Sunday, May 10, 2009

పోలీసులు, శాంతి భద్రతలు

పోలీసులు, శాంతి భద్రతలు

శాంతి భద్రతలు క్షీణించినప్పుడల్లా పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించరు. ఇందుకు కారణం ఏమిటి? పోలీసులు, నేరన్యాయ వ్యవస్థని ఆర్థం చేసుకోవాలంటే ముందుగా పోలీసుల గురించి తెలియాలి. పోలీసు వ్యవస్థ మన దేశంలోకి ఎలా వచ్చిందో, అది ఏ విధంగా పని చేస్తోందో కూడా తెలుసుకోవాలి. మన దేశం 32, 87, 782 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించింది. మన దేశ జనాభా దాదాపు 1.02 బిలియన్లు. రాజ్యాంగంలోని అధికరణ 246 ప్రకారం శాసన అధికారాలు నిర్దేశితమయ్యాయి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో వీటిని ఉదహరించారు. ఈ షెడ్యూలులో మూడు జాబితాలు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్లమెంటు తయారు చేసే శాసనాల విషయాలను పేర్కొన్నారు. ఆ విషయాల మీద చట్టాలు తయారు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంటుంది. దీనినే కేంద్ర జాబితా అంటాం. రెండవ జాబితాలో పేర్కొన్న విషయాల మీద రాష్ట్ర శాసనసభలు శాసనాలను తయారు చేస్తా యి. దీనినే రాష్టల్ర జాబితా అంటాం. మూడవ జాబితాలో విషయాల మీద పార్లమెంట్‌, రాష్ట్ర శాసన సభలు రెండూ శాసనాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. అధికరణ 246 ప్రకారం- శాంతి భద్రతలు, కోర్టులు, కారాగారాలు, బోస్టన్స్‌ స్కూళ్లు వగైరా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. అందుకని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు. అదే విధంగా శాంతి భద్రతలకు రాష్టమ్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది.పోలీసు వ్యవస్థ మనకు బ్రిటిష్‌ వారినుంచి సంక్రమించింది. వ్యక్తి స్వేచ్ఛకు మూలాధారం మాగ్నాకార్టా (1215) అని బ్రిటిష్‌ పాలకులు అనుకున్నప్పటికీ, హెబియస్‌ కార్పస్‌ హక్కుల చట్టం 1684, ప్రెంచ్‌ డిక్లరేషన్‌ 1789 కంటే పూర్వమే దాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ఆ హక్కులను బ్రిటిష్‌ వాళ్ళ పాలనలో మనకు ఇవ్వలేదు.స్వేచ్ఛా పూరితమైన ఎన్నికలు, భావస్వేచ్ఛ, బెయిల్‌ వంటి భావనలు బ్రిటిష్‌ వారి కి తెలిసినప్పటికీ వాటిని భారత దేశ ప్రజలకు ఇవ్వలేదు. పోలీసు వ్యవస్థను సేవా సంస్థగా కాకుండా, ఒక శక్తిగా మాత్రమే వారు మన దేశంలో రూపొందించారు. మన దేశ ప్రజలను, వారి హక్కులను అణగదొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వాళ్ళు పోలీసులకు తెలియనివ్వలేదు. స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొ న్న సంస్థలను, వ్యక్తులను అణిచివేయడానికే బ్రిటి్‌ష్‌ పాలకులు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నారు. శారీరక దారుఢ్యం వంటి విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేలా పోలీసువ్యవస్థ నిబంధనలను రూపొందించారు, క్రమశిక్షణ పరేడ్‌ గ్రౌండ్‌నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కలిగించారు. తమకి ఎదురుగాఉన్న వ్యక్తి తమ శత్రు వు అనీ, తాము కూడా ‘శక్తి’ అనేభావనలను బ్రిటి్‌ష్‌వారు పోలీసులకి కలిగించారు. పోలీసులకు- స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం గురించి, ప్రాధమిక హక్కుల గురించి మానవ హక్కుల గురించి శిక్షణ ఇస్తున్నారు. కానీ వారిలోబ్రిటిష్‌ కాలం నాటి పాత శాసనాలు పోలేదు.మన రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించిన నియమ నిబంధనల ప్రకారం ఈ వ్యవస్థ పని చేయాలి. ప్రతి రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు వేరు వేరుగా పోలీసులు ఉన్నారు. ఈ వ్యవస్థ పోలీసుచట్టం 1861 ప్రకారం ఏర్పడింది. 1857లో సిపాయి ల తిరుగుబాటు జరిగింది. ఆ తరువాత ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విధంగా రూపు దిద్దుకున్న పోలీసులంటే అందరిలోనూ భయం నెలకొంది. కానీ కష్టకాలం లో పోలీసుల సహాయం కోరకుండా ఉండలేని పరిస్థితి. శాంతి భద్రతలను రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎంపిక చేసిన వ్యక్తులే పోలీసులు. పోలీసుల విధులకు సంబంధించి చాలా చట్టాల్లో మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌- భారతీయ శిక్ష్యాస్మృతిలో పేర్కొన్నప్పటికీ, వీరి విధులకు సంబంధించిన ప్రధాన చట్టం భారతీయ పోలీస్‌ చట్టం 1801.పోలీసులంటే శాంతి భద్రతలను చట్ట ప్రకారం రక్షించే వ్యక్తులు. వ్యవస్థ- చట్ట ప్రకారం నేరాలను నిరోధించే వ్యవస్థ. పోలీస్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదైన వ్యక్తులు. ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేకమైన బలగాలు ఉన్నాయి. అయితే నాలుగు కారణాలవల్ల అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన వ్య వస్థ ఉంది. ఆ కారణాలు -1. పోలీసు చట్టం 1861 ప్రకారం రాష్ట్ర పోలీసు యంత్రాంగం నియంత్రితమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు చట్టాలు ఉన్నప్పటికీ అవి దాదాపుగా పోలీసు చట్టం 1861ని పోలి ఉన్నాయి.2. ప్రధాన చట్టాలైన భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ భారతీయ సాక్ష్యాధారాల చట్టం లాంటివి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అనేది భారత దేశానికంతటికీ వర్తించే సర్వీస్‌. ఈ సర్వీస్‌లకు కేంద్ర ప్రభుత్వం వ్యక్తులను ఎంపిక చేస్తుంది. వారికి శిక్షణ ఇస్తుంది.4. మన దేశంలో ఉన్న ఖ్వాసీ ఫెడరల్‌ ప్రకారం రాజ్యాంగంలో ఏర్పరిచిన నిబంధనల వల్ల కేంద్రానికి పోలీసుల విషయంలో సమన్వయం చేకూర్చే అవకాశం ఉంది.శాంతి భద్రతలను పరిరక్షించడం, నేరాలను నిరోధించడం, నేరాలని దర్యాప్తు చేయడం, అవసరమైనప్పుడు కాగ్నిజబుల్‌ నేరాలు చేసిన వ్యక్తులను అరెస్టు చెయ్యడం; వ్యక్తుల ప్రాణాలను, స్వేచ్ఛను, ఆస్తులను రక్షించడం; సరైన యంత్రాంగం చట్టబద్దంగా జారీచేసిన ఉత్తర్వులను, వారెంట్లను అమలు చెయ్యడం లాంటి విధులను పోలీసులు నిర్వర్తిస్తారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చట్టం పరిధిలోకి లోబడి ఈ విధులను నిర్వర్తిస్తారు. అందుకని శాంతి భద్రతలు క్షీణించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను నిందించడం జరుగుతోంది.

No comments:

Post a Comment

Followers