Wednesday, September 14, 2011

హకుల పరిరక్షణ కోర్టుల బాద్యత

కోర్టుల్లో పనిభారం ఎక్కువ. విచారణ జాప్యం. కేసుల్లో శిక్షలు పడకపోవడం. ముద్దాయిలు శిక్షల నుంచి తప్పించుకుపోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది న్యాయవ్యవస్థను నిందించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఆ విమర్శలో ఎలాంటి సహేతుకతలేదు. కోర్టుల్లో కేసులు రుజువు కాకపోవడానికి, తక్కువ కేసుల్లో శిక్షలు పడటానికి, కేసుల విచారణల్లో జాప్యం జరగడానికి కారణాలు ఎన్నో. కేసుల దర్యాప్తులోని లోపాలు, ప్రాసిక్యూషన్ కేసుని సరిగ్గా నిర్వహించకపోవడం, సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం లాంటి కారణాలు ఎన్నో కోర్టుల్లో కేసులు విఫ లం కావడానికి కారణమతున్నాయి.తమ పరిధిలో ఉన్న అంశాల మీద న్యాయమూర్తుల నిర్వహణని బేరీజు వేసుకొని విమర్శలు చేస్తే దాన్ని సద్విమర్శ అనుకోవచ్చు. ఆ విధంగా గాకుండా కోర్టు నియంవూతణలోలేని అంశాలను ఆధారం చేసుకొని న్యాయమూర్తులని, న్యాయవ్యవస్థని విమర్శించడం సరైంది కాదు. దేశ న్యాయవ్యవస్థలో భాగస్వాములైన యంత్రాంగాల సమష్టి నిర్వహణే కేసుల్లో వచ్చే చిక్కులు. అవి శిక్షలు పడ డం కావచ్చు. శిక్షలు పడకపోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే ఉన్న విధులు ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కొన్ని విధులను న్యాయమూర్తులు మాత్రమే నిర్వహిస్తారు. అవి న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే వుంటాయి. అందులో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని ఇతర భాగస్వాముల ప్రమే యం ఉండదు. అందులో ముఖ్యమైనది హక్కుల పరిరక్షణ. అవి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులు కావ చ్చు. ఇతర శాసనాల ద్వారా నిర్వహించిన హక్కులు కావచ్చు.

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు, నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. అప్పు డు ఎలాంటి అవరోధాలు లేవు. వాళ్లకు తోచింది చేసే అవకాశం ఉండేది. అనుమానం మీద నేరారోపణల మీద శిక్షలు విధించే అవకాశం ఏర్పడింది. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండాపోయింది. నిరంకుశత్వం పెరిగింది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215 సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ‘ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా తన వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్షులు లేకుండా ఏ అధికారి కూడా ఏ వ్యక్తిని భవిష్యత్తులో విచారణకు నిలబెట్టకూడదు. ఎవరి స్వేచ్ఛనైనా హరించాలంటే దానికి న్యాయబద్ధమైన తీర్పు ఉండాలి.’
మాగ్నాకార్టాలో పొందుపరిచిన విషయాలకు మన రాజ్యాంగ కర్తలు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయాలను పొందుపరుస్తూ అధికరణలను ఏర్పాటు చేశారు.

అవి అధికరణం 20, 21, 22. అధికర ణం 20 ప్రకారం అమలులో ఉన్న శాసనాల ప్రకారం ఏదైనా చర్య నేరమైనప్పుడు మాత్రమే ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. అంతే అది నేరం కానప్పుడు శిక్షించడానికి వీల్లేదు. ఆ నేరం చేసినప్పుడు, ఆ వ్యక్తికి అమల్లో ఉన్న శాసనాల ప్రకారం ఎంత శిక్ష అయితే విధించడానికి అవకా శం ఉందో అంతే శిక్షను విధించాలి. అంతకన్నా ఎక్కువ శిక్షను విధించడానికి వీల్లేదు. ఎవరైనా వ్యక్తిపై అభియోగం మోపబడి శిక్ష పడిన తర్వాత మళ్లీ అదే నేరానికి రెండవసారి అభియోగం దాఖలు చేయడానికి వీళ్లేదు. ఆర్టికల్ 21 శాసనం ప్రకారం నిర్ణయించిన పద్ధతుల్లో తప్ప, ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 22 ప్రకారం-ఎవరైనా వ్యక్తి ఈ భూభాగంలోని సాధారణ శాసనాల ప్రకారం అరెస్టు అయినప్పుడు అరెస్టు చేసిన వెంటనే ఏ కారణాల ప్రకారం అరెస్టు చేశారో ఆ విషయం అతనికి తెలియజెయ్యాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం కల్పించాలి.

అరెస్టు చేసిన 24 గంటల్లో దగ్గర్లో ఉన్న మెజివూస్టేట్ ముందు హాజరు పరచాలి. అరెస్టు అయిన స్థలం నుంచి మేజివూస్టే ట్ కోర్టు వరకు తీసుకురావడానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటలని అర్థం చేసుకోవాలి. మేజివూస్టేట్ ఉత్తర్వులు లేకుండా అరెసై్టన వ్యక్తి 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు.
దేశంలో ఆమాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వతంవూతమైన న్యాయవ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధం లేకుండా న్యాయవ్యవస్థ వుంది. ఈ వ్యవస్థ దేశ పౌరులకు, ముద్దాయిలకు, అనుమానితులకు, బాధితుల కు, సాక్షులకు రాజ్యాంగం ద్వారా వివిధ శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల హక్కులకు సంరక్షకునిగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అందుకే ఈ వ్యవస్థ మీద అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉంది. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. హక్కులను కాపాడటం కోర్టుల మీద ఉన్న ప్రాథమిక బాధ్యత. హక్కులను, బాధ్యతలను కోర్టులు భారతీయ సాక్ష్యాధారాలు చట్టం ప్రకారం నిర్ధారించాలి. రాజ్యాంగం ద్వారా, శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేసిన శాసనం ద్వారానే నియంవూతించాల్సి ఉంటుంది. తొలగించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తుల మౌలికమైన హక్కు. స్వతంవూతమైన న్యాయవ్యవస్థ నిర్వహించాల్సిన విధి ఇదే.

వ్యక్తుల హక్కులను కాపాడటం, శాసనం నిర్దేశించిన పద్ధతిలో శిక్షలు విధించడం ద్వారా ప్రజల హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ చేయాల్సిన ప్రాథమికమైన విధి. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాత పూర్వకమైన రాజ్యాంగం ఉన్న మన దేశంలో నేరస్తులను శిక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. నేరం చేసిన వ్యక్తులని శిక్షించడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత కాదు. పోలీసులది అంత కంటే కాదు. రాజ్యాంగం రాక ముందు కొన్ని శతాబ్దాలుగా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ పని చేసింది. ఇప్పుడు చేయకూడదు. చేసే అవకాశం లేదు. చేయకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తిపై ఉంది. ముద్దాయిలను అరెస్టు చేసి మేజివూస్టేట్ మందు హాజరు పరుస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్ష న్ 57 ప్రకారం 24 గంటలు పూర య్యే వరకు ముద్దాయిలను తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవకా శం లేదు. కేసు దర్యాప్తుకు ఎంత కాలం అవసరం ఉందో అంత కాలం మాత్రమే తమ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది. అది కనిష్ఠ కాలపరిమితి.

24 గంటలు అనేది గరిష్ఠ కాలపరిమితి. అదే చట్టంలోని సెక్షన్ 50 ఎ ప్రకారం అరెస్టు చేసిన సమయాన్ని అరెసై్టయిన వ్యక్తి స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలి. ఏడేళ్లకు తక్కువ శిక్ష విధించే అవకాశం కేసుల్లో, అదే విధంగా ఏడేళ్లవరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో సెక్షన్ 41లో చేర్చిన కొత్త నిబంధనల ప్రకారం అరెస్టు చేయకూడదు. అరె స్టు చేస్తే వాటి చట్టంలో చెప్పిన కారణాలు వున్నాయో లేదో చూడా లి. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే, అదృశ్యం అయితే దానికి గురించి సెక్షన్ 176 ప్రకారం మేజివూస్టేట్ విచారణ జరగా లి. అక్రమ నిర్బంధం ఉన్నప్పుడు సెక్షన్ 97 ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రథమ సమాచార నివేదిక నుంచి చార్జిషీట్ దాఖలు అయ్యే వరకు మేజివూస్టేట్ పర్యవేక్షణ ఉంటుంది. జోక్యం ఉండదు.

హక్కుల పరిరక్షణ బాధ్యత ఆ తరువాత మిగతా కోర్టుల మీద ఉంటుంది. హక్కులు వ్యాఖ్యానించేటప్పుడు కూడా క్రియాశీలంగా వ్యవహరించి వ్యాఖ్యానించాలి. అంతే కానీ సాంకేతికంగా కాదు. క్రిమినల్ న్యాయ పరిపాలనలో రాజ్యాంగం విలువల్ని పరిరక్షిస్తూ వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. ఈ బాధ్యతను నిర్వహించనప్పుడు కోర్టులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ హక్కులు ముద్దాయిలవి కావొచ్చు, అనుమానితులవి కావొచ్చు, సాక్షులవి కావొచ్చు, బాధితులవి కావొచ్చు.

-మంగారి రాజేందర్

Thursday, August 4, 2011

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!
-విశ్లేషణ
మంగారి రాజేందర్, మూడవ అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ద్విగుణీకృతం చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్య కాలంలో రెండు ప్రధానమైన కేసుల్లో మరణశిక్షలు విధించడాన్ని ఖరారు చేసింది. అందులో మొదటిది ‘పరువు’ హత్యలకు చెందినది కాగా, రెండవది ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించినది. ఈ రెండు రకాల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ తీర్పులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి . పరువు హత్యలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేంద్రం ప్రతిపాదిస్తున్న నేపథ్యం కూడా ఒక సందర్భం. ఎన్‌కౌంటర్ హత్యలను నేరాలుగా నమోదుచేసి దర్యాప్తు చేయాలన్న వాదన గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది. వాటిని హత్యా నేరాలుగా నమోదు చేయాలని చట్టాలు నిర్దేశిస్తున్నప్పటికీ దర్యాప్తు ఆ వెలుగులో జరగడం లేదన్నది ప్రధాన విమర్శ.

‘భారత శిక్షాసృ్మతి’ ప్రకారం ఆరు రకాలైన నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవి- ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారన్న నేరారోపణలో (సెక్షన్ 121), సిపాయిలను రాజ్యంపై తిరగబడేలా ప్రేరేపించినపుడు (సె.132), మరణశిక్ష పడేలా తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు (సె.194), హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు (సె.302), 18 సంవత్సరాలు నిండని వారినీ, మానసిక రుగ్మతలున్న వారినీ ఆత్మహత్యకు ప్రేరేపించినపుడు (సె.305), దోపిడీకి పాల్పడుతూ హత్యగావించినప్పుడు (సె.396). కొన్ని సందర్భాల్లో ఎవరినైనా చంపడానికి ప్రయత్నించినపుడు సెక్షన్ 307 ప్రకారం కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే, ప్రత్యేక చట్టాల్లో కూడా అలాంటి శిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే ఈ నేరాలన్నింటిలో కూడా నేరం రుజుైవె నప్పటికీ మరణశిక్ష విధించాలన్న నియమం లేదు. కేసులోని తీవ్రతనుబట్టి జీవితఖైదు గానీ, మరణశిక్ష గానీ కోర్టులు విధిస్తాయి. కానీ జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఎవరినైనా చంపితే, సెక్షన్ 303 ప్రకారం విచారించి నేరం రుజువైతే వారికి కోర్టులు విధిగా మరణశిక్షను విధించాల్సి ఉంటుంది.

ఇలాంటి నేరాల్లో మరణశిక్ష విధించడం సహేతుకం కాదని అనడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదనీ, ప్రజాహితం కోసం ఈ శిక్ష ఉండాల్సిందేననీ, ఇది రాజ్యాంగంలోని జీవించే హక్కుకు వ్యతిరేకం కాదనీ గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గుర్తుచేయడం గమనార్హం. బచన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో దీన్ని మరింత స్పష్టంగా ప్రకటించింది . క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354 ప్రకారం హత్యానేరం రుజువైన వ్యక్తులకి జీవిత ఖైదు శిక్ష విధించడమనేది నియమంకాగా, మరణశిక్ష కూడా విధించవచ్చన్నది మినహాయింపు. అయితే సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్ష విధించడానికి గల ప్రత్యేకమైన కారణాలను తీర్పులో పేర్కొనాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కొలబద్దల్ని కూడా సుప్రీంకోర్టు బచన్‌సింగ్ కేసులో స్పష్టపరుస్తూ, మార్గదర్శకాలను నిర్దేశించింది (ఏఐఆర్ 1983 సుప్రీంకోర్టు 957).

అవి ప్రధానంగా- హత్య జరిగిన తీరు, నేరం జరగడానికి కారణం, సాంఘికంగా తిరస్కరించే విధంగా ఉన్న నేరాలు, నేర తీవ్రత, హత్యకు సంబంధించిన బాధితుల వ్యక్తిత్వం. అలాగే దుర్మార్గంగా, అస్వాభావికంగా, పైశాచికంగా, పిరికితనంగా లేక మోసపూరితంగా చంపినప్పుడు మరణశిక్ష విధించవచ్చు. ఉదాహరణకు- బాధితుడు నిప్పులో కాలి చనిపోవాలన్న ఉద్దేశంతో అతని ఇంటికి నిప్పు పెట్టి చంపినప్పుడు, బాధితులు చనిపోవాలని అతన్ని చిత్రహింసల పాల్జేయడం, అమానవీయంగా ప్రవర్తించడం, బాధితుల శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం లేక ఛిన్నాభిన్నం చేసి పైశాచికంగా ప్రవర్తించడం.

ఎన్‌కౌంటర్ మరణాల్లో, పరువు హత్యల్లో ఈ అంశాలు లేకపోవచ్చు. కానీ, ఈ నేరాలను కూడా సుప్రీంకోర్టు అరుదైన వాటిల్లో అరుదైనవిగా పరిగణించి మరణశిక్షలను ఖరారు చేసింది. ఎన్‌కౌంటర్ మరణాల పేరుతో అమాయకులను చంపే అధికారులకు ఒక హెచ్చరికగానూ, వెనుకంజవేసే విధంగానూ ఈ తీర్పులు తోడ్పడతాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా పరువు, ప్రతిష్టల పేరుతో నేడు జరుగుతున్న హత్యలని నిరోధించడానికి కూడా ఈ తీర్పులు దోహదపడతాయని భావించవచ్చు.

ప్రకాశ్ కదమ్ మరి ఇతరులు వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా మరి ఇతరులు (క్రిమినల్ అప్పీలు నంబరు 1174-1178 / 2011) కేసులో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసులో అరుదైనవిగా అభివర్ణించింది. ముంబైలో ప్రకాశ్ కదమ్ అనే పోలీసు అధికారి నేతృత్వంలో ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి కోసం అతని మిత్రుణ్ణి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. ఈ కేసులో అక్కడి సెషన్స్ కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీనిపై పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసుల్లో అరుదైనవిగా అభివర్ణించింది. ఆ నేర తీవ్రతను సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే-

‘‘ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులని చంపడం అతి హేయమైన నేరం.

ఈ నేరాన్ని కూడా అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. పోలీసు అధికారి నేరం చేశాడని రుజువైతే అతనికి మరణశిక్షను విధించాలి. మామూలు వ్యక్తి హత్య చేస్తే అది మామూలు హత్య. కానీ పోలీసు అధికారి చేస్తే, అది అతని విద్యుక్త ధర్మానికి వ్యతిరేకమైనది. సమాజంలో శాంతిభద్రలు కాపాడే విధంగా విధులను నిర్వర్తించాల్సిన వ్యక్తి వాటికి విఘాతం కలిగించినప్పుడు అతనికి మరణశిక్షే సరైన శిక్ష’’.తన పైఅధికారి చంపమని ఆదేశిస్తే ఎన్‌కౌంటర్ పేరుతో చంపకూడదు. దాన్ని తిరస్కరించాలి. ఆ విధంగా చేయనప్పుడు అతనికి మరణశిక్ష విధించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంటూ న్యూరెంబర్గ్ విచారణలను ఉదహరించింది. ‘‘ఆ విచారణల్లో ‘ఉత్తర్వులు ఉత్తర్వులే’ అని అధికారులు డిఫెన్స్ తీసుకున్నప్పటికీ ‘నాజీ’ అధికారులకు మరణశిక్షని విధించారు’’.

బూటకపు ఎన్‌కౌంటర్లంటే దారుణమైన హత్యలనీ, చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఉల్లంఘనలకు పాల్పడటం తగదని అభిశంసించింది. సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులే కిరాయి రౌడీలుగా మారి హతమార్చడం అత్యంత హేయమైన విషయమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక వ్యక్తిని చంపుతున్న పోలీసులు, మరో వ్యక్తిని రక్షించడానికి సాక్షులను కూడా చంపరన్న గ్యారంటీ ఏమిటి? అని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రశ్నించింది. తమని రక్షించుకోవడం కోసం తమ బంధువులని కూడా వాళ్లు చంపగలరని కోర్టు తీవ్రంగా స్పందించింది. సొహ్రాబుద్దీన్, ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసుల నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఇక పరువు హత్యలను కూడా అరుదైన కేసుల్లో అరుదైన వాటిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు భగవాన్‌దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, క్రిమినల్ అప్పీలు నంబరు 1117/11 కేసులో స్పష్టం చేసింది. ఈ కేసులోని విషయాలకు వస్తే, భగవాన్‌దాస్ తన సొంత కూతురినే చంపేశాడు. కూతురు భర్తను వదిలిపెట్టి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందన్న కోపంతో, అతను కుటుంబం పరువు పోయిందని ఆమెని చంపేశాడు. పరువు హత్యలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ పోలీసుల రక్షణలో బతుకుతున్నారు. ఏ కారణాలతో ఈ హత్యలు చేసినప్పటికీ, వీటిని అరుదైన కేసుల్లో అరుదైనవిగా బావించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అహంకారపూరితమైన, హీనమైన ఈ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. మేజరైన వ్యక్తులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే అధికారం ఉంది. పరువు ప్రతిష్టల పేరుతో ఈ హత్యలకు పాల్పడే వ్యక్తులు తమకు ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం గమనిస్తే మంచిదని సుప్రీంకోర్టు తీర్పులో హెచ్చరించింది.

బూటకపు ఎన్‌కౌంటర్‌లను, పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా భావించి మరణశిక్షని విధించాలని సుప్రీంకోర్టు ఈ రెండు తీర్పుల్లో నొక్కి చెప్పింది. బచన్‌సింగ్ కేసులో నిర్దేశించిన అంశాలకి మరో రెండు కొత్త అంశాలును జతచేయడం హర్షించదగిందే. పరువు హత్యల కన్నా, ఎన్‌కౌంటర్ హత్యల్లో కేసు నమోదు అవడం చాలా కష్టం. పొరపాటున నమోదైనా పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చెయ్యాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 132, 197 ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికే సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో అనుమతి రాక ఎన్నో కేసులు మూలన పడుతున్నాయి. వచ్చినా వాటి పరిష్కారానికి ఎంత కాలం పడుతుందో కళ్ల ముందు కనిపిస్తున్నదే. అలాగని నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాజ్యాంగలోని జీవించే హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. చట్టం నిత్యనూతనమైంది. కాలానుగుణంగా అది మార్పు చెందుతుంది. కోర్టుల వ్యాఖ్యానాలు కూడా దానికి దోహదపడతాయి. ఆ నేపథ్యంలో వచ్చినవే ఈ రెండు తీర్పులన్నది గుర్తించాలి.

బూటకపు ఎన్‌కౌంటర్లకి పాల్పడే వ్యక్తులు ఒక్క విషయం గమనంలో ఉం చుకోవాలి. ముంబైలో రాజ్‌బీర్‌సింగ్ అనే పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ప్రతీతి పొందాడు. రాష్ట్రపతి గేలంటరీ అవార్డు కూడా వచ్చింది. అతనికి రియల్ ఎస్టేట్ వ్యక్తులతో తెరచాటు సంబంధాలు ఉన్నాయన్నది ఆరోపణ.

అతన్ని మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్చిచంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్ పోలీసు అధికారి కూడా రాలేదనీ, కనీసం ఒక్క పుష్పగుచ్ఛానికీ నోచుకోలేదనీ విన్నప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ దేశంలో అది సాధ్యమా అని! సీనియర్లందరూ గతంలో అతన్ని అభినందించిన వారే. ఈ సంఘటనతోపాటు, సుప్రీంకోర్టు తీర్పుని కూడా దేశంలోని పోలీసులంతా ఒక బాధ్యతగా సంయమనంతో అధ్యయనం చేయగలిగితే భవిష్యత్ సమాజం వారికి నీరాజనాలు పడుతుందనడంలో సందేహం లేదు!

Friday, January 28, 2011

గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం

బెయిలు లేదిక అంతా బయలే!
గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం
విశ్లేషణ...29-1-2011 saakshi

ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంతో కీడూ అంతే.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ ‘అరెస్టు’కి సంబంధించిన ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సవరణల) చట్టం-2010’ గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ తెరపైకి రావడం వివాదంగా మారుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2008’ని రూపొందించింది. అయితే, దేశ వ్యాప్తంగా న్యాయవాదులు, మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రధానంగా 5, 6 (అరెస్టుకి సంబంధించినవి), 21 (బి) తప్ప మిగిలినవి అమల్లోకి వచ్చేవిధంగా ప్రకటన జారీ చేసింది. అరెస్టు నిబంధనలు మినహా ఆ చట్టం 2009 డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తరువాత వివిధ వర్గాలతో చర్చలు జరిపి అరెస్టుకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-2010’ రూపంలో ఆ సవరణలను చట్టంగా తీసుకొచ్చింది. ఈ సవరణలతో కూడిన కొత్త చట్టం 2010 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2010 నవంబర్ 1న ఎస్.ఓ.నెం.2689(ఇ)ను జారీ చేస్తూ, భారత గెజిట్‌లో ప్రచురించింది. ఎంతో వివాదాస్పదమైన అరెస్టుకు సంబంధించిన ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి కానీ, వాటి గురించి ప్రజలకి తెలియజేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిం చలేదు. ఎలాంటి అలికిడీ లేకుండా ఇవి అమల్లోకొచ్చాయి. గతంలో అన్ని వర్గాల వారు వ్యతిరేకించిన సవరణలు, నేడు ప్రజలకి, న్యాయవ్యవస్థకి ఏ మేరకు మేలు చేస్తాయన్న విషయాన్ని చర్చించవలసిన అవసరం ఉంది.

న్యాయశాస్త్ర పరిభాషలో ప్రతి నిర్బంధం అరెస్టు కాదు. వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయే విధంగా చేయడం అరెస్టు అవుతుంది. కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను పోలీసులు ఎలాంటి వారంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నేరానికి సంబంధించి ఎవరిపైనైనా సహేతుకమైన ఫిర్యాదు అందినప్పుడు లేదా విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. అనుమానంపై కూడా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే అరెస్టుకు దారితీసే సందర్భాలను చట్టం స్పష్టంగానే నిర్దేశించింది. కేసు విచారణ సమయంలో ముద్దాయి హాజరు కాడన్న అనుమానం ఉన్నప్పుడు; హత్య, రేప్, బందిపోటు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులతో సమాజంలో భయాందోళనలు నెలకొన్నప్పుడు అరెస్టు అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో నేరస్తుని ప్రాణాలు రక్షించడానికి కూడా అరెస్టు తప్పదు. నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయకుండా, సహ ముద్దాయిలకు వార్నింగ్ ఇవ్వకుండా, మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా అరెస్టు అవసరమవుతుంది.

ఇన్ని జాగ్రత్తలతో కూడిన నిబంధనలు ఉన్నప్పటికీ, అరెస్టుల విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అపవాదు తప్పలేదు. జాతీయ పోలీస్ కమిషన్ మూడవ నివేదికలో అక్రమ అరెస్టుల గురించి ఆందోళనను వెలిబుచ్చడం గమనార్హం. పోలీసులు చేస్తున్న అరెస్టుల్లో 60 శాతం అనవసరమైనవి, న్యాయబద్ధత లేనివని, వీటివల్ల జైళ్ల నిర్వహణా ఖర్చు పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. లా కమిషన్, మలిమత్ కమిటీ నివేదికలు కూడా అనవసర అరెస్టుల గురించి ప్రస్తావించాయి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అరెస్టులు, కస్టోడియల్ హింసపై ఆందోళన వెలిబుచ్చింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41కి సవరణలు తీసుకొస్తూ 2008లో చట్టాన్ని రూపొందించింది. అయితే ఆ సవరణలపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో, అవి అమల్లోకి రాలేదు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు అరెస్టు సవరణలను వ్యతిరేకించారు. ఈ సవరణలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొందరు సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం, 2008 చట్టం ద్వారా తీసుకొచ్చిన సవరణలను తప్పుగా అర్థం చేసుకుంటున్నార ంటూ హితవు పలికి, వాటిని స్వాగతించింది. దేశపౌరుల కష్టాలను, వేదనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలని వ్యతిరేకించకూడదని కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది. ఈ సవరణల మంచి చెడ్డలను చర్చిండానికి భారత ప్రభుత్వం 2009 ఆగస్టులో ఒక సమావేశాన్ని నిర్వహించి, కొన్ని నిబంధనలపై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఆ తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2010ని తీసుకొచ్చింది. ఈ సవరణలు నవంబర్ 2, 2010 నుంచి అమలులోకి వచ్చాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41 సబ్‌సెక్షన్ (1)లో ఉన్న ఎ, బి సబ్ క్లాజ్‌లను తొలగించి, ఈ సవరణల ద్వారా వాటికి ప్రత్యామ్నాయాలను ఏర్పరచారు. అదేవిధంగా (బి, ఎ) అన్న క్లాజ్‌ని 41ఎ, 41బి, 41సిలుగా ఏర్పరచారు. ముందుగా తొలగించిన క్లాజ్‌ల వివరాలను పరిశీలిస్తే, సె.41 ప్రకారం వారంట్ లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు.

ఆ సందర్భాలు-
ఎ) కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తిని, లేదా ఏ వ్యక్తికి వ్యతిరేకంగానైతే సముచితమైన ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని లేదా విశ్వసనీయ సమాచారం లేదా సముచితమైన అనుమానం ఉన్నప్పుడు (వారికి కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉందని అన్పించినప్పుడు);
బి) ఇళ్లకు కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు ఎవరైనా కలిగి ఉన్నప్పుడు (అవి కలిగి ఉండటానికి శాసన సమ్మతమైన కారణం ఉన్నదని రుజువు పరచుకునే బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది).

సవరణకు ముందు ఈ రెండు క్లాజుల ద్వారా పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేయడానికి విశేషమైన అధికారాలు ఉండేవి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం- ‘ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు చాలా ఉన్నాయి. వాస్తవంలో అవి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. ఈ రెండు క్లాజ్‌ల గురించి లా కమిషన్ 177వ నివేదికలో చర్చించింది’ అని వ్యాఖ్యానించారు.

కాగ్నిజబుల్ నేరం చేశాడన్న అనుమానం వచ్చినప్పుడు, ఆ నేరంతో సంబంధం ఉన్నప్పుడు, కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తినైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే, ఇళ్లకి కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు అంటే ఏమిటి? పనిముట్ల్లు కలిగివున్న వ్యక్తులనూ ఆ నెపం మోపి పోలీసులు అరెస్టు చేయవచ్చుకదా అన్న అనుమానం రాకతప్పదు. ఈ రెండు క్లాజ్‌ల ద్వారా పోలీసులకు అపరిమితమైన ఆధికారాలు లభించాయన్నది ప్రధాన విమర్శ. అందుకని ఈ రెండు క్లాజ్‌లను తొలగించి, కొత్త నిబంధనలతో వాటి స్థానంలో 2010 సవరణల చట్టం తీసుకొచ్చారు.

దాని ప్రకారం-
41 (1)(ఎ) పోలీసుల సమక్షంలో కాగ్నిజబుల్ నేరం చేసినప్పుడు;
(1)(బి) 7 సంవత్సరాల వరకు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షపడే అవకాశం ఉన్న నేరం చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా సముచితమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, నేరానికి సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందినప్పుడు లేదా సహేతుకమైన అనుమానం కలిగినప్పుడు, ఈ షరతుల పట్ల సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాగ్రత్తలూ పాటించాలి. 1) ఆ వ్యక్తి ఆ నేరం చేశాడనటానికి గట్టి ఆధారం ఉండాలి. (2) ఆ అరెస్టు, కింద పొందుపరచిన కారణాల వల్ల అవసరమని పోలీసు అధికారి సంతృప్తి చెందాలి.

అవి-
- ఆ వ్యక్తి తిరిగి అలాంటి నేరం చేయకుండా నిరోధించడానికి;
- దర్యాప్తు నిరాటంకంగా కొనసాగడానికి;
- సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండటానికి;
- సాక్షుల విషయంలో జోక్యం చేసుకోకుండా చూడటానికి;
- ఆ వ్యక్తిని అరెస్టు చేస్తే తప్ప కోర్టు ముందు హాజరుపెట్టలేమని భావించినప్పుడు.

ఈ కొత్త నిబంధనల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను, అదేవిధంగా 7 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న వ్యక్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయాలి. అది కూడా తగు కారణాలను నమోదు చేసిన అనంతరమే అరెస్టు చేయాలి. దీంతో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498-ఎ (వేధించడం), 379 (దొంగతనం) వంటి కేసుల్లో అరెస్టులకు అవకాశం ఉండదు. మోసం, నమ్మక ద్రోహం వంటి కేసుల్లో కూడా అతి కష్టంగా అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్టు చేసినప్పుడు, అదేవిధంగా అరెస్టు చేయనప్పుడు కూడా తగు కారణాలను పోలీసులు నమోదు చేయాలి. ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంత ఉందో కీడూ అంతే ఉంది.

అరెస్టు చేయకుండా పోలీసులు దర్యాప్తు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని అధిగమించడానికి సె.41(ఎ)ని కూడా చట్టం లో పొందుపరిచారు. సె.41(1) ప్రకారం అరెస్టు చేయనప్పుడు, ముద్దాయిలు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులో చెప్పిన ప్రకారం నేరస్తులు పోలీసు అధికారి నిర్దేశించిన ప్రదేశంలో హాజరుకావాలి. దాని ప్రకారం హాజరైతే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీల్లేదు. అయితే , ఆ వ్యక్తిని కూడా యోగ్యతగల కోర్టు అనుమతి తీసుకుని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

ఈ కొత్త నిబంధనల ద్వారా పోలీసులకు గతంలో ఉన్న విశేష అధికారాలను తొలగించి, నోటీసు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. కానీ దాన్ని పోలీసులు ఆయుధంగా వాడుకుని నేరస్తులను వేధించే అవకాశం ఉంది. దీని నియంత్రణకి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే నోటీసుని ఉల్లంఘించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటే యోగ్యతగల కోర్టు ఉత్తర్వుల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. యోగ్యత గల కోర్టు ఏదీ అన్నది స్పష్టంగా చెప్పలేదు. అది సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, నోటీసును పాటిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి అవసరంలేదు. అందుకు గల కారణాలను నమోదు చేస్తే సరిపోతుంది. అరెస్టు స్ఫూర్తికి ఇది విరుద్ధం. నోటీసు పేరుతో ముద్దాయిలపై పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 157 ప్రకారం దర్యాప్తులో చివరి దశ అరెస్టు. మొదటి దశ ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడం. నేరస్థలాన్ని సందర్శించడం రెండవ దశ. కేసుకి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం మూడవ దశ. చివరి దశ- ముద్దాయిని అరెస్టు చేయడం. అది కూడా అవసరమైతేనే. కానీ ముద్దాయిని అరెస్టు చేయడం మొదటి దశగా మారింది. సె. 41 ఆధారంగా అక్రమ అరెస్టులు, అనవసర అరెస్టులు కొనసాగేవి. ఈ సవరణల ద్వారా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేసే అవకాశం తగ్గవచ్చు. ఈ కొత్త నిబంధనలు పోలీసు కమిషన్, లా కమిషన్‌ల నివేదిక, డీకే బసు కేసు తీర్పు ఆధారంగా రూపొందాయి. వీటివల్ల పోలీసుల అధికారాలు పూర్తిగా పోయాయనిగానీ, విశేష అధికారాలు వచ్చాయనిగానీ కాదు.

ఈ నిబంధనల పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పవచ్చు:
***పోలీసులు వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా సులభంగా అరెస్టు చేయడానికి అవకాశం లేదు.
***7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో తగు కారణాలు ఉన్నప్పుడే, వాటిని నమోదు చేసి అరెస్టు చేయాలి. ఈ కారణాలను రిమాండ్ చేసే ముందు మేజిస్ట్రేట్ గమనంలోకి తీసుకోవాలి.
***కాగ్నిజబుల్ నేరాలు చేసిన వ్యక్తుల హాజరుపై పోలీసులు నోటీసు జారీ చేస్తారు. దానిని పాటించనప్పుడు, కోర్టు అనుమతితో మాత్రమే అరెస్టు చేయవచ్చు. నోటీసును పాటిస్తున్నప్పటికీ తగు కారణాలను చూపి అరెస్టు చేయవచ్చు. నోటీసు పేరుతో అరెస్టుకన్నా ఎక్కువ వేధించే అధికారం పోలీసులకు న్యాయబద్ధంగానే లభిస్తుంది.
***పోలీసులకి ఉన్న అరెస్టు అధికారాన్ని ఈ నిబంధనలు పూర్తిగా తీసివేయలేదు. కాకపోతే ఆ అధికారం మీద నిఘా ఉంటుంది.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ అంశానికి చెందిన కీలకమైన సవరణలను గుట్టుచప్పుడు కాకుండా అమలుచేయడం అంత మంచి సంప్రదాయం కాదు. ఈ సవరణల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్యన ఉన్న దూరం తగ్గుతుందా, పెరుగుతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి!

మంగారి రాజేందర్
మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

Monday, November 29, 2010

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines
వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines

Monday, November 8, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి అవసరమైన అంశాలు

October 20th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులను కోరే పద్ధతి గతంలో లేదు. దీన్ని 1976లో ప్రవేశపెట్టారు. ఇది ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాఖలు చేస్తారు. మామూలుగా విడాకులు కోరినపుడు ఆ విధంగా కోరిన వ్యక్తి దరఖాస్తుదారుగా అవతలి వ్యక్తిని ప్రతివాదిగా చూపిస్తారు. అయితే ఈ పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ఇద్దరు దంపతులు సంయుక్తంగా కలిసి దాఖలు చేస్తారు.
ఈ దరఖాస్తులో ఏ అంశాలు ఉండాలి
పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ప్రధానంగా మూడు అంశాలు వుండాలి. అవి-
* వారిద్దరి మధ్య వివాదం జరిగి వుండాలి. ఏ చట్ట ప్రకారమైతే వివాహం జరిగిందో, వారు ఆ మతానికి చెందినవారై వుండాలి. ఆ విషయాన్ని అందులో పేర్కొనాలి.
* సంవత్సరం నుంచి కానీ అంతకుమించి గానీ వారిద్దరూ వేరుగా నివశిస్తూ ఉండాలి.
* వాళ్ళిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడి, పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని వుండాలి.
వివాహం జరిగి ఉండాలి అంటే?
హిందూ వివాహ చట్టం అమల్లోకి రాకముందుగానీ ఆ తరువాత గానీ వారిమధ్య వివాహం జరిగి ఉండాలి. దరఖాస్తుతో తమ వివాహం హిందూ మతాచారం ప్రకారం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. దానికి సంబంధించిన పత్రాలని దరఖాస్తుతోబాటు జత చేయాలి. వారి వివాహ పత్రిక, సంయుక్తంగా వున్న ఫొటో, అవి లేనప్పుడు ఇద్దరివి వేరువేరుగా వున్న ఫొటోలని దరఖాస్తుతోబాటూ జత చేయాలి. వీలైతే వాటిని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి దాఖలుచేయాలి.
వేరుగా నివసిస్తూ వుండాలంటే?
పరస్పర ఆమోదంతో సంయుక్తంగా దంపతులిద్దరు కలిసి దాఖలుచేసే దరఖాస్తు తాము సంవత్సరం నుంచి గానీ అంతకుమించిగానీ వేరుగా నివశిస్తున్నామని పేర్కొనాలి. వాస్తవంగా ఇద్దరిమధ్య విభేదాలు పొడసూపి వేరువేరుగా నివశిస్తారు.
అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నప్పటికీ వేరు వేరు జీవితాలని గడుపుతుంటారు. అంటే వారి మధ్యన దాంపత్య జీవనం వుండదు. ఇలాంటి సందర్భాన్ని కూడా వేరువేరుగా నివసించడంగా పరిగణించవచ్చా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీన్ని కూడా వేరుగా నివశిస్తున్నట్టుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. దాంపత్య జీవనం లేకపోవడం అంటే భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాలు లేకపోవడమని అర్ధం. ఒక గూడులో నివశిస్తున్నప్పటికీ వారిమధ్యన సెక్స్ సంబంధాలు లేకపోతే దాన్ని వేరుగా నివసిస్తున్నట్టుగానే భావించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
కలిసి జీవించి వుండలేని పరిస్థితులు అంటే
దంపతులిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడి కలిసి జీవించి వుండలేని పరిస్థితులు వుండాలి. రాజీ ప్రయత్నాలు కూడా విఫలమై వుండాలి. ఈ పరిస్థితుల కారణంగా వారిద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని వుండాలి.
షరతులు పెట్టుకోవచ్చా?
ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని షరతులని కూడా దంపతులు ఏర్పరచుకుంటారు. ఆస్తి విభాగాల గురించి, భరణం గురించి, నెలవారీ చెల్లించే మనోవర్తి గురించి, పిల్లల కస్టడీ గురించి, పిల్లలని చూడటానికి సంబంధించిన సమయాలు, తేదీల గురించి కూడా ఈ దరఖాస్తు పరిష్కారంలో కోరుకోవచ్చు. ఇవి ప్రైవేట్ హక్కులకి, పబ్లిక్ పాలసీకి భంగం కలిగించకుండా వుండాలి.
ఈ దరఖాస్తు దాఖలు తరువాత ఎంతకాలం
వేచి వుండాలి?
పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దాఖలుచేసిన దంపతులు తిరిగి ఆలోచించుకోవడానికి, రాజీచేసుకొని దాంపత్య జీవనం తిరిగి కొనసాగించడానికి చట్టపరంగా 6 నెలల కాలాన్ని కనీస సమయంగా ఏర్పరిచారు. దాన్ని 18 నెలల కాలం వరకు ఈ సమయాన్ని పొడిగించే అవకాశం వుంది. దీని ఉద్దేశ్యం- వివాహం తిరిగి పునరుద్ధరించబడటానికి తొందరపాటు వల్ల విడాకులు తీసుకోకుండా వుండటానికి ఈ కాలపరిమితిని ఏర్పాటుచేశారు.
ఈ కాలపరిమితిలో పార్టీలు తమ దరఖాస్తుని ఉపసంహరించుకొని దాంపత్య జీవనాన్ని కొనసాగించవచ్చు. వివాహం చెదిరిపోకుండా వుండటానికి, దంపతుల మధ్య ఆవేశకావేశాలు, కోపతాపాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షరతుని ఏర్పరచి శాసనకర్తలు కొంత జాగ్రత్తని తీసుకున్నారని అన్పిస్తుంది.
ఆరునెలల తరువాత పార్టీలు ఏం చెయ్యాలి?
ఆరునెలల తరువాత కోర్టు పార్టీలని విచారించాయి. ఈ ఆరునెలల కాలం గడిచిన తరువాత పార్టీలు ఇంకా అదే అభిప్రాయంతో వున్నారా అన్న విషయాన్ని పరిశీలించి, కోర్టు సంతృప్తి చెందిన తరువాత కోర్టు విడాకులను మంజూరు చేస్తుంది. ఇందుకుగానూ పార్టీలు తమ ప్రమాణ పత్రాలని సమర్పించవచ్చు. లేదా కోర్టు వారి స్టేట్‌మెంట్లని నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో పార్టీలు సమ్మతిని మోసం ద్వారా ఒత్తిడి ద్వారా ప్రభావితం చేయడం ద్వారా పొందినవా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించాల్సి వుంటుంది. భార్య తన మనోవర్తి గురించి, పిల్లల అధీనం గురించిన హక్కులను వదులుకున్నారా అన్న విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది.
ఫొటోలు, స్టేట్‌మెంట్లు నమోదు అవసరమా?
గతంలో విడాకుల దరఖాస్తులో ఫొటోలని కావాలని కోర్టులు అడిగేవి కావు. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో మోసాలు జరిగిన సంఘటనలు కోర్టుల దృష్టికి వచ్చాయి. వేరే ఎవరినో తీసుకొనివచ్చి విడాకులు పొందిన సందర్భాలని కోర్టులు గమనించి ఆ పార్టీల ఫొటోలు అవసరమని కోర్టులు అంటున్నాయి.
అదేవిధంగా దరఖాస్తుని దాఖలుచేసిన సందర్భంలో మళ్లీ విడాకులు మంజూరు చేసే సందర్భంలో పార్టీలని స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేయడం అవసరం. అలా చెయ్యడంవల్ల తమ దరఖాస్తులో రాసిన విషయాలు ఈ పార్టీలకి బోధపడతాయి.
ఒకవేళ ప్రమాణ పత్రాలను దాఖలు చేసినపుడు కూడా వాటిలోని కోర్టు వారికి తెలియచెప్పి తిరిగి వారి సంతకాలు తీసుకుంటోంది. కాబట్టి అందులో ఏమి రాసి వుందో ఆ విషయం పార్టీలకు మళ్ళీ ఒకసారి అవగతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
మోసాలు జరగకుండా వుండటానికి కోర్టు వివాహానికి సంబంధించిన ఫొటోను అదేవిధంగా కొత్త పాస్‌పోర్టు ఫొటోను తమ దరఖాస్తుతోబాటు జతచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. పార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మోసాలు జరగకుండా వుండటానికి కోర్టులు ఈ పని చేస్తున్నాయని గ్రహించాలి.


*
*
*

* Releated Articles

భర్త హాజరు కానప్పుడు.

.
November 2nd, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే దరఖాస్తు దాఖలు చేసిన తరువాత కనీసం 6 నెలలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ గడువుని ఏర్పర్చడానికి కారణం పార్టీలు తొందరపాటు వల్ల విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోలేదని, ఒత్తిడి వల్ల, బెదిరింపువల్ల అలాంటి నిర్ణయానికి రాలేదని కోర్టు అభిప్రాయ పడటానికి. అదే విధంగా పార్టీలు పునరాలోచించుకోవడానికీ ఈ గడువు దోహదపడుతుంది.
ఒక్కసారి కోర్టు ద్వారా విడాకుల కోసం పార్టీలు వచ్చినారంటే అది ఒక్క కేసులోనే ఉండదు. క్రిమినల్ కేసులు, ఆస్తి తగాదాలు, పిల్లల కస్టడీలో లాంటి కేసులు కూడా ఉంటాయి. కొంతమంది భర్తలు (్భర్యలు కూడా) పరస్పర ఆమోదంతో విడాకులు కోరడానికి దరఖాస్తుని దాఖలు చేసుకొని ఆ తరువాత సహకరించరు. అప్పటికే వాళ్లు కొన్ని కేసుల్లో లబ్ధి పొందుతారు. లబ్ధి పొంది మిగతా వ్యక్తులని ఇబ్బందులకు గురిచేస్తారు.
మొదటి సారే కాకుండా ఆరు నెలల నుంచి 18 మాసాలలోపు మళ్లీ పార్టీలు కోర్టు ముందుకు వచ్చి మేము విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు కాని కోర్టు మంజూరు చేయవు. ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? కోర్టు ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం రాజస్థాన్ హైకోర్టు శ్రీమతి సుమన్ వర్సెస్ సురేంద్ర కుమార్ ‘ఎఐఆర్ 2003 రాజస్థాన్ 155-ఐ (2003) డిఎమ్‌సి 805 కేసులో సమాధానాలు చెప్పింది.
పరస్పర ఆమోదంతో దాఖలు చేసిన దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం 2-12-1999 రోజున తిరస్కరించింది. దీనిపైన రాజస్థాన్ హైకోర్టులో డివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత కోర్టు దరఖాస్తుని ఆమోదించింది.
కేసు విషయాల్లోకి వస్తే - పార్టీల మధ్య 24, మే 1995 రోజున వివాహం జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరూ వేరువేరుగా నివసించడం మొదలు పెట్టారు. ఆ తరువాత 15-1-1999 రోజున హిందూ వివాహ చట్టంలోని సె.-13బి ప్రకారం విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశారు. వారిద్దరి స్టేట్ మెంట్లని కోర్టు నమోదు చేసి, ఆరు నెలల తరువాత వారి హాజరు గురించి తేదీని నిర్ణయించింది. ఆ తరువాత భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భార్య హాజరైంది. రెండు, మూడు వాయిదాలు ఇచ్చినప్పటికీ భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భర్త నడవడిక చూసి విసుగు చెందిన భార్య, అతను కోర్టు ముందు హాజరు అయ్యే విధంగా, అదే విధంగా అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకోవడానికి సమన్స్ పంపించాలని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. ఆ విధంగా చేయడానికి చట్టంలో అలాంటి ప్రొసీజర్ లేదని కోర్టు పేర్కొంటూ దరఖాస్తుని కొట్టివేసింది. ఐదవసారి పార్టీలు హాజరు కావడం లేదన్న కారణంగా కోర్టు వారి కేసుని కొట్టివేసింది. దీనిపైన అప్పీలుకి రాజస్థాన్ హైకోర్టులో దాఖలు చేసింది భార్య. దానిపైన రివ్యూ దరఖాస్తుని దాఖలు చేశారు. రివ్యూని కోర్టు ఆమోదించింది.
ఇద్దరూ కలిసి దరఖాస్తుని దాఖలు చేసినప్పుడే కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులు మంజూరు చెయ్యాలి తప్ప వారు హాజరు కానప్పుడు మంజూరు చేయడానికి వీల్లేదని భర్త న్యాయవాది కోర్టు ముందు వాదనలు చేశాడు. మొదటి సారి విడాకుల కోసం సమ్మతిని తెలియజేసి ఆ తరువాత కోర్టు ముందు హాజరు కాకపోవడం ద్వారా తనను ఇబ్బంది పెట్టి కేసు డిస్మిస్ అయ్యే విధంగా చేయడం సరైంది కాదని, వరుసగా హాజరు కాకుండా చేయగా అలాంటి తనని ఇబ్బందికి గురి చేయడమేనని కోర్టు ముందు భార్య న్యాయవాది వాదనలు చేశాడు.
తీర్పులోని ముఖ్యాంశం
మొదటిసారి తరువాత ఇంకొకసారి ఇద్దరూ హాజరై విడాకుల కోసం తమ సమస్యలు తెలియజేయాలి. అలాంటి సందర్భాల్లోనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కోర్టు గడువు ఇచ్చిన సమయంలో తమ సమ్మతిని తెలియజేస్తూ భార్యా భర్తలలో ఎవరైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ ఈ కేసులో భర్త ఆ విధంగా చేయలేదు.
అతను కోర్టు ముందుకు రాకుండా వౌనంగా ఉన్నాడు. ఆ వౌనాన్ని, సమ్మతిని ఉపసంహరించుకున్నట్టుగా భావించడానికి వీలు లేదు. అతను ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు వౌనంగా ఉన్నాడు. అతను తన సమ్మతిని ఉపసంహరించుకో దలిస్తే కోర్టు ముందుకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ముందుకి రాకుండా అతను భార్యని వేధించాడు. రెండవసారి ఇద్దరు పార్టీలు హాజరు వుండాలన్న సాంకేతిక అభ్యంతరాన్ని మేం పట్టించుకోదల్చుకోలేదు. రెండవసారి అతను హాజరు కాకపోవడం వల్ల అతను సమ్మతిని ఇచ్చాడన్న భావనకి రావల్సి ఉంటుంది. భర్త పూర్తిగా వౌనంగా ఉండటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రెండవ సందర్భంలో కొన్ని నెగటివ్‌గా తీసుకోవాలా, పాజిటవ్‌గా తీసుకోవాలా? తను తన సమ్మతిని ఉపసంహరించుకోవాలంటే అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు. అతన్ని ఎవరూ నిరోధించలేదు. అందుకని అతను సమ్మతిని ఉపసంహరించాడని కాకుండా ఇచ్చాడన్న అభిప్రాయానికి కోర్టు రావాల్సి ఉంటుంది. అందుకని ఈ కేసులో భర్త సమ్మతిని ఇచ్చాడన్న నిర్ణయానికి వచ్చి వారి వివాహాన్ని రద్దు చేస్తున్నాం’’.
భర్త హాజరు కాకున్నా కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులను మంజూరు చేసింది. దీని ఉద్దేశం ఇద్దరు హాజరు కాకున్నా మంజూరు చేయవచ్చని కాదు. తన సమ్మతిని ఉపసంహరించుకోకుండా నిరాటంకంగా హాజరు కానప్పుడు కోర్టు ఇలాంటి భావనకి రావల్సి ఉంటుందని ఈ తీర్పు ఉద్దేశం.

Followers