Saturday, June 13, 2009

సార్వ భౌమ మినహాయింపు ఎప్పుడు వర్తించదు?
ఈప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు భంగం వాటిల్లిందని చెప్పడంతో కోర్టు బాధ్యత తీరిపోదు. నష్ట పరిహారాన్ని బాధితులకు చెల్లించాలి. అయితే, ఈ నష్ట పరిహారం కూడా సివిల్‌ చర్యల్లో భాగం కాకుండా, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినందుకు గాను పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. జరిగిన తప్పుకు- జరిగిన గాయానికి శాసన ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడమే కోర్టులు ఇచ్చే క్లేశ నివారణ చర్య. ఇలాంటి విషయాల్లో ‘సార్వభౌమ మినహాయింపు’ వర్తిం చదు. మోటారు వాహన ప్రమాదాలు రిగినప్పుడు కూడా ప్రభుత్వాలకు సార్వభౌమ మినహాయింపు వర్తించదు. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని చాలా కేసుల్లో స్పష్టం చేసినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతుంటాయి. కస్తూరీ లాల్‌ కేసులో ‘సార్వభౌమ మినహాయింపు’ గురించి చర్చ జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న సార్వభౌమ మిన హాయింపు అనేది రాజ్యం సేవకులు చేసిన సివిల్‌ నేరాలకు మాత్ర మే వర్తిస్తుంది. అది ఏమీ రక్షణ కూడా కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు 32, 226 ప్రకారం నష్టపరిహారం ఇమ్మని కోర్టులు ఆదేశించవచ్చు. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం అదే. కస్తూరీ లాల్‌ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు అతని వస్తువులు జప్తు చేసి తమ తప్పు వల్ల తిరిగి ఇవ్వలేదు. అది సివిల్‌ తప్పిదానికి కోరిన నష్టపరిహారం. అంతే కానీ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినందుకు కోరిన నష్ట పరిహారం కాదు. అందుకని కస్తూరీలాల్‌ కేసులోని తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వర్తించదు.తమ సేవకుల వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లైతే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం అభయం ఇచ్చిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛలను రాజ్యాంగ వ్యతిరేకం గా కాలరాచినప్పుడు, పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాలకు కోరే నష్ట పరిహారానికి అదనంగా ఈ నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రొసీడింగ్స్‌కు భిన్నంగా పబ్లిక్‌ లా ప్రొసీడింగ్స్‌ను నిర్దేశించారు. రాజ్యాంగం అభయం ఇచ్చిన ఆర్టికల్‌ 21 లోని అజేయమైన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. అందువల్ల దేశ పౌరులకు తమ హక్కులను, ప్రయోజనాలను రక్షించే న్యాయ వ్యవస్థ ఉందన్న విశ్వాసం కలుగుతుంది. ప్రాథమిక హక్కులకి రక్షణ కల్పించడంలో విఫలమైన రాజ్యాన్ని బాధ్యత వహించేలా చేసి కోర్టులు ఆర్టికల్‌ 32 లేక 226 ప్రకారం నష్టపరిహారాన్ని మంజూరు చేస్తున్నాయి. సివిల్‌ లా పరిధిలో ఉపశమనాల్ని ఇచ్చే పాత పద్ధతి వల్ల, కోర్టుల పరిధిని తగ్గించడమే అవుతుంది. ప్రజల సాంఘిక ఆకాంక్షల్ని కోర్టులు, చట్టాలు సంతృప్తి పరచాల్సిన బాధ్యత వాటిపై ఉంది. ఈ వాస్తవాలకు దూరంగా కోర్టులు ఉండటానికి వీల్లేదు. ముద్దాయిని శిక్షించడం వల్ల కావలసినంత ఊరడింపు బాధితుల కుటుంబాలకు దొరకదు.సివిల్‌ చర్యల వల్ల నష్టపరిహారం పొందడం కష్టమైన పని. డబ్బు రూపేణా నష్టపరిహారం ఇవ్వడం వల్ల కొంతవరకైనా బాధితులకు, వారి కుటుంబాలకు ఉపయోగం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ గాయాలని మాన్పే బలమైన ఉపశమనం ఇదే. నీలాబతి బెహవా కేసులో సుప్రీంకోర్టు సేవకుల తప్పిదాలకు రాజ్యం బాధ్యత వహించే విషయంలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెలిబుచ్చింది-ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్ళు సివిల్‌ కోర్టుల్లో కేసులు దాఖలు చేసుకోవచ్చు. అయితే సివిల్‌ కోర్టులకే వెళ్ళాలని హైకోర్టులు రిట్‌ పిటీషన్లలో అనడానికి వీల్లేదు. ఆ విధంగా ఉపశమనం పొందే అవకాశం ఉన్నప్పుటికీ పబ్లిక్‌ లా ప్రకారం ఎలాంటి నష్టపరిహారం రాదు అని కోర్టులు అనడం సరైంది కాదు.ఇది ఇలా ఉంటే, సివిల్‌ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ‘సార్వభౌమ మినహాయింపు’ను కోరుతుంటాయి. ఈ సిద్ధాంతానికి సుప్రీంకోర్టు ఎన్నడో తెర దించేసింది. అయినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నా యి. మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నాయి. ఈ మినహాయింపు వర్తించదని సుప్రీంకోర్టు పుష్పా టాకూర్‌ కేసులో స్పష్టం చేసింది.పుష్పా టాకూర్‌ కేసులోని విషయాలకు వస్తే- మిలిటరీ ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఓ మోటారు వాహన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయినాయి. కుడి కాలిని తీసివేయాల్సి వచ్చింది. బాధితుడు మోటారు వాహన చట్ట ప్రకారం నష్టపరిహారం కోరాడు. ట్రిబ్యునల్‌ అతని క్లయిమ్‌ను విచారించింది. ప్రమాదానికి కారణం ఆ వాహన డ్రైవరేనన్న నిర్ణయానికి వచ్చింది. కానీ ఆ ట్రక్కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్‌ బలగాలకు సంబంధించినది కాబట్టి సార్యభౌమ మినహాయింపు అనేది ఉంటుందన్న కారణంగా నష్టపరిహారాన్ని మంజూ రు చేయలేదు.బాధితుడు హైకోర్టుకి అప్పీలు చేశాడు. హైకోర్టు కూడా ట్రిబ్యునల్‌ అభిప్రాయాన్నే బలపరిచింది. అందుకని అతను సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.తన సేవకులు చేసిన పనులకి రాజ్యం బాధ్య వహించదన్న సూ త్రం పాతబడిపోయిందని, సార్వభౌమ మినహాయింపు వర్తించదని హైకోర్టు తప్పు తీర్పు ప్రకటించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం విషయంలో ఎలాంటి వివాదం లేదు. అందుకని ప్రభుత్వం అతని తప్పుకి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. క్ష రూపాయలను నష్టపరిహార మొత్తంగా సుప్రీంకోర్టు నిర్ధారించి హైకోర్టు తీర్పుని కొట్టివేసింది.తన సేవకులు చేసిన తప్పిదం వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో సివిల్‌ కేసుల ద్వారా కాకుండా రిట్‌ల ద్వారా కూడా కోర్టులు నష్ట పరిహారాలను మంజూరు చేయవచ్చు.

No comments:

Post a Comment

Followers