Friday, March 27, 2009

votarlu ga namodu 28-3-04 suryaa

విద్యార్థులు ఓటర్లుగా నమోదు

పద్ధెనిమిది సంవత్సరాల వయసు వారికి ఓటు హక్కు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ వయస్సు వారిలో చాలామంది విద్యార్థులు. వారు చదువుతున్న ప్రదేశం ఒకచోట, వాళ్ళ నివాసం మరో చోట. వాళ్ళ స్థిరనివాసం దగ్గరే వాళ్ళ ఓట్లు ఉంటాయి. ఎన్నికల కోసం వాళ్ళు ఎంతో దూరంలో ఉండే తమ ఊళ్ళకు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ ఓట్లు వృధాగా పొయే అవకాశం ఉంది. ఇందకు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందా?ఈ పరిస్థితిని అధిగమించడానికి వాళ్ళు ఎలాం టి చర్యా తీసుకోవడం లేదు. రెండు విధాలుగా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా, లేదా తాము ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రాంతంలోనే తమను ఓటర్లుగా నమోదు చేసుకోవడం ద్వారా! ఇది సాధ్యమయ్యే పనేనా అనే సందేహం వస్తుంది. అవుతుందని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా బెంగళూరు విద్యార్థులు రుజువు చేశారు. రెండు రోజుల క్రితం ఈ వార్త పత్రికల్లో చోటుచేసుకుంది. బెంగళూర్‌ లాంటి పట్టణాల్లో స్థిరమైన జనాభా ఉండదు. చదువుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ వెళుతూ ఉంటారు. ఆ కారణంగా జనాభా ఎక్కువగా ఉన్నా, ఓటర్లు తక్కువ. ఉన్న ఓటర్లలో బూత్‌ దాకా వెళ్ళి ఓటు వినియోగించుకునే ఆసక్తి చాలా మందికి ఉండదు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఓటు ఉండదు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో విద్యార్థులు కూడా ఉంటారు. స్థానికులు కాదనే కారణంతో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల అధికారులు ఇష్టపడరు. అయితే బెంగళూరులో విద్యార్థుల హాస్టళ్లను వారి నివాసంగా పరిగణించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాలే జీ అధికారులు అధికారులను ఒప్పించగలిగారు. ఫలితంగా ఆ కాలేజీ విద్యార్థులు బెంగుళూరు ఓటర్లుగా నమోదైనారు.ఓటర్లుగా నమోదు కావాలంటే ఏ అర్హతలు ఉండాలి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. రాజ్యాంగంలోని అధికరణ 326 ప్రకారం పయోజనుడైన ప్రతి భారతీయుడు ఓటరుగా నమోదు అయ్యే అర్హత కలిగి ఉంటాడు. అతను భారతీయుడై ఉండాలి, అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే కొన్ని అనర్హతలు లేకుండా కూడా ఉండాలి. ఏదైనా చట్ట ప్రకా రం అనర్హతను వారు కలిగి ఉండకూడదు. మానసిక అనారోగ్యం(పిచ్చి) లేకుండాఉండాలి. ప్రవాస ప్రాంతం వాడై ఉండ కూడదు. ఎన్నికల్లో అవినీతికర పనులు చేసినందుకు శిక్ష పడి ఉండకూడదు. ఓటు అనేది రాజ్యాంగ పరమైన హక్కా, చట్టం ద్వారా వచ్చిన హక్కా అన్న ప్రశ్న కూడా ఉంది. అయితే అది ప్రాథమిక హక్కు కాదు. ఈ విషయంలో ఎలాంటి చ…ర్చకు అవకాశం లేదు. రాజ్యాంగంలోని భాగం మూడులో అధికరణం 12 - 35 లలో ఓటు హక్కు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అందులోని ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. ఓటరు అర్హతలు, నమోదు ప్రక్రియ లాంటి విషయాలన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ఓటు హక్కు నియమాలు 1960 లలో చెప్పినారు. అందుకని ఇది చట్టపరమైన „హక్కు అని మన న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని అధికరణ 326 ప్రకారం వయోజనులకు ఓటు హక్కున్న కారణంగా దీన్ని రాజ్యాంగ పరమైన హక్కుగా గుర్తించాలన్న వాదన కూడా ఉంది. ఏ వాదనలు ఉన్నప్పటికీ ఓటు హక్కు అనేది చట్టపరమైన హక్కు అని, అది ప్రాథమిక హక్కు కాదని స్థిరమైపోయింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సె.19 ప్రకారం ఎవరైనా పౌరుడు ఓటరుగా నమోదు చేయించుకోవాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నదన్న సాక్ష్యం, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో సాక్ష్యం ఉంటే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.ఏడు సంవత్సరాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ నివాసాలకు దూరంగా కొన్ని సంవత్సరాలు నివసించవలసి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఒక్క రోజు కోసం తమ గ్రామానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగిం చుకునే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళ ఓటు హక్కు వృధాగా పోవలసిందేనా? `సాధారణ నివాసం' ఉన్న వ్యక్తులు ఓటరుగా నమోదుచేసుకోవచ్చని ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సె.20 చెబుతుంది. కొంతకాలం పాటు ఒక ప్రాంతంలో నిరంతరాయంగా నివసిస్తే దాన్ని సాధారణ నివాసం అంటారు. హాస్టళ్లలో విద్యార్థుల నివాసాన్ని `సాధారణ నివాసం'గా పరిగణించవలసి ఉంటుంది. ఎవరైనా ఒక నియోజక వర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవలసి ఉం టుంది. ఈ విషయం గురించి ప్రకటనను కూడా జత చేయవలసి ఉంటుంది.ఇదివరకే ఎక్కడైనా ఓటరుగా నమోదైతే దాన్ని రద్దు చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.బెంగళూర్‌లో యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఓటరు నమోదు ప్రక్రియను దేశవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల హాస్టళ్లను వాళ్ళ నివాస గృహాలుగా పరిగణించి వాళ్ళని ఓటర్లుగా నమో దుచేయవలసిన అవసరం ఉంది. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు, ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే దాని సార్థకత
.రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Monday, March 23, 2009

surya 21-9-09 saturday

వ్యతిరేక ఓటు అవసరమా?

మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల చర్చ వస్తుంది. తర్వాత మూలన పడుతుంది. విద్యావంతులు ఓటు వేయడానికి ఉత్సాహం చూపరు. ఎండలో వెళ్ళి క్యూలో నిలబడి ఓటు వేయడం ఇష్టం ఉండదు. అలాగే ఓటు వేద్దామనుకొన్నా తమ పేరు ఓటరు లిస్టులోంచి మాయం కావడం వల్ల కొందరు ఓటు వేయలేరు. ఓటు వేద్దామనుకొన్నా తమ ఓటు వేరెవరో వేసి ఉంటారు. ఇలా ఎన్నో కారణాలవల్ల చాలా మంది ఓటు వెయ్యరు. ఈ కారణాలతో బాటు మరో కారణం కూడా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులెవరూ నచ్చకపోవడం వల్ల కూడా ఓటు వేయడానికి కొంత మంది ఇష్ట పడరు. వ్యతిరేక ఓటు వేసే అవకాశం మన దేశంలో లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వ్యతిరేక ఓటు, అభ్యర్థుల నేర చరిత్ర, రీకాల్‌ వంటి విషయాలమీద చర్చ కొనసాగుతుంది. ఎన్నికల సంస్కరణలు అత్యంత అవసరమన్న అభిప్రాయం వినిపిస్తుంది. వ్యతిరేక ఓటు మీద చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. వ్యతిరేక ఓటు అవసరం లేదన్న వాదనకు, అవసరమన్న వాదనకు తగు కారణాలు ఉన్నాయి. ఓటరుకు ఇష్టమైన వ్యక్తులు ఎవరూ పోటీ చేయనప్పుడు, అందరికీ నేర చరిత్ర ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని ఓటరుకు అనిపించవచ్చు. కానీ మన దేశంలో ఆ అవకాశం లేదు. అమెరికాలోని నెవదా రాష్ట్రంలో ఈ పద్ధతి అమల్లో ఉంది. అక్కడి బ్యాలెట్‌ పత్రాలలో `వీరెవరికీ ఓటు వేయడం లేదు' అన్న కాలమ్‌ కూడా ఉంటుంది. అందులో ఓటు వేసి ఓటర్లు అభ్యర్థుల పట్ల తమ వ్యతిరేకతను తెలియజేసే అవకాశం ఉంది. ఇష్టమైన అభ్యర్థులు లేనప్పుడు ఎన్నికలను బహిష్కరించకుండా ఓటు వేసే అవకాశం లేదు. ప్రజలు తమ నిరసనను వ్యక్తపరచడానికి ఎన్నికలను బహిష్కరిస్తూ ఉంటారు. మరి కొంత మంది పోలింగ్‌ బూత్‌ల దాకా వెళ్ళి ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్‌ పత్రాన్ని వేసి వస్తూ ఉంటారు. ఇంకా కొంత మంది ఇద్దరు, ముగ్గురికి కూడా ఓటు వేసి తమ ఓటు చెల్లకుండా చేసి తమ నిరసనను వ్యక్తపరిచే అవకాశం ఉంది. `వ్యతిరేక ఓటు' వేసే అవకాశం ఉంటే తమ నిరసనను చెప్పడానికి ఇటువంటి పద్ధతులు వెతికే అవసరం ఉండదు. బ్యాలెట్‌ పత్రాలలో వ్యతిరేక ఓటు కాలమ్‌ కూడా ఉంచే విషయాన్ని లా కమిషన్‌ కూడా పరిశీలించింది. ఎన్నికల సంస్కరణల గురించి లా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 170వ నివేదికలో ఈ వ్యతిరేక ఓటు వ…ల్ల కలిగే ప్రయోజనాలను ఈ విధంగా వివరించింది- `వ్యతిరేక ఓటు పద్ధతి వల్ల రాజకీయ పక్షాలపై నైతిక పరమైన ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల వారు అనవసరమైన వ్యక్తులను, అవినీతి పరులను, నేరచరితులను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం తగ్గుతుంది'. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం కంటె వ్యతిరేక ఓటుకు ఎక్కువ ఓట్లు వస్తే, ఆ నియోజక వర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ అభ్యర్థులు తిరిగి పోటీ చేయకుండా నిరోధించాలని ఈ పద్ధతిని సమర్ధిస్తున్న వారి వాదన. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో ఈ వ్యతిరేక ఓటు పద్ధతి ప్రవేశ పెట్టడం సాధ్యమా? ఒక వేళ ప్రవేశపెట్టినా అదేమన్నా ఫలితాన్ని ఇస్తుందా? ఇది ప్రస్తుతం జవాబు దొరకని ప్రశ్న. వ్యతిరేక ఓటు గురించిన ఒక ప్రజాహిత కేసు కూడా సుప్రీం కోర్టులో 2004లో దాఖలయింది. ఈ కేసును సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచి 2009 ఫిబ్రవరి 23వ తేదీన పరిష్కరించింది. ఈ కేసును కొట్టి వేయాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. కానీ సుప్రీం కోర్టు అలా చేయకుండా దీనిని విస్తృత ధర్మాసనానికి పంపించాలని సూచించింది. వ్యతిరేక ఓటు అన్నది పూర్తిగా తిరస్కరించలేని అంశమని ఇందువల్ల మనకు బోధపడుతోంది. వ్యతిరేక ఓటు పద్ధతిని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న విషయూన్ని ఎన్నికల కమిషన్‌ పరిశీలించింది. ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఎన్నికల కమిషన్‌ను చాలా మంది కోరుతున్నారు. ఓటర్లకు ఇష్టం లేని వ్యక్తులను తిరస్కరించడానికి వ్యతిరేక ఓటు కూడా అవసరమని ఎన్నికల కమిషన్‌ భావించింది. ఈ విషయమై 2001లో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని సంప్రదించింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తరువాత, 2004లో యుపిఎ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. ఆ ప్రభుత్వం నుంచి కూడా స్పందన రాలేదు. వ్యతిరేక ఓటు గానీ, తటస్థ ఓటు పద్ధతిని గానీ ప్రవేశపెడితే బాగుంటుందని ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి సూచించింది. అయితే, వ్యతిరేక ఓటును ఎక్కువ మంది ఉపయోగిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, తటస్థ ఓటును ఎక్కువ మంది ఉపయోగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, March 13, 2009

14-3-08

ప్రత్యేక ఖైదీలు

భారతరాజ్యాంగం ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చట్టం ముందు వ్యక్తులందరూ సమానమే. ఖైదీలు కూడా మనుషులే. వాళ్ళ కి హక్కులుంటాయి. గతంలో ఖైదీలని శత్రువులుగా చూసేవారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వా త ఖైదీలను మనుషులుగా గుర్తించటం జరిగింది. త… ర్వాతి కాలంలో ఖైదీలకు ఉన్న హక్కులనే కాదు, వారి గౌరవాన్ని కూడా మన సమాజం గుర్తించడం మొదలు పెట్టింది. నాగరిక సమాజంలో శిక్షించే పద్ధతులు కూడా మారిపోయినాయి. కొన్ని దేశాల్లో మరణ శిక్ష అమల్లో నే లేదు. మరి కొన్ని దేశాల్లో ఆనాగరికమైన పద్ధతులు ఇంకా అమల్లో ఉన్నాయి. మన దేశంలో మరణ శిక్ష అమల్లో ఉన్నప్పటికి అరుదైన వాటికి మాత్రమే కోర్టులు ఆ శిక్షను విధిస్తున్నాయి. శిక్షలు విధించినప్పటికి కోర్టు లు, మన సమాజం ఖైదీలకు ఉండే హక్కులను, వారి గౌరవాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఖైదీల హక్కులకు భం గం కలిగించే శిక్షలు వేటినీ ఇప్పుడు మన… దేశంలో కోర్టులు విధించడం లేదు. వ్యక్తుల్లో అంతర్గతంగా ఉన్న ఈ గౌరవం, సమానత్వాన్ని గుర్తించడం సమాజంలో శాంతి పునాది రాళ్ళను గట్టిపరిస్తుందని భావించవచ్చు. చేసిన నేరంతో సంబంధం లేకుండా ఖైదీలందరికీి సమానమైన గౌరవాన్ని మన చట్టం ఇస్తోంది.ఖైదీలు రెండు రకాలుగా ఉంటారు. విచారణలో ఉన్న ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు. ఈ ఖైదీలను వేరు వేరు గా చూడాల్సి ఉంటుంది. వారిని నిర్బంధించడం కూడా వేరు వేరుగా ఉండాలి. విచారణలో ఉన్న ఖైదీలను శిక్షపడిన ఖైదీలతో, అదే విధంగా సివిల్‌ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో కాకుండా వారిని వేరుగా ఉంచాల్సి ఉం టుంది. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని కోర్టు న్యాయ సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ విధం గా ఆదరించకుండా ఏదైనా విచారణ జరిగినటై్లతే దానికి అసహహేతుకమైన విచారణగా పరిగణించడం జరుగుతుంది. సమానమైన న్యాయ సహాయం అందడానిి గాను, జైళ్ళలో మగ్గుతున్న బీదƒ ఖైదీలకు న్యాయ సహాయాన్ని అందజేయాలిసిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పటికీ, విచారణలో ఉన్న ఖైదీల విషయంలో కొంత భేదం ఉం ది. ఈ ఖైదీలను రెండు తరగతులుగా వర్గీకరించారు. ప్రత్యేకమైన తరగతి, సాధారణ తరగతి. సమాజంలో ఉన్న ప్రత్యేƒ హోదా, విద్య, అలవాట్లు, అలవాటై న ఉన్నతస్థాయి జీవనం - వీటిని గమనించి అలాంటి ముద్దాయిలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి జైలు ఆధికారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేయవలసి ఉంటుంది. ఆ సిఫారసులను జిల్లా మేజిస్ట్రేట్‌ అమోదించి వారికి ప్రత్యే క హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ హోదా ఇచ్చినప్పుడు వారికి కొన్ని ప్రత్యేక వసతులు లభిస్తాయి. ఈ నియమం సమానత్వ హోదాకి విరుద్ధంగా ఉందని చా లా మంది భావన. విచారణ కన్నాముందే జైలు నుంచి విడుదలకావడం అనేది ఖైదీలకు ఉన్న హక్కు. ఈ హ క్కు సాధారణ ఖైదీలకు, ప్రత్యేక హోదా ఉన్న ఖైదీలకు కూడా ఉంది. ఈ హక్కును ఉపయోగించుకొని, విచారణలో ఉన్న ఖైదీలు తమ పిల్లలను, తమ కుంటుంబాల ను, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురికాకుండా చూసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా విచారణలో ఉన్న ఖైదీలు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందే హక్కు కలిగి ఉంటారు. ఈ హక్కును ఆరెస్టు నుండి తుది తీ ర్పు దాకా కలిగిఉంటారు. విచారణలో ఉన్న ఖైదీలు, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టంకింద జైళ్ళలో ఉన్న డిటెన్యూ లు జైళ్ళలో పనిచేయాలిసిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే పని చేయవచ్చు, కాని ఇష్టం లేనప్పుడు పనిచేయవలసిన అవసరం లేదు.వివిధ కమిషన్లు జైళ్ళ సంస్కరణల గురించి జారీ చేసి న సిఫారసుల ఆధారంగా విచారణలో ఉన్న ఖైదీలకు కొన్ని ప్రత్యేక హక్కులు, సదుపాయాలు ఉంటాయి. ప్రభుత్వం వారికి ఆ సదుపాయాలను ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. అవి - న్యాయ వాదులతో చర్చించి తమ కేసు డిఫెన్సును సక్రమంగా ఏర్పాటు చేసే హక్కు. క్రయ విక్రయాలు చేసే డాక్యుమెంట్లు, కుదువ డాక్యుమెంట్లు, వీలునామా పత్రం రాసే హక్కు. కూతురు, కొడుకు, ఇతర దగ్గరి బంధువుల వివాహాలకు హజరయ్యే హక్కు. మతపరమైన విధులు నిర్వహించే హక్కు. అవసరమైనప్పుడు వైద్యసదుపాయం పొందే హక్కు. జైలు నియమాలకు విరుద్ధంగా ఏవైనా శిక్షలు విధించినట్లయితే వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకొనే హక్కు. స్త్రీలను, జువనైల్‌‌స (బాలనేరస్థులు)ను వేరుగా నిర్బందించే హక్కు. యూనివర్సిటీ, స్కూలు విద్యను కొనసాగించే హక్కు. బంధువులకు ఉత్తరాలు రాసుకొనే హక్కు. రేడియో, టెలివిజన్‌, ఇతర సంగీత వాయిద్యాలను ఉపయోగించే హక్కు. ఎన్నికల్లో నిలబడే హక్కు, తనకు ఇష్టమైన వ్యక్తికి ఓటువేసే హక్కు.కొంత మంది ఖైదీలు చిన్న నేరాలు చేసి చాలాకాలం నుంచి జైళ్ళలోనే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులను గమనించి శాసన కర్తలు బెయిల్‌ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. బెయిలబుల్‌ నేరాల్లో అంటే బెయిలు పొందడం హక్కుగా కలిగిఉన్న నేరాల్లో ముద్దాయి కోరకుండానే కోర్టు బెయిల్‌ను మంజూరు చేవలసి ఉంటుంది. ఈ కేసుల్లో కూడా కోర్టులు జామీను కోరే అవకాశం ఉంది. జామీను కట్టలేని పేదవాళ్ళు చాలా మంది జైళ్ళలో ఉండి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించి పేదవాళ్ళని వ్యక్తిగత పూచికత్తు మీద వదిలిపెట్టాలన్న నిబంధనని క్రి.ప్రొ.కో.సె- 436లో కొత్తగా చేర్చారు. ఈ నిబంధన ప్రకారం ఆరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల దాకా ఎవరైనా వ్యక్తి జామీను పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తిని నిరుపేద వ్యక్తిగా భావించాల్సి ఉంటుంది. బెయిలబుల్‌ నేరాల్లో ముద్దాయి ఆరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల్లో జామీను పెట్టుకోకపోతే అతనికి జామీను పెట్టుకొనే స్థోమత ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన కోసం నిరుపేదగా గమనించి వ్యక్తిగత పూచికత్తుమీద విడుదల చేయాల్సి ఉంటుంది.విచారణలో ఉన్న ఖైదీలు శిక్షపడిన ఖైదీలకన్నా మంచి స్థితిలో ఉంటారు. అంటే వారు ఎన్నికల్లో నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశం శిక్షపడిన ఖైదీలకు ఉండదు. అదే విధంగా ఇష్టం ఉంటేనే జైళ్ళల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాని కఠిన కారాగార శిక్షపడిన ఖైదీలు వారి ఇష్టఇష్టాలతో నిమిత్తం లేకుండా జైళ్ళల్లో పని చేయాల్సి ఉంటుంది. ఖైదీలకు హక్కులు ఉండటంతోనే సరిపోదు, వాటిని ఉపయోగించుకోవాలనే విషయం కూడా వారికి తెలిసి ఉండాలి. అప్పుడే ఆ హక్కులకు సార్థకత. విచారణలో ఉన్న ఖైదీలను రెండు తరగతులుగా విభజించడం ఎంత మేరకు సమంజసమో అర్థంకాని విషయం.

రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయ సహాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, March 6, 2009

atrocities on women 7-2-09 sataur day suryaa daily

మహిళలపై నేరాలను నిరోధించలేమా?
mangari rajender

మరోమహిళా దినోత్సవం వచ్చేస్తోంది. కాని మహిళల జీవితాల్లో పెద్దమార్పేమీ ƒనిపించడం లేదు. నేరాలు తగ్గడం కాకుండా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈవ్‌ టీజింగ్‌లు, లైంగిక వేధింపులను చాలా చిన్న విషయాలుగా మన సమాజం భావిస్తోంది. కారణం, అవి రోజూ మన జీవితంలో మామూలు విషయాలైపోయాయి. సమాజంలో కొత్త కొత్త సంఘటనలు కనిపిస్తున్నాయి. తనని ప్రేమిం చడం లేదని స్త్రీలను చంపివేస్తున్న సంఘటనలు, వారి మీద యాసిడ్‌ దాడులు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రేమించమంటూ సంవత్సరాల తరƒబడి వేధించడం, చివరకు ఆ అమ్మాయి వివాహం చేసుకొంటున్న దశలో అల్లరి పెట్టడం, దాడులు చేయడం ఎక్కువగా జరుగుతున్నాయి.

యాసిడ్‌ దాడులేకాదు, ఈ మధ్యకాలంలో ప్రేమించిన స్త్రీలపై వేడి నూనెతో కూడా దాడులు చేస్తున్నారు. మెసేజ్‌ల ద్వారా మహిళలను అందోళనకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఈవ్‌ టీజింగ్‌లు, ప్రేమిస్తున్నానని వెంటపడటం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఉపేక్షించడం కూడా ఇలాంటి చర్యలు ఎక్కువ కావడానికి దోహద పడుతోంది. ఈ నేరాల బారిన పడుతున్న వ్యక్తులు యుక్త వయస్సులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయలేక పోతున్నారు. ఫిర్యాదు చేస్తే అనవసర ప్రచారం జరుగుతుంది. అది వాళ్ళకు హానికరంగా మారే అవకాశం ఉంది.

అంతేకాదు, ఆ స్త్రీలంటే పడని వ్యక్తులు ఈ విషయాల గురించి చిలువలు పలువ…లుగా చెప్పుకొంటారు. ఇవన్నీ ఇష్టంలేక స్త్రీలు ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. అందువల్ల ఈ నేరాలు అంతకంతకూ వికృత రూపం దాలుస్తున్నాయి.ఈ మధ్య ఒక అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌ వచ్చింది. దాన్ని వాళ్ళ చిన్నాన్న చూసి ఆ వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయితో పాటు చదువుతున్న విద్యార్థే. కాలేజి యాజమాన్యం ఆ విద్యార్థిని మందలించింది. అందుకనే ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. ఇలా చాలా సంఘటనలు పోలీసుల దృషిి్ట, కోర్టుల దగ్గరకు రాకుండాఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు.

స్త్రీలపై జరిగే ఈ నేరాలు కొన్ని బలప్రయోగం లేకుండా జరిగేవే. కాలేజిల్లో రోడ్డు మీద మహిళలను మాటల ద్వారా, సైగల ద్వారా, చర్యల ద్వారా అవమానపరచడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. మొబైల్‌ ఫోన్లు వచ్చిన తర్వాత మెసేజ్‌ల ద్వారా స్త్రీలను అవమానపరచడం జరుగుతోంది. ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ- మెయి ల్‌‌స ద్వారా మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుఉంటారు. మెసేజ్‌లు పంపడం, ఈ- మెయిల్‌‌స పంపడం నేరం అవుతుందా? అసభ్యకరమైన మెసేజ్‌లను, ఈ- మెయిల్‌‌సను పంపించినప్పుడు వాళ్ళపై చర్య తీసుకొనే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నే నేను ఉదహరించిన సంఘటనలోని అమ్మాయి వాళ్ళ చిన్నన్న అడిగాడు. కానీ అనవసర ప్రచారాన్ని ఇష్టపడక పోవడంవల్ల పోలీసులకు ఫిర్యాదుచేయకుండా ఊరుకున్నారు.
ఉద్దేశ్యపూర్వకంగా స్త్రీ గౌరవ మర్యాదలను కించపరచడానికి ఏ వ్యక్తి అయినా ఏమైనా మాటల్ని గాని, శబ్దాలను కాని, భావ సూచనలని గాని, ఏవైనా వస్తువులను గాని ప్రదర్శించి ఆ చర్యలను గమనించాలని అనుకొన్నప్పుడు అది భారతీయ శిక్షాస్మృతిలోని సె-509 ప్రకారం నేరం అవుతుంది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఆ వ్యక్తి చేసిన చర్యలను ఆ స్త్రీ చూడాల్సిన అవసరం లేదు, ఆ చర్యలను చూసినవారెవరైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ మహిళను కోర్టులో విచారించాల్సిన అవసరం ఉండదు. అనవసర ప్రచారం లేకుండానే శిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ అంశాన్ని కోర్టులు, పోలీసులు గమనించి సున్నితంగా వ్యవహరించినప్పుడే ఆ నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడే అవకాశాలున్నాయి. సె-509 ప్రకారం నేరం రుజువు చేయాలంటే బాధితురాలిని సాధారణంగా విచారించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ముద్దాయి అన్న మాటలు శబ్దాలు, భావసూచనలు ఆ స్త్రీ చూడాలని, వినాలని అతను చేశాడని రుజు వుచేస్తే సరిపోతుంది. అందుకని బాధితురాలిని కోర్టులో తప్పకుండా విచారించాల్సిన అవసరం లేదు.

అసభ్యకరమైన ఉత్తరాలను, మెసేజ్‌లను, మెయిల్‌‌సను పంపించడం సె-509 ప్రకారం నేరమవుతుంది. స్త్రీ గుప్తతలోకి చొరబడటం కూడా నేరమే. ఎవరైనా వ్యక్తి జనంలో ఉన్నప్పటికీి ఆ వ్యక్తి గుప్తత ఉంటుంది. అది ఆలోచనకు సంబంధించిన గుప్తత కావొచ్చు. ఈ గుప్తతలోకి జొరబడడానికి ఎవరికీ అవకాశం లేదు. ఎవరి గుప్తతనైనా భంగపరిచేటప్పుడు సాధారణంగా క్షమించమనే అడుగుతాము. స్త్రీ గుప్తతలోకి జొరపడటం జనం మధ్య ఉన్నప్పుడు, ఆమె ఇంటిలో ఉన్నప్పుడు కూడా జరగొచ్చు. స్త్రీనిచూసి అనవసరంగా నవ్వడం, కన్నార్పకుండా వాళ్ళను చూడటం లాంటి సంఘటనలు కూడా ఆమె గుప్తతలోకి జొరబడటమే అవుతుంది. అయితే ఈ నేరాలకి చట్టం నిర్దేశించిన శిక్ష మాత్రం చాలా తక్కువ.మన దేశంలో స్త్రీలు అనుకూలస్థితిలో లేరు. ఎన్నో సాంఘిక పరమైన ఆటంకాల ను, ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో పాటు సమాన స్థాయిని ఇచ్చారు. కాని వాస్తవం ఆవిధంగా లేదు. ఇటీవలి కాలంలో స్త్రీలపై వేధింపులు ఎక్కువైనాయి. స్త్రీలపై జరుగుతున్న నేరాలు వాళ్ళకి మాత్రమే వ్యతిరేకంగా జరిగినవి కాదు, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు. ఈనేరాల వల్ల స్త్రీలు తీవ్రమైన అశాంతికి లోనవుతారు.

తీవ్రమైన భావోద్రేకాలకు లోనవుతారు. అయినా కూడా ఈ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. అది సహజం. ఎందుకంటే, ఫిర్యాదు చేయడంవల్ల వారు ఎక్కువ అసౌకర్యానికి గుర య్యే అవకాశం ఉంది. అయితే ఫిర్యాదు చేయకపోవడం వల్ల తర్వాత కాలంలో తీవ్రమైన పరిణామాలను ఎదుక్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ అందుకు తార్కాణాలే. ఇలాంటి ఫిర్యాదులు అందిన…ప్పుడు పోలీసులు కూడా ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందించడం లేదు. అందరూ సున్నితంగా స్పందించినప్పుడే తీవ్ర పరిణామాలు రాకుండా నిరోదించగలం. నేరం జరిగిన తరువాత తీవ్రంగా స్పందించడం కంటే నేరం జరుగకుండా నిరోధించడం మేలు. ఈ విషయాన్ని అందరూ, మరీ ముఖ్యంగా పోలీసులు గుర్తించాలి. అందు వ…ల్ల మహిళలపై నేరాలను నిరోధించలేకపోయినా తగ్గించే అవకాశం ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసహాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Followers