Wednesday, August 19, 2009

ఉత్తరాలు -విలువ

రోజు రోజుకీ వరకట్నం చావులు పెరిగి పోతున్నాయి. రక రకాల కారణాలతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. సరైన దర్యాప్తు లేకపోవడం, సాక్షులు కోర్టుల్లో ప్రతి కూల సాక్ష్యం ఇవ్వడం లాంటి కారణాలు ఎన్నో, ఈ పరిస్థితిని అధిగమించడానికి మరణ వాంగ్మూలంలాంటివి ఎంతో అవసర మవుతాయి. మరణ వాంగ్మూలం అంటే మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కావొచ్చు.

మరణానికి దారి తీసిన పరిస్థితులు గురించి చెప్పినవి కావొచ్చు. అవి మౌఖి కాంశంగా ఉండవచ్చు. ఉత్తరాల రూపం లో డైరీల రూపంలో ఉండవచ్చు. వాటికి అత్యం త విలువ ఉంది. మరణ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి తన మర ణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన ఎదైనా పరిస్థితిని వివరిం చినప్పుడు, ఆ వ్యక్తి మరణం ప్రశ్నార్థ కమైనప్పు డు వాంగ్మూలం మరణ వాంగ్మూల మవుతుంది.

‘మరణానికి గల కారణం’, ‘మరణానికి దారి తీసి న పరిస్థితులు’ అన్న ్కజిట్చట్ఛట రెండూ ఒకే అర్థంలో వాడినవి కాదు. ఈ రెండింటి మధ్య భేదం ఉంది. రెండింటి ఉద్ధేశ్యం వేరు. మరణానికి గల కారణం అన్న దానికి పరిమితులున్నాయి. రెండో ్కజిట్చట్ఛకి పరిమితులు లేవు. దాని పరిధి విస్తృతమైనది.
మరణానికి సంబంధించి ఏదైనా పరిస్థితిని వివరించినప్పుడు అది వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని సాక్ష్యంగా తీసుకోవాల్సిన ఉంటుంది.

మర ణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే సామీప్యం ఉన్న పరిస్థితు లేనా? దూరమైన పరిస్థితులు ఉంటే అవి సె.32(1) ప్రకారం సంబం ధితాలు కావా? ఈ విషయం గురించి వివాదాలు ఉండేవి కానీ ఈ విషయాన్ని మొదట శరద్‌బిర్థీ చంద్‌ శారద వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ర్ట (ఏ.ఐ.ఆర్‌ 1984 సుప్రీం కోర్టు 1622-1984 క్రిమినల్‌ లా జర్నల్‌ 1738) కేసులో, ఆ తరువాత చాలా కేసుల్లో పరిష్కరించి వివాదానికి తెరదించింది. మరణానికి దారి తీసిన ఏదైనా పరిస్థితితో దగ్గరి సంబంధం ఉందా? దూరం సంబంధం ఉందా అన్న విషయాలతో పని లేదు.

కన్సేరాజ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ ( 2000 ఏ.ఐ.ఆర్‌. 2324 సుప్రీం కోర్టు =2000 క్రిమినల్‌ లా జర్నల్‌ 2993) కేసులో సుప్రీం కోర్టు ఈ విషయం గురించి ప్రస్తావిస్తు- ‘మరణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే పరిస్థితులకి మరణానికి ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి కాదు. సంభవించిన మరణంతో ఆ పరిస్థితులకి దూరమైన సంబంధం ఉన్నా సరిపోతుంది. లీగల్‌ పొజిషన్‌ ఇలా ఉన్నప్పుడు -సునీత తల్లి దండ్రులకి సోదరులకి తెలిసిన వాళ్ళకి మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్లు సెక్షన్‌ 32 ప్రకారం ఆమోదయోగ్యాలు.

ఎవరైనా వ్యక్తి మరణం ప్రశ్నార్థకమైనప్పుడు ఆ మరణించే వ్యక్తి తన మరణానికి గల కారణాన్ని లేక ఆ మరణానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించిన ప్రకటన భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.32(1) ప్రకారం సంబంధితమైనది కాబట్టి అది ఆమోదయోగ్యమైనది. ఈ స్టేట్‌మెంట్లనే మరణ వాంగ్మూలాలని అంటాం. ఈ స్టేట్‌మెంట్లని ‘అవసరార్థం’ అనే సూత్రం ప్రకారం కోర్టులు ఆమోదిస్తున్నాయి. హత్యకు సంబంధించిన విషయాలైతే-మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని రుజువు చేస్తే అవి ఆమోద యోగ్యాలవుతాయి. సె.32 ఆర్షింపబడాలంటే -మృతుని మరణ వాంగ్మూలాన్ని ఆమోదించాలంటే ఈ విషయాలు రుజువు పరచాల్సి ఉంటుంది.

(ఎ) ఎవరి స్టేట్‌మెంట్‌ నైతే రుజువు చేయదల్చుకున్నారో ఆ వ్యక్తి మరణించిన వ్యక్తిగాని, జాడ తెలియని వ్యక్తిగానీ, మతిస్థి మితం కోల్పోయి. సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి గానీ, తీవ్ర మైన ఖర్చుతో కష్టంగా కోర్టుకి పిలవడానికి అవకాశం ఉన్న వ్యక్తిగానీ అయి ఉండాలి. (బి) ఆ స్టేట్‌మెంట్లు సె.32లోని సబ్‌సెక్షన్‌ 1 నుంచి 8 సందర్భాలలో ఏదైనా ఒక సందర్భంలో పేర్కొన్నదై ఉండాలి. సె.32(1)లో పేర్కొన్న మరణానికి దారి తీసిన పరిస్థితులు వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి. ఇంకోరకంగా చెప్పా లంటే-మృతుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న మరణం కావడం లేక మరణానికి దారితీసిన పరిస్థితులు జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి.

మరణించే మనిషి తన నోట్లో అబద్ధాన్ని పెట్టుకొని చావడు (ూ్ఛఝౌ ఝౌటజ్టీఠటఠట ఞట్చ్ఛటఠఝజ్టీఠట ఝ్ఛ్టజీట్ఛ) అన్న సూత్రం ప్రకారం కోర్టు లు మరణ వాంగ్మూలాన్ని నమ్ముతున్నాయి. ఈ స్టేట్‌మెంట్‌ స్థిరమైన సాక్ష్యంగా ఉండాలంటే ఆ స్టేట్‌మెంట్‌పై ఆధారపడిన వ్యక్తులు గానీ ఏజెన్సీగా ఆ స్టేట్‌మెంట్‌ని షార్ప్‌గా రుజువు పరచాలి. మరణ వాంగ్మూ లం ఇచ్చిన వ్యక్తి ఊహించిన దానికన్నా చాలా రోజులకి చనిపో యారన్న కారణంగా ఆ మరణ వాంగ్మూలం తన విలువని కోల్పోదు. ఆ స్టేట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కావాలంటే అది తన మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని వివరిస్తే సరిపో తుంది. మరణానికి గల కారణం ప్రత్యక్షంగా ఉండవచ్చు లేక పరో క్షంగా ఉండవచ్చు.

(సుధాకర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, 2000 ఏ. ఐ.ఆర్‌. 2002 సుప్రీంకోర్టు =2000 క్రిమినల్‌ లా. జర్నల్‌ 3490).మరణానికి ముందు రాసిన ఉత్తరాలకి నేర సంఘటనతోని దగ్గరి సామీప్యత ఉంటే ఆ ఉత్తరాలు సె.32 ప్రకారం సంబంధితాలవు తాయి. హింసని, వేదనని ఈ ఉత్తరాలు ప్రతిబింబించవచ్చు. కొన్ని కేసుల్లో చాలా రోజుల క్రితం రాసిన ఉత్తరాలని కోర్టులు తిరస్క రించాయి.

మరికొన్ని కేసుల్లో ఆమోదించాయి. మృతురాలు రాసిన ఉత్తరాలే ప్రధాన సాక్ష్యంలో భాగమైనప్పుడు ఆమె మరణానికి ఆ ఉత్తరాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు, మరణానికి సంబం ధించిన కథని వివరిస్తున్నప్పుడు ఆ ఉత్తరాలు తప్పక సె.32 పరిధిలోకి వస్తాయి. అవి ఆమోదయోగ్యం కూడా అవుతాయి. సుదూరమైన కాలం కారణంగా ఆ ఉత్తరాలు సంబంధితాలు కావని అనడానికి వీల్లేదు అని శరద్‌బిర్దీ చంద్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరణానికి నెల రోజుల ముందు తన అత్తమామల చేతుల్లో పడుతున్న బాధల గురించి రాసిన మూడు ఉత్తరాలు సెక్షన్‌ 32(1) పరిధిలోకి వస్తాయి. (బిక్షపతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, 1989 క్రిమినల్‌ లా జర్నల్‌ 1186 ఎ.పి)మరణానికి రెండు రోజుల ముందు మృతురాలు తన తండ్రికి ఉత్తరం రాసింది. తన అత్తమామ, భర్త, ఇతర బంధువుల చేతుల్లో తన మరణం ఉందని తనని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళమని ఆ ఉత్తరాల సారాంశం.

ఆ ఉత్తరం రెండు రోజుల ముందు రాసింది కాదు అంతకు ముందు రాసిందని డిఫెన్స్‌ వాదన. ఎప్పుడు రాసిందీ అన్న విషయంలో ఏమీ భేదం లేదు. ఆ ఉత్తరాలు ఆమే రాసినట్లు రుజువైందని సుప్రీంకోర్టు అభిప్రా య ప డింది. ఆమె రాసిన మిగతా ఉత్తరాలని ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు కోర్టు లో ప్రవేశపెట్టని కారణంగా, ఆ ఉత్తరాలు మరుగు పరిచి ఆమె చేతి రాతని పరిక్షించే వీలు కల్పించలేదనే భావనకి రావడానికి వీల్లేదు. (స్టే ట్‌ ఆఫ్‌ యూ.పి వర్సెస్‌ హరిహరన్‌ 2001 ఎస్‌.సి.సి (క్రిమినల్‌) 49).స్వర్ణలతని వాళ్ళ అత్తా మామ హింసించి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఆమె తమ తల్లితండ్రుల వద్ద కొద్దికాలం నివసించింది. ఆ కాలంలో తనని తీసుకెళ్ళమని తప్పు తనదేనని అత్తమామలకి ఎన్నో ఉత్తరాలు రాసింది. కానీ ఫలితం లేకపోయింది.

చివరికి తన మేనమామలను తీసుకొని వెళ్ళింది. కానీ వాళ్ళ ఆమెను తిట్టి పంపించి వేశారు. తన మేనమామలతో కలిసి తిరిగి వస్తున్నప్పుడు, మేన మామలు ఎడ్లబండి తీసుకురా వడానికి వెళ్ళినప్పుడు ఆమె రైల్వేట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అత్తమామల పైన ఆత్మహత్య ప్రేరకులుగా కేసు పెట్టారు. స్వర్ణలత రాసిన ఉత్తరాలను కోర్టులో ఆమె మరణా నికి కారణాలుగా (ఇజీటఛిఠఝ ట్ఞ్చఛ్ఛిట) ప్రవేశపెట్టారు. నేర సంఘటనతో ఆ ఉత్తరాలకి సామీప్యత (ఞట్ఠౌఝజ్టీడ) లేదని కోర్టు ఆ ఉత్తరాలను మరణ వాంగ్మూలంగా ఆమోదించ లేదు. (గోకుల చంద్ర వర్సెస్‌ స్టేట్‌, ఏ.ఐ.ఆర్‌.1950 కలకత్తా 306) సంఘటన కన్నా ముందు అంటే ఐదు సంవత్సరాలకి ముందు రాసిన ఉత్తరాలు కూడా మరణ వాంగ్మూలాలుగా ఆమోదించబడతాయి.

No comments:

Post a Comment

Followers