Wednesday, May 19, 2010

దాన ధర్మాలకూ పరిమితులు

May 18th, 2010

హిందువులు ముస్లింలు కాకుండా మిగతా మతాలకు చెందిన వ్యక్తులు తమ ఆస్తులను ధార్మిక సంస్థలకి దానధర్మం చేయడానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితులకు లోబడి వీలునామా రాసినప్పుడే అవి చెల్లుతాయి.
కొడుకులు, కూతుళ్ళు ఇంకా సమీప బంధువులు వున్న వ్యక్తులు తమ వీలునామాని తమ మరణానికి కనీసం 12 నెలల ముందు ఈ వీలునామా రాయాల్సి వుంటుంది.
అంతేకాకుండా అది రాసిన ఆరు నెలల తరువాత దాన్ని డిపాజిట్ చేయవలసి వుంటుంది. ఇది స్థిర చరాస్తులకు దేనికి సంబంధించినదైనా వర్తిస్తుంది.
ఈ పరిమితిని వుంచడానికి గల కారణం వీలునామా కర్త సెంటిమెంట్‌కి లోనై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దానధర్మాలకు రాయకుండా వుండాలని అతని బంధువులకి అన్యాయం జరగకుండా వుండాలని. ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకి వర్తించదు. కానీ ఈ నిబంధన ప్రస్తుత కాల మాన పరిస్థితుల ప్రకారం మార్చాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఆ ధార్మిక సంస్థ ఉనికి లేనప్పుడు...
వీలునామాకర్త ధార్మిక సంస్థకి తన ఆస్తి చెందాలని వీలునామా రాసినప్పుడు, అతని జీవితకాలంలో అట్టి ధార్మిక సంస్థ ఉనికే లేనప్పుడు, ఆ ఆస్తిని అలాంటి ధార్మిక సంస్థలు దేనికైనా ధారాదత్తం చేయవచ్చు.
ఎలాంటి వీలునామా లేనప్పుడు...
ఎవరైనా వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు అతని ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అలాగే మొత్తం ఆస్తి గురించి వీలునామా లేనప్పుడు, ఆ మిగిలిన ఆస్తి వారసత్వ చట్టప్రకారం అతని వారసులకి చెందుతుంది. అవశిష్ట వారసుల్ని పేర్కొన్నప్పుడు ఆ మిగిలిన ఆస్తి అతనికి చెందుతుంది.
హిందువులు
వీలునామా రాయకుండా ఎవరైనా హిందువు చనిపోయినపుడు అతని ఆస్తి అతని భార్య, పిల్లలకు, తల్లికి సమానంగా చెందుతుంది. ఎవరికి ఎక్కువగానీ తక్కువ గానీ లేదు.
ముస్లింలు
ముస్లింల చట్టప్రకారం ఏ వ్యకె్తైనా తన ఆస్తిలో 1/3 వరకే వీలునామా చేయగలుగుతాడు. మిగిలిన 2/3 అతని వారసులకి చట్టప్రకారం చెందుతుంది. ఈ భాగాల పంపకం వాళ్ళల్లోవున్న తెగలని బట్టి వుంటుంది. ఆ భాగాల పంపకం ఎలా వున్నప్పటికి పురుషులకి ఎక్కువగా అంటే స్ర్తిలకన్నా రెట్టింపుగా చెందుతుంది.
క్రైస్తవులు
వీలునామా రాయకుండా క్రైస్తవ వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆస్తిలో 1/3 వంతు అతని భార్యకి మిగిలిన 2/3 వంతులు పిల్లలకి చెందుతాయి ఒకవేళ ఆ వ్యక్తికి పిల్లలు లేనప్పుడు అతని ఆస్తిలో సగం అతని భార్యకి మిగిలిన సగభాగం అతని తల్లిదండ్రులకి ....... చెందుతాయి.
పార్శీలు
పార్శీలలో వీలునామా లేకుండా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి భార్యాపిల్లలు వున్నప్పటికి అతని తల్లిదండ్రులకి భాగం వుంటుంది. మగపిల్లలకి, భార్యకి, ...... రెట్టింపు భాగం వుంటుంది. తండ్రికి ఒకటిన్నర భాగం, తల్లికి అర్ధ్భాగం వుంది.
నామినీ వున్నప్పుడు...
ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్, పాలసీలలో నామినీగా పేర్కొన్నప్పటికీ వీలునామా రాయాల్సి వుంటుంది. ఈ ‘నామినీ’లు ఆ డబ్బుని పాలసీ హోల్డర్ చట్టబద్ధ వారసుల తరపున ట్రస్టీగా తీసుకుంటున్నట్టు మాత్రమే. అలాగే ప్రావిడెంట్ ఫండ్ నామినీ కూడా ఈ డబ్బులు నామినీకే చెందాలని దాని కర్తకి వున్నప్పుడు వీలునామాలో స్పష్టంగా అతనికి చెందాలని పేర్కొన్నప్పుడు మాత్రమే చిక్కులుండవు.
వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించవచ్చా?
* భారతీయ వారసత్వ చట్టంలోని సె.60 ప్రకారం ఏ వయస్సులో వున్న తండ్రైనా వీలునామా ద్వారా తన పిల్లలకి సంరక్షకులను నియమించవచ్చు.
అయితే తల్లి అలా నియమించడానికి ఈ చట్టంలో వీలు కల్పించలేదు. ఆ వీలు కలిగేట్టు చట్టాన్ని మార్చాల్సిన అవసరం వుంది.
* వీలునామా ద్వారా సంరక్షకున్ని నియమించినంత మాత్రాన దాన్ని ప్రాబేట్ చేయించాల్సిన అవసరం లేదు.
* ఈ నియమ నిబంధన హిందువులకి వర్తించదు. ఎందుకంటే హిందువులు సంరక్షకులని హిందూ మైనారిటీ గార్డియన్‌ల చట్టప్రకారం నియమించాల్సి వుంటుంది.
*

No comments:

Post a Comment

Followers