Tuesday, August 25, 2009

మరోసారి మరణ వాంగ్మూలం

మరోసారి మరణ వాంగ్మూలం

మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. వరక ట్నం చావు కేసులు పెరుగుతున్నాయి. వర కట్నం మరణాలు ఎక్కువగా అత్తవారింట్లో జరు గుతాయి. అత్తమామలు, భర్త, అతని బంధువులు తప్ప వేరే ఇతరుల సాక్ష్యాలు దొరకడం కష్టమ వుతుంది. కాలి న గాయలతో’ ఉన్న మహిళని హాస్పి టల్లో చేరు స్తారు. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు, మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తారు. ఆ దశలో ఆమె అత్త గారి ప్రభా వం ఉంటుంది. బతుకుతానన్న ఆశని కూడా వాళ్ళు కలిగిస్తారు. జరిగిన సంఘటన గురించి చెప్పకుండా ఏ ప్రమాదం వల్లో ఆ సంఘ టన జరిగిందని ఆమె సాక్ష్యం చెబుతుంది.

ఆ స్టేట్‌ మెంట్‌ ఆధారంగా ముద్దాయిలు నేరం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. క్రిమినల్‌ కేసుల్లో ఎక్కువగా మౌఖిక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన తరు వాతనే ఆ సాక్ష్యాన్ని కోర్టులు స్వీకరిస్తాయి. అయితే వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, ఆ మరణించిన వ్యక్తి తన మరణానికి గల కారణాల్ని గానీ లేక ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులని గానీ వివరిం చినప్పుడు కోర్టులు వాటిని సాక్ష్యంగా స్వీకరిస్తాయి. వీటినే మరణ వాంగ్మూలం అంటారు.

మరణ వాంగ్మూలం అతి ముఖ్యమైన సాక్ష్యం. చాలా మంది మహిళలు తమని తాము కాల్చు కోవడమో, ఇతరులే కాల్చినప్పటికీ ఆ విషయం చెప్పకుండా ఉండటమో జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో వివాహితలు ఎక్కువ. ఈ సంఘటన జరి గిన వెంటనే ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు ఆమె భర్త, అతని బంధువుల ప్రభావం వల్లనో, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించో జరిగిన విషయం చెప్పరు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతూ ఉంటారు. ఆ మహిళ సబంధీకులు- అంటే ఆమె తల్లి దండ్రులు, అన్నదమ్ములు వచ్చిన తరువాత ధైర్యం కూడ తీసుకుంటారు. అప్పుడు వాస్తవం చెప్పాలనుకుంటారు. అయితే అప్పటికే ఆమె మరణ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తే, ఇలాంటి సందర్భాలలో మరోసారి ఆమె మ రణ వాంగ్మూలాన్ని నమోదుచేసే అవకాశం ఉందా?

రెండోసారి అదే మహిళ చెప్పిన మరణ వాంగ్మూ లం రాయడానికి చాలా మంది మేజిస్ట్రేట్లు సంశ యిస్తూ ఉంటారు. సెషన్స్‌ జడ్జీల అనుమతి కోరు తూ ఉంటారు. అనుమతి ఇవ్వడానికి సెషన్స్‌ జడ్జీలు కూడా సంశయిస్తూ ఉంటారు. మరి కొంత మంది సెషన్స్‌ జడ్జీలు రెండవ మరణ వాంగ్మూ లాన్ని, అదే మేజిస్ట్రేట్‌ నమోదు చేయడాన్ని తప్పు పడుతూ ఉంటారు. ఇది సరైందేనా? ఇలాంటి సం దర్భాలలో చట్టం ఏమి జవాబు చెబుతోంది.?

రెండోసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం ఏదీ చట్టంలో లేదు. మొ దటిసారి మరణ వాంగ్మూలం నమోదు చేసిన మేజి స్ట్రేట్‌ మళ్ళీ రెండవ మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం కూడా చట్టంలో లేదు. రెండవసారి నమోదు చేసిన మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. దేశంలోని అత్యున్నత కోర్టు రెండవసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడాన్ని అనుమతి ఇస్తున్నది. అలాంటి కేసే- సమిరా భాను . సుల్తానా బేగమ్వర్సెస్స్టేట్ఆఫ్మహారాష్ట్ర, అప్పీలు నెం.141/2006, తీర్పు తేదీ: 8/2/07 న్యాయమూర్తులు: సి.కె టక్కర్‌, లోకేశ్వర్‌ సింగ్‌ పాట్నా, సుప్రీంకోర్టు. ఈ కేసులో రెండు మరణ వాంగ్మూలాలను మృతురాలు ఇచ్చింది. రెండింటిని ఒకే మేజిస్ట్రేట్‌ నమోదు చేశాడు.

మొదటి వాంగ్మూలంలో కిరోసిన్‌ దీపంపై పడి అంటుకొని గాయాలు అయినాయని ఆమె చెప్పింది. రెండవ మరణ వాంగ్మూలంలో, తన అత్త కిరోసిన్‌ పోసి కాల్చిందని చెప్పింది. కేసుని విచారించిన సెషన్స్‌ కోర్టు రెండవ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని శిక్ష విధించింది. హై కోర్టు కూడా శిక్షను సమర్థించింది. సుప్రీం కోర్టు కూడా శిక్షని సమర్ధిస్తూ ‘విషయాలను, సాక్ష్యాలను ఆధారం చేసుకొని క్రిమినల్కేసును పరిష్కరిస్తారు. అంతే కానీ గతంలో చెప్పిన తీర్పుల ఆధారంగా కాదు. ముందు ముద్దాయి బాధితురాలిని కొట్టినట్టు, వేధించినట్టు సాక్ష్యం ఉంది. అందుకని రెండవ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించడం సమంజసమే’-అని వాఖ్యానించింది.
ఈ తీర్పునిబట్టి, మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించే అవకాశం ఉంది

1 comment:

  1. మీ బ్లాగు బాగుంది.
    లా కి సంబందించిన ఎన్నో విషయాలు చెపుతున్నారు.
    అభినందనలు. బ్లాగులను అర్ధం పర్ధం లేని వివాదాలకు కాకుండా ఇలా విషయపరిజ్ఞాన ప్రచారం కొరకు ఉపయోగించుకోవటం ముదావహం.

    అభినందనలు

    బొల్లోజు బాబా

    ReplyDelete

Followers