Tuesday, March 30, 2010

తల్లి సహజ వారసురాలు కాదా?

తల్లి సహజ వారసురాలు కాదా?
March 23rd, 2010

తండ్రి తరువాత తల్లి వారసురాలు అవుతుందా? లేదా తండ్రి వుండగానే తల్లి సహజ వారసురాలిగా వుండటానికి అవకాశం వుందా? ఈ విషయం ‘గీతా హరిహరన్’ మరి ఒక్కరు వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ 1999 (2) ఎస్.సి.సి.228 కేసులో తలెత్తింది. ఈ కేసులో తల్లి కూడా సహజ సంరక్షకురాలని కోర్టు తీర్పుని ప్రకటించింది. కేసులోని విషయాలకు వస్తే మొదటి వాది రెండవ వాది భార్య గీతా హరిహరన్ రచయిత్రి. చాలా పుస్తకాలని ప్రచురించింది. ఆమె భర్త జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో మెడికల్ సైంటిస్ట్. వాళ్ళిద్దరూ సంయుక్తంగా 10-12-1984 రోజున రిలీఫ్ బాండ్‌లు తమ కొడుకు పేరు మీద ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి మొదటి వాది గీతా హరిహరన్ కొడుకుని సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందని తమ దరఖాస్తులో పేర్కొన్నారు. కొడుకు పేరు మీద డబ్బుని పెట్టుబడి పెడుతున్నామని అది కొడుకు కోసమని కూడా దరఖాస్తులో పేర్కొన్నారు. గీతా హరిహరన్ సంరక్షకురాలిగా నిర్ణీత ఫారమ్‌లో సంతకం చేసింది.
ఆమెను సంరక్షకురాలిగా రిజర్వ్‌బ్యాంక్ ఆమోదించలేదా. తండ్రిని సంరక్షురాలిగా పెట్టమని లేదా యోగ్యతగల కోర్టునుంచి సంరక్షకురాలిగా నియమించినట్టు ఉత్తర్వులు తీసుకొని రావాలని రిజర్వు బ్యాంక్ వాళ్ళకి జవాబుని ఇచ్చింది. దీనిపై వాళ్ళు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేసి హిందూ మైనారిటీ గార్డియన్ యాక్ట్ 1956లోని సె 6 (ఎ) అదేవిధంగా గార్డియన్ అండ్ వార్డ్ చట్టంలోని సె.19(బి)లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 150కు విరుద్ధంగా వున్నాయని, వాటిని తొలగించాలని రిట్ పిటిషన్ని దాఖలుచేశారు. అదేవిధంగా మొదటి ప్రతివాది డబ్బుని స్వీకరించేట్టు గీతా హరిహరన్‌ని సంరక్షకురాలిగా ఆమోదించేట్టు రిట్ ఆఫ్ మాండమస్ ఉత్తర్వులు జారీచేయాలని కోర్టుని కోరినారు.
హిందూ మైనారిటీ గార్డియన్ చట్టంలోని 1956 సె. 6 (ఎ) ప్రకారం తల్లి సహజ వారసురాలు కాదని, అందుకని వాళ్ళ దరఖాస్తును రిజర్వుబ్యాంక్ ఆమోదించకపోవడం సరైందేనని తమ జవాబులో రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఇలాంటి మరో కేసు (తీ.ఔ(ష)10/6/1991) కేసు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ కేసులో వాది భార్య మొదటి ప్రతివాది ఆమె భర్త వాది ప్రకారం- ప్రతివాది తరచూ స్కూల్‌కి, తనకి ఉత్తరాలు రాసి తాను సహజ సంరక్షకుడనని రాస్తున్నాడని అందుకని ఆ రెండు నిబంధనల్ని కొట్టివేయాలని రిట్‌పిటిషన్ని దాఖలుచేసింది. ఈ రెండింటిలో తలెత్తిన అంశం ఒక్కటే కాబట్టి, ఈ రెండింటిని కలిపి సుప్రీంకోర్టు విచారించి తీర్పుని ప్రకటించింది.తండ్రి తరువాత తల్లిని సహజ వారసురాలిగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని వారి న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు ముందు వాదించింది.

తీర్పులోని సారాంశం
-----------------------
‘తండ్రి ఆ తరువాత తల్లి’ అన్న అభివ్యక్తి ప్రకారం తండ్రి జీవిత కాలం తరువాత తల్లి సహజ సంరక్షకురాలు అన్న అభిప్రాయం కలుగుతుంది. మైనర్ సంక్షేమం అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన విషయమని దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఎవరు సహజ సంరక్షకులో నిర్థారించాల్సి వుంటుంది. అవసరమైనప్పుడు తండ్రి జీవితకాలంలో అతని స్థానంలో తల్లిని సంరక్షకురాలిగా నియమించవచ్చు. ఇంకా ఎవరినైనా కోర్టు నియమించవచ్చు.
‘తరువాత’ అన్న పదాన్ని తప్పనిసరిగా తండ్రి జీవితం తరువాత అన్న అర్ధంలో తీసుకోవద్దని దాన్ని తండ్రి పరోక్షంలో అని భావించాలి. పిల్లవాడిని అతని ఆస్తిని తండ్రి సంరక్షించలేనప్పుడు, ఇతర కారణాలు వున్నప్పుడు అతను అవాస్తకంగా వున్నప్పుడు, అతను తల్లితో నివశిస్తున్నప్పటికీ అతని స్థానంలో తల్లి సంరక్షకురాలిగా ఉండవచ్చు. అదేవిధంగా తల్లీ తండ్రి ఇద్దరు పరస్పర ఆమోదంతో వున్నప్పుడు తల్లిని సంరక్షకురాలిగా చూడవచ్చు. తండ్రి సంరక్షకురాలిగా వుండలేని అనారోగ్యంతో వున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులలో తల్లి సహజ సంరక్షకురాలిగా భావించవచ్చు. సె.4, 6లని సంయుక్తంగా చదివినపుడు అర్థమవుతున్నది అదే.ఇలాంటి పరిస్థితులలో తల్లిని సహజ సంరక్షకురాలిగా చూడాలి. అదేవిధంగా శారీరక లేక మానసిక అశక్తతవల్ల అతను సంరక్షకునిగా వ్యవహరించలేని పరిస్థితులు వుండవచ్చు. అపుడు తల్లి సహజ సంరక్షకురాలిగా వ్యవహరించవచ్చు. తండ్రి బతికి వున్నప్పటికి ఆమె చర్యలు చట్టబద్ధమైనవే. అలాంటప్పుడు ఆమె చర్యలు అతని పరోక్షంలో అని భావించాల్సి వుంటుంది. సె.6(ఎ) ప్రకారం సరైనదని భావించాల్సి వుంటుంది.’’ ఈ పరిశీలనకు నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ గీతా హరిహరన్ దరఖాస్తు పరిష్కరించాలని ఆదేశించింది.

*
*
*

*

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి సంరక్షకులు ఎవరు?

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి సంరక్షకులు ఎవరు?
March 30th, 2010

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి వారసులు ప్రత్యేకంగా ఎవరూ వుండరు. ఆ కుటుంబానికి పెద్ద (కర్త) ఎవరైతే వుంటారో అతనే మైనర్ ఆస్తి (సంయుక్త ఆస్తి) వ్యవహారాలు చూస్తాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చెల్లించడానికి, అవసరమైనప్పుడు మైనర్ పిల్లల తండ్రి మైనర్ పిల్లల భాగాన్ని అమ్మడానికి అవకాశం వుంది. మరోవిధంగా చెప్పాలంటే జాయింట్ ఆస్తికి సంబంధించి దాని పూర్తి నిర్వహణ బాధ్యత కుటుంబ పెద్దకి వుంటుంది. అవసరమైనప్పుడు అతను అమ్మడానికి అవకాశం వుంది.

మైనర్ ఎవరి ఆధీనంలో వుంటాడు?

సాధారణ పరిస్థితులలో మైనర్ సహజ సంరక్షకుడైన తండ్రి ఆధీనంలో వుంటాడు. 5 సంవత్సరాల లోపు వున్న పిల్లలకి మాత్రం తల్లి వారసురాలిగా వుంటుంది. పిల్లలు ఎవరి అధీనంలో వుండాలి అన్న విషయంలో అత్యంత ముఖ్యమైనది పిల్లల సంక్షేమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఆధీనాన్ని మంజూరు చేస్తాయి.
తండ్రి అనేవాడు పిల్లవాడికి సహజ రక్షకుడు. మైనర్ పిల్లల చదువూ సంధ్యలు చూడాల్సిన బాధ్యత పిల్లలపైనే వుంటుంది. సంరక్షణ బాధ్యత అప్పగించే ముందు పిల్లల సంక్షేమం చూసి నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టుపై వుంటుంది. సాధారణంగా మైనర్ పిల్లలపై తండ్రికే నియంత్రణ వుంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వుండదు.

తండ్రి నియంత్రణ మైనర్ పిల్లలపై ఎప్పుడు వుండదు?

ఈ సందర్భాలలో మైనర్ పిల్లలపై తండ్రి నియంత్రణ వుండదు.
* నీతి బాహ్యమైన పనుల్లో గానీ లేదా రౌడీ వ్యవహారాల్లో తండ్రి వున్నప్పుడు;
* తన ప్రవర్తన ద్వారా పెద్ద అధికారాన్ని తండ్రి వదులుకున్నప్పుడు;
* కోర్టు అనుమతి లేకుండా కోర్టు అధికార పరిధినుంచి మైనర్ పిల్లలని దూరంగా తీసుకొని వెళ్ళినపుడు.
తల్లికి ఎప్పుడు పిల్లవాడి ఆధీనాన్ని ఇస్తారు?
పిల్లవాడి సంక్షేమం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎవరి అధీనంలో పిల్లవాడికి అభివృద్ధి వుంటుందో, పిల్లవాడు క్షేమంగా వుంటాడో కోర్టు పరిశీలించి ఆధీనాన్ని ఇస్తుంది.
ఉదాహరణకి తండ్రి నిరుద్యోగి అయి, తల్లి ఉద్యోగం చేసి 20వేల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, ఆ పిల్లవాడిని సరిగ్గా చూసే అవకాశం, మంచి విద్యని అందించే అవకాశం తల్లికే వుంటుంది. ఇలాంటి సందర్భాలలో తల్లి ఆధీనంలోకే పిల్లవాడిని కోర్టులు ఇస్తుంటాయి. (రాజిందర్ కుమార్ మిశ్రా వర్సెస్ రిచా ఏ.ఐ.ఆర్.2005 అలహాబాద్ 379)

5 సంవత్సరాల లోపు వున్న పిల్లలు తప్పకుండా తల్లి ఆధీనంలోనే వుండాలా?

హిందూ గార్డియన్ మైనారిటీ చట్టం 1956 చట్టంలో సె.6లోని ప్రో.వి.సో ప్రకారం 5 సంవత్సరాలలోపు వున్న పిల్లల ఆధీనం తల్లి దగ్గరే వుండాలి. అయితే ఇది రద్దుచేయడానికి వీల్లేని నిబంధన కాదు. ఎందుకంటే ఈ ప్రోవిసోలోనే ఒక మాట చెప్పారు. అది ‘సాధారణంగా’ అంటే సాధారణ పరిస్థితులలో 5 సంవత్సరాలలోపు పిల్లవాడి అధీనం అంటే అసాధారణ పరిస్థితులలో ఇతరులకి కూడా వారి ఆధీనం ఇవ్వడానికి అవకాశం వుంది. అదేవిధంగా సె.13 ప్రకాం మైనర్ శ్రేయస్సే ప్రధానమైన విషయం. ఈ రెండు విషయాలను గమనించినపుడు 5 సంవత్సరాలలోపు వున్న మైనర్ పిల్లలకి తల్లే తప్పకుండా సంరక్షకురాలని, ఆమె అధీనంలోకే పిల్లలని ఇవ్వాల్సి వుంటుందని చెప్పలేం. అది సరికాదు.
మైనర్ ఆస్తి ఎవరి అధీనంలో వుంటుంది?
ఉమ్మడి ఆస్తి కానప్పుడు ఆ మైనర్ పిల్లవాడి ఆస్తి సహజ సంరక్షకుని ఆధీనంలో వుండవచ్చు.
అక్రమ సంతానమైన మైనర్ పిల్లలు ఎవరి అధీనంలో వుంటారు?
అక్రమ సంతానమైన మైనర్ పిల్లలు తల్లి ఆధీనంలో వుంటారు. వారికి తల్లే సహజ సంరక్షకురాలు. ఆ పిల్లల మైనారిటీ తీరనంతవరకి వారి తండ్రికి ఎలాంటి వారి అధీనం గురించి ఎలాంటి హక్కు వుండదు. అక్రమ సంతానం తండ్రి ఎవరో తెలిసినప్పటికి తల్లే సహజ సంరక్షకురాలు అవుతుంది.
సహజ సంరక్షకునికి ఎప్పుడు అనర్హత వర్తిస్తుంది?
ఈ నిబంధనలోని ప్రోవిసో ప్రకారం- రెండు సందర్భాలలో అనర్హత ఏర్పడే అవకాశం వుంది.
ఆ సందర్భాలు
--------------
* సహజ సంరక్షకులు వేరే మతాన్ని స్వీకరించినపుడు, అంటే హిందూ మతాన్ని త్యజించినప్పుడు-
* అదేవిధంగా సన్యాసం తీసుకొని వన ప్రస్తానికి వెళ్లినపుడు.


అన్యమతాన్ని స్వీకరించిన సహజ సంరక్షకులకి పిల్లల ఆధీనాన్ని కోర్టు ఇవ్వవచ్చా?

అన్యమతాన్ని స్వీకరించినపుడు సహజ సంరక్షకులకి ఆ హోదా పోతుంది. కానీ అలాంటి వ్యక్తులని కోర్టు సహజ సంరక్షకులుగా నియమించడానికి వీల్లేదని ఎలాంటి నిబంధన లేదు. అందుకని అన్యమతం స్వీకరించిన సహజ సంరక్షకులకి కూడా కోర్టు నియమించవచ్చు.

*
*
*

Wednesday, March 17, 2010

హిందూ మైనరుకి సంరక్షకులు

హిందూ మైనరుకి సంరక్షకులు
March 18th, 2010

పిల్లల సంరక్షణ గురించి రెండు రకాలైన చట్టాలు వున్నాయి. మతాన్ని బట్టి ఒక చట్టం వుంది. మతాలతో సంబంధం లేకుండా మరో చట్టం వుంది. తండ్రి మతాన్ని బట్టి వారి పిల్లలకి అతని మతానికి చెందిన చట్టం వర్తిస్తుంది. రెండు రకాలైన చట్టాలు పిల్లలకి వర్తిస్తాయి.
హిందువులకి సంబంధించి సంరక్షణ గురించి హిందూ సంరక్షణకు మైనారిటీ చట్టం వర్తిస్తుంది. మైనారిటీ తీరని వ్యక్తుల సంరక్షణ కోసం, దానికి సంబంధించిన ‘లా’ని సవరించి క్రోడీకరించి ఈ చట్టాన్ని తయారుచేశారు. హిందూ మైనర్లకి, సంరక్షకులకి సంబంధించిన స్మృతులు, వ్యాఖ్యానాలు, వాటిని కోర్టులు ఆమోదించిన తీరును బట్టి ఈ చట్టాన్ని రూపొందించినారు. అంతేకాదు మైనర్లకి సంబంధించిన ఇతర చట్టాలు గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం 1890, హిందూ మెజారిటీ చట్టం, 1875 చట్టంలోని నిబంధనల ఆధారంగా దీన్ని రూపొందించినారు. ఈ చట్టాలని పరిశీలించి దీన్ని తయారుచేశారు. ఈ చట్టంలోని సె.2 ప్రకారం ఇది గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానికి అధికం తప్ప దాన్ని తక్కువ చేయడానికి ఉద్దేశించి కాదు. ఈ చట్టంలోని నిబంధనలకి మిగతా చట్టంలోని నిబంధనలు విరుద్ధంగా వుంటే ఈ చట్టంలోని నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ చట్టంలో చెప్పిన విషయాలకు సంబంధించి హిందూ లాలోని ఇతర చట్టాలు వర్తిస్తాయి. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం అన్ని మతాలవారికి వర్తిస్తుంది. ఈ చట్టం హిందువులకి మాత్రమే పరిమితం.
ఈ చట్టంలో నిబంధనలని గమనించినపుడు, ఇది ఇతర చట్టాలకి అనుబంధమని తెలుస్తుంది. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానికి ఇది అదనం. సంరక్షకులుగా వ్యవహరించడానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలో, అందులో ఏ ఏ అంశాలు వుండాలో గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టంలో వివరంగా చెప్పినారు. అదేవిధంగా సంరక్షకుల విధులు, ఆ సంరక్షకులని తొలగించు విధానం ఆ చట్టంలో స్పష్టంగా చెప్పినారు. ఈ విషయాలకి సంబంధించి హిందువులు కూడా గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానే్న ఆశ్రయించాల్సి వుంటుంది.

మైనరంటే ఎవరు?
హిందూ మైనర్ల సంరక్షకుల చట్టప్రకారం మైనరంటే- 18 సంవత్సరాలు నిండని వ్యక్తి.
సంరక్షకులు అంటే ఎవరు?
మైనర్ వ్యక్తి సంరక్షణ, అతని ఆస్తి సంరక్షణ చూస్తున్న వ్యక్తిని సంరక్షకుడు అంటారు. అందులో ఈ వ్యక్తులు వుంటారు.
* సహజ సంరక్షకులు
* మైనర్ వల్ల లేదా తండ్రి రాసిన వీలునామా ద్వారా నియమితుడైన వ్యక్తి
* కోర్టు ప్రకటించిన లేదా నియమించిన వ్యక్తి.
* ఏదైనా చట్టం ద్వారా అధికారం వచ్చిన వ్యక్తి లేదా సంరక్షకుల చట్టం ద్వారా అధికారం వచ్చిన వ్యక్తి.
హిందూ మైనరుకి సహజ సంరక్షకులు ఎవరు?
హిందూ మైనరుకి సహజ సంరక్షకులు ఆ శిశువు తండ్రి. అతని తరువాత తల్లి సహజ సంరక్షకురాలు.
5 సంవత్సరాలుకు లోబడిన మైనరు పిల్లలకు మాత్రం తల్లే సహజ సంరక్షకురాలు.
అక్రమ సంతానం అయినపుడు వాళ్ళకి ముందుగా ఆ పిల్లల తల్లి సహజ సంరక్షకురాలు. ఆ తరువాత తండ్రి.
వివాహం అయిన బాలికకు మాత్రం ఆమె భర్త సహజ సంరక్షకుడు.
సహజ సంరక్షకులే ఆ పిల్లల ఆస్తికి కూడా సంరక్షకులు అవుతారు.
సంరక్షకులు హిందూ మతాన్ని వీడినప్పుడు...
సహజ సంరక్షకులు హిందూమతాన్ని విడనాడినప్పుడు, సన్యాసం స్వీకరించినపుడు మాత్రం సహజ సంరక్షకులుగా వుండటానికి వీల్లేదు.
ఐదు సంవత్సరాల లోపు వున్న పిల్లల ఆస్తికి సంరక్షకులు ఎవరు?
ఐదు సంవత్సరాల లోపు వున్న పిల్లలకి సంరక్షకులుగా తల్లికి అర్హత వుంటుంది. వారి ఆస్తికి ఎవరు సంరక్షకులుగా వుంటారో, ఈ చట్టం చెప్పలేదు. ఇలాంటి సందర్భాలలో గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టప్రకారం ఆ పిల్లల ఆస్తికి సంరక్షకులని నియమించాల్సి వుంటుంది.
హిందూ సంరక్షణ మైనారిటీ చట్టం వచ్చినప్పటికీ గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం తన ఉనికిని కోల్పోలేదని మనకు

Wednesday, March 10, 2010

న్యాయపరమైన క్రూరత్వం

March 9th, 2010

‘క్రూరత్వాన్ని’ నిర్వచించలేదు. రాయల్ కమిషన్ (1956)లో క్రూరత్వం గురించి ఈ విధంగా పరిశీలించింది.
‘‘క్రూరత్వాన్ని నిర్వచించకుండా అదేవిధంగా వుంచడం అవసరం. ఎందుకంటే విభిన్న తరగతుల మధ్యన క్రూరత్వం విభిన్నంగా వుంటుంది’’.
క్రూరత్వం అనేది కేసు స్వభావాన్ని బట్టి మారుతుంది. కేసు నేపథ్యాన్ని బట్టి, సాక్ష్యాలను బట్టి కోర్టులు క్రూరత్వాన్ని అంచనావేయాల్సి వుంటుంది. వైవాహిక కేసులు చాలా సున్నితమైనవి. ప్రతి కేసు దానికదే ప్రత్యేకంగా వుంటుంది. ఒక కేసులో క్రూరత్వం అనేది మరో కేసులో క్రూరత్వం కాకపోవచ్చు. అందుకని క్రూరత్వాన్ని ఎప్పుడు ఒకే విధంగా చూడలేం.
వాదికి జీవితానికి వున్న హాని, ఆపదని బట్టి క్రూరత్వాన్ని చూడాల్సి వుంటుంది. ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటనలని క్రూరత్వంగా పరిగణించలేం.
కానీ కేసులో జరిగిన సంఘటనలన్నింటి ఆధారంగా క్రూరత్వం అన్పించినపుడు మాత్రమే క్రూరత్వంగా పరిగణించాల్సి వుంటుంది. హిందూ వివాహ చట్టంలోని క్రూరత్వం గురించి జిల్లా హైకోర్టు 1985లో ఒక తీర్పుని ప్రకటించింది. అదే ‘హాండా వర్సెస్ హాండా’ (ఎ.ఐ.ఆర్.1985 ఢిల్లీ 76) ఆశాహాండా వర్సెస్ బల్దేవ్ రాజ్ హాండా. ఆ కేసులోని విషయాలకొస్తే- వారిద్దరి వివాహం 21 మార్చి 1972లో జరిగింది. మార్చి 5, 1981 రోజున ఆశా విడాకుల కోసం భర్తపైన కేసుని దాఖలు చేసింది. క్రూరత్వం, వదిలిపెట్టడం అన్న రెండు ఆధారాల ప్రకారం ఆమె కేసును దాఖలు చేసింది. 1973 నుంచి వాది తన మొత్తం జీతం తనకే ఇవ్వాలని ప్రతివాది ఆమెను రోజూ హింసించేవాడు. జీతం మొత్తం తీసుకొని చాలా చిన్న మొత్తాలని ఆమెకు ఖర్చు క్రింద ఇచ్చేవాడు. తరువాతి తరువాతికాలంలో ఆమె వ్యక్తిగత ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వడం మానేశాడు. ప్రసవానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. బిడ్డ అనారోగ్యంగా వున్నపుడు మందులు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. రోజూ రాత్రి తాగి వచ్చి తిట్టడం కొట్టడం, ఇంట్లోనుంచి బయటకు పంపిస్తానని అనడం దాకా వెళ్ళింది.
ప్రతివాది చర్యలు క్రూరత్వం క్రిందకు వస్తాయా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించింది. మారుతున్న సాంఘిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూడాల్సి వుంటుందని కోర్టు అభిప్రాయపడింది. స్వభావాలలో వున్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని విడాకులు మంజూరు చేయకూడదు. ఏదైనా సంఘటన క్రూరత్వంగా ఇతరులకి కష్టం కలిగించే సంఘటన లేదా సంఘటనలు తీవ్రంగా వుండాలి. అంతేకానీ, అయితే అతని ప్రవర్తన రోజువారీ జీవితంలో తీవ్రమైనదిగా వుండకూడదని అభిప్రాయపడింది.
న్యాయపరమైన క్రూరత్వంలో ఈ అంశాలు వుండాలి. అవి:
-జీవితానికి ఆపద లేదా హాని, అది మానసికమైనది కావొచ్చు, శారీరకమైనది కావచ్చు. లేదా
-అలాంటి భయం వుండాలి. అది సహేతుకంగా వుంటే చాలు.
కర్నాటక హైకోర్టు ఈ విషయంలో విస్తృతమైన అర్థాన్ని శ్రీకాంత్ వర్సెస్ అనురాధ (ఏ.ఐ.ఆర్ 1980 కర్నాటక 8) కేసులో ఇచ్చింది. క్రూరత్వాన్ని నిర్వచించడంవల్ల దాని పరిధి తగ్గిపోతుంది. అది అభిలషణీయం కాదు. అది సాధ్యమూ కాదు. న్యాయపరమైన క్రూరత్వం అనేది శారీరక చర్యలకి, గాయాలకే పరిమితం కదా. హాని కలిగించాలన్న ఉద్దేశ్యం ప్రతివాదికి లేకపోవచ్చు. అయినా కూడా క్రూరత్వం వుంటుంది. వైవాహిక బాధ్యతలని విస్మరించడం, దంపతుల్లో ఒకరి ప్రవర్తన ఇతరులని కించపరిచే విధంగా వున్నపుడు, అగౌరవపరిచేదిగా వున్నపుడు అది న్యాయపరమైన క్రూరత్వమే అవుతుంది.
నిర్వచనాలు
హిందూ వివాహ చట్టంలో క్రూరత్వం అంటే ఏమిటో నిర్వచించలేదు. కానీ క్రూరత్వం అంటే ఏమిటో భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఏలో నిర్వచించినారు. ఆ నిబంధన ప్రకారం-
ఎవరైనా ఉద్దేశ్యపూర్వకమైన నడవడిక ద్వారా, ఆ నడవడిక స్వభావంవల్ల ఆ మహిళ ఆత్మహత్య చేసుకునేవిధంగా లేదా తీవ్రమైన గాయాలు అయ్యే విధంగా లేదా ఆమె జీవితానికి అవయవాలకి లేదా ఆరోగ్యానికి హాని కలిగే విధంగా వుంటే అది క్రూరత్వం అవుతుంది. అది శారీరక క్రూరత్వం కావొచ్చు. మానసిక క్రూరత్వం కావొచ్చు.
అదేవిధంగా ఆ మహిళలను గానీ ఆమె సంబంధీకులను గానీ ఏదైనా చట్ట వ్యతిరేకమైన డిమాండ్ చేసి ఏదైనా ఆస్తిని లేదా విలువైన సెక్యూరిటీని పొందడానికి వేధిస్తే అది క్రూరత్వం అవుతుంది.
క్రూరత్వం అనేది ముస్లిం వివాహాల చట్టం, 1939లోని సె.2 (్పజజజ)లో కూడా నిర్వచించినారు. ఆ నిర్వచనం ప్రకారం- భర్త భార్యని ఈ విధంగా చేస్తే అది క్రూరత్వం అవుతుంది.
ఎ) తరుచూ ఆమెపై దౌర్జన్యం చేసినా లేదా ఆమె జీవితాన్ని భరించలేని విధంగా తన నడవడిక ద్వారా చేసినా, అది శారీరకంగా బాధపెట్టడం కాకపోయినప్పటికీ
బి) చెడ్డపేరు వున్న స్ర్తిలతో సాంగత్యం ఏర్పరచుకున్నపుడు లేదా ప్రతిష్టలకి భంగం కలిగే జీవితం గడుపుతున్నపుడు;
సి) అవినీతికరమైన జీవితం గడపాలని భార్యని బలవంతపెట్టినపుడు
డి) ఆమె ఆస్తులని అన్యాక్రాంతం చేసినపుడు లేదా ఆమె హక్కులని ఉపయోగించుకోకుండా నిరోధించినపుడు
ఇ)తన మత సంబంధమైన హక్కులని లేదా అలవాట్లని భర్త ఆటంకపరచినప్పుడు
ఎఫ్) అతనికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు వున్నపుడు, ఆ....... ఖురాన్‌లో చెప్పిన విధంగా సమానంగా

Tuesday, March 2, 2010

విడాకులకు క్రూరత్వమూ ఒక కారణమే!

March 3rd,2010

హిందూ వివాహ చట్టానికి 1976లో మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులకన్నా ముందు ‘క్రూరత్వం’ అనేది విడాకులు పొందడానికి ఒక ఆధారం కాదు. ఈ 1976లో తీసుకొచ్చిన సవరణల ప్రకారం విడాకులు పొందడానికి క్రూరత్వం అనేది కూడా ఒక ఆధారం అయ్యింది. అంతకుముందు అది న్యాయ నిర్ణయ వేర్పాటు పొందడానికి మాత్రమే ఆధారం. సె.10 (బి) (1) ప్రకారం ‘న్యాయ నిర్ణయ వేర్పాటు’ క్రూరత్వం ఆధారంగా విడాకులు పొందే అవకాశం వుండేది. వాదికి సహేతుకమైన భయాందోళనలను కలిగించి ప్రతివాదితో కలిసి జీవించడం హానికరంగా గానీ లేక అపాయకరంగాని ఆ క్రూరత్వం వుండాలి. అలాంటి పరిస్థితులు వుంటేనే న్యాయ నిర్ణయ వేర్పాటు పొందే అవకాశం వుండేది.

1976లో సవరణలు తీసుకొచ్చిన తరువాత హిందూ వివాహ చట్టంలో సె.13 (జ)(ఎ)ని చేర్చినారు. ప్రతివాది వాదితో వివాహం తరువాత క్రూరత్వంతో ప్రవర్తిస్తే విడాకులు పొందడానికి అవకాశం ఈ కొత్త నిబంధన ద్వారా ఏర్పడింది.
‘క్రూరత్వం’ అనే పదానికి విస్తృతమైన అర్ధం, పరిధి వుంది. దీనిలో రెండు స్పష్టమైన అంశాలు వున్నాయి. అవి-

* కష్టపెడుతున్నాడన్న ఫిర్యాదు వుండాలి.
* దాని ఫలితంగా భయంగానీ లేక ఆపదగానీ వుండాలి.
భయంవల్ల వారిద్దరూ కలిసి జీవించడం వల్ల హాని లేక అపాయం గానీ వుండాలి. అవే చర్యలుగానీ అలాంటి చర్యలుగానీ తిరిగి జరుగుతాయన్న భయం వుండాలి.

క్రూరత్వాన్ని విధంగా నిర్థారిస్తారు?

పార్టీల జీవన సరళిని బట్టి క్రూరత్వాన్ని నిర్థారించాల్సి వుంటుంది. కేసు విషయాలని బట్టి, చట్టాన్ని బట్టి నిర్థారించాల్సి వుంటుంది. దీన్ని కోర్టు ముందు రుజువు చేయడానికి ఎలాంటి కొలమానాలు లేవు. అందుకని పార్టీల జీవన సరళి, వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే పద్ధతి, వారి స్వభావాలని సంస్కృతి, దేహ నిర్మాణాన్ని బట్టి, ఇంకా కేసులోని ఇతర విషయాలను బట్టి క్రూరత్వాన్ని నిర్థారించాల్సి వుంటుంది. శారీరక, మానసిక హింస కూడా కోర్టులు పరిశీలిస్తాయి. క్రూరత్వానికి పాల్పడుతున్న వ్యక్తివల్ల ఇంకో వ్యక్తి పొందే శారీరక, మానసిక క్రూరత్వాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. శారీరకంగా జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా క్రూరత్వం కిందకి వస్తాయా అన్న విషయం ఇతర విషయాలను బట్టి వుంటుంది. పార్టీల వయస్సు, జీవనసరళి, హోదా, వారు నివశిస్తున్న వాతావరణం ఇలాంటి విషయాలను బట్టి నిర్థారించాల్సి వుంటుంది. కేసులోని అన్ని విషయాలను గమనించి క్రూరత్వం గురించి కోర్టు ఒక భావనకి రావాల్సి వుంటుంది.

క్రూరత్వానికి సంబంధించి ప్రముఖమైన కేసు ఏమిటి?

క్రూరత్వానికి సంబంధించి ప్రముఖమైన కేసు దస్తానే వర్సెస్ దస్తానే (ఎ.ఐ.ఆర్.1975 సుప్రీంకోర్టు 1534) ఈ కేసు ‘న్యాయ నిర్ణయ వేర్పాటు’కి సంబంధించినది. అయితే ఇది విడాకుల కేసుకి కూడా వర్తిస్తుంది.
ఈ కేసులోని భార్యాభర్తల మధ్య 1956లో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. ఇద్దరు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. చాలా అర్హతలు వున్న వ్యక్తులు. వారికి ముగ్గురు కూతుర్లు కలిగారు. 1961లో ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయి. వారిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తరాలు రాసుకోవడం ఇద్దరికీ చాలా ఇష్టమైన పని. వారిద్దరిమధ్య సంభాషణలు లేకుండా పోయి ఉత్తరాల ద్వారా మాత్రమే సంభాషించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రతివాది తనభర్త పట్ల క్రూరంగా వ్యవహరించిందని ఆ ఉత్తరాల ద్వారానే రుజువైంది. ఆమె తప్పిదాలు కోకొల్లలు. మచ్చుకు కొన్ని-

-అత్తగారు చాలా మోటు మనిషని భార్య తరుచూ అనేది. అదేవిధంగా భర్త పూర్వీకులని శ్రద్ధాంజలి రోజు తిట్టేది.
- పిల్లకి 104 డిగ్రీల జ్వరం వున్నపుడు ఆమెను కొట్టింది.
- అర్ధరాత్రి పూట లైట్లు వేసి రాత్రంతా భర్తతో నసపెట్టేది. ఫలితంగా భర్త ఎన్నోసార్లు తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముగ్గురు న్యాయమూర్తుల బెంచి తరఫున న్యాయమూర్తి చండ్రచూడ్ తీర్పుని ఈ విధంగా వెలువరించారు.
‘‘... ఇలాంటి ఆక్రోశాలు వెళ్ళగక్కడం వైవాహిక జీవితంలో జరుగుతుంటాయి. కాని అవి నిరంతరాయంగా జరగడంవల్ల ఇంటిలో ప్రశాంతత పోతుంది. వైవాహిక జీవితంలోని న్యాయబద్ధమైన మధురిమ పోతుంది. కొన్ని సందర్భాలలో ఏవైనా అనాల్సి రావచ్చు కానీ ప్రతివాది ప్రవర్తన మరీ ఎక్కువగా వుంది. ఆమె నడవడిక క్రూరత్వంగానే పరిగణించాల్సి వస్తుంది. ప్రవర్తన ద్వారా వాది ఆమెతో కలిసి జీవించడం కష్టం.
కోర్టు ఈ కేసులో ప్రతివాది క్రూరత్వం వుందన్న నిర్థారణకి వచ్చి న్యాయనిర్ణయ వేర్పాటు డిక్రీని మంజూరు చేసింది.
క్రూరత్వంలో మానసిక క్రూరత్వం కూడా వు

Followers