Monday, June 22, 2009
బ్లాగ్లు - లీగల్ సమస్యలు
బ్లాగ్లు - లీగల్ సమస్యలు
ఒక విషయాన్ని తెలియచెప్పడం అనేది ఒక కళ. ఒకే విషయాన్ని కొంతమంది చాలా అందంగా, ఆకర్షించేట్టు చెబుతారు. మరి కొందరు ఆ విధంగా చెప్పలేకపోతారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత కమ్యూనికేషన్ చాలా వృద్ధి చెందింది. అచ్చు యంత్రం వచ్చిన తరువాత ఇది అభివృద్ధిలోకి వచ్చింది. ఇంటర్నెట్ యుగంలో కమ్యూనికేషన్ ప్రాధాన్యతని సంతరించుకుంది.
ఈ ఇంటర్నెట్ యుగంలో ‘బ్లాగులు’ వచ్చేశాయి. కొంత బ్లా గుల్లో రాసుకున్న సమాచారాన్ని పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. ఓ యువతి తన బ్లాగ్లో రాసిన నవల ఇంగ్లీషులో వచ్చి చాలా ప్రాచుర్యాన్ని పొందింది. కొన్ని బ్లాగ్లు సమాచారాన్ని ఇస్తున్నార ుు. మరికొన్ని బ్లాగ్లు చర్చావేదికలుగా ఉంటున్నాయి. చాలా మంది ప్రముఖులు కూడా బ్లాగులని నిర్వహిస్తున్నారు. కొన్ని బ్లా గులని చాలా మంది చదువుతున్నారు. కొన్ని బ్లాగ్ల చర్చా వేదికల్లో కొందరు పాల్గొని తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. ఈ బ్లాగ్ల్లో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే ఎవరిపైన చర్య తీసుకోవాల్సి ఉంటుం ది. వారి పైన పరువు నష్టం కలిగించినారని సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి అవకాశం ఉందా? డి.అజిత్ అనే వ్యక్తిపైన శివసేన కార్యకర్తలు ముంబైలో క్రిమినల్ కేసుని దాఖలు చేశారు. తన పై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయాలని అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విఫలమైనాడు. ఈ నేపథ్యంలో బ్లాగుల గురించి, చట్టపరమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన విషయాలు తెలుసుకునే ముందు బ్లాగ్ అనే పదబందం ఎట్లా అమల్లోకి వచ్చిందో చూద్దాం. వెబ్(ఠ్ఛీఛ), లాగ్(జూౌ) అన్న రెండు పదాల నుంచి బ్లాగ్ అన్న పదబందం వాడుకలోకి వచ్చింది.
బ్లాగ్ అంటే ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉన్న ‘అంతర్జాల డైరి’. ప్రజల అభిప్రాయాలని అంతర్జాల పేజీలలో తెలియచేసే అవకాశం ఉన్న స్థలం. తమ వ్యక్తిగత అభిప్రాయాలని బ్లాగ్ల్లో వ్యక్తపరచవచ్చు. లేదా సమకాలీన సమస్యల మీద సంఘటనల మీద తమ అభిప్రాయాలని బ్లాగ్ల్లో వ్యక్త పరచవచ్చు. ఆ క్షణంలో జరుగుతున్న సంఘటనల మీద కూడా అప్పటికప్పుడు తమ అభిప్రాయాలని వ్యక్తపరచడానికి అవకాశం ఉన్న స్థలం, సాధనం బ్లాగ్. బ్లాగ్ను సంపాదించడం చాలా సులువు. బ్లాగ్ను ఏ విధంగా తయారుచేసుకోవచ్చోనన్న విషయం అంతర్జాలంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తి అయినా సులువుగా తెలుసుకోవచ్చు. తమ వ్యక్తిగత సమాచారాన్ని కొంతమేరకే తెలియపరిచి బ్లాగ్లను సృష్టించుకునే అవకాశం ఉంది. ఈ బ్లాగ్లకి అవసరమైన స్థలాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాడుకందార్లకి ఉచితంగా అందచేస్తున్నాయి. ఈ స్థలానికి వాళ్ళు ఎలాంటి డబ్బులని కూడా తీసుకోవడం లేదు.
ఇంత సులువుగా, ఎలాంటి ఖర్చు లేకుండా సంపాదించుకునే ఈ స్థలానికి ప్రచురణ కర్త ఎవరు? బ్లాగ్లలో పరువునష్టం కలిగించే రాతలని, మీద విద్వేషాలని కలిగించే రాతలని, అసభ్యకరమైన బొమ్మలని ప్రచురిస్తే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? దీని బాధ్యత ఆ బ్లాగ్ని నిర్వహిస్తున్న వ్యక్తిపై ఉంటుం దా? ఆ స్థలాన్ని సమకూర్చిన ఇంటర్నెట్ ప్రొవైడర్పై ఉంటుందా? ఆ సమాచారాన్ని అందులో ఉంచిన వ్యక్తిపై ఉంటుందా? ఈ ముగ్గురిపై ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మన దేశంలో సరైన సమాధానం లేదు. దానికి కారణం- వీటిని నియంత్రించడానికి అవసరమైన శాసనం ఇంకా మన దేశంలో లేదు.
బ్లాగ్లో కన్పించే అసభ్యకరమైన పదాలని బొమ్మలని తొలగించడానికి వడబోత యంత్రాంగం ఉంది. కానీ ఆ వడబోత ‘స్పామ్’ (టఞ్చఝ)లు అన్నింటిని తీసివేయలేవు. పరువు నష్టానికి సంబం ధించిన విషయాలు సందర్భాన్ని బట్టి మాత్రమే అర్థమవుతాయి. ఇది ఒక రకంగా ఉంటే కొన్ని బ్లాగుల్లోని పరిస్థితులు మరోరకం గా ఉంటాయి. కొన్ని బ్లాగ్లు చర్చలని, అభిప్రాయాలని చదువరు ల నుంచి తీసుకుంటాయి.వాటిల్లో ఏవైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే బ్లాగ్ యజమాని దానికి బాధ్యత వహించాల్సి ఉం టుందా? అజిత్ విషయంలో అదే జరిగింది.
శివసేన అజిత్పైన క్రిమినల్ కేసుని దాఖలు చేసింది. మతపరమైన భావాలని భంగ పరుస్తున్నాడని, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని ముంబైలోని పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదుని నమోదు చేసింది. తనపై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయమని అతను సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ని దాఖలు చే శాడు. సుప్రీంకోర్టు అజిత్పైన దాఖలైన కేసుని కొట్టివేయలేదు. అంతర్జాలంలోని తన బ్లాగ్లో ఉన్న సమాచారం ప్రపంచ వ్యాప్తం గా ఎంతోమందికి చేరుతుంది. అందుకని అందులో ఏవైనా అ భ్యంతర విషయాలు ఉంటే దాని పరిణామాలని అతను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. అంటే బ్లాగ్కి కూడా పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదిం చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ దానికి పరిమితులు ఉన్నా యి. ఆ పరిమితులకి లోబడే బ్లాగ్లో విషయాలు ఉండాలి. వార్తాపత్రికలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఉండే పరిమితులు బ్లాగ్కి కూడా ఉన్నాయి.
అజిత్పైన కేసు 2008 ఆగస్టులో దాఖలైంది. అంటే ఐ.టి.చట్టానికి సవరణలు తీసుకొని రాకముందు ఈ కేసు దాఖలైంది. సవరణలు తీసుకొచ్చిన ఐ.టి. చట్టప్రకారం- బ్లాగ్ని నిర్వహిస్తు న్న వ్యక్తి ఆ బ్లాగ్లో ఇతరులు రాసిన వ్యాఖ్యలకి, వాఖ్యానాలకి బాధ్య త వహించడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యాలని అందులో నుంచి తొలగించనప్పుడు మా త్రమే అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ వ్యాఖ్యాలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని అనుకున్నప్పుడు కూడా బ్లాగ్ యజమాని ఆ వ్యాఖ్యాలకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అజిత్ బ్లాగ్లో వ్యక్త పరిచిన అభ్యంతరకర విషయాలు అతనివి కాదు. ఇతరులు వ్యక్త పరిచినవి. అయితే అతను ఆ బ్లాగ్కి కర్త. ఐ.టి. చట్టానికి సవరణలు రాకముందు జరిగిన సంఘటన అది. బాజి.కామ్ కేసు ఫలితంగా ఐ.టి. చట్టానికి సవరణలని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా చట్టాల్లో సవరణలు వస్తున్నాయని భావించడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ సవరణలు కూడా అజిత్ రక్షణకి వస్తాయని ఆశించవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు.
ReplyDelete>>"సవరణలు తీసుకొచ్చిన ఐ.టి. చట్టప్రకారం- బ్లాగ్ని నిర్వహిస్తు న్న వ్యక్తి ఆ బ్లాగ్లో ఇతరులు రాసిన వ్యాఖ్యలకి, వాఖ్యానాలకి బాధ్య త వహించడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యాలని అందులో నుంచి తొలగించనప్పుడు మా త్రమే అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ వ్యాఖ్యాలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని అనుకున్నప్పుడు కూడా బ్లాగ్ యజమాని ఆ వ్యాఖ్యాలకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు."
అయితే ఇంకేం పక్కనోడు అభ్యంతరం చెప్పనంతవరకు బ్లాగుల్లో రెచ్చిపోవచ్చన్నమాట. :))