో వీలునామా పత్రంపై సంతకమన్నా చేసి వుండాలి. లేదా ఆ విషయాన్ని వాళ్ళ సమక్షంలో ఒప్పుకొనైనా వుండాలి. సాక్షులిద్దరూ వీలునామా కర్త సమక్షంలోనే సంతకాలు చేయాలి.
మైనరు కాని ఏ వ్యక్తులైనా సాక్షులుగా వుండవచ్చు. ఈ సాక్షులకి వీలునామా పత్రంలోని విషయాలు మొత్తం తెలిసి వుండాల్సిన అవసరం లేదు. కాని వీలునామా కర్త వాళ్ళ సమక్షంలో సంతకమన్నా చెయ్యాలి. లేదా చేసినట్టు ఒప్పుకోనైనా వుండాలి (సె.63, భారతీయ వారసత్వ చట్టం).
సాక్షి లబ్దిదారుడైనప్పుడు
వీలునామాలోని సాక్షికి కూడా ఏమైనా ఆస్తి చెందేట్టు వుండి, లబ్దిదారుడైనప్పటికీ, వీలునామా అమలు అది ఆటంకం కాదు. అయితే లబ్దిదారులకు మాత్రం ఆ వీలునామా చెల్లదు. ఈ నిబంధన హిందువులకి వర్తించదు. (సె.67 భారతీయ వారసత్వ చట్టం)

వీలునామా భాష

వీలునామాలోని భాష సరళంగా స్పష్టంగా ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా వుండాలి. సాంకేతిక చట్టపరమైన పరిభాష ఉండాలని ఏమీ లేదు. కానీ వీలునామా చదవగానే వీలునామా కర్త ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమయ్యేట్లు వుండాలి.

వీలునామాలో కింది విషయాలు స్పష్టంగా వుండాలి

-వీలునామా ద్వారా ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా పేర్కొనాలి.
-అలాగే ఆస్తిలో ఎలాంటి హక్కులు అతనికి ధారాదత్తం చేయబడ్డాయో పేర్కొనాలి.
-ఆస్తి వ్యక్తికి ఎప్పటినుంచి చెందాలో (అంటే మైనారిటీ తీరిన తరువాత గానీ లేక వివాహమైన తరువాత) స్పష్టంగా పేర్కొనాలి.
ఎవరైనా వ్యక్తి జైల్లో వున్నప్పుడు వీలునామా రాయవచ్చు. జైల్లో వీలునామా రాసినంత మాత్రాన ఎవరి ఒత్తిడి వల్లనో రాసినట్టు అనుకోవడానికి వీల్లేదు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).

వీలునామా ఎప్పుడు చెల్లదు?Bold

ఎవరైనా వ్యక్తి మోసం చేసిగానీ, ఒత్తిడి చేసిగానీ వీలునామా రాయిస్తే అది చెల్లదు.
ఉదాహరణకు వీలునామా కర్తని చంపుతామని బెదిరించి వీలునామా రాయించినపుడు, అతని పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగిస్తామని ఒత్తిడి తెచ్చినపుడు, అతని కొడుకు తప్పు పని చేసాడని తెలియకుండా వుండాలంటే వీలునామా వ్రాయాలని రాయించినపుడు అవి చెల్లవు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).
పెళ్ళి అయిన తరువాత...
వీలునామా కర్త పెళ్లయిన తర్వాత వీలునామా దానంతట అదే రద్దవుతుంది. కానీ ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకు వర్తించదు. *

Followers